నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రపంచవ్యాప్తంగా న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కుల రక్షణను పెంపొందించే లక్ష్యంతో ఏటా జులై 17న ‘నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం’గా నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల మధ్య నిరాయుధీకరణను సాధించడం, వివిధ దేశాల మధ్య తలెత్తే సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడం, మానవాళి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు వారి హక్కులను పరిరక్షించేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేశారు.