గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి

సర్పంచులు మున్సిపల్ చైర్మన్ లో కౌన్సిలర్లు పారిశోద్య కార్యక్రమాలు చేయించాలి

ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఆదేశాలు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లాలో నియోజకవర్గంలో వనపర్తి పట్టణంలో అన్ని గ్రామాలలో సర్పంచులు మున్సిపల్ చైర్మన్ లు కౌన్సిలర్లు పారిశోధ్య కార్యక్రమాలు చెయంచాలని రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణ సందర్భంగా వనపర్తి లో కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్ లో ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త కాపు శివసేనారెడ్డి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మున్సిపల్ చైర్మన్ లు వనపర్తి మీడిదొడ్డి మాధవి పెబ్బేర్ శ్రీనివాస్ గౌడ్ కొత్తకోట అరుణ ఆత్మకూర్ నాగమణి మున్సిపల్ కమిషనర్లు అధికారులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ పట్టణాలలోవనపర్తి పట్టణంలో జిల్లాలోని నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో మురికి కాలువలు పేరుక పోయిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచులు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి పాలన సందర్భంగా శుభ్రం చేయించాలని ఆదేశించారు అదేవిధంగా వర్షాకాలం కంటే ముందు సాగునీటి కాలువలలో మట్టి పేరుకుపోయిందని మట్టిని తీసి వేయించాలని గ్రామాల సర్పంచ్లకు అధికారులను వీఆర్వోలను ఆదేశించారు ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్ రవాణా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సీసీ రోడ్స్ నిర్మాణాలు పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సోన మసూరి బియ్యం సరఫరా ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచ్ లు ప్రజలకు వివరించాలని కోరారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ప్రజలకు సంబంధించి పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ ఫిర్యాదులకు ప్రజలకు సమాచారం తెలపాలని అధికారులను ఆదేశించారు ఫైల్స్ పెండింగ్ లేకుండా క్లియరెన్స్ చేయాలని అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని ప్రగతి ప్రణాళిక కార్యాచరణ వారీగా విభజించి అమలు చేస్తున్నామని తెలిపారు వనపర్తి పట్టణంలో వనపర్తి జిల్లాల్లో ఇక్కడ కూడా పారిశ్రాధ్య లోపం చెత్త చెదారం మురికి కాలువలు జామ్ కాకుండా మట్టిని తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరా రు ఆరోగ్యం డ్రగ్స్ వాడకుండా అడ్డుకట్టు వేయాలని ఎక్సైజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ శిక్షణ శిబిరం సమావేశంలో జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ భీమ్య నాయక్ డి పి ఆర్ ఓ సీతారాం జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు

99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి..

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ లో జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణతో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల డిసిపి భాస్కర్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు. కార్యక్రమం జూన్‌ 12 వరకు కొనసాగుతుందని, ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ చైర్మెన్ ,సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానికంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు.

పెండింగ్‌ ఫైల్స్‌ పరిష్కారం, పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మన పనితీరు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. వేసవి కాలంలో జిల్లాలో తాగు నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన అందించేందుకు ఏర్పాటుచేసిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజా ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు మునిసిపాలిటీల చైర్ పర్సన్లు వైస్ చైర్ పర్సన్లు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version