బిజెపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి : బిజెపి నేత కౌకుట్ల చంద్ర రెడ్డి..

బిజెపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి : బిజెపి నేత కౌకుట్ల చంద్ర రెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మురుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మాజీ చైర్మన్, బిజెపి నాయకుడు కౌకుట్ల చంద్ర రెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ వార్డు 2 పోతారంలో బీజేపీ అభ్యర్థి ప్రియాంక శ్రీకాంత్ రెడ్డి తరపున పోతారం, నారాయణపూర్ గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలోబీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి..

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..

మైనంపల్లి హనుమంతరావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం నస్కల్, నార్ల పూర్, కాసింపూర్ గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు.. గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులే కాకుండా, సొంతంగా గ్రామాల అభివృద్ధికి ఎంఎస్ఎస్ఓ ద్వారా నిధులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version