పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట…

పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట

గుండాల,నేటిధాత్రి :

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్టఅనే అంశంపై నర్సాపురం తండా గుండాల పంచాయతీ కార్యాలయం గురుకులం స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈగల్ టీం సీఐ గుండాల సీఐ తిరుపతి, గుండాల ఎస్సై రాహుఫ్,ఏం ఆర్ఓ , ఎక్సైజ్ శాఖ అధికారులు, చైల్డ్ సూపరింటెండెంట్, ఏంఈఓ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం గురించి ఈగల్ టీం సీఐ మాట్లాడుతూ
డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబ జీవితం పై వచ్చే ప్రమాదాలు గురించి వివరించారు. అలాగే యువత, పిల్లలు డ్రగ్స్ కు దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.గుండాల సీఐ రహూఫ్ ఈ కార్యక్రమం లో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.అనుమానాస్పద వ్యక్తులతో లేదా చెడు స్నేహితులతో కలవకుండా ఉండాలి అని ఎవరు ఇచ్చినా తెలియని మాత్రలు లేదా పదార్థాలు తీసుకోకూడదు అని చదువు, క్రీడలు మంచి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి.డ్రగ్స్ ఉపయోగం కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని తెలియజేశారు. గుండాల ఎస్సై మాట్లాడుతూ పిల్లలు యువత సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టి వారికి సరైన మార్గదర్శనం చేయాలి అని ఈ కార్యక్రమం ద్వారా పిల్లల భద్రత మరియు డ్రగ్స్ నివారణపై సమాజంలో అవగాహన పెంపొందించటం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించబడింది అని చెప్పటం జరిగింది.అన్ని డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమం లో హాజరై తమ సూచనలు తెలియజేశారు.

డ్రగ్స్‌కు నివారణ పై అవగాహన కార్యక్రమం.

డ్రగ్స్‌కు నివారణ పై అవగాహన కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యక్రమంలో భాగంగా
అవగాహన కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర EAGLE టీం డైరెక్టర్ శాందీప్ శ్యాండిల్య పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పిల్లల భద్రత,డ్రగ్స్‌కు అడ్డుకట్ట కార్యక్రమంలో బాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈసందర్భంగా గురువారం రోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించి,డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలు,వాటి దుష్పరిణామాలు,అలాగే పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నటేష్ మాట్లాడుతూ..దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన నేటితరం విద్యార్థులని,వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,విద్యార్థులు తమ శక్తిని క్రీడలు, విద్య మరియు ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మళ్లించుకోవాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన EAGLE టీం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని,యువత భవిష్యత్తును కాపాడటమే పోలీస్ శాఖ మరియు EAGLE టీమ్‌ల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం…..

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం…..

డ్రగ్స్ బారి నుండి బావిభారత పౌరులను రక్షిద్దాం….

ఈగల్ టీం డిఎస్పి ఉపేందర్….

నేటిధాత్రి

 

కమలాపూర్ (హనుమకొండ) బావి భారత పౌరుల జీవితాలను నాశనం చేస్తూ,సమాజానికి పెనుభూతంగా తయారైన డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని ఈగల్ టీం డిఎస్పి ఉపేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలోనీ కమ్యూనిటీ హాల్లో విద్యార్థులు,గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు,వైద్య సిబ్బంది,మండల అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులకు డ్రగ్స్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు యువత డ్రగ్స్ బారినపడి తమ విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని,భవిష్యత్తును కోల్పోతున్నారని, దానికి దూరంగా ఉండాలని

పిలుపునిచ్చారు.ఆర్థికంగా,శారీరకంగా,మానసికంగా క్రుంగి పలువురు తమ జీవితాలన్ మధ్యలోనే బుగ్గి పాలు చేసుకుంటున్నారని,మరి కొందర్ ఆ మత్తులో నేరాలు,ఘోరాలు చేస్తూ సమాజానికి చీడ పురుగులుగా తయారై సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్త పరిచారు.డ్రగ్స్ వాడటం వల్ల కలిగే పలు అనర్థాలను వివరించారు.పిల్లలను డ్రగ్స్ కు దూరంగా ఉండేటట్లు వారిపై దృష్టి సారించాలని తల్లిదండ్రులను,పాఠశాల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం పాఠశాల విద్యార్థి విద్యార్థులచే డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేసి డ్రగ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.డ్రగ్ రహిత గ్రామంగా మార్చేందుకు అందరము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ నవీన్,కమలాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్ తో పాటు వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ వైద్యులు,సిబ్బంది, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మరియు వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version