బడుగు బలహీన వర్గాలకు న్యాయం.

బిల్లుల ఆమోదంతో… బడుగు బలహీన వర్గాలకు న్యాయం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభల్లో ఆమోదం

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దశ్రు నాయక్,

శాసనసభలో బీసీ రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన సందర్భంగా నేడు కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు,ధన్యవాదాలు తెలిపిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దస్రు నాయక్

అనంతరం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ:- 42 శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లును చట్టసభలో ఆమోదంతో బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని నిరూపితమైంది..

కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల న్యాయం చేస్తుందని మరోసారి రుజువైంది.
ఎవరు చేయలేని సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారు.
బీసీ బిల్లును కేంద్రం బిజెపి అడ్డగుడ్డ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు..

సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దపిట వేస్తున్నాను చెప్పడానికి బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభలో ప్రవేశపెట్టడమే నిదర్శనం..

ఎన్నికల్లో హామీ ఇచ్చినం మాట ప్రకారం రాష్ట్రంలో కులగరణ పూర్తి చేసి కాంగ్రెస్ చరిత్ర సృష్టించడమే కాకుండా దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది..

దేశవ్యాప్తంగా కులగనన చేపట్టాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితులను చేస్తానని చెప్పి కేసీఆర్ గెలిచాక తానే గద్దనికి దళితులను అవమానించారు అని గుర్తుచేశారు..

ఈ కార్యక్రమంలో ప్రాంతీయ అథారిటీ సభ్యులు రావుల మురళి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,మాజీ జడ్పీటీసీ కదిరే సురేందర్,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పోలేపాక నాగరాజు, ఎండి తాజోద్దీన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయాబ్ ఖాన్, యాదగిరి, వీరన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు, పోలేపల్లి వెంకట్ రెడ్డి,రాము, వేణు,కొండ సురేష్, కొమరయ్య, సాట్ల శ్రీను,మాజీ ఉప సర్పంచ్ వెంకన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులు, భూలోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గందసిరి వెంకన్న, పోకల శ్రీనివాస్,తరాల సుధాకర్, సామల నరసయ్య, ఏలేందర్ బన్నిచెట్టి వెంకటేష్, బద్య, హనుమ, బాల,ముజ్జూ, సుందర్ వెంకన్న, బాదవత్ సుమన్,బాలు, పిల్లి రమేష్, వెంకన్న, ఎండి నవాజ్, మామిడి శెట్టి మల్లయ్య, సారయ్య,అరుణ్,రఫీ,సిద్దు,అలీమ్,ఏకాంత చారి,సుధాకర్, గొట్టం రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version