వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.!

వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.

◆- అన్ని వర్ణాల వారు అర్హులే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాలలో ఉచిత ప్రవేశాలు జరుగుతున్నాయని సంస్థాపకులు, మహామండలేశ్వర్ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 14 ఏళ్లలోపు వారు అర్హులని చెప్పారు. వేదంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ఏ వర్ణానికి చెందినవారైనా అర్హులేనని తెలిపారుప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలో 90 మంది విద్యార్థులు కృష్ణ యజుర్వేదంలోని వివిధ కోర్సులు చదువుతున్నారని వారు పేర్కొన్నారు. ఆశ్ర.మంలో వేదం పఠించే విద్యార్థులకు ఉచిత బోధన, భోజనం, వసతి కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆరేళ్లపాటు శిక్షణ ఉంటుందని వారు అన్నారు. ప్రవేశ, వర, ప్రవర కోర్సులు (అర్చక, పౌరోహిత్య షోడశ సంస్కార విద్య) వేదాంత విజ్ఞానంపై బోధన ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో వేదాంత, న్యాయ, యోగదర్శనం,ధ్యానం, భజన, గ్రంథపఠనం తదితర తరగతులు ఉంటాయని ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఆచార్యులు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమైనట్లు వివరించారు. ఈ నెల 29న మౌఖిక పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 5న అడ్మిషన్లు జరుగుతాయని, జూన్ 12న లింగదీక్షతోతరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గలవారు దత్తగిరి ఆశ్రమ కార్యాలయాన్ని లేదా మరింత సమాచారం కోసం చరవాణి 9177259329, 86392 58008 ద్వారా సంప్రదించాలని కోరారు.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ప్రధానోపాధ్యాయురాలు ఏ.భద్రమ్మ తెలిపారు.

 

Students

ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 19 వరకు నిర్వహించబడుతుందని చెప్పారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డ్రాయింగ్, డాన్స్ క్రాఫ్ట్ కరాటే, గేమ్స్ మరియు స్పోర్ట్స్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పలు శిక్షణలు ఉంటుందన్నారు.ఈకార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులుజ్ మాజీ సర్పంచ్, గ్రామ కార్యదర్శి దేవేందర్,ఉపాధ్యాయులు కృపాల్,దేవేందర్,తాజుద్దీన్,కిషన్, పద్మశ్రీ,వాలంటీర్స్ పాల్గొన్నారు.

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ .

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 19 మంది లో బాలురు(13) బాలికలు(6 )గురు విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అధిక మార్కులు సాధించి ఉత్తీర్ణత అయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని పేద మధ్య తరగతి విద్యార్థులు అధిక మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరును తీసుకొచ్చారని అన్నారు.అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలు,పాఠశాల విద్య కమిటీ చైర్మన్ గుండా సునీత,ఉపాధ్యాయులు చూపిన చొరవతో అధిక మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.

అద్భుతమైన ఫలితాలు సాధించిన మామిడి గి పాఠశాల.!

అద్భుతమైన ఫలితాలు సాధించిన మామిడి గి పాఠశాల విద్యార్థులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిగి లో మొత్తం 30 మంది విద్యార్థులు ఈ సారి పదవ తరగతి పరీక్షలకు హాజరైనారు. అందులో 30 మంది విద్యార్థులు కూడా పాసైనారు గత సంవత్సరం లాగా ఈసారి కూడా పాఠశాల విద్యార్థులు 100% ఫలితాలు సాధించడం జరిగింది.

Students

 

A1 గ్రేడ్ సాధించిన విద్యార్థులు ముగ్గురు ఉన్నారు. 500 లకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 30 లో 19 మంది విద్యార్థులు ఉన్నారు.

రిజల్ట్స్ లో ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

ఎస్ఎస్సి రిజల్ట్స్ లో ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రోబెల్ మోడల్ హైస్కూల్ వెల్లడించిన ఎస్ఎస్సి రిజల్ట్ లో విద్యార్థుల మార్కులు 561 బి సిరిచందన 550 డి దీపాన్విత 541 బి దీక్ష 532 కె నిహారిక 521 జి వైష్ణవి మార్కులు సాధించారు
500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 10 మంది.
100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల
గత 20 సంవత్సరాల నుండి మండలంలో కార్పొరేట్ కు దీటుగా అగ్రగామిగా నిలుస్తున్న ఏకైక పాఠశాల ప్రొబెల్ మోడల్ హై స్కూల్ అధిక మార్కులు సాధించిన భాష బోయిన సిరి చందనను సన్మానించిన ప్రొఫైల్ మోడల్ యజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు

ప్రైవేట్ స్కూలు వద్దు అంగన్వాడి ముద్దు.

ప్రైవేట్ స్కూలు వద్దు అంగన్వాడి ముద్దు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

చిట్యాల మూడవ కేంద్రంలో అన్యువల్ డే ప్రోగ్రాం అరుణ భాగ్యమ్మ టీచర్స్ఏర్పాటు చేయడం జరిగింది జయప్రద సూపర్వైజర్ హాజరై జూన్24 నుండి ఏప్రిల్ 25 వరకు 11 నెలలలో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో నేర్చుకున్న ప్రీస్కూల్ కార్యక్రమాలన్నింటినీ తల్లులకు చేయించి చూపించడం జరిగింది ఆటలు పాటలు కథలు ఇంగ్లీష్ తెలుగు బోధనా అక్షరాలు అంకెలు వయసుల వారీగా పిల్లల బరువు ఎత్తులు ఏ స్థాయిలో ఉన్నవని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చేసి చూపించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ స్కూల్లువద్దు అంగన్వాడీ ముద్దు అనే నినాదంతో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించినట్లయితే పిల్లల శారీరక మానసిక కండరాల అభివృద్ధి ఆలోచన శక్తి మేధాశక్తి అభివృద్ధి చెంది నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతూ ఆరు సంవత్సరాలురాగానే ఏ స్కూళ్లకు పంపించిన పిల్లలందరు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు ప్రైవేట్ స్కూల్ కి పంపడం వల్ల చిన్న వయసులో ఆడి పాడి సంతోషంగా గడపాల్సిన వయసులో ప్రైవేట్ స్కూల్ బందికానలో బంధించకండి ప్రస్తుతం శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు మినిస్టర్ జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి పరుచుట కొరకు పిల్లలు సంతోషంగా ఉత్సాహంగా ఉండుట కొరకు భవనాలను రిపేర్ చేయించడం రకరకాల పెయింటింగ్ వేయించడం యూనిఫామ్ ఇవ్వడం పిల్లలు కూర్చోవడానికి మ్యాట్స్ ఎన్నో రకాల ఆట వస్తువులను కూడా పంపిచ్చుచున్నారు అలాగే పిల్లలకు ముఖ్యంగా రుచికరమైన భోజనాన్ని వేడిగా అందించడం జరుగుతున్నది అందరూ అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో అరుణ భాగ్యమ్మ జ్యోతి భాగ్యలక్ష్మి సంధ్యారాణి సుజాత మహిళలు హాజరైనారు తల్లులందరికి పిల్లల గ్రోత్ కార్డ్స్ అభివృద్ధి పరిశీలన పత్రాలు అందివ్వడం జరిగింది.

జిల్లా పరిషత్ పాఠశాలలో .!

జిల్లా పరిషత్ పాఠశాలలో
తల్లిదండ్రులు ఉపాద్యాయుల సమావేశానికి హాజరైన ఎస్సై దీకొండ రమేష్

ఓదెల (పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

 

ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన తల్లి దండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా పోత్కపల్లి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ధీకొండ రమేష్ హాజరయ్యారు.2024-25 విద్యాసంవత్సరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు జారీ చేసిన ఓదెల యం ఈ ఓ Y. రమేష్ ఈ సందర్భంగా SI రమేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు జాగ్రత్త గా ఉండాలని ఈత కోసం వెళ్లి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది అని, మొబైల్ ఫోన్లను వాడే క్రమం లో ఆన్లైన్లో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని. విద్యార్థినులు ఫేస్ బుక్,వాట్సాప్,ఇన్స్తా గ్రామ్ లలో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ ఆన్లైన్ గేమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని,చిన్న పిల్లలకు బైక్ లు మొదలైన వి డ్రైవింగ్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని అన్నారు.ఓదెల MEO మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు చదవడం రాయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పై తరగతులకు చెందిన తెలుగు,హిందీ పుస్తకాలు విద్యార్థులకు అందించి వాటిని తిరిగి పాఠశాల ప్రారంభం నాటికి వాటిని చదవడం రాయడం చేస్తూ భాష పట్ల ప్రావీణ్యం పెంచుకోవాలని, ప్రమాదాల వైపు పోకుండా తల్లి దండ్రుల సంరక్షణలో ఉండాలని కోరారు.2024-25 విద్యాసంవత్సరం FLN లో ఓదెల మండలం యం ఈ ఓ సమర్ధ వంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ఓదెల 3వ స్థానం లో నిలిపినందుకు డి ఈ ఓ చేతుల మీదుగా ప్రశంస అందుకున్న యం ఈ ఓ కు గ్రామస్తులు విద్యార్థుల తల్లి దండ్రులు శాలువాతో సన్మానం చేశారు.ఈ సమావేశం లో కనగర్తి మాజీ సర్పంచ్ తాళ్లపల్లో లక్ష్మణ్ , కొట్టిరెడ్డి మహేందర్ రెడ్డి ,మాజీ వార్డు సభ్యులు తాళ్లపెల్లి శ్రీనివాస్ ,జాగిరి కిషోర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిండ్రులు పాల్గొన్నారు.

మండపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలు.

మండపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు. మాట్లాడుతూ మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక ఫలితాలు సాధించినందుకు గర్వంగా ఉందని అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులలో.MPC. విభాగంలో. G. సిరి.T. శైలజ. 470 మార్కులకు గాను. 462. ప్రథమ స్థానంలో నిలిచారని.Bipc. విభాగంలో.P. అనూష 400. మార్కులు గాను.CEC. విభాగంలో.E. ప్రణీత. 400. మార్కులు గాను ఆయా విభాగాలలో ప్రథమ స్థానంలో నిలిచారని. ద్వితీయ సంవత్సరంలో.M. అంజన. 932.M. హర్షిత. 931. ఎంపీసీ. బైపిసి. సిహెచ్. శ్రీజ. 894. ల.తో. ప్రథమ స్థానం నిలిచారని. సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు ఇక ముందు కూడా మోడరన్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విద్యార్థులు జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని చదువులో చక్కగా రానించి మరిన్ని మంచి ఫలితాలు రాబట్టాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారికి ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్.!

ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గ్రామీణ భాగస్వామ్యంపై అవగాహన సదస్సు

నేటిధాత్రి వరంగల్:

ఎస్సార్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గ్రామీణ భాగస్వామ్యంపై అవగాహన సదస్సు బుధవారం నాడు హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు, ఎస్సార్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం పార్టిసిపేటరీ రూరల్ అప్రజల్ గ్రామీణ విశ్లేషణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం నుండి విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్, కెవి కెఆర్ ఎడబ్ల్యూ డిపి కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. సోషల్ మ్యాపింగ్, వెన్ రేఖ చిత్రాలు వంటి వివిధ భాగస్వామ్య పద్ధతులను ఉపయోగించి భాగస్వామ్యంపై రైతులకు వివరించారు. అనంతరం స్థానిక సంఘంతో సమావేశమయ్యారు విద్యార్థులు. ఆ ప్రాంతంలో స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి కీలక సమస్యలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ డాక్టర్ భూపాల్ రాజ్, ఆర్ ఎ డబ్ల్యూ ఏపీ కోఆర్డినేటర్ శ్రీకర్ రెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ మహేష్, కె వి కె ఆర్ ఏ డబ్ల్యు ఏపీ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్, మార్గదర్శకత్వంలో పాల్గొన్న విద్యార్థులు మీనుమోసెస్, ప్రణయ్, అభిషేక్, నవీన్, ఆలీ, రంజిత్, సాయిపవన్, రాజేష్, సమద్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు.

సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని తెలంగాణ (మోడల్) ఆదర్శ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. సిఈసి ప్రథమ సంవత్సరం ఫలితాల్లో భోగ శ్రీజ 494/500 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తెలియజేశారు. ఎంపిసి విభాగంలో పుట్ట హాసిని 448/470, అదరలేని వైష్ణవి 427/470, మ్యాడారం అంజనీ సామ్య 415/470, బైపిసి విభాగంలో ఎన్.జ్యోతి 389/440, జాడి హరిణి 350/440, గడ్డం నవ్య 342/440, సిఈసి మొదటి సంవత్సరంలో భోగ అర్చన 477/500, కూన రేణుక 462/500 మార్కులు, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపిసిలో కే.మహేశ్వరి 934/ 1000, ఎస్.సాయి ప్రణవి 896/1000, బైపిసిలో సిహెచ్.శ్రీవిద్య 893/1000, ఎమ్.ప్రణవి 829/1000, సిఈసిలో ఈ.కార్తిక్ 955/1000, కే.శ్రావణి 873/1000 మార్కులు సాధించి రామడుగు మోడల్ పాఠశాలను మండలంలో ముందు వరుసలో ఉంచారన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తో పాటు ఉపాధ్యాయుల బృందం, తదితరులు అభినందించారు.

విద్యార్థులు ఇష్టపడి చదవాలి పాఠశాల.!

విద్యార్థులు ఇష్టపడి చదవాలి పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలో ఈరోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ప్రాథమికొన్నత పాఠశాల, గణపురం మండలంకేంద్రంలోని మోడల్ స్కూల్
ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పాఠశాలల వార్షికోత్సవ వేడుకల్లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు చాలా ఆకర్షించాయి. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఏడాది పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రులతోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారన్నారు.

 

MLA

తల్లిదండ్రులు పిల్లలకు ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి, వారితో విద్యాపరమైన సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో భయం పోతోందన్నారు. చదవుతో పాటు ఆటపాటలు కూడా చాలా అవసరం అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరారు.విద్యార్థుల కళా ప్రదర్శన అద్భుతంగా ఉందని అన్నారు.చెల్పూర్ పాఠశాలలో వాష్ రూమ్స్ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు.పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు టెంకాయ కొట్టి ఇట్టి నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పారు. గణపురం మండలం మోడల్ పాఠశాలలో డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధ్యాయులను శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి , జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ , మండల ఎంపిడిఓ ఎల్ భాస్కర్ ,ఉపాధ్యాయులు , విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం.

జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం:

 

నేటిధాత్రి

 

 

 

 

తేదీ: 21-04-2025 నాడు జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ఆధునికరణ కొరకై పాఠశాల పూర్వ విద్యార్థి గుండేటి ప్రసాద్ మమత దంపతులు గారు విరాళాలు అందజేయడం జరిగినది. ఇట్టి కంప్యూటర్ గదిని వారి తల్లి గారైన గుండేటి గంగుబాయి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎం అర్జున్ గారు మాట్లాడుతూ నేటి యుగంలో పిల్లలకు తప్పనిసరిగా కంప్యూటర్ విద్యపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి కంప్యూటర్ గది ఆధుని కొరకు సహకరించిన గుండేటి రాజేంద్రప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. బోగోరి గంగాధర్ లక్ష్మీ నర్సు, ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశం, పి దరందీప్, పి శశిధర్, డి ఏడుకొండలు, జి అశోక్ ,రాజ్యలక్ష్మి, లక్ష్మి, ఉమాదేవి, నీలిమ, షాహినా, రవీందర్, సుమన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

బాలికల గురుకుల పాఠశాలలో.!

బాలికల గురుకుల పాఠశాలలో పోషణ పక్వాడ్ పై అవగాహన కార్యక్రమం

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండలకేంద్రము లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రిన్స్ పాల్ బిక్షపతి సమక్షంలో పోషణ పక్వాడ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద నిర్వహించడం జరిగింది,ఈసాద్7 ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమము యొక్క ఉద్దేశం 11 నుండి 18 సంవత్సరాల బాలికలు తీసుకోవలసిన సమతులఆహారము వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత ఆడపిల్లలయినందన ఇంటి పనులు వంట పనులు కూరగాయల తోటలు పండ్లు పూల మొక్కలు పెంచుకోవడం మొబైల్ కి దూరంగా ఉండడం విద్య యొక్క ప్రాముఖ్యత బయట వారు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మవద్దని 18 సంవత్సరాలు అయ్యే వరకు వివాహ ఆలోచన చేయరాదని అన్ని రంగాలలో ఆడపిల్లలు అని వెనకడుగు వేయకుండా క్రీడారంగాలు వ్యాయామము క్రికెట్ అన్ని వృత్తి కోర్సులను చదువుతోపాటు నేర్చుకోవాలని వివరించడం జరిగింది,అనంతరం సూపర్వైజర్ మాధవి పిల్లలందరితో పోషకహార ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి అరుణ జ్యోతి భాగ్యమ్మ ప్రతిభ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయురాలు మాధవి, సూపర్వైజర్హాజరైనారు

దుంపేట యు.పి.యస్ పాఠశాల ప్రభంజనం.

ప్రభంజనం ప్రభంజనం
దుంపేట యు.పి.యస్ పాఠశాల ప్రభంజనం

  నేటిధాత్రి

 

 

జిల్లా స్థాయి క్విజ్ పోటీలో మా 5వ తరగతి విద్యార్థి ఊడుగుల శ్రీవాన్ టీం జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించినందున ఊడుగుల శ్రీవాన్ కి పాఠశాల ఉపాధ్యాయుల బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, గ్రామ పెద్దలు, పాఠశాల శ్రేయోభిలాషులందరి తరుపున హార్దిక శుభాకాంక్షలు.
ఇంతటి ఘనత సాధించినందున మా విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ
ఉపాధ్యాయుల బృందం యు.పి.యస్ దుంపేట

సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను.

సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను శాస్త్రీయంగా పునర్విభజించాలి.

పెనుగొండ హై స్కూల్ ను నూతన కాంప్లెక్స్ గా ఏర్పాటు చేయాలి

గతంలో ఇష్టారాజ్యంగా, అస్తవ్యస్తంగా పాఠశాలల కూర్పు

దూరాభారంతో సవ్యంగా పర్యవేక్షణ చేయని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు

చదువులో తగ్గిన గుణాత్మకత – నష్టపోయిన విద్యార్థులు

నూతన ఇనుగుర్తి మండలంలోకి భౌగోళికంగా 15 పాఠశాలల చేర్పు

అయినా ఇంకా కేసముద్రం మండల స్కూల్ కాంప్లెక్స్ లోనే కొనసాగింపు

వచ్చే నూతన విద్యా సంవత్సరానికి ముందే స్కూల్ కాంప్లెక్స్ ల పునర్విభజన పూర్తి చేయాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

స్కూల్ కాంప్లెక్స్ లోకి సమీప పాఠశాలలను చేర్చి శాస్త్రీయంగా పునర్విభజించాలని కోరుతూ శనివారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో మండల విద్యాధికారి కాలేరు యాదగిరికి ప్రాతినిధ్యం చేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ గతంలో స్కూల్ కాంప్లెక్స్ ల ఏర్పాటు దగ్గర ,దూరంతో సంబంధం లేకుండా అస్తవ్యస్తంగా జరిగిందని , ఏ ప్రామాణికత లేకుండా చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. స్టేషన్ కాంప్లెక్స్ లో ఉన్న యుపిఎస్ మహమూద్ పట్నం పాఠశాల నిజానికి కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ దగ్గర్లో ఉంటుందని, అమీనాపురం సమీపంలో ఉండే మాన్సింగ్ తండా పాఠశాల స్టేషన్ , కల్వల కాంప్లెక్స్ లకు సమీపంలో ఉంటుందనీ , కానీ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే తాళ్లపూసపళ్లి కాంప్లెక్స్ లో చేర్చారని , సర్వాపురం స్టేషన్ కి దగ్గరగా ఉన్నప్పటికీ తాళ్లపూసపల్లి కాంప్లెక్స్ లో చేర్చడం, అలాగే పెనుగొండ, దాని ఆవాస పాఠశాలలన్నీ స్టేషన్ కాంప్లెక్స్ కు చాలా దూరంగా ఉన్నప్పటికీ విధి లేక దానిని స్టేషన్ కాంప్లెక్స్ లో చేర్చడం వల్ల ఆయా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు
దూరాభారంతో పాఠశాలల పర్యవేక్షణ చేయలేకపోయారని , తద్వారా పర్యవేక్షణలోపించి విద్యార్థులకు గుణాత్మక విద్య సరిగా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు

పెనుగొండ ఉన్నత పాఠశాల ఆవాసంలో ఉండే 15 పాఠశాలలన్నింటితో పెనుగొండ నూతన కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తే ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణకు సులభంగా ఉంటుందని సూచించారు.

ఇదిలా ఉంటే నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండలానికి భౌగోళికంగా 15 పాఠశాలలు చేర్చినప్పటికీ ఇనుగుర్తి మండలంలో నూతన స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయకపోవడం వలన అవి ఇంకా కేసముద్రం మండల కాంప్లెక్స్ లోనే
కొనసాగుతున్నాయని, ఆయా పాఠశాలల పర్యవేక్షణ ఇనుగుర్తి మండల ఎంఈఓ మరియు కేసముద్రం మండల విలేజ్ మరియు కల్వల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చేయాల్సి ఉండగా వారి మధ్య సమన్వయం కొరవడి పర్యవేక్షణ సవ్యంగా సాగలేదని ముఖ్యంగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే ఉంటారని, వారి సర్వతోముఖాభివృద్దికి , వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు .కొంతమంది ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పని చేస్తే , మరికొంతమంది పర్యవేక్షణ అనే భయంతో పని చేస్తారన్నారు.
విద్యా ప్రమాణాలతో ముడిపడి ఉన్న ఈ పర్యవేక్షణ సవ్యంగా సాగాలంటే, ఆ కాంప్లెక్స్ లో ఉండే పాఠశాలలు ఆ కాంప్లెక్స్ కు అతి సమీపంలో ఉండేలా శాస్త్రీయంగా స్కూల్ కాంప్లెక్స్లను పునర్విభజన చేయాలని ,అలాగే పెనుగొండ ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్ గా మార్చాలని అధికారులను ఈ సందర్భంగా సురేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్ ,అప్పాల నాగరాజు పాల్గొన్నారు.

పాఠశాల వార్షికోత్సవ వేడుకలు.!

ఘనంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగామండల విద్యాధికారి అంబాటి వేణు కుమార్ హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తిరుపతయ్య, మాజీ ఎంపిటిసి గుండి ప్రవీణ్, మాజీ ఉపసర్పంచ్ మేడి శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ చిలువేరి స్వప్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, మ్యాకల నాగరాజు, మడ్డి మనోజ్, ఉత్కం శ్రీనివాస్, మచ్చ పవన్ కళ్యాణ్, మంద రాజశేఖర్, కత్తి సాయి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలలో ఏడుగురు బాలికలకు అస్వస్థత.

గురుకుల పాఠశాలలో ఏడుగురు బాలికలకు అస్వస్థత

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం హోతి(కె) బాలికల గురుకులంలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నైట్ స్టడీ తర్వాత విద్యార్థినులు తీవ్రమైన దగ్గు, ఆయాసంతో అస్వస్థతకు గురవడంతో వారిని హాస్టల్ సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి వారు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

సమయానికి తెరుచుకొని పాఠశాల.

సమయానికి తెరుచుకొని పాఠశాల

విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులు

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మున్సిపల్ మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ రోజురోజుకు మరి అధ్వానంగా తయారవుతున్నాయని ప్రభుత్వ పాఠశాలలో కొలువులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా విధులలో అలసత్వం వహిస్తున్నారని, సమయానికి పాఠశాలల తలుపులు తెరుచు కోవడం లేదని విద్యార్థుల మాటలు వినబడుతున్నాయి, మండల విద్యాశాఖ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు మెమొలు జారీ చేసినప్పటికీ ఉపాధ్యాయుల విధి నిర్వహణలో మార్పు కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మండలంలో పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు స్థానికంగా ఏ ఒక్కరు ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి కొన్ని రవాణా సౌకర్యాలు రైలుబండ్లు మరియు ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యం రాకపోకలు జరుగుతున్నప్పటికీ ఎవరు ప్రశ్నించేవారు లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. స్థానికంగా ఉండకుండా ఇలా రోజు వచ్చి పోయే క్రమంలో ట్రైన్లు బస్సులు ఆలస్యంగా నడవడం సహజం, కానీ విధులు నిర్వహించే ఉద్యోగులు సమయానికి రాక ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడే వీరి పాఠశాల సమయపాలనగా భావిస్తూ విడుదల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విద్యావేత్తలు మేధావులు ప్రశ్నిస్తున్నారు.

Education

తల్లి తండ్రి దైవం గురువు వీరు అత్యున్నతమైన స్థానం కలిగిన వారిని, గురువుకు అత్యున్నతమైన గౌరవం ఈ సమాజంలో ఉందని అంతటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు అద్దకారం అయిపోతుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు చదువులలో వెనుకబడిపోతున్నారని పలువురు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గురువారం కేసముద్రం మున్సిపల్ లోని దానసరి ఎస్టి కాలనీ గల ప్రాథమిక పాఠశాల సమయానికి తలుపులు తెరుచుకోక విద్యార్థులు సమయానికి పాఠశాల చేరుకొని గేటు బయట ఎదురుచూస్తున్న సంఘటన చోటుచేసుకుంది, ఉదయం 7:40 నిమిషములకు పాఠశాలకు రావలసిన ఉపాధ్యాయులు సమయానికి రాక గేటు తాళాలు తీసేవారు లేక విద్యార్థిని విద్యార్థులు గేటు బయటే కూర్చుని ఉపాధ్యాయుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే పాఠశాలకు ఆలస్యంగా చేరుకోవడం జరిగింది, ఇంకో ఉపాధ్యాయులు మాత్రం నేను ఈరోజు రావడం లేదని లీవ్ లో ఉన్నానని ఫోన్ ద్వారా వివరణ ఇవ్వటం జరిగింది, ఈ స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సమాచారం తెలియజేయగా మాకు ముందస్తు సమాచార లేదని తెలిపారు. ఇలా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పనితీరు మండల విద్యాశాఖ అధికారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచారం కాకుండా చూడాల్సిన విద్య శాఖ అధికారులు ఇలాంటి ఉపాధ్యాయుల పట్ల కఠిన నిర్ణయాలు పాటించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల ఆణిముత్యాలు..

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని దోరువారివేంపల్లి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు 100%శాతం ఫలితాలు , సత్తా చాటిన పాఠశాల విద్యార్థులు
ఫిబ్రవరి 23 వ తారీఖున జరిగిన టీజీ గురుకుల సెట్ లో హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా అందులో నుండి పోయిన వారం వెల్లడించిన ప్రవేశ ఫలితాల వెల్లడిలో 10/10 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు దొరవారివేంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సువర్ణ పాక క్రిష్ణ తెలిపారు… ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా యొక్క పాఠశాలలో ప్రాథమిక తరగతి వరకే ఉండడం వలన విద్యార్థులు ఈ గ్రామం మంచి పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలని పాఠశాల విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్ష కోసం స్పెషల్ క్లాస్ నిర్వహించము అందుకే విద్యార్థులకు ఈ రోజున పదికి పది మంది విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలలో సీట్ రావడం జరిగిందని చెప్పారు ఈసందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.. విద్యార్థులు తల్లిదండ్రులు సందర్భంగా చాలా సంతోషం పడ్డారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అండెం కృష్ణ గారు అంగన్వాడీ టీచర్ భారతి గారు పాల్గొన్నారు…

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు.

అంగరంగ వైభవంగా.కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు*

 

రాయికల్ నేటి ధాత్రి. ఏప్రిల్ రాయికల్.పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ “విరించి-2025″వార్షికోత్సవ వేడుకలను గురువారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ….. పాఠశాలల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలోని ప్రతిభ పాటవాలు వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్న శిఖరాలను అధిరోహించాలని,సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు.వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు,కరాటే,పౌరాణిక దేశభక్తి నృత్యాలతో పలువురిని అబ్బురపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు,డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version