99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి..

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

https://youtu.be/l0AynUdkDb8

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ లో జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణతో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల డిసిపి భాస్కర్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు. కార్యక్రమం జూన్‌ 12 వరకు కొనసాగుతుందని, ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ చైర్మెన్ ,సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానికంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు.

పెండింగ్‌ ఫైల్స్‌ పరిష్కారం, పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మన పనితీరు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. వేసవి కాలంలో జిల్లాలో తాగు నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన అందించేందుకు ఏర్పాటుచేసిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజా ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు మునిసిపాలిటీల చైర్ పర్సన్లు వైస్ చైర్ పర్సన్లు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే…

సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఆశ్విన్ కాలనీ లో గల ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యంలో జరిగిన రంజోల్ గ్రామ మాజీ సర్పంచ్ కీ. శె. కొత్త రామ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళాలు అర్పించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా కొత్త రామ్ రెడ్డి గారి సేవలు చిరస్మనీయమని, వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అన్నారు…..
ఎమ్మెల్యే గారితో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్,యువ నాయకులు ముర్తుజా, బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్ తదితరులు ఉన్నారు …

ప్రతి ఇంటికీ కేసీఆర్ చిత్రపటం.. కుటుంబానికి ఒక గోడ గడియారం: మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి.

ప్రతి ఇంటికీ కేసీఆర్ చిత్రపటం.. కుటుంబానికి ఒక గోడ గడియారం: మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి

 

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ మరియు దీప్తి శ్రీ నగర్ డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక గోడ గడియారాలను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవిష్కరించారు. ​మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా, రెండు డివిజన్లలోని ప్రతి ఇంటికీ కేసీఆర్ చిత్రపటం, బీఆర్ఎస్ జెండా మరియు నవత రెడ్డి ఫోటోతో కూడిన గోడ గడియారాన్ని పంపిణీ చేయనున్నారు. “ఇంటి ఇంటికి కేసీఆర్ చిత్రపటం – గడప గడపకు బీఆర్ఎస్ జెండా” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

త్వరలోనే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని, పార్టీ సిద్ధాంతాలను మరియు అభివృద్ధిని ప్రతి గడపకు చేరవేయడమే దీని ప్రధాన ఉద్దేశమని నవత రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ప్రకాష్, సలీం, గౌస్, చందర్ రావు, ప్రమోద్, అనంత రెడ్డి, షబానా, బాబా తదితర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మొగులపల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా ఎం. సురేష్ బాధ్యతలు స్వీకరణ…

మొగులపల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా ఎం. సురేష్ బాధ్యతలు స్వీకరణ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగులపల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. సురేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొగులపల్లి మండలంలో చట్టం మరియు శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.

ప్రజలు పోలీస్ శాఖపై విశ్వాసం ఉంచాలని, ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తెలియజేయాలని ఆయన కోరారు. నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

దేవునూరి కుమార్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి.

యాసంగి సీజన్ ముగుస్తుంది. లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.

బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు

దేవునూరి కుమార్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి.

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు ఎప్పుడు ఇస్తారని తెలంగాణ రైతులు 70 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని ఇంకా యాసంగి సీజన్18 రోజులే మిగిలి ఉంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు ఇంకెప్పుడు వేస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు బి ఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుల కోసం చూడని రైతులు కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలతో పంట పెట్టుబడి కోసం మళ్ళీ అప్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది బి ఆర్ఎస్ ప్రభుత్వంలో లో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేందుకు రైతుబంధు సాయాన్ని అందజేయగా ప్రస్తుత రైతు భరోసా సాయం కోసం ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి సకాలంలో సాయం అందకపోవడంతో పాటు మరోవైపు అప్పులు దొరకక తీవ్ర కష్టాలు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి సబ్బండ వర్గాల ప్రజలకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులను నట్టేట ముంచింది. బి ఆర్ఎస్ సర్కార్ హయాములో పదేళ్లపాటు ప్రతి సీజన్ ముందే పెట్టుబడి సాయం అందించి అప్పుల్లో కూరుకపోయిన అన్నదాతలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది సీజన్ కు ఒక మాట చెబుతూ రైతులకు న్యాయం వస్తున్న ప్రభుత్వం యాసంగి సీజన్ పూర్తికావస్తున్న పెట్టుబడి సాయం ఎప్పుడు అందిస్తారని దానిపై నిర్ణయం తీసుకోలేదని పెట్టుబడి సాయం సమయానికి అందకపోవడంతో చాలా మంది పేద అన్నదాతలు తమకున్న ఎకరా రెండు ఎకరాల పొలంలో పంట సాగు చేయకుండా బీడు గానే ఉంచుతున్నారు

ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…

ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

ఎమ్మెల్యే గండ్రసత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్పెషలిస్ట్ వైద్యులు ఆర్ బిఎస్ కే వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇలాంటి వైద్య శిబిరాల ద్వా రా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్స పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్ర మంలో హన్మకొండ డీ.ఎమ్. ఎచ్.ఓ డా. అప్పయ్య , మండల మెడికల్ ఆఫీసర్, మండల ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్య కర్తలు అభిమానులు ,ప్రజలు పాల్గొన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్….

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం .జిల్లెల్ల గ్రామంలోనీ. వ్యవసాయ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు .సర్పంచ్లకు. ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు జిల్లెల్ల గ్రామ శివారులోని నూతనంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిలకు సర్పంచులకు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం జిల్లెల్ల కాన్ఫరెన్స్ హాలులో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని. ఇందులో భాగంగా ఈరోజు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఆధ్వర్యంలో. జ్యోతి వెలిగించి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు వ్యవసాయ కళాశాలలో మండలంలోని అలాగే మున్సిపల్ పరిధిలోని అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచులు ప్రజా ప్రతినిధుల అందరికీ ప్రజా పరిపాలన ప్రణాళికలో భాగంగా ఒక్కరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని. ఇందులో అనేక విషయాలపై పలు సమస్యలపై తెలుసుకోవడంతో పాటు గ్రామ పరిపాలనలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా .ఒడిడోడుకులకు. గురికాకుండా శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలపై క్షుణ్ణంగా పరిశీలనలతోఅవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్. జిల్లా .ఎస్పీ .మహేష్ బి.గితే. అదనపు .కలెక్టర్ .గడ్డం నగేష్. నూతనంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధ్యక్షులు గ్రామ సర్పంచ్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

జీర్లపల్లి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు…

జీర్లపల్లి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరసంఘం మండల కేంద్రంలోని జీర్ణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పందిరిలో నృత్యాలు, పాటలు, స్కిట్లతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉపాధ్యాయులకు, స్నేహితులకు భావోద్వేగపూరితంగా వీడ్కోలు పలికారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, జిల్లా విద్యాధికారులు, కలెక్టర్ వంటి పాత్రలను స్వీకరించి ఒక రోజు పాటు బాధ్యతలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రైతులకు రాయితీపై జిప్సం పంపిణీ….

రైతులకు రాయితీపై జిప్సం పంపిణీ

భూగర్భ నేలల్లో అల్యూమినియం విష ప్రభావం తగ్గించడం ద్వారా మొక్క వేరు పెరుగుదలను మెరుగుపరిచి పంట దిగుబడిని పెంచుతుంది. మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జిప్సం అనేది సోడిక్/లవణ(సౌడు) నేలలను సరిచేయడానికి, నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి మరియు pH ను గణనీయంగా పెంచకుండా కాల్షియం మరియు సల్ఫర్‌ను సరఫరా చేయడానికి ఉపయోగించే అత్యంత ప్రభావవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన నేల సవరణ. ఇది నీటి చొరబాటును పెంచుతుంది, క్రస్టింగ్ తగ్గిస్తుంది, కోతను తగ్గిస్తుంది మరియు భూగర్భ నేలల్లో అల్యూమినియం విషప్రభావం తగ్గించడం ద్వారా మొక్క వేరు పెరుగుదలను మెరుగుపరిచి పంట దిగుబడిని పెంచుతుంది.
90 శాతం రాయితీ పై జిప్సం రైతులకు పంపిణీ చేయడానికి అవకాశం కలదు. చౌడు భూములలో జిప్సం వేసుకోవడం వలన చౌడు తీవ్రత తగ్గి పంటల దిగుబడి పెరుగును. ఒక టన్నుకు మొత్తం ధర 5660 రూపాయలు, ఇందులో 90% రాయితీ పోను 10శాతం అనగా ఒక టన్నుకు 566రూపాయలు రైతులు చెల్లించాలి. ఈ జిప్సం 50 కిలోల బస్తాలలో పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇందులో సన్న, చిన్న కారు మరియు మహిళా రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. జిప్సం కావలసిన రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి 20టన్నులకు రైతు వాటా డీడీ చెల్లించినచో ఆ గ్రామానికి జిప్సం లోడు సరఫరా చేయడం జరుగుతుంది. జిప్సం కావలసిన రైతులు వారి యొక్క పూర్తి వివరాలతో మీ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని(ఏ ఈ ఓ )లేదా మండల వ్యవసాయ అధికారిని(ఎం ఏ ఓ)సంప్రదించి రాయితీ పై జిప్సంను పొందాలని వ్యవసాయ శాఖ ద్వారా పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.

యిరీఆధ్వర్యంలో.పుస్తె మట్టలపంపిణీ….

కరీంనగర్.పాల.డే
యిరీఆధ్వర్యంలో.పుస్తె మట్టలపంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం. బాలుమల్లెపల్లె గ్రామంలో నూతనంగా .వివాహం. చే సు.కోబోతున్న జంటకు కరీంనగర్.పాలకేంద్రం డైరీ ఆధ్వర్యంలో ఉచిత పుస్తెమట్టలుపంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ పాలకేంద్రం.అగ్రహారం అసిస్టెంట్ మేనేజర్.ఉచ్చిరెడ్డి రాజిరెడ్డి. ఆధ్వర్యంలో నూతన.వధూవరులకు.పుస్తె మట్టలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్ రాజిరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ డైరీ అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా కళ్యాణమస్తుపథకం ద్వారా ఆడబిడ్డ పెళ్లికి. పుస్తె మట్టెలు అందజేశామనితెలిపారు అందులో భాగంగా. నూతనంగా వివాహం కాబోతున్న బాలు.మల్లేపల్లి గ్రామ పాడి రైతు .ఎనిమిట్ల మల్లారెడ్డి విజయ కూతురు అక్షితకు. కరీంనగర్ పాల డైరీ ఆధ్వర్యంలో .పుస్తెమట్టలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రూట్ సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి. పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు సమస్త అధ్యక్షులు వాసాలరాజిరెడ్డి. తిరుపతి. పాల .ఉత్పద్దారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

డ్రగ్స్‌కు నివారణ పై అవగాహన కార్యక్రమం.

డ్రగ్స్‌కు నివారణ పై అవగాహన కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యక్రమంలో భాగంగా
అవగాహన కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర EAGLE టీం డైరెక్టర్ శాందీప్ శ్యాండిల్య పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పిల్లల భద్రత,డ్రగ్స్‌కు అడ్డుకట్ట కార్యక్రమంలో బాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈసందర్భంగా గురువారం రోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించి,డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలు,వాటి దుష్పరిణామాలు,అలాగే పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నటేష్ మాట్లాడుతూ..దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన నేటితరం విద్యార్థులని,వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,విద్యార్థులు తమ శక్తిని క్రీడలు, విద్య మరియు ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మళ్లించుకోవాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన EAGLE టీం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని,యువత భవిష్యత్తును కాపాడటమే పోలీస్ శాఖ మరియు EAGLE టీమ్‌ల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలం విట్టు నాయక్ తండాలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్ దీపక్ ,యువ నాయకులు ముర్తుజా,బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్, గ్రామ సర్పంచ్ చందు జాదవ్,మాజి సర్పంచ్ లు కేషు,జితేందర్, ఉప సర్పంచ్ రూప్ సింగ్,మాజి ఉప సర్పంచ్ శంకర్,ధర్మం, చంద్రు, మేఘనాథ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

సిద్ధపూర్లో ఘనంగా మహిళా శక్తి భవన భూమి పూజ…

సిద్ధపూర్లో ఘనంగా మహిళా శక్తి భవన భూమి పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://youtu.be/l0AynUdkDb8?si=0HJaxNEgaq7J2t7t

ఝరాసంగం మండల పరిధిలోని సిద్ధపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ‘మహిళా శక్తి భవనం’ నిర్మాణానికి మరియు నూతన బోరు ను ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ విచ్చేసి, పూజా కార్యక్రమాల్లో పాల్గొని పనులను ప్రారంభించారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు అభినందనీయమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే గ్రామస్తుల నీటి అవసరాలను తీర్చేందుకు నూతన బోరు ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హఫీజ్, సిద్ధపూర్ గ్రామ సర్పంచ్ షరీఫ్ ఉప సర్పంచ్ విమలమ్మ, వార్డు సభ్యులు రామిరెడ్డి,, కాంగ్రెస్ నాయకులు కొల్లూర్ సంగన్న వేణుగోపాల్, శ్రీకాంత్ రెడ్డి, సంగ్రామ్ పాటిల్, ఆలయ కమిటీ ధర్మకర్త మాలి పటేల్ మల్లప్ప, నవిన్ పటేల్ యూసుఫ్, పీల్డ్ అసిస్టెంట్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ నెల 13న పీఎం కిసాన్ నిధులు…

రైతులకు గుడ్ న్యూస్

ఈ నెల 13న పీఎం కిసాన్ నిధులు:
భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సురేష్ చింతకింది
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం పథకం పీఎం- కిసాన్ నిధులు ఈ నెల 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 22వ విడత ఈ స్కీం నిధులను అసోంలోని గువాహటిలో ప్రధాని మోడీ రిలీజ్ చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున డబ్బులు జమ కానున్నాయి. కాగా, పీఎం-కిసాన్ స్కీమ్ను 2019లో ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది మూడు సార్లు రూ.2,000 చొప్పున రూ.6వేలు రైతుల ఖాతాల్లో కేంద్రం వేస్తున్నది. ఈ సారి రూ. 19 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. పత్రిక విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రైతుల పక్షాన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.

దేశరాజుపల్లి పాఠశాలకు రూ.రెండు లక్షల విలువగల కంప్యూటర్స్, ఫర్నిచర్ అందజేత….

దేశరాజుపల్లి పాఠశాలకు రూ.రెండు లక్షల విలువగల కంప్యూటర్స్, ఫర్నిచర్ అందజేత..

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)

కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లి ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన ఈయుటి టెక్నాలజీస్ యాజమాన్యం రూ. రెండు లక్షల విలువగల కంప్యూటర్, ఫర్నిచర్ బీరువాలు అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ తెలిపారు. గ్రామానికి చెందిన ఆ సంస్థ నిర్వాహకులు కాందుర్ల బాబురావు ఆయన కుమారులు శివాజీ, అరుణజీలు వారు చిన్న నాడు చదువుకున్న పాఠశాల అభివృద్ధి కు గాను, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు కంప్యూటర్ తో పాటు బ్లూటూత్ స్పీకర్, మూడు బీరువాలు, నాలుగు టేబుల్స్ ఇతర ఫర్నిచర్ అందజేసినట్లు తెలిపారు. పాఠశాలకు తోడ్పాటును అందించిన కాందుర్ల బాబురావు వారి కుమారులను పాఠశాల అధ్యాపక బృందం గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా బాబురావు ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిట్టపల్లి మహేశ్వరి,స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాణి,మాజీ ఎంపీటీసీ శైలజ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అస్లాంబి,పాఠశాల అధ్యాపక బృందం రాజేందర్ రెడ్డి,అజిత్ కుమార్, ఐలేష్,విజయశ్రీ,మార్నింగ్ వీడియోస్ నటులు స్వాగత్, శంకర్,రత్నాకర్ మరియు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల…

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల

 

ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

 ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కట్టెల పొయ్యిలు, వంట పాత్రలు, ఎల్పీజీ సిలిండర్ల పోస్టర్లతో నిరసనకు దిగారు. విపక్షాల ఆందోళనలో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) పాల్గొని ప్రసంగించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు.
ఎల్పీజీ సమస్యను పరిష్కరించాలి..

ఎల్పీజీ సమస్యను కేంద్రప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 18వ లోక్‌సభలో కేంద్రప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోదీ ప్రభుత్వ అజెండాగా మారిందని ఆగ్రహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలను నరేంద్రమోదీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ట్రంప్ చర్యలను మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రంప్‌నకు మోదీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు, ప్రభావంపై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్…

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్

 

ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్2026లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయం సాధించింది.

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్(T20 World Cup2026)లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.. టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో 2011 వన్డే ప్రపంచకప్‌లో భార‌త్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను అప్పటి పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గుర్తు చేసుకున్నాడు. ఆ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంటర్వ్యూలో అఫ్రిది(Shahid Afridi) మాట్లాడుతూ..’వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌2011లో మొహాలీలో టీమిండియాతో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మ్యాచ్‌లో మేము చాలా అద్భుతంగా బ్యాటింగ్ ప్రారంభించాము. మా ఓపెనర్లు మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ తొలి వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్‌ను ఓడించడం ఖాయమని చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. కానీ తొలి వికెట్ పడగానే సీన్ మారిపోయింది’ అని గుర్తు చేసుకున్నాడు.

‘మా తొలి వికెట్ పడగానే స్టేడియంలోని అభిమానులు టీమిండియాను ఉత్సాహపరిచిన తీరు అమోఘం. ఆ కేరింత‌లు, అరుపుల దెబ్బకు మైదానంలో మా బ్యాటర్లు వణికిపోవ‌డం నేను చూశాను. అదే సమయంలో భార‌త్(Team India) తిరిగి అద్భుతంగా పుంజుకుంది. హఫీజ్ ఔటైన తర్వాత, మా బ్యాటర్లు వ‌రుస క్రమంలో పెవిలియ‌న్‌కు చేరారు. ప్రతీ బంతికి ఇబ్బంది పడ్డారు. స్టేడియంలో విపరీతమైన గోల మ‌ధ్య మా ప్లేయ‌ర్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. కనీసం నిలదొక్కునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు’ అని అఫ్రిది వెల్లడించాడు.

కాగా 2011 ప్రపంచ కప్‌లో మొహాలి వేదికగా భారత్ , పాకిస్థాన్ మధ్య సెమీఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం 261 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో పాక్ 231 ప‌రుగులకు ఆలౌటైంది. దీంతో29 పరుగుల తేడాతో పాక్ పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 85 ప‌రుగులు చేసిన స‌చిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ప్లేయ‌ర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.

పెజెష్కియాన్‌ కీలక ప్రకటన.. యుద్ధం ఆపాలంటే షరతులకు ఒప్పుకోవాల్సిందే..

పెజెష్కియాన్‌ కీలక ప్రకటన.. యుద్ధం ఆపాలంటే షరతులకు ఒప్పుకోవాల్సిందే..

పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలంటే తమ షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు.

టెహ్రాన్, మార్చి 12: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 1300 మంది ఇరానీయులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. రెండు దేశాలపై విరుచుకుపడుతోంది. అరబ్ దేశాలలోని అమెరికా ఎయిర్‌బేస్‌లపై దాడులు చేస్తోంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయిల్, గ్యాస్ ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
ఇరాన్‌ అధ్యక్షుడి కీలక ప్రకటన

పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలంటే తమ షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లోనూ తమ దేశంపై ఎవరూ దాడులు చేయకూడదని అన్నారు. తమ న్యాయపర హక్కులను ప్రపంచం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో శాంతి, భద్రతలకు ఇరాన్ కట్టుబడి ఉందన్నారు. అయితే, ఇరాన్ భద్రతకు గ్యారెంటీ ఇస్తేనే యుద్ధం ఆపుతామని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడినపుడు కూడా ఇదే విషయం చెప్పామని అన్నారు.

మెజ్తాబాకు ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అమెరికా డిమాండ్లకు ఒప్పుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్‌ను ఇరాన్ పూర్తిగా ఆపేయాలన్నారు. అలా జరగని పక్షంలో చావు తప్పదని హెచ్చరించారు. ఫిబ్రవరి 28వ తేదీ లాంటి దాడులు మరోసారి జరుగుతాయని చెప్పారు. ఇజ్రాయెల్ సాయంతో మొజ్తాబాను చంపేస్తామని తేల్చి చెప్పారు.

రాంతీర్థంలో తాగునీటి సమస్యకు చెక్…

రాంతీర్థంలో తాగునీటి సమస్యకు చెక్…

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాంతీర్థం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పరిష్కారం చూపారు. ఇటీవల త్రవ్వించిన బోరు బావికి కొత్త మోటారును అమర్చి, తాగునీటి సరఫరాను బుధవారం ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజలు తాగునీటి కష్టాల నుండి విముక్తి పొందారు. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కృషిని గ్రామస్థులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ తాగునీటి సరఫరాను కొనసాగిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈనెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు….

ఈనెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి, ఈ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్ధులు ముమ్మరంగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే విద్యార్ధుల హాల్ టికెట్లు కూడా విడదలయ్యాయి. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 8096958096 వాట్సాప్ నంబరు ద్వారా కూడా హాల్టికెట్లు పొందొచ్చు.విద్యార్ధులు భయపడ కుండా ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విద్యార్థులకు సూచించా రు.
ఈ సారి రాష్ట్ర వ్యాప్తం గా మొత్తంగా 5,28,239 మంది పరీక్షలకు హాజరవు తున్నారు. వీరిలో రెగ్యుల ర్ విద్యార్థులు 5,17,727 మంది ఉన్నారు. 5,329 ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, 1,057 గురుకులాల నుంచి 60, 139 మంది, 5,288 ప్రైవే ట్, ఎయిడెడ్ పాఠశాలల నుంచి 2,50,015 మంది పరీక్షలు రాయనున్నారు.
ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాలకు విద్యార్ధులు సులువుగా చేరుకునేం దుకు హాల్టికెట్ల…

error: Content is protected !!
Exit mobile version