కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..
మైనంపల్లి హనుమంతరావు
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం నస్కల్, నార్ల పూర్, కాసింపూర్ గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు.. గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులే కాకుండా, సొంతంగా గ్రామాల అభివృద్ధికి ఎంఎస్ఎస్ఓ ద్వారా నిధులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు ఉన్నారు.
