రాజీమార్గమే రాజ.. మార్గం..
13 జాతీయ లోక్ అదాలత్..
ఎస్సై రాజేష్.
నిజాంపేట: నేటి ధాత్రి
శత్రువులను పెంచుకుంటు వెళ్తే శత్రుత్వమే పెరుగుతుందని రాజీ పడితే.. ఇద్దరూ గెలిచినట్టేనని రాజీమార్గమే రాజ మార్గమని నిజాంపేట ఎస్సై రాజేష్ పేర్కొన్నారు. నిజాంపేటలో మాట్లాడుతూ.. వివిధ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు ఈనెల 13న జరిగే జాతీయలోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ కేసులకు సంబంధించి యాక్సిడెంట్, గొడవ, చీటింగ్, భూతగాదాలు వివాహ సంబంధానికి సంబంధించిన కేసులపై రాజీ పడదగిన కేసులపై రాజీపడి కేసులను క్లోజ్ చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజ మార్గమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.