ప్రజా ప్రభుత్వం..తెలంగాణ రైతుకు వరం.

-మంత్రి ‘‘ఉత్తమ్‌’’ పర్యవేక్షణ.. కమీషనర్‌ ‘‘చౌహాన్‌’’ కార్యదక్షత.

-మిల్లర్‌ నుంచి వసూలు చేస్తున్న ఖమ్మం జేసికి ప్రశంసలు!

-జిల్లా అధికారులతో పాటు, కమీషనర్‌ చౌహాన్‌ను రైతులు ప్రశంసిస్తున్నారు.

-అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు?

-అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు.

-అధికారులకు ప్రభుత్వ స్వేచ్ఛ..తప్పు చేసే మిల్లర్లకు తప్పదు శిక్ష.

-ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్‌ నుంచి రికవరీ..

-వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ.

-మిల్లర్‌ నుంచి ముక్కు పిండి వసూలు… రైతుల ఖాతాలో పైసలు.

-2 వేల బస్తాలు మింగిన మిల్లర్‌ జగన్‌కు చుక్కలు..

-టోపి పెట్టాలనుకున్న మిల్లర్‌…తాట తీసిన ఆఫీసర్‌.

-మరో సారి జగన్‌ మోసం బైట పడిరది!

-‘‘నేటిధాత్రి’’ ముందే పసిగట్టి చెప్పింది.

-రెండు వేల వడ్ల బస్తాల స్వాహా వెలుగులోకి వచ్చింది?

-అధికారులను గుప్పిట్లో పెట్టుకొని 50 లారీలు మళ్లించుకున్నాడు.

-2 వేల బస్తాలు కన్నం పెట్టాడు.

-ఖమ్మం జేసి వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు.

-ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు.

-అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు.

-మిల్లర్‌ జగన్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

-దేశంలోనే ఇది మొదటి సారి అని అంటున్నారు.

-రైతులను వందల కోట్లు ముంచిన మిల్లర్లు?

-రైతులను నిలువుగా మిల్లర్‌ ముంచాలని చూశాడు.

-అధికారులు అప్రమత్తమై రికవరీ చేయిస్తున్నారు.

-ఖమ్మం జిల్లా అధికారుల బేష్‌.

-అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం.

-రైతుల వద్ద కోసిన వడ్లతో కోట్లు కూడబెట్టుకుంటున్నారు.

-ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ప్రజలకు మేలైన, మెరుగైన పనులు చేయొచ్చని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరూపించింది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన కొంత మంది అక్రమ మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట అయ్యింది. గత ప్రభుత్వ పెద్దలు కళ్లు చూసుకోవడం వల్ల మిల్లర్లు కొందరు రైతులను విపరీతంగా మోసం చేసే వారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే వారు. రైతులకు చెందాల్సిన సొమ్మును తమ ఖాతాల్లో వేసుకునే వారు. రైతుల గోస పుచ్చుకునే వారు. ఆ సమయంలో మిల్లర్లు చెప్పిందే వేదమన్నట్లు చేసే వారు. అప్పటి ప్రభుత్వం ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతులు ఎంతో నష్టపోయే వారు. యధా రాజ, తదా ప్రజా అన్నట్లు అధికారులు మేమేం తక్కువ అన్నట్లు మిల్లర్లకే సాయపడేవారు. వారు కూడా రైతులను దోచుకునేందుకు పరోక్షంగా సహకరించే వారు. రైతుల ఆందోళన అరణ్య రోదనయ్యేది. పట్టించుకునే వారు కాదు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కూడా గత పాలకుల కాలంలో జరిగింది. కానీ ఇకపై మిల్లర్ల ఆట కట్‌ అనే విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు రూపాయి కూడా మోసానికి గురి కాకుండా చూసుకునే పరిస్థితి తెస్తున్నారు. సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్తి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆ శాఖ కమీషనర్‌ చౌహాన్‌ తీసుకుంటున్న చర్యల మూలంగా రైతులకు భవిష్యత్తులో నష్టం వాటిల్లకుండా చూసే రోజులు రాబోతున్నాయి. ఇది ఎంతైనా తెలంగాణ రైతుకు వరమనే చెప్పాలి. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పర్యవేక్షణతో కమీషనర్‌ చౌహాన్‌ కార్యదక్షతతో కూడుకున్న చర్యల వల్ల ఖమ్మం జిల్లా రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఏర్పడిరది. గతంలో ప్రభుత్వ పెద్దల ఆలోచనలు, అధికారులను కూడా తప్పు దోవ పట్టించేలా వుండేవి. పైకి మాత్రం రైతులకు ఎంతో మేలు చేస్తున్నట్లు ప్రకటనలు చేసే వారు. చేతులు దులుపుకునే వారు. దాంతో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకునే వారు అసలే కాదు. నేటిధాత్రి లాంటి మీడియాలో ఎన్ని కథనాలు రాసినా పట్టించుకునే వారు కాదు. స్పందించే విధానం వుండేది కాదు. ఇక రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తినప్పుడు మాత్రం నామ మాత్రపు స్పందన కనబర్చినట్లు నటించే వారు. అంతకు మించి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వాలు ఆ బాధ్యతలు పూర్తి స్థాయిలో అధికారులకు అప్పగించి, ఎలాంటి అవకతవకలు జరగొద్దని చెప్పడం గతంలో చూడలేదు. కానీ ప్రజా ప్రభుత్వం వడ్ల సేకరణలో అధికారులకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు. అది ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తన కర్తవ్యాన్ని అంకిత భావంతో అమలు చేశారు. ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్‌ నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగా చర్యలు మొదలుపెట్టారు. తప్పు చేసిన మిల్లర్‌ కు చుక్కలు చూపిస్తున్నాడు. వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ వుండాల్సిన అవసరం లేకుండా చూస్తున్నారు. అయితే ఆ కధ ఏమిటో తెలియాలి. ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వడ్లు హన్మకొండ జిల్లాలో వున్న కొన్ని మిల్లులకు జాయింట్‌ కలెక్టర్‌ సిఫారసు చేశారు. వాటిని ఖమ్మం జేసి సూచించిన విధంగా ఎంపిక చేసిన మిల్లర్లకు చేరలేదు. మధ్యలో హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఓ మిల్లర్‌ కు కొమ్ము కాసే పని పెట్టుకున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల వడ్లను జగన్‌ అనే మిల్లర్‌ కు మళ్లించారు. నిజానికి చెందాల్సిన మిల్లర్లకు చెందకుండా చేశారు. అధికారుల అండతో జగన్‌ అనే మిల్లర్‌ ఆ వడ్ల నుంచి ఏకంగా 2 వేల బస్తాలు మింగేశాడు. తప్పుడు లెక్కలు సృష్టించాడు. బస్తాకు కోసే వడ్ల విషయంలో తన ఇష్టానుసారం వ్యవహరించాడు. ఈ విషయం తెలిసిన ఖమ్మం జేసి సదరు మిల్లర్‌ జగన్‌కు చెందిన మిల్లులకు నోటీసులు జారీ చేశారు. ఓ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వార్తా కథనం నేటిధాత్రి మిల్లులకు ప్రచురించింది. అది ఖమ్మం జిల్లా జేసికి చేరింది. అంటే వెంటనే స్పందించారు. నివేదిక తెప్పించుకున్నారు. మిల్లర్‌ చేసిన మోసం పసిగట్టారు. రెండు వేల బస్తాలకు సంబంధించిన సొమ్ము కక్కాల్సిందే అని నోటీస్‌ జారీ చేశారు. ఇది సివిల్‌ సప్లయ్‌ శాఖ చరిత్రలోనే మొదటి సారి అంటున్నారు. గతంలో ఇలా స్పందించిన అధికారి ఎవరూ లేరని ప్రశంసిస్తున్నారు. రైతులకు ఎంతో ఊరట కలిగించడమే కాదు, మోసపోయిన సొమ్ము కూడా రైతుల ఖాతాలలో వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి, రైతుల కష్టానికి టోపి పెట్టాలనుకున్న మిల్లర్‌ తాట తీసే పని ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ పెట్టుకున్నాడు. ఒక మిల్లర్‌ ప్రభుత్వం కళ్లు గప్పి, రైతులను మోసం చేసి, రెండు వేల వడ్ల బస్తాల స్వాహా చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు. ఏ పనైనా తూతూ మంత్రంగా చేసే అలవాటు హన్మకొండ అధికారులకు వుంది. లారీలు వచ్చాయా? వాటిని తమకు అనుకూలమైన మిల్లర్‌ జగన్‌కు అందించామా! లేదా!! అనేదే చూసుకున్నారు. కానీ బస్తాలపై వున్న మర్మం కనిపెట్ట లేకపోయారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎంతో తెలివిగా ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు. అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. మొదటి నుంచి నేటిధాత్రి ఈ విషయం చెబుతూనే వుంది. అధికారులను హెచ్చరిస్తూనే వుంది. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులు నేటిధాత్రి అందిస్తున్న వార్తలను పెడ చెవిన పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సాగినట్లే ఇప్పుడూ సాగుతుందనుకున్నారు. పదేళ్లు తిష్ట వేసుకొని తినడం అధికారులకు అలవాటైంది. రైతులను మోసం చేయడం మిల్లర్లకు సామాన్యమైపోయింది. రైతుల నెత్తిన కోత శఠగోపం పెట్టడం నిండా ముంచడం బాగా అలవాటైపోయింది. అదే ధోరణి విచ్చలవిడిగా సాగుతోంది. మమ్మల్ని అడిగేవారు ఎవరు? పట్టించుకునే వారు ఎవరు? నేటిధాత్రి రాస్తూనే వుంటుంది. అదంతా కామనే అనుకున్నారు. కానీ ఖమ్మం జిల్లా జేసి ఇచ్చిన రaలక్‌తో ఒక్క సారిగా హన్మకొండ సివిల్‌ సప్లయ్‌ అధికారుల్లో కూడా రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. నిజానికి ఉన్నత స్థాయిలో వున్న అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు ఇంత అద్భుతంగా వుంటాయి. ప్రజలకు మేలు చేసేలా వుంటాయి. అని నిరూపనైంది. జిల్లా అధికారులతో పాటు, కమీషనర్‌ చౌహాన్‌ను రైతులు ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు. ఇలాంటి వ్యవహారాలు అన్ని జిల్లాలలోనూ సాగుతున్నాయి. అన్ని జిల్లాల అధికారులు ఖమ్మం జిల్లా అధికారులను ఆదర్శంగా తీసుకుంటే ఏ మిల్లర్‌ మోసానికి పాల్పడలేడు. రైతుల సొమ్ము అప్పనంగా దోచుకునే వెలుసుబాటు అసలే వుండదు. రైతులను కొట్టి కోట్లు మింగాలనుకుంటున్న మిల్లర్లు తప్పులు చేయడానికి అసలు ఆస్కారం వుండదు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా రైతులను వందల కోట్లు ముంచుతూనే వున్నారు మిల్లర్లు. వారికి సహకరిస్తూనే వున్నారు అధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు? జరగడం ఖాయం. ఈ ఖమ్మం జిల్లా అధికారుల బేష్‌. అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం. ఏటా రైతుల వద్ద కోసిన వడ్లతో మిల్లర్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు. దయచేసి ఇకనైనా మిల్లర్ల దోపిడీ ఆపండి. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు మిల్లర్లకు సహకారం ఆపండి. 

బాక్స్‌.

ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలం!

ఖమ్మం జిల్లా అధికారులు చూపిన చొరవతో రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా ఏకతాటిపైకి వచ్చి మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులను మోసం చేసిన మిల్లర్‌ నుంచి రికవరీ వసూలు చేసిన సందర్భాలు లేవు. ఇంత మంచి విషయాన్ని, విజయాన్ని కాంగ్రెస్‌ క్రాడర్‌ ప్రచారం చేసుకోవడం లేదు. రైతులకు జరిగే మేలుపై కాంగ్రెస్‌ క్యాడర్‌ కదలకపోవడం కూడా పార్టీకి ఎంతో నష్టం జరుగుతోంది. ప్రతిపక్షాలు రైతులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అయినా కాంగ్రెస్‌ నాయకులకు అవగాహన లేకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా కాంగ్రెస్‌ క్యాడర్‌ కళ్లు తెరవండి. ప్రతిపక్షాల నోరు మూయించండి.

కుల రాజకీయ సాలెగూడులో దళపతి!!

 

కుల రాజకీయ సాలెగూడులో దళపతి!!

తమిళనాడులో కులం, పేదరికం ఒక విరోధాభాస

పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే అధికారానికి ముప్పు

విజయ్‌ వ్యూహాలు డీఎంకేను దెబ్బకొట్టే అవకాశం

కులాల కుంపట్ల సెగ అంటని బీజేపీ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణలువేగంగా జరుగుతుండటం వర్తమాన పరిణామం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది సినీతెరవేల్పు విజయ్‌ (దళపతి) కొత్తగా స్థాపించిన తమిజగ వెట్రి కజగం (టీవీకే). తమిళనాడులో ద్రవిడ రాజకీయాలే బలంగా వుంటాయన్న సంగతి అదరికీ తెలిసిందే. ఈ నేప థ్యంలో ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఎఐడీఎంకెలను, విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ఏవిధంగా ఎదుర్కొని నెట్టుకు రాగలుగుతుందన్నది ప్రధాన ప్రశ్న. అయితే దళపతి రాబోయే ఎన్నికలకోసం ఇ ప్పటినుంచే చాపకింద నీరులా తన వ్యూహాలను అమలుపరచడం మొదలుపెట్టారు. వచ్చే ఆగస్టునుంచి ఆయన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వృధాచలం నియోజకవర్గం నుంచి తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పట్టలి మక్కల్‌ కచ్చి (పీఎంకే), దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) పార్టీల స్టాండ్‌ ఏవిధంగా వుండబోతున్నది కూడా ఆగస్టు నాటికి స్పష్టమయ్యే అవకాశముంది. ముఖ్యంగా పీఎంకేకు ఓబీసీవర్గమైన వన్నియార్లలో మంచి బలముంది. దివంగత సినీ హీరో విజయకాంత్‌ నెలకొల్పిన డీఎండీకేకు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గట్టిపట్టును కొనసాగిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ, సెమీ`అర్బన్‌ ప్రాంతాల్లోని దళిత, ఓబీసీ వర్గాల ఓట్లపై టీవీకే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది.
పీఎంకే, డీఎండీకేల అసంతృప్తి
ప్రస్తుతం డీఎండీకేకు నాయకత్వం వహిస్తున్న ప్రేమలత ఏఐడీఎంకే పట్ల తీవ్ర అసంతృప్తితో వున్నారు. సీట్ల కేటాయింపులో తమకిచ్చిన హామీని తుంగలో తొక్కారంటూ ఏఐడీఎంకే నాయకుడుపళినిస్వామిపై ఆగ్రహంతో వున్నారు. ఇక పీఎంకే విషయానికి వస్తే దీని వ్యవస్థాపకుడు రామ్‌దాస్‌, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా వున్న అంబుమని రామ్‌దాస్‌కు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. రామ్‌దాస్‌, ఏఐడీఎంకేతో నేరుగా చర్చలు జరపాలని భావిస్తుంటే, అంబుమని రామ్‌దాస్‌ ప్రస్తుతం కేంద్రమంత్రిగా వున్న నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది వీరిద్దమధ్య నెలకొన్న విభేదాలకు కారణం. ఈ విభేదాలు పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఉత్తర తమిళనాడుకు చెందిన పది జిల్లాల్లో ఈ పార్టీ ప్రభావం అధికం. ఈ అసంతృప్తి వీరిని పీఎంకేవైపుకు మొగ్గు చూపేలా చేస్తే అప్పుడు ఒక్క ఏఐడీఎంకేకు మాత్రమే కాదు డీఎంకేకు కూడానష్టం కలిగించక మానదు. ఎట్లా అంటే డీఎంకే కూటమిలో వున్న విడుత్తలై చిరుతైౖగలల్‌ కచ్చి (వీసీకే)కు ఈ ప్రాంతంలో దళితుల్లో మంచి బలం వుంది. పైరెండు పార్టీల ప్రభావంతో ఈ ఓ ట్లు కూడా చీలి టీవీకే ఖాతాలోకి వెళ్లకూడదనేం లేదు. క్రైస్తవుడైన విజయ్‌, వచ్చే ఆగస్టులో వృ ధాచలం నుంచి ప్రారంభించే యాత్రలో వన్నియార్లు (ఓబీసీలు), దళితులు, మత్స్యకార్లు, క్రైస్తవ వర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. గతంలో వృధాచలం డీఎండీఏకేకు గట్టి పట్టున్న ప్రాంతం. డీఎండీకే, పీఎంకేలు ప్రస్తుతం ఏఐడీఎంకేతో జట్టుకట్టి వున్నాయి.
ప్రస్తుతం విజయ్‌ ‘టీవీ’ని తన పార్టీ గుర్తుగా చేసుకునే అవకాశముంది. ఈనేపథ్యంలోనే ‘టీవీ`కే’కు ఓటువేయండి నినాదంతో ముందుకెళ్లవచ్చు. అదీకాకుండా ‘టీవీ’ ప్రజలకు ఏవిధమైన కష్ట లేకుండా తేలిగ్గా గుర్తుండిపోతుంది కూడా. ప్రస్తుతం విజయ్‌ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలుహాజరవుతుండటాన్ని ఏవిధంగా తీసుకోవాలనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీవీకేకు ఇది సానుకూల పరిణామమని కొందరు వాదిస్తుంటే, మరికొందరు అభిమానం వేరు ఇది ఓటుగా మారడం వేరని చెబుతున్నారు. విజయ్‌కాంత్‌ వంటి స్టార్‌ హీరో పెట్టిన పార్టీకే దిక్కులేదు, ఇప్పుడు విజయ్‌ పార్టీ కూడా ఇదేబాటలో పయనిస్తుందని అంచనాలు కట్టే నిరాశా వాదులుకూడా లేకపోలేదు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే విజయ్‌ తన ఛరిష్మాతో పదిశాతం ఓట్లు సాధించుకోగలిగితే డీఎంకే కొంప నిండా మునిగినట్టేనన్నది మాత్రం సుస్పష్టం.
యువకుల్లో మద్దతు
వర్తమాన పరిస్థితి పరిశీలిస్తే దళపతికి యువకుల్లో, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో, ప్రధానంగా మైనారిల్లో పట్టు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వర్గాలు సంప్రదాయికంగా డీఎంకే మద్దతు దార్లు. ఈ వర్గాలు దళపతిని కేవలం వెండితెరవేల్పుగా మాత్రమే కాదు, ఎంతోకొంత చేసిచూ పించే నాయకత్వ లక్షణాలు కలిగినవాడిగా పరిగణించడం మొదలైంది. మొదట్లో విజయ్‌ టీవీకేను స్థాపించిన తర్వాత, రాజకీయ పండితులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీవీ కే 5 నుంచి 6శాతం వరకు ఓట్లు సంపాదిస్తుందని అంచనాలు కడుతున్నారు. మరి గతంలో కమల్‌ పెట్టిన మక్కల్‌ నిధి మయమ్‌ (ఎంఎన్‌ఎం) 2021లో కేవలం 2.52శాతం ఓట్లు మాత్రమేసాధించింది. దీంతో పోలిస్తే టీవీకే చాలా ముందంజలో ఉన్నట్టే లెక్క! అంతేకాదు ఇతర పార్టీ లనుంచి 2`3శాతం ఓట్లు చీల్చగలడన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. తాను సొంతంగా 5శాతం ఓట్లు సాధించే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పటికి మొత్తంమీద చూసుకుంటే గరిష్టంగా 8శాతం ఓట్లు సాధించగలడన్నది తమిళనాడు రాజకీయాలను పరిశీలించే వారి అంచనా. అయితే విజయ్‌ ‘వర్క్‌ ఫ్రం హోం’ రాజకీయాలు నడుపుతారన్న విమర్శకులు కూడా లేకపోలేదు. ఇదిలావుండగా ఎన్నికలు దగ్గరపడ్డే కొద్దీ ఈ అంచనాల్లో మార్పు కచ్చితంగా వుండి తీరుతుంది. ఎందుకంటే విజయ్‌ ప్రధానంగా దళితులు, ఆర్థికంగా అణగారిన వర్గాలు, శ్రామికులపై దృష్టి పెట్టి తన రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇది ఓట్ల చీలికవల్ల సాధ్యమవుతుందని అనుకునేదాని కంటే, వివిధ వర్గాల ప్రజల ఆలోచనా శైలిలో వస్తున్న మార్పుల వల్ల అని చెప్పవచ్చు. మరి ఈ వర్గాలే డీఎంకేకు వెన్నెముకగా నిలుస్తున్నారు మరి!!
కులరాజకీయాలు అధికం
తమిళనాడులో కులరాజకీయాల ప్రభావం ఎక్కువన సంగతి తెలిసిందే! కులాభిమానం, పేదరికం అనే రెండు అంశాలు విరోధాభాస వంటివి. ఎందుకంటే పేదలు అన్నివర్గాల్లో వున్నారు. కాకపోతే దళితుల్లో వీరి సంఖ్య అధికం. వన్నియార్లు, గౌండర్లు, థెవరాల వంటి ఓబీసీ కులాలవా రు, ఇప్పుడు విజయ్‌కు దళితులు పూర్తి అండగా నిలుస్తున్నారన్న అభిప్రాయంతో వున్నారు. ఈ ఓబీసీలకు, దళితులకు ఎంతమాత్రం పొసగదు. ఇప్పుడు పట్టల్‌ మక్కల్‌ కచ్చి (పీఎంకే)కు వన్నియార్లలో బలం వుంది. అదే విడుత్తలై ఛిరుతైౖౖగల్‌ కచ్చి (వీసీకే)కు దళితుల్లోని పరైయార్‌ వర్గం మద్దతుంది. మరి ఈ రెండు పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకేలకు వ్యతిరేకం కానప్పటికీ, ఒకే కూటమిలో వుండటం సాధ్యంకాదు. ఇప్పుడు వెన్నియార్‌లు విజయ్‌కి అభిమానులుగా ఉన్నప్పటికీ, టీవీకేకు అత్యధికశాతం దళితుల మద్దతుండటంవల్ల, వారు పీఎంకేకు అనుకూలంగానే వుంటారుతప్ప దళపతివైపు మొగ్గు చూపరు.
ఏఐడీఎంకే `బీజేపీ కూటమి భవితవ్యం?
ఈవిధంగా ఓబీసీ లెక్కలు సంక్లిష్టమయంగా వున్న నేపథ్యంలో ఏఐడీఎంకాేబీజేపీ కూటమికి అను కూలంగా మారే అవకాశాలు ఎక్కువ. పశ్చిమ తమిళనాడులోని కొంగు వెల్లలార్‌ గౌండర్లు ఎప్పటికీ ఏఐడీఎంకేకు అనుకూలమే. ఎందుకంటే ఏఐడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఈ కులానికి చెందినవాడే! ఉత్తర తమిళనాడులో బలమైన వెన్నియార్ల మద్దతున్న పీఎంకే ఇప్పుడు ఏఐడీఎంకాేబీజేపీ అలయన్స్‌ వైపు చూస్తుండటం గమనార్హం. దక్షిణ మరియు డెల్టా ప్రాంతాల్లో థేవర్ల ప్రాబల్యం ఎక్కువ. గతంలో ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్‌సెల్వం, ప్రస్తుత టీటీవీ నాయకుడు దినకరన్‌లు ఈ వర్గానికి చెందినవారే. వీరిద్దరూ తిరిగి ఏఐడీఎంకాేబీజేపీ కూటమిలోకి వచ్చే అవకాశాలున్నాయి. అదీకాకుండా ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నయనార్‌నాగేంద్రన్‌ థెవర వర్గానికి చెందినవాడు. పన్నీర్‌సెల్వం, దినకరన్‌లు ఎన్‌డీఏ కూటమిలోకి చేరి తే, అప్పుడు కూటమికి థెవర వర్గంలో తిరుగుండదు.
ఇక బీజేపీ విషయానికి వస్తే సైద్ధాంతిక ప్రాతిపదిక తప్ప, కులానికి ప్రాధాన్యత లేకపోవడంతో, దానికి ఇప్పటివరకు వున్న ఓట్లశాతంలో ఏవిధమైన మార్పు వుండదు. ఎందుకంటే దీని మద్దతుదార్లు సైద్ధాంతిక ప్రాతిపదికన వుండటం గమనార్హం. అందువల్ల విజయ్‌ ప్రభావం ఇతర పార్టీ లపై పడినంతగా భాజపాపై పడదు. విజయ్‌వల్ల బాగా దెబ్బతినేది సీమన్స్‌ నాయకత్వంలోని నామ్‌ తమిళర్‌ కచ్చి (ఎన్టీకే) తమిళనాడుకు మరింత స్వేచ్ఛ కావాలని పోరాడే పార్టీ ఇది. యువకులు ప్రధానంగా రాజ్యాన్ని వ్యతిరేకించే వారు ఇందులో సభ్యులు. వీరంతా ఇప్పుడు తమ అ భిప్రాయాన్ని విజయ్‌కి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక అధికార డీఎంకే పార్టీ విషయానికి వస్తే, ఒకటీ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయాల్లో వచ్చిన మార్పులు ప్రభావం చూపవు. రాష్ట్రం మొత్తంమీద పరిశీలిస్తే తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాల్లోనే డీఎంకేకు అసలైన ప్రమాదం పొంచివుంది. ఉదాహరణకు 2021లో కువందంపాలయం నియోజకవర్గంలో ఏఐడీఎంకే అభ్యర్థికి 9,776 ఓట్ల మెజారిటీ వచ్చింది. విచిత్రమేమంటే ఇక్కడ కమల్‌ హసన్‌ పార్టీ ఎంఎన్‌ఎంకు 23527 ఓట్లు రాగా, ఎన్టీకే పార్టీకి 17897 ఓట్లు వచ్చాయి. మరి ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే ఏఐడీఎంకేకు వచ్చిన మెజారిటీ ఓట్లకంటే ఎక్కువ. ఇదే నియోజకవర్గంలో వ్యక్తిగతంగా పార్టీల ఓట్లశాతం గమనిస్తే, ఎంఎన్‌ఎం పార్టీకి వచ్చిన ఓట్లు 18శాతం. 2016 ఎన్నికల్లో ఓట్లశాతాన్ని పోల్చినప్పుడు డీఎంకే నుంచి చీల్చుకున్న 6శాతం ఓట్లున్నాయి. నాటి ఎన్నికల్లో డీఎంకే ఈ నియోజకవర్గం నుంచి 3శాతం ఓట్ల తేడాతో గెలవడం గమనార్హం!
ఇదేవిధంగా వచ్చే ఎన్నికల్లో దళపతి నేతృత్వంలోని టీవీకే మొత్తంమీద పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమవుతుంది.
ఓటుబ్యాంకు రాజకీయాలు, కూటములు కట్టడంలో డీఎంకేకు తిరుగులేదు. దీంతోపాటు కుల రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట! ఈ నేపథ్యంలో దళపతి పార్టీ రంగంలోకి వచ్చిన నేపథ్యంలో డీఎంకే అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయనేది వేచి చూడాల్సిందే. తమిళ రాజకీయాల్లో నేటి పరిణామం ఒక్క సత్యాన్ని వెల్లడిస్తోంది. సంప్రదాయికంగా తమిళ రాజకీయాల్లో వేసే ఎత్తుగడలు, పన్నే వ్యూహాలు ఏమీ తెలియని ఒక కొత్త నాయకుడు విజయ్‌ రాజకీయ అరంగేట్రం చేశారు. ఛరిష్మా ఓటుగా మారితే, అన్ని వ్యూహాలు, ఎత్తుగడలు సునామీలో కొట్టుకుపోయి, రాష్ట్రంలో కొత్త రాజకీయశకం ప్రారంభం కాగలదు.

`మల్టీ టాలెంటెడ్‌ మహా మాయగాడు గుమస్తా మిల్లర్‌ ‘‘జగన్‌’’ మరో కుంభకోణం!!

‘‘నేటిధాత్రి’’, ఎఫెక్ట్‌

`మల్టీ టాలెంటెడ్‌ మహా మాయగాడు గుమస్తా మిల్లర్‌ ‘‘జగన్‌’’ మరో కుంభకోణం!!

`కలెక్టర్‌ కళ్ళు కప్పి.. జగన్‌ కు అప్పజెప్పి.

`సన్నాలకు జగన్‌ కన్నం!

`వడ్లన్నీ జగనొక్కడే మింగుతున్నాడు!!

`అధికారులు ఆ ఒక్కడి మిల్లులోనే కుక్కుతున్నారు!!

`కిలాడీ జగన్‌ కనుసన్నల్లోనే అధికారులు కంపు కంపు చేస్తున్నారు

`జగన్‌ మోసాలను కళ్లు మూసుకొని చూస్తున్నారు

`రైతుల ‘‘ట్రక్‌ షీట్ల’’ లను సొమ్ము చేసుకుంటున్నాడు రైతులను ముంచి కోట్లు

మూటగట్టుకుంటున్నాడు

`మిల్లుల మురికి నీరు వరద కాలువల్లో కలుపుతున్నాడు

`పొల్యూషన్‌ అధికారుల నోరు నోట్లతో మూయిస్తున్నాడు

`ఇరిగేషన్‌ అధికారులను కనుసైగతో కమ్మేస్తున్నాడు

`‘‘జేసి’’ని కూడా చిటికెన వేలు మీద ఆడిస్తా అంటున్న జగన్‌

`అధికారులందినీ గుప్పిట్లో పెట్టుకున్నారు

`మిల్లింగ్‌లో మాయా ప్రపంచం సృష్టించుకున్నాడు

`గుమస్తా పని చేసి గూడుపుఠాణి నేర్చుకున్నాడు

`సన్నాలొద్దని గాయి గాయి చేశాడు

`ఇప్పుడు సన్నాలను రా మిల్లులకు కాకుండా చేస్తున్నాడు

`అటు రైతులను నిండా ముంచుతున్నాడు

`ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు

`కులం పేరు అడ్డం పెట్డుకొని కుటిల నీతికి పాల్పడుతున్నాడు

`మహా మాయగాడుగా వడ్లన్నీ మాయం చేస్తున్నాడు

`‘‘నేటిధాత్రి’’ కథనానికి ఖమ్మం అధికారులు స్పందించారు

`హన్మకొండ అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు

`ఖమ్మం జిల్లా వడ్లను కూడా గుమస్తా జగన్‌కే కట్టబెట్టారు

`ఎంక్వౌరీకి ఆదేశించినా హన్మకొండ అధికారులు కళ్లు తెరవడం లేదు

`ఖమ్మం జెసి నుంచి రికవరీ ఆర్డర్లు వచ్చినా హన్మకొండ అధికారులు మేలుకోవడం లేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
కొందరికి కాలం కలిసి వస్తుంది. మరి కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరి కొందరకి పేరు కలిసివస్తుంది. రాజపకీయం కలిసి వస్తుంది. కాని ఓ వ్యక్తికి మాత్రం అన్నీ కలిసి వస్తాయి. ఏక కాలంలో అన్నీ కలిసివస్తుంటాయి. అలా పుర్కర కాలం నుంచి సివిల్‌ సప్లయ్‌ శాఖను గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంచెలంచెలుగా కాదు, ఏకంగా ఒక్కసారే ఎదిగాడు. మోసాలకు వెన్నతో పెట్టిన విద్య అనే పదానికి నిర్వచనమయ్యాడు. అందరూ గుమస్తా జగన్మోహన్‌ రావు అంటుంటారు. పేరు ముందు వుండే కులం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. రాజకీయం వెన్నంటే వున్నట్లు చేసుకున్న ప్రచారం కలిసి వచ్చింది. అందుకు సివిల్‌ సప్లై శాఖ కూడా అండదండలు అందించింది. సహజంగా ఎవరికైనా వారి అదృష్టమే కలిసి వస్తుంది. కాని ఈ వ్యక్తికి ఇతరుల అదృష్టం కూడా లాక్కునేంత శక్తి వుంది. అందుకే మల్టీ టాలెంటెడ్‌ మాయగాడు అని అందరూ అంటుంటారు. ఒక గుమస్తా నుంచి ఏకంగా మిల్లర్‌గా ఎదగడమే కాదు, బినామీలతో మిల్లర్ల వ్యవస్ధను సృష్టించుకున్నాడు. మిగతా మిల్లర్ల నోరు కొడుతున్నాడు. ఇతర మిల్లర్లకు రావాల్సిన వడ్లను కొల్లగొడుతుంటాడు. అధికారులను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నాడు. వారి బలహీనతలను తాను సొమ్ము చేసుకుంటున్నాడు. తోటి మిల్లర్లకు అన్యాయం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. రైతులను నిండా ముంచేస్తున్నాడు. పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బ తీస్తున్నాడు. సాగు నీటిని కలుషితం చేస్తున్నాడు. ఎన్ని రకాలా మోసాలు చేయాలో తెలుసుకున్నాడు. ఆచరించి చూపిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన మరో మోసం, ఒక రకంగా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నెల రోజుల పాటు సెలవుల్లో వెళ్లారు. ఇదే అదునుగా సివిల్‌ సప్లై శాఖ ఉద్యోగులతో సహకారంతో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన సన్నాలను తను సొంతం చేసుకున్నాడు. నిజానికి అవి హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు కేటాయించారు. ఆ మిల్లులకు కాదని, రాత్రికి రాత్రి తన చాణక్యం ప్రదర్శించి, వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. కలెక్టర్‌కు తెలియకుండానే సివిల్‌ సప్లై శాఖ అధికారులు సహకరించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమింటే ఈ జగన్‌కు వున్నవి బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు. గతంలో సన్నాలు తీసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి చేసినా వద్దని వారించాడు. ప్రభుత్వాన్నే ఎదిరించాడు. మాకు దొడ్లు వడ్లు మాత్రమే కావాలిన మొండికేశాడు. సన్నాల వల్ల తాము ఎంతో నష్టపోతామని, తాము నష్టాల బారిన పడిపోతామని అనేవాడు. ఇదే విషయంలో ఒకటి, రెండు సార్లు జాయింట్‌ కలెక్టర్‌ సమావేశానికి హజరుకాలేదు. కొన్ని సార్లు హజరైనా తన నిరసన తెలియజేస్తూ వెళ్లిపోయేవాడు. తమకు సన్నాలు వద్దని సమావేశంలో మధ్యలోనే లేచి వెళ్లిపోయేవాడు. అలాంటి జగన్‌ ఇప్పుడు సన్నాలు మాత్రమే కావాలంటున్నాడు. ఆయనకు రా రైస్‌ మిల్లులు లేవు. కాని సన్నాలు కావాలంటున్నాడు. ఇతర రా రైస్‌ మిల్లులకు చెందాల్సిన సన్నాలను కూడా లాగేసుకుంటున్నాడు. ఖమ్మం నుంచి 50 లారీల వడ్లు హన్మకొండ జిల్లాకు వచ్చాయి. వాటిని ఇతర మిల్లుకు అదికారులు కేటాయించారు. అయినా వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లానుంచి వచ్చిన వడ్లలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేశాడు. తప్పుడు లెక్కలు చూపించాడు. వడ్లు తీసుకొని, బియ్యం చేసే సరఫరాకు పెద్ద తేడాను తెలివిగా చూపించాడు. ఇది అధికారులు గమనించారు. దాంతో ఖమ్మం అధికారులు వెంటనే అలెర్టయ్యారు. ఇక్కడ ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. ఖమ్మం జిల్లా నుంచి పంపిన సన్నాల బస్తాల మీద తూకం రాయించారు. అక్కడ జగన్‌ దొరికిపోయారు. ఇచ్చిన సన్నాలుకు, జగన్‌ మిల్లులనుంచి వెళ్లిన బియ్యానికి పొంతన లేదు. దాంతో కమీషనర్‌ కార్యాలయానికి సమాచారం అందించి, ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ఏఏ మిల్లు ఎంత మోసం చేసిందనే విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు. అవి వసూలు చేస్తున్నారు. ఇలా సివిల్‌ సప్లైయ్‌ని పుష్కర కాలంగా మోసం చేస్తూ వస్తున్న జగన్‌ కిలాడీ వేషాలు అనేకం వున్నాయి. ఆయన చేస్తున్న ఘనకార్యాలు తక్కువేం కాదు. రైతులు తెచ్చే వడ్లకు ట్రక్‌ షీట్ల పేరుతో ప్రభుత్వం రవాణ చార్జీలు చెల్లిస్తుంది. అలా ప్రతి సీజన్‌లో కొన్ని మండలంలోని రైతులందరికీ ఆ సొమ్ము చేరాలి. కాని జగన్‌ ఆ వడ్లకు సంబందించిన ట్రక్‌ షీట్ల పేరుతో వచ్చే సొమ్మును మింగేస్తుంటాడు. ఆ సొమ్ము వెలల్లోనో, లక్షల్లోనో కాదు, ఏకంగా కోట్లలో వుంటుంది. అలా రైతులకు రావాల్సిన రవాణ ఖర్చులు మొత్తం తనఖాతాలోనే వేసుకుంటాడు. రైతుల చేత మాత్రం సంతాకాలు తీసుకుంటుంటుంటాడు. ఇలా ప్రతిసీజన్‌లో కోట్ల రూపాయల గోల్‌ మాల్‌ చేస్తున్నాడు. జిల్లాలో అందరికీ అందాల్సిన సన్నాలన్నింటినీ ఈసారి సివిల్‌ సప్లై అదికారులు జగన్‌ మిల్లులకే అప్పగిస్తున్నారు. మిగతా మిల్లర్లకు మొండి చేయి చూపిస్తున్నారు. అయినా ఆ మిల్లులను సక్రమంగా నడిపిస్తున్నాడా? అంటే అదీ లేదు. సహజంగా బాయిల్డ్‌ మిల్లులకు నీటి శుద్ద ప్లాంట్లు వుంటాయి. జగన్‌కు చెందిన మిల్లులకు కూడా వున్నాయా? అంటే వున్నాయన్నట్లు వున్నాయి. అవి పనిచేస్తున్నాయా? అంటే తూతూ మంత్రంగా పనిచేస్తాయి. కాని వాటి పనితీరుపై అధికారుల పర్యవేక్షణ ఎప్పుడూ వుండదు. కాని అంతా బాగుందనే అదికారులు రిపోర్టులిస్తుంటారు. మరి నిజమేనా? అని ఆరా తీసేవారే లేకుండాపోయారు. బాయిల్డ్‌ మిల్లులో వడ్లు ఉడకపెట్టడానికి పెద్దఎత్తున నీటిని వినియోగిస్తారు. ఆ నీటిలో కొన్ని కెమికల్స్‌ కూడా మిక్స్‌ చేస్తారు. వడ్లను ఉడకపెడుతుంటారు. ఆ తర్వాత ఆ నీళ్లను బైటకు వదిలేస్తారు. అలా బైటకు పంపే నీరు ఎంతో దుర్గంధంతో వుంటుంది. ముక్కు పుటాలు అదిరిపోయేంత ధుర్గంధం వెదజల్లుతుంది. అలాంటి నీటిని మిల్లు పరిసరాల్లో వుండే నీటి శుద్ది ప్లాంటులోకి పంపించాలి. ఆ నీటిని శుద్ధి చేసి, బైటకు వదిలేయాలి. కాని జగన్‌కు చెందిన మిల్లుల నుంచి వెలువడిన ఆ నల్లని రంగుతో, దుర్గంధంతో కూడిన నీటిని మిల్లుల వెనక నుంచి వెళ్లే సాగు నీటి కాలువలో కలిపేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. కాని అదికారులు అటు వైపు వెళ్లరు. చూడరు. మిల్లుపై చర్యలు తీసుకోరు. ఎందుకంటే మిల్లుల వెనక నుంచి సాగు నీటి కాలువ వెళ్తుందని వాళ్లకు తెలుసు. ఆ కాలువలోకి జగన్‌కు చెందిన మిల్లుల నీరు వెళ్లి ఆ కాలువలో చేరుతుందని తెలుసు. కాలువలో నీరంతా కలుషితమైపోతుందని తెలుసు. ఆ కాలువ ద్వారా వెళ్తున్న కెమికల్‌తో కూడిన మురుగునీరు పక్కనే వున్న చెరువులో చేరుతుందని తెలుసు. ఆ మిల్లుల వ్యర్దాల నీరు చెరువులోకి చేరడం వల్ల చేపలు చనిపోతున్నాయని తెలుసు. ఆ చెరువు నుంచి మరో చెరువుకు అదే నీరు వెళ్లి చేరుతుందని తెలుసు. అయినా అదికారులు కదిలింది లేదు. మిల్లుల మీద చర్యలు తీసుకున్నది లేదు. సరే ఇరిగేషన్‌ శాఖ అంటే పట్టించుకోలేదు. కాని పర్యావరణానికి హనీ కలిగే ఏ సంస్ధనైనా నిర్ధాక్షిణ్యంగా నిలిపివేసే శక్తి, హక్కు వున్న పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏం చేస్తుందనేది కూడా ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక రోజో, రెండు రోజులో కాదు, నెలలు అసలే కాదు. ఏకంగా సంవత్సరాల తరబడి ఆ మిల్లులనుంచి వ్యర్ధాలన్నీ సాగు నీటి కాలువలోకి పంపిస్తున్నారు. పర్యావరణం పాడౌతోంది. నీరు కాలుష్యమైపోతోంది. మిల్లుల పరిసరాల్లో పెద్దఎత్తున దుర్గంధం వెదజల్లబడుతోంది. కాని అధికారులు ముక్కు మూసుకుంటున్నారు. అప్పుడప్పుడు మిల్లుల తనిఖీకి వచ్చినప్పుడు కళ్లు కూడా మూసుకుంటున్నారు. మిల్లుల్లో వుండాల్సిన నీటి శుద్ది ప్లాంటు కళ్లముందు పని చేయడం లేదని కనిపిస్తున్నా..బాగుందనే రిపోర్టు రాసేస్తుంటారు. పక్కనే సాగు నీటి కాలువను తొంగి కూడా చూడరు. అందులో కలుస్తున్న నీటిని పట్టించుకోరు. ఇలా వ్యవస్ధలను, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని చేయాల్సినన్ని దర్మార్గాలు జగన్‌ చేస్తున్నాడు. జాయింట్‌ కలెక్టర్‌ ఏం చేయగలడని కూడా తోటి మిల్లర్ల ముందు సవాలు కూడా విసురుతుంటాడని విశ్వసనీయ సమాచారం. మరి ఇప్పుడు సెలవులు ముగించుకొని జాయింట్‌ కలెక్టర్‌ వస్తున్నారు. ఇప్పటికైనా జగన్‌ మీద చర్యలు తీసుకుంటారా? జగన్‌ చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తారా? అన్నది వేచి చూడాలి.

హోం మినిస్టర్‌ రాములమ్మ.

-తెలంగాణ తొలి మహిళా హోం మినిస్టర్గా విజయశాంతి.

FOR E-PAPER CLICK BELOW LINK

https://epaper.netidhatri.com/view/610/netidhathri-e-paper-3rd-june-2025

-తెలంగాణ కోసం అందరినీ ధిక్కరించిన ధీశాలి విజయశాంతి.

-నాలుగు సంవత్సరాల పాటు నిరంతరం పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్న ఏకైక తెలంగాణ నాయకురాలు.

home minister vijayashanthi

-డిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

-బిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే ఉద్యమ కారులతోనే ఎదుర్కోవాలి.

-బిఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టాలంటే విజయశాంతి లాంటి వాళ్లే కావాలి.

-ఉద్యమ ఆకాంక్షలు, కేసిఆర్‌ మోసాలు తెలిసిన నాయకురాలు విజయశాంతి.

-అధిష్టానం ఇప్పటికే స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.

-ఏపిలో కూడా మహిళా హోం మంత్రి వున్నారు.

-డైనమిక్‌ విజయశాంతికి హోం బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు.

-రాములమ్మ కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఇచ్చిన మాట.

-తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆనాడు పార్టీలో చేరారు.

-అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.

-తెలంగాణ కోసం తల్లి తెలంగాణ ఏర్పాటు చేసిన విజయశాంతి.

-రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితం త్యాగం చేసిన నాయకురాలు విజయశాంతి.

-ఏనాడు పదవుల కోసం ఆశించి రాజకీయాలు చేయలేదు.

-పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి కెరియర్‌ కూడా వదులుకున్నారు.

-ఎన్నికల రాజకీయాలలో పదవుల అనుభవించిన వారు త్యాగాలు అని చెప్పుకుంటున్నారు.

-విజయశాంతి త్యాగం అంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కవ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాములమ్మ హోం మంత్రి కాబోతున్నారా? అంటే డిల్లీ సర్కిళ్లలో ఔననే సమాధానం వస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో కచ్చితంగా ఎమ్మెల్సీ విజయశాంతిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీల నుంచి ఎవరూ మంత్రి లేరు. ఎమ్మెల్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా బిసి సామాజిక వర్గానికి మరింత ప్రాదాన్యతనిచ్చినట్లు సంకేతాలు కూడా కాంగ్రెస్‌ పంపాలని అనుకుంటోంది. అందుకే ఆరు మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సిన అవసరం వుంది. అయితే అవి ఇప్పుడే భర్తీ చేస్తారా? లేక ఇంకా కొంత కాలం ఆగి చేస్తారా? అన్నది త్వరలోనే తేలనుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి డిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పరమైన పదవులు ఇప్పటికే చాలా వరకు కొలిక్కి వచ్చాయి. అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. పదవుల పంపకాలు దాదాపు పూర్తయినట్లే లెక్క. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మాత్రమే మిగిలివున్నాయి. పార్టీ ఉపాధ్యక్ష పదవులు ఇంకా రాలేదని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్‌లో వున్న పార్టీపరమైన సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలందరూ పార్టీ అటోమెటిగ్‌గా ఉపాధ్యక్షులౌతారు. ఇది అనాదిగా ఆపార్టీలో అనుసరిస్తున్న సంప్రదాయమే. అవి కూడా పూర్తయనట్లే లెక్క. ఇక మిగిలినవి మంత్రి పదవులు. నామినేటెడ్‌ కార్పోరేషన్‌పదవులు ఇంకా కొన్ని పెండిరగ్‌లో వున్నాయి. ముఖ్యమంత్రి డిల్లీ పర్యటనలో నామినేటెడ్‌ పదవులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. కాని మంత్రి పదవుల పంపకాలలో కొన్ని పీట ముడులున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు ఒక్క రాములమ్మకు మాత్రమే మంత్రి పదవి ఖాయమైందని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకురాలు. తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతామని బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో ఆమె మెదక్‌ పార్లమెంటును పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె ఎన్నికల్లో పోటీచేసేందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. పార్టీ నుంచి సూచనలు వచ్చినా ఆమె పార్టీకి సేవ చేయడానికే పరిమితయ్యారు. అందుకే ఆమె 2018 ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌గా బాద్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమెకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కడం లేదని ఎన్ని రకాల వార్తలు వచ్చినా స్పందించలేదు. తాను కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తిగా వున్నానని కూడా చెప్పలేదు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఆమె చేసుకుంటూ వెళ్లారు. అంతే తప్ప ఎక్కడా పార్టీపై ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. తాను చేసిన సేవలకు, తెలంగాణ ఉద్యమ కారిణిగా సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుందని మాత్రం నమ్మకంతో వున్నారు. ఆ నమ్మకమే ఇప్పుడు వరంగా మారింది. తెలంగాణ వచ్చిన సమయంలో పార్టీ ఆమెకు కొన్ని వాగ్ధానాలు చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే సముచితస్ధానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ పదేళ్లలో ఆమె ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా, కాంగ్రెస్‌లోనే వున్నది. ఓ దశలో రాములమ్మ కాంగ్రెస్‌లో వున్నట్లా? లేనట్లా? అంటూ వార్తలు కూడా వచ్చాయి. గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి పిలుపు లేదని కూడా ఆమె ఎక్కడా ఒక్క ప్రకటన కూడా చేసింది లేదు. సమయం కోసం వేచి చూశారు. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు కూడా ఆమెకు పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అంటే కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఎంత నిబద్దతతో వుంటుందో ఈ ఒక్క విషయంలోనే తేలిపోయింది. ఎంతో మంది పేరు ఎమ్మెల్సీల ఎంపికలో వచ్చినా, విజయశాంతికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. విజయశాంతి అంటే కాంగ్రెస్‌ పార్టీకి ఎంత విశ్వాసమో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే విజయశాంతి అంటే సామాన్యురాలు కాదు. ఆమె ఒకప్పటి సినీ సూపర్‌ స్టార్‌. ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోయినా, మూడు దశాబ్దాల పాటు ఆమె సినీ పరిశ్రమను ఏలిన నటి. తెలుగు, తమిళ్‌, హిందీ భాషలలో ఆమె అగ్రశ్రేణి నటిగా ఓ వెలుగు వెలిగారు. దేశమంతా లేడీ అమితాబ్‌ అని కీర్తించేవారు. ఆమెతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూలో వుండేవారు. కేరిర్‌ పీక్‌ స్టేజ్‌లో వున్నప్పుడు ఆమె జై తెలంగాణ అన్నారు. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమ ఇచ్చింది చాలు. ప్రేక్షకుల ప్రేమచాలు. ఇక తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం కోసం వస్తున్నానని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. నిజానికి ఆమె రాజకీయంగా పదవులే కావాలనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో పదవులు వచ్చేవి. తమిళనాడులో కూడా ఆమెకు పెద్ద పెద్ద పదవులే వచ్చేవి. ఎందుకంటే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు విజయశాంతి ఎంతో సన్నిహితురాలు. ఆమె రాజకీయం చేయాలనుకుంటే తమిళనాడు నుంచికూడా ఎమ్మెల్యే అయ్యేది. మంత్రి అయ్యేది. కాని ఆమె తెలంగాన ఉద్యమంలోకి వచ్చారు. కేరీర్‌ వదులుకున్నారు. కోట్ల రూపాయల సంపాదన వద్దనుకున్నారు. కార్లు, అద్దాల మేడలు, ఏసి గదుల్లో జీవితం వదులుకొని ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. తెలంగాణ ప్రజలకు తోడుగా పోరాటంలోకి దిగారు. తల్లి తెలంగాణ రాజకీయ పార్టీని పెట్టారు. తాను సంపాదించిన కోట్లాది రూపాయలను ఆమె ఉద్యమానికి ఖర్చు చేశారు. తల్లి తెలంగాణ పార్టీ నిర్వహణకు కోట్లు ఖర్చు చేశారు. నిజానికి ఆమె ఆ పార్టీని అలాగే నడిపి వుంటే ఆమె రాజకీయ భవిష్యత్తు మరోలా వుండేది. ఆమె ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చేది. కేసిఆర్‌ మాటలు నమ్మి, కేవలం తెలంగాణ కోసం పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసింది. ఆ సమయంలో ఎంతో మంది కేసిఆర్‌ పార్టీలో తల్లి తెలంగాణను విలీనం చేయొద్దని సూచించారు. కేసిఆర్‌ వల్ల మొదటికే మోసం వస్తుందని కూడా హెచ్చరించారు. ఎందుకంటే అప్పటికే తల్లి తెలంగాణ పార్టీ తెలంగాణ అంతటా విస్తరించింది. అన్ని జిల్లాల కమిటీలు వేయడం జరిగింది. టిఆర్‌ఎస్‌కు పోటీగా తల్లి తెలంగాణ ఎదిగింది. ఆ పార్టీ కోసం, ఉద్యమం కోసం కొన్ని వందల మంది తల్లి తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దఎత్తున ఖర్చు చేసింది. వాళ్లందరికీ బిఆర్‌ఎస్‌లో సముచిత స్ధానం వుంటుందని విజయశాంతిని నమ్మించారు. చివరికి ఆమెను కూడా కేసిఆర్‌ నట్టెట ముంచారు. తొలుత విజయశాంతిని సొంత చెల్లెలుకన్నా ఎక్కువ అంటూ ఆమెను నమ్మించారు. తర్వాత ఆమె ప్రాధాన్యత తగ్గిస్తూ పోయారు. అయినా ఆమె ఏనాడు వెరవలేదు. తెలంగాణ కోసం మాత్రమే తాను వచ్చానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తనకు ప్రత్యేకమైన రాజకీయం అవసరంలేదని తేల్చి చెప్పారు. టి ఆర్‌ఎస్‌ నుంచి తప్పించినా, ఆమె చిరునవ్వుతోనే స్వాగతించింది. తాను కోరుకున్న రాష్ట్రం ఏర్పాటైందన్న సంతోషమే ఆమె ఎక్కువ పడిరది. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన చరిత్ర చాలనుకున్నది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతానన్న మాటను కూడా నిలబెట్టుకున్నది. ఆమె అంకితభావం కాంగ్రెస్‌ పార్టీ గుర్తించింది. అంతే కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి పోరాట పటిమ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష్యంగా చూసింది. డిసెంబర్‌ 9 ప్రకటన పరిణామాల తర్వాత జరిగిన ఉద్యమంలో విజయశాంతి చూపిన చొరవ అంతా ఇంతా ఇంతా కాదు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సాగిన పార్లమెంటు సమావేశాలను ఏ ఒక్కనాడు సజావుగా సాగకుండా అడ్డుకున్న ఏకైన నాయకురాలు విజయశాంతి. నాలుగేళ్ల సుధీర్ఘ కాలం అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం ఆమె సభ జరుగుతున్నంత సేపు నిలబడి నిరసన తెలియజేసేశారు. వెల్‌లోకి దూసుకెళ్లెవారు. ఆ అవకాశం దక్కనప్పుప్పుడు తనసీట్‌ వద్దనే నిలబడి నిరసన తెలియజేసేవారు. నిజానికి లోక్‌సభ సమావేశాలకు కేసిఆర్‌ పెద్దగా హజరయ్యేవారు కాదు. బడ్జెట్‌సమావేశాలకు కూడా వెళ్లేవారు కాదు. కాని విజయశాంతి ఏ ఒక్కరోజు కూడా వెళ్లకుండా వుండలేదు. నిరసన తెలియజేయని రోజంటూ లేదు. అలా నాలుగు సంవత్సరాల పాటు లోక్‌సభలో నిరవదిక నిరసన చేసిన ఏకైక నాయకురాలు విజయశాంతి. ప్రపంచ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ఉద్యమకారిణి విజయశాంతి త్వరలో తెలంగాణ మంత్రి కానున్నారు. ఆమె చేసిన త్యాగం వృధా కాలేదు. కాస్త ఆలస్యం కావొచ్చు. కాని గుర్తింపు ఎప్పటికైనా పక్కా అనుకున్న ఆమె నమ్మకం మరోసారి నిలబడిరదనే చెప్పాలి.

ఖద్దరు కక్షలకు ఖాకీ బలి !?

`పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు.

`రాజకీయ పార్టీల మధ్య నలుగుతున్న పోలీసు?

`కార్యకర్త స్థాయి నుంచి నాయకులు దాకా పోలీసులను బెదిరిస్తున్నారు.

`గతంలో ఇంతటి వేధింపులు వుండేవి కాదు.

`నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు.

`పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు.

`నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.

`ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు.

`క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు.

`నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు.

`మనసు చంపుకొని పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు.

`నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు.

`పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు.

`కాంగ్రెస్‌ ఎదురు లేకుండా పాలించిన రోజుల్లో పోలీసు వ్యవస్థ బాగుండేది.

`ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం వచ్చాక అసలైన సమస్య మొదలైంది.

`కాంగ్రెస్‌లో అప్పట్లో గ్రూపులు మాత్రమే వుండేవి.

`తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీ ఆధిపత్యం మొదలైంది.

`పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది.

`అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది.

`తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు.

`రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.

`ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది.

`ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు.

`సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు.

`సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు.

`సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు.

`పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు.

`ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు.

`ఒకప్పుడు తప్పు చేస్తే శంకరగిరి మాణ్యాలు అనే వారు.

`ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు.

`ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్‌ లేకుండా చేస్తున్నారు.

`దేశవ్యాప్తంగా పోలీసులు అనుభవిస్తున్న ఇబ్బంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
జనం కోసం బతికే ఏకైక వ్యవస్థ పోలీసు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడి, త్యాగాల కోసమే పుట్టిన వ్యవస్థ పోలీసు. దేశ సరిహద్దులలో ఎండనక, వాననక, చలిని లెక్క చేయకుండా మనల్ని కావాడే వాళ్లు సైనికులు. మరి మన సమాజంలో చుట్టూ వున్న శక్తులను నుంచి కాపాడేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ వుందనే నమ్మకం, ధైర్యంతోనే మనం నిశ్చింతగా బతుకుతున్నాం. పోలీసులే లేకుంటే ఒక్ష క్షణం కూడా గడవదు. సమాజ భద్రత సాగదు. సమాజంలో మంచి వుంటుంది. చెడు వుంటుంది. చెడు మీద మనం విజయం సాధించాలంటే కూడా మనకు పోలీసు అవసరం. పోలీసు వృత్తి అంటే అంత సామాన్యమైనది. తెగింపుతో కూడున్నది. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు పెట్టేది. అలాంటి వ్యవస్థ ఇప్పుడు రాజకీయ పార్టీల చేతుల్లో నలిగిపోతోంది. రాజకీయ పెత్తనంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.
నిజం చెప్పాలంటే పోలీసు వ్యవస్థ నిస్సహాయ స్థితికి చేరుకుంటోంది. నిష్పక్షపాతంగా పని చేయలేకపోతోంది. పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకుల గుప్పిట్లో పని చేయాల్సి వస్తోంది. గతంలో రాజకీయ వ్యవస్థ పోలీసు యంత్రాంగంలో జోక్యం చేసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి పోలీసు స్టేషనులో అధికారులుగా ఎవరుండాలని నాయకులే నిర్థేశిస్తున్నారు. సంబంధిత నియోజకవర్గాలలో పాలక పక్షం ఎమ్మెల్యే చెప్పిన వారికే పోస్టింగులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పోలీసులు ఠానాలకు ట్రాన్స్‌ఫర్‌ కాలేకపోతున్నారు. ఎమ్మెల్యేల విల్లింగ్‌ లెటర్లు లేకుండా పోస్టింగులు అందుకోలేక పోతున్నారు. దాంతో లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల చేతిలో కాకుండా నాయకుల చేతుల్లోకి పోతోంది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా, అందులో ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల ట్రాన్స్‌ఫర్లు యదాలాపంగా జరిగిపోవాలి. కానీ ట్రాన్స్‌ఫర్ల సమయంలో ఫలానా పోలీసు అధికారి మాకు వద్దని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. పోలీసు వ్యవస్థను అచేతనావస్థలోకి నెట్టేస్తున్నారు. రాజకీయాలు రంగు మారడమే కాదు, రకరకాల విన్యాసాలు కూడా చేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తోంది. అది ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు అదే వైఖరిని అనుసరిస్తున్నాయి. అనుభవిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచిది కాదు. గతంలో ప్రత్యర్థులు అంటే రాజకీయంగా, సిద్దాంత పరంగా విభేదాలు వుండేవి. కానీ కక్ష పూరిత రాజకీయాలకు తావుండేది కాదు. పాలక పక్షం, ప్రతి పక్షం పరస్పరం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయత్నించేవి. నిజం చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలు సమాజ ప్రయోజనాల కంటే నాయకుల ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాయని చెప్పడంలో సందేహం. దాంతో రాజకీయ కక్షలు పెరిగిపోతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు చెలరేగిపోతున్నాయి. ఒకప్పుడు ఆధిపత్య రాజకీయాలలో నాయకుల అనుచరులు మీద ఎక్కువగా ఆధారపడుతూ వుండేవారు. కాలం మారింది. నాయకులలో మరింత స్వార్థం పెరిగింది. అనుచరులు బాగు పడడం అనేది నాయకులకు ఇష్టం లేకుండా పోయింది. నాయకులను సొంత పనులకు వాడుకొని, వారిని పోషించడం కన్నా, పోలీసు వ్యవస్థను వినియోగించుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు. పోలీసు వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయాలు సాగిస్తున్నారు. ఇది నిజంగా పోలీసు వ్యవస్థకు తీరని అన్యాయం జరుగుతున్నట్లే లెక్క. నిష్పాక్షికంగా పని చేయాల్సిన పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం మరీ మితిమీరి పోవడంతో వ్యవస్థ నలిగిపోతోంది. ఏ పోలీసు అధికారి అన్యాయానికి గురైన వారిని ఇబ్బందులకు గురి చేయాలని అనుకోరు. వాళ్లు మనుషులే! వారిలోనూ మానవత్వం వుంటుంది. ఖాకీ దుస్తులు వేసుకున్నంత మాత్రాన వారిది కరుకు గుండె కాదు. పోలీసులంటేనే సమాజ రక్షకులు. ఆ విషయం ప్రతి పోలీసుకు తెలుసు. కానీ రాజకీయ వ్యవస్థ వారి చేతులు కట్టేస్తుంది. పార్టీల స్వలాభానికి వినియోగించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు చెప్పినట్లు వినకపోతే పరిస్థితులు ఎలా వుంటాయన్నది కూడా వాళ్లకు తెలుసు. అందుకే విధిలేని పరిస్థితులలో మనసు చంపుకొని పని చేస్తున్న పోలీసులు కొన్ని వేల మంది వున్నారు. పాలకుల ఎవరైనా సరే వారు చెప్పింది వినాలి. అది రూలు. ఆ రూల్‌ను పోలీసులు అతిక్రమించలేరు. దాంతో రాజకీయాల మూలంగా ఖాకీలు ఎంతో నష్టపోతున్నారు. ఉన్నత విద్య చదువుకొని, పోటీ పరీక్షలు రాసి, ఎన్నో సంక్లిష్టమైన దేహ దారుడ్య, శిక్షణలు పూర్తి చేసుకొని ఉద్యోగాలకు వస్తారు. సమాజాన్ని ఏదో చేయాలని కలలుగంటారు. కానీ కుర్చీలో కూర్చున్న రోజే తన చేతులతో అన్యాయం వైపు మొగ్గు చూపేలా నాయకుల జోక్యం, ఒత్తిడి మొదలౌతుంది. అప్పుడు వారు పడే వేధన, అనుభవించే ఆవేదన వాళ్లకు మాత్రమే తెలుసు. అయినా ఖద్దరు సమస్యలను తమ భుజాన వేసుకోవాల్సిన అవసరం ఖాకీలకు లేదు. అయినా పాలనా పరంగా అనుసరించక తప్పదు. అందుకే ఖద్దరు కక్షలకు పోలీసులు బలి అవుతున్నారు. రాజకీయ పార్టీల ఆధిపత్యం మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో ఇంతటి వేధింపులు పోలీసులకు వుండేవి కాదు. నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు. నాయకులు పోలీసులతో ఎంతో మర్యాద, గౌరవంగా వుండే వారు. పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు. ఆ సమయంలో నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు. క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు. నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు. మనసు చంపుకొని పోలీసులు పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల దాకా పోలీసులను బెదిరిస్తున్నారు. గతంలో రౌడీలు, గూండాలు, గజ దొంగలు పోలీసులకు సవాలు విసిరే వారు. ఇప్పుడు వాళ్లు కనుమరుగైపోయారు. ఆ పని ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నారు. పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ వచ్చిన తర్వాత మొదలైంది. తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీల ఆధిపత్యం పోలీసుల మీద మొదలై, వేధింపుల దాక వచ్చింది. ఇది ముమ్మాటికీ నిజం. అంతకు ముందు వర్గ పోరులు మాత్రమే వుండేవి. గ్రూప్‌ తగాదాలే వుండేవి. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల అధికార మార్పిడీతో పోలీసు వ్యవస్థ సంకటానికి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్నప్పుడు సహజంగా ఆ పార్టీ నాయకుల చెప్పినట్లు వినాల్సి వచ్చేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తెలంగాణ రాజకీయాలు సీమాంధ్ర రాజకీయాలను పోలి వుండేవి కాదు. ముఖ్యంగా రాయలసీమ, ఆంద్రా ప్రాంతాలలో పార్టీల ఆధిపత్యం విపరీతంగా వుండేది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాలలో పోలీసులు నలిగిపోయేవారు. పాలక పక్షం పెంచి పోషించే రౌడీలు, గూండాలు కూడా పోలీసులను బెదిరించే స్తాయికి చేరుకున్నారు. ఆంద్రాలో ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలలో రౌడీలు రాజ్యమేలుతూ వుండేవారు. సినిమాలు కూడా అదే తరహాలో వుండేవి. ముఖ్యంగా కుల రాజకీయాలు, పార్టీ పరమైన రాజకీయాలు విపరీతంగా వుండేవి. ఇక్కడ ఒక విషయం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. వంగవీటి మోహనరంగా హత్య తర్వాత ఆయన కుటుంబమే అ పార్టీ ఈ పార్టీ అని పార్టీలు మారింది. కానీ ఆనాడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే రంగ హత్యకు గురయ్యే వారు కాదని అదే రాజకీయ పార్టీలు అంటాయి. ఇంతకన్న దుర్మార్గం ఏదైనా వుంటుందా? చివరికి ఇప్పటికీ పోలీసులనే దోషులుగా చూస్తున్నారు. ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అనేది ప్రపంచమంతా తెలుసు. ఆ సంఘటన జరిగి నలభై ఏళ్లయినా ఇప్పటికీ పోలీసులను నిందిస్తూనే వుంటారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే అధికారంలో వున్న పార్టీలు, ప్రతిపక్షాలను అణచి వేయడానికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు. అది ఏ పార్టీ అయినా సరే…పాలకులు చెప్పిందాన్ని పోలీసులు పాటించాల్సి వస్తుంది. తప్పడం లేదు. అలా వింటే అన్నీ చూస్తున్నాం..పోలీసు వ్యవహార శైలిని పరిశీలిస్తున్నాం…పేర్లు నోట్‌ చేసుకుంటున్నామని పై స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. రెడ్‌ బుక్‌, పింక్‌ బుక్‌, బ్లాక్‌ బుక్‌ ఇలా తెలుగు రెండు రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది. అసలు రాజకీయ పార్టీలు సవాళ్లు చేసుకోవడం మానేసి, పోలీసులను టార్గెట్‌ చేస్తున్నారు. మీ అంతు చూస్తామని బెదురిస్తున్నారు. దాంతో ఇప్పుడున్న పాలకుల మాట వినాలా? ప్రతిపక్షాల బెదిరింపులకు భయపడాలా? అన్న సందిగ్ధత ఎదురౌతోంది. పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది. ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు. సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు. అలాంటి రాజకీయాల వల్ల సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు. పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు. సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు. పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు. ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు. ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్‌ లేకుండా చేస్తున్నారు.

వచ్చే సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి దేశీయ సెమికండక్టర్‌ చిప్‌లు

 

`28`90 నానోమీటర్‌ టెక్నాలజీలో స్వావలంబన దిశగా అడుగులు

`దిగుమతులపై ఇక ఆధారపడాల్సిన అవసరంలేదు

`దేశ అవసరాలతో పాటు గ్లోబల్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే యత్నాలు

`వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సెమికండక్టర్‌ రంగంలో స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న భారత్‌ ఈ ఏడాదిలోగా ఈ లక్ష్యా న్ని సాధించనున్నది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. సెమికండక్టర్‌ చిప్‌ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందిగా పరిగణించే 28`90 నానోమీటర్‌ టెక్నాలజీకి సంబంధించిన స్వదేశీ తయారీ చిప్‌ ఈ ఏడాది చివరల్లో మార్కెట్‌లోకి రానుంది. మే 29న జరిగిన కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ వార్షిక వాణిజ్య సదస్సులో ఈ అద్భుత విషయాన్ని ప్రకటించారు. 2022లో భారత్‌ ఈ చిప్‌ తయారీ రంగంలోకి భారత్‌ ప్రవేశించింది. కేవలం మూడేళ్ల కాలంలోనే ఈ అద్భుతాన్ని సాధించడం విశేషం. ఈ ప్రకటనతో భారత్‌ అంతర్జాతీయ చిప్‌ మార్కెట్‌లో తన వంతు వాటాను సాధించేందుకు వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నంలో మరో ముందడుగు పడినట్లయింది. ముఖ్యంగా చిప్‌ తయారీలో టెక్నాలజీ నోడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్‌ వుంది. మొత్తం చిప్‌ మార్కెట్‌లో 60శాతం టెక్నాలజీ నోడ్‌ ఆక్రమిస్తోంది. ప్రస్తుతం భారత్‌ ఈ రంగంలో పట్టును సాధించేందుకు వ్యూహా త్మకంగా గట్టి ప్రయ్నతం చేయనుంది. ఆటోమోటివ్‌, టెలికమ్యూనికేషన్‌, విద్యుత్‌ వ్యవస్థలు, రై ల్వే సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో టెక్నాలజీ నోడ్‌ చిప్‌లకు అత్యధిక డిమాండ్‌ వుంది. ప్రస్తుతం మనదేశంలో ఆరు ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లు నిర్మాణంలో వున్నాయి. ఇదేసమయంలో దేశంలో రూ.76వేల కోట్లతో సెమికండక్టర్‌ ఎకోసిస్టమ్‌ రూపకల్పన జరుగుతోంది. దీన్ని సెమికండక్టర్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా సెమికండక్టర్‌ చిప్‌ల దిగుమతిపై మనదేశం పూర్తిగా ఆధారపడాల్సి వస్తున్నది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తం గా చిప్‌తయారీ దెబ్బతిన్న ప్రభావం మనదేశంపై బలీయంగా పడినమాట వాస్తవం. ఈ నేపథ్యంలో చిప్‌లు ప్రతి రంగానికి అత్యంత అవసరమైన నేటి కాలంలో, వీటిపై పూర్తిగా దిగుమతులపై ఆధారపడటం అంత శ్రేయస్కరం కాదని అప్పుడే భారత్‌ గుర్తించి, వీటి తయారీలో స్వావలంబన సాధించేందుకు అవసరమైన కృషిని ప్రారంభించింది. ఆ ప్రయత్నాల ఫలితం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చి ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో తయారైన చిప్‌లు మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయనున్నాయి. దీంతో పాటు మనదేశం ప్రపంచ చిప్‌ మార్కెట్‌లో వాటా సంపాదించడం తో పాటు మరింత విస్తరించేందుకు కూడా ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. 

వ్యూహాత్మక ప్రకటన

దేశంలో తొలి సెమికండక్టర్‌ చిప్‌ తయారీ ప్రకటన వెనుక ఎంతో జాగరూకత, వ్యూహాత్మకత ఇమిడి వున్నాయి. చిప్‌లను స్వదేశంలో తయారుచేయడం వల్ల మనకు దిగుమతుల భారం తగ్గ డంతో పాటు గ్లోబల్‌ మార్కెట్‌లో ప్రవేశించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇదే సమయంలో సాంకేతిక రంగంలో మన సార్వభౌమాధికారాన్ని సుస్థాపితం చేయడంతో పాటు ఆర్థికపరంగా ఇతరదేశాలతో మరింత పోటీ పడేస్థితికి ఎదగవచ్చు. కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ`2వ సదస్సులో మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చేసిన ప్రకటనలోని సారాంశం ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత డిమాండ్‌ వుండటంతో పాటు 60% డిమాండ్‌ వున్న టెక్నాలజీ నోడ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించి సుస్థిరత సాధించడమే ప్రధాన లక్ష్యమన్నది స్పష్టం చేస్తున్నది. ఈరంగంలో మార్కెట్‌ గతిశీలతపై ఇప్పటికే మనదేశం ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయ సెమికండక్టర్‌ పరిశ్రమకు వాణిజ్యపరంగా బలమైన పునాది వేసేందుకు మన ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

2030 నాటికి గ్లోబల్‌ సెమికండక్టర్‌ చిప్‌ల మార్కెట్‌ ఒక ట్రిలియన్‌ డాలర్లను మించిపోనున్నదన్న అంచనాలు వెలువడుతున్న తరుణంలో మనదేశం చిప్‌ మార్కెట్‌లోకి త్వరలో ప్రవేశిస్తుందన్న ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. ఇప్పుడు మనదేశం ప్రధానంగా చిప్‌లకు సంబం ధించి దేశీయ అవసరాలను పూర్తిచేస్తూనే, ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించే రీతిలో వ్యూహాలను రూపొందించి అమలు చేయాల్సి వుంటుంది. మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పిన విధంగా మనం కేవలం ఫ్యాబ్రికేషన్‌పై మాత్రమే దృష్టిపెట్టడం కాదు మొత్తం ఎకోసిస్టమ్‌ను పరిపూర్ణంగా నిర్మించా ల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఈ రంగంలో భారత్‌ సంపూర్ణ దృక్కోణం ఏవిధంగా వున్నదీ అర్థమవుతోంది. అంటే తయారీతో పాటు దేశీయంగా మేధోఆస్తుల అభివృద్ధి, ఉత్పత్తి డిజైన్‌, ప్రామాణీకరించడం వంటి అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

ప్రస్తుతం 28ా90 నానోమీటర్‌ సెగ్మెంట్‌ టెక్నాలజీపైనే మనదేశం ప్రధానంగా దృష్టిపెట్టడానికి కారణం, ప్రపంచంలో ఈ సెగ్మెంట్‌కున్న డిమాండ్‌ మాత్రమే! అతి చిన్న నానోమీటర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడం వెనుక ప్రధాన కారణం కేవలం దీనికున్న ప్రాసెసింగ్‌ శక్తి మరియు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకునే సామర్థ్యం. అదీకాకుండా 28ా90 నానోమీటర్‌ సెగ్మెంట్‌ ప్రస్తుతం పారిశ్రామిక రంగం, దాంతో మమేకమై పనిచేసే వ్యవస్థలకు అత్యంత కీలకం. ఇది భారత్‌లో వినియోగానికి తక్షణం అవసరం. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్‌కు కూడా దీని అవస రం చాలా అధికంగా వుంది. ఈ సెగ్మెంట్‌లో తయారీని కొనసాగించాలని నిర్ణయించడానికి మరో కారణం తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంతో పాటు భవిష్యత్తులో మరింత ఆధునిక టెక్నాలజీ నోడ్స్‌ రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేసుకోవడం.

సాంకేతిక ప్రత్యేకతలు మరియు అనువర్తనాలు

28`90 నానోమీటర్‌ సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఏవో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. విభిన్న రంగాలకు చెందిన అనేక పరిశ్రమలకు కావలసిన సంక్లిష్ట అనువర్తనాలకు ఈ నానోమీటర్‌ టెక్నాలజీ ఒక వేదికగా నిలుస్తుంది. ఈ నానోమీటర్‌ పరిమాణంలోని అతిచిన్న చిప్‌ల కారణంగా, తయారు చేసే సెమికండక్టర్ల పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. 28ా90 నానోమీటర్‌ రేంజ్‌ పనితీరు, తక్కువఖర్చు మరియు తయారీ సంక్లిష్టతల మధ్య అద్భుతమైన సమ న్వయం సాధించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి మార్కెట్‌ పరంగా అత్యంత స్థితిస్థాపక లక్షణం వుంటుంది. ఫౌండ్రీ మార్కెట్‌ షేర్‌ 7.5%ను సుస్థిరంగా వుండేలా చూడగలదు. అంటే ఫ్రౌండ్రీ స్థాయిలో 15బిలియన్‌ యు.ఎస్‌. డాలర్ల మార్కెట్‌ అన్న మాట. ఇదే స్థితి కొనసాగితే 2030 నాటికి 200 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను తేలిగ్గా సాధించవచ్చు. 

దేశీయ పరిశ్రమలకు ఉపయోగం

28ా90 నానోమీటర్‌ రేంజ్‌ దేశీయ పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగకరం. అంతేకాదు దేశీయ మార్కెట్‌ అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికపరంగా దేశానికి ఎంతో ప్రయోజనం చే కూరుస్తుంది. ఉదాహరణకు ఆటోమోటివ్‌ రంగాన్ని తీసుకుంటే ఈ చిప్‌లు ఇంజిన్‌ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఉద్గమిస్తున్న విద్యుత్‌ వాహనాలకు అవసరమైన సాంకేతిక అవసరాలను ఈ 28ా90 నానోమీటర్‌ రేంజ్‌ తీర్చగలుగుతుంది. ఇక టెలికమ్యూనికేషన్‌ రంగం గురించి చె ప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ రంగానికి చిప్‌ సాంకేతిక పరిజ్ఞానం ఒకరకంగా ప్రాణం వంటిదనే చెప్పాలి. నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలు, బేస్‌ స్టేషన్లు, వినియోగదారుల ఉపకరణాలు, విద్యుత్‌ వ్యవస్థలు ఈ చిప్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తాయి. అంతేకాదు విద్యుత్‌ నిర్వహణ మరియు గ్రిడ్‌ గరిష్టంగా పనిచేయడంలో ఇవి చాలా అవసరం. రైల్వేల్లో ఆ ధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థల్లో ఈ చిప్స్‌ను విస్తృతంగా వాడతారు. అంతేకాదు రైలు నియంత్రణకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాల్లో, లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా చిప్‌లు బాగా అవసర మవుతాయి. 

దేశభద్రత మరింత పటిష్టం

28`90 ఎన్‌ఎం నానో టెక్నాలజీని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, హోం ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌లు ఈ చిప్స్‌ విస్తృతంగా ఉప యోగపడతాయి. ప్రస్తుతం మనదేశ ప్రాథమిక దశలో వున్న సెమికండక్టర్‌ పరిశ్రమ దేశంలోని బహుళ మార్కెట్‌ వ్యవస్థల అవసరాలను తీర్చగలుగుతుంది. కాగా మనదేశంలో సెమికండక్టర్‌ చిప్‌లు ఈ ఏడాది సెప్టెంబర్‌ాఆక్టోబర్‌ మధ్యకాలంలో మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయని అంచనా వే స్తున్నారు. ఈ చిప్‌లు అందుబాటులోకి వస్తే ఆర్థికంగానే కాదు, దేశభద్రత కూడా మరింత పటిష్టమవుతుంది. ఈ నానో చిప్‌ల తయారీలో పరిణితి సాధించిన తర్వాత 14ా7 ఎన్‌ఎం చిప్‌ల తయారీకి ముందడుగు వేయవచ్చు.

కులగణనతో ఓబీసీ పార్టీలకు ఇబ్బందులు తప్పవా?

ఆధిపత్య ధోరణి వీడకపోతే ఓబీసీ పార్టీల మనుగడ కష్టం
ఓబీసీల్లో ప్రయోజనం పొందుతున్నది కొన్ని కులాలే
అగ్రవర్ణాలకు మించిన స్థాయిలో కొనాగుతున్న ఆధిపత్యం
ఎదుగుదల లేని అణగారిన కులాలు
ఓబీసీ ఆధిపత్య కులాల మెడకు కులగణన
కులం పేరుతో రాజకీయాలు నడపడం కష్టం కావచ్చు
అల్పజనసంఖ్య కలిగిన కులాల మనుగడ కష్టం
సామాజిక సమతుల్యతను సమూలంగా మార్చేసే కులగణన
డెస్క్‌ ,నేటిధాత్రి: 
కాంగ్రెస్‌ సహా విపక్షాలు కులగణన చేపట్టాల్సిందేనని పట్టుపట్టడం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తిచేశాయి. ఇక జనతాదళ్‌ (యు) బిహార్‌లో దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన పూర్తిచేసింది. కులగణనలో సశాస్త్రీతను ప్రశ్నించినవారు లేకపోలేదు. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో ప్రాబల్యాన్ని కలిగివున్న కులాలు తమ ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో ఈ కులగణను వ్యతిరేకించడాన్ని కూడా మనం చూశాం. బీజేపీ మొదట్నుంచీ కులగణను వ్యతిరేకిస్తోంది. ఓట్లకోసం హిందువులను విభజించి ప బ్బం గడుపుకోవాలన్న దురాశతోనే విపక్షాలు కులగణనను డిమాండ్‌ చేస్తున్నాయంటూ వాదించినా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తదితర విపక్షాలు దీన్ని ప్రధానాస్త్రంగా ఉపయోగించడంతో తప్పనిపరిస్థితుల్లో కేంద్రం వచ్చే జనగణనతోపాటు కులగణన కూడా చేపడతామని ప్రకటించింది. విచిత్రమేమంటే విపక్షాలు దేన్నయితే తమ ప్రధాన అస్త్రంగా మలచుకోవాలనుకుంటున్నాయో అది బూమరాంగ్‌ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రా ల్లో బలీయంగా వున్న కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఈ కులగణన ఫలితాలు ఇబ్బంది కలిగించేవి గా వున్నాయనేది ఇప్పుడిప్పుడే వెల్లడవుతుండటం తాజా పరిణామం. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌ (యునైటెట్‌) పార్టీల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓబీసీ కులాలకు చెందిన నాయకులకు కొత్త సమస్యలు పుట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడిరది. అదెట్లాగో పరిశీలి ద్దాం.
మింగుడుపడని సమస్య
ఎస్సీ వర్గాలను ఉపకులాలుగా వర్గీకరించమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ఆవర్గాల్లో సమస్యాత్మకంగా మారినట్టే, ఇప్పుడు కులగణన ఓబీసీ (ఇతర వెనుకబడిన కులా లు) రాజకీయాలపై ఆధారపడిన పార్టీలకు మింగుడు పడటంలేదు. పైకి కులగణన వల్ల అధిక జనాభా కలిగిన ఓబీసీ కులాలవారికి ప్రయోజనం కలుగుతుందని పైకి ఎంతగా విపక్షాలు వా  దించినా, ఓబీసీల్లోని కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యం వహిస్తున్న సంగతి ఇప్పుడు మరింత   ప్రస్ఫుటం కానుంది. అంటే ఓబీసీకులాల్లోనే అసమానతలు బహిర్గతమవుతున్నాయి. రాజ్యాం  గం ప్రసాదిస్తున్న రిజర్వేషన్ల ఫలాలను కూడా వీటిల్లోని కొన్ని కులాలుమాత్రమే అనుభవించడమేకాకుండా మరోపక్క రాజకీయ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో  కొన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వైనం కులగణన పుణ్యమాని మరింత స్పష్టంగా వెల్లడి కానుంది. ఇప్పటివరకు ఓబీసీ భజన చేస్తున్న విపక్షాలకు ఇదొక విరోధాభాస వంటిదేనని చెప్పాలి. 
కొన్ని కులాలదే ఆధిపత్యం
1931లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం దేశంలో కులగణన నిర్వహించిన తర్వాత, మళ్లీ దాన్ని చేపట్టడం ఇదే ప్రథమం. కేంద్రం నిర్ణయాన్ని ఎస్‌.పి, ఆర్‌జేడీ, జెడీ(యు), కాంగ్రెస్‌ పార్టీలు స్వాగతిం చాయి. కేంద్రం నిర్ణయం తీసుకోవడం తన ఘనతేనని జేడీ(యు) చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. కాకపోతే ఇప్పుడు ఎస్‌.పి, ఆర్‌జేడీలు కూడా ఈ అంశాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం తాజా పరిణామం. ఈ మూడు పార్టీలు జయ ప్రకాష్‌ నారాయణ్‌ యుగం, మండల్‌ కమిషన్‌ కాలం తర్వాత వెలుగులోకి వచ్చినవే. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ఓబీసీలకు చెందిన కొన్ని కులాల నాయకులు మాత్రమే! ఓబీసీల ఐక్యతారాగం వెనుక ఆయా కులాల ‘సామాజిక`ఆర్థిక వెనుకబాటు’ అనే ని నాదం ప్రధాన పాత్ర పోషించిందనేది కీలక సత్యం. ఇందులో భాగంగానే ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి, ములాయంసింగ్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ`క్షత్రియ ఆధిపత్యాన్ని దెబ్బతీసి ఓబీసీల పాలనను అందుబాటులోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇక లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ‘ఓబీసీ’ కులంకార్డుతో రాజకీ  యాలు నడిపి ఆర్‌జేడీ పాలనను తీసుకొచ్చారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అణగదొక్కామని ప్రచారం చేసుకున్న లాలూప్రసాద్‌ యాదవ్‌, వారిని తలదన్నే రీతిలో తన కుటుంబ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, ఓబీసీల్లో ఎవరినీ పైకి రానీయకుండా అప్రతిహతంగా బిహార్‌ను పాలించారు. ఇక నితీష్‌ కుమార్‌ విషయానికి వస్తే, ఆయన పై ఇద్దరు నాయకులంత దూకుడుగా కాకుండా, మధ్యేమా ర్గంలో తన ఓబీసీ రాజకీయాన్ని కొనసాగించారు.బిహార్‌ రాజకీయాల్లో యాదవుల (ఓబీసీలు) వెన్నుదన్నుతోనే ఆర్‌జేడీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో వీరి జనాభా     14% కావడం ఇక్కడ కీలకం. 
ఇక ఉత్తరప్రదేశ్‌ విషయానికి వస్తే యాదవుల జనాభా 8 నుంచి 10శాతం వరకు వుంటుంది. సమాజ్‌వాదీ పార్టీ ఓబీసీల్లోని ఇతర ఉపకులాలు, ముస్లింల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో నితిష్‌కుమార్‌ ప్రధానంగా కూర్మీలు (ఇది ఆయన కులం) మరియు కోయిర్లపై ఆధారపడి తన రాజకీయాన్ని నడిపారు. ఈ రెండుకులాలు కలిపితే 7 నుంచి 10శాతం వరకు వుంటారు. అయితే తీవ్రంగా వెనుకబడిన కులాల్లో (ఈబీసీ) ఆయన గట్టి పట్టును సంపాదించడం కూడా జేడీయూ అధికారంలోకి రావడానికి మరో కారణం. ఎందుకంటే ఈబీసీల జనాభా రాష్ట్రంలో36% వరకు వుంది. 
ఇక ఓబీసీ పల్లవి కష్టం
ఈవిధంగా ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌కుమార్‌లు ఓబీసీ రాజకీ యాల నేపథ్యంలో ఎదిగినా, చివరకు ఈ వర్గాల్లో కేవలం ఒక్క కులం మాత్రమే ఆధితపత్యం వహించడం చివరకు చోటుచేసుకున్న పరిణామం. ఇప్పుడు చేపట్టిన కులగణన వల్ల, ఓబీసీల్లో ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారన్న నిజం బయటకు రావడం ఈ నాయకులకు మింగుడుపడటం లేదు. అంటే ఓబీసీల్లో ఎన్నో కులాలున్నప్పటికీ కేవలం ఒకే ఒక కులం అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో ఆధిపత్యం వహిస్తున్నదన్న సత్యం బహిర్గతం కావడంతో ఇప్పుడు ఆయా నాయకులకు ఓబీసీ పల్లవిని అందుకోవడం కష్టంగా మారింది. అంతా ఓబీసీలే అనేది ఒక సత్యమైతే, వీరిలో ఒక కులం మాత్రమే ఆధిపత్యం వహిస్తున్నదనేది మరో సత్యం. ఈవిధంగా కులగణనలో ఓబీసీ అనేది ఒక విరోధాభాసగా తయారైంది! దేశ జనాబాలో ఓబీసీలదే సింహభాగమని పై మూడు రాజకీయ పార్టీల వాదన. అందుకనే కులగణ చేపడితే ఓబీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీ యపరంగా న్యాయం జరుగుతుందని వీరు చేస్తున్న వాదన కూడా సహేతుకమే. అయితే ఉద్యోగ, ఉపాధి, రిజర్వేషన్‌ ప్రయోజనాలు, రాజకీయ ఆధిపత్యం ఓబీసీల్లో ఏదో ఒక కులం చేతిలోనే వున్నదనేది ఈ కులగణనద్వారా స్పష్టమవుతోంది. అంటే ఎస్సీ రిజర్వేషన్లలో మాలలు ప్రయోజ నం పొందినట్లుగానే, ఓబీసీల్లో యాదవుల వంటి కొన్ని కులాలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయని చెప్పవచ్చు. 
‘యాదవీకరణ’
ఓబీసీ రాగం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌లు ఓబీసీల్లోని ‘యాదవ’ కులానికి చెందినవారు. ఎప్పుడైతే సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌లు అధికారంలోకి వచ్చాయో అప్పుడు ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాల్లో కేవలం ఈ కులానికి చెందినవారే ఎక్కువగా ప్రయోజనం పొందడం మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పూర్తిగా ‘యాదవీకరణ’ జరిగిందనేది ప్రధానంగా వచ్చిన ఆ రోపణ. ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు యు.పి.లోని 1526 పోలీస్‌ స్టేషన్లలో,    600 యాదవ్‌ కులానికి చెందిన పోలీసు అధికార్ల ఆధిపత్యంలో వుండేవని ఒక నివేదిక వెల్లడిరచింది. లక్నో, మధుర, కాన్పూర్‌, ఘజియాబాద్‌, సంభాల్‌, బడౌన్‌ వంటి నగరాల్లోని పోలీస్‌ స్టేషన్లలో 40శాతం వరకు యాదవుల ఆధిపత్యంలోనే వుండేవి. సీనియర్‌ అధికార్ల అంచనా ప్రకారం 50శాతం పోస్ట్‌లను అనధికారికంగా యాదవ్‌లకు రిజర్వ్‌ చేసి వుంచేవారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. కేవలం ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడే ఇట్లా జరిగిందా అంటే, బీఎస్‌పీ అధికారంలో వున్న 2011వ సంవత్సరంలో కూడా ఇదే తంతు  కొనసాగడం విశేషం. బీఎస్‌పీ కాలంలో ప్రావెన్షియల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (పీసీఎస్‌) పరీక్షా ఫలితాల్లో 176 మంది ఓబీసీలు ఉత్తీర్ణులైతే వీరిలో 147మంది యాదవులు! దీంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగడంతో ప్రభుత్వం మరో 86మంది అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 54 మంది మళ్లీ యాదవులే వుండటం గమనార్హం! ఈ 54 మందిలో చివరకు   ఇంటర్వ్యూలో 50 మంది ఎంపికయ్యారు. 2011 నుంచి 2014 వరకు వివిధ రకాల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎక్కువ మంది యాదవ కులానికి చెందిన అభ్యర్థులే ఎంపికవడం గమ నార్హం. తర్వాతి కాలంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 8 నుంచి 14 టిక్కెట్ల ను యాదవులకే కేటాయించింది. 2024లో అఖిలేష్‌ యాదవ్‌ తమ కులానికి కేవలం నాలుగు టిక్కెట్లు మాత్రమే ఇచ్చారు. ఆ నలుగురూ కూడా ఆయన కుటుంబసభ్యులే! నెల క్రితం వరకు యు.పి.లోని 22 జిల్లాల్లో పార్టీ ఆధిపత్యం యాదవుల చేతుల్లోనే కొనసాగింది.
బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ
ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఐదేళ్లపాటు బిహార్‌ను పాలించారు. ఆయన పాలన దేశంలోనే గొప్ప అవినీతి, అరాచకాలకు బ్రాండ్‌గా మారిపోయింది. వివిధ శాఖలకు చెందిన అధికార్లు వేధింపుల భయంతో బదిలీలు చేయించుకున్నారు. కొద్దో గొప్పో సంపద కూడబెట్టుకున్న వారు దాన్ని బయటపెట్టడానికి భయపడ్డారు. భద్రతకోసం మహిళలు, పురుషులపై మరింతగా ఆధారపడాల్సి వచ్చింది. ఓబీసీ కులాల్లో పేదలు మరింత పేదలుగా మారగా, ధనికులు మరింతధనికులయ్యారు. లాలూ కాలంలో భూమి లావాదేవీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలైన వాటి ల్లో ఎక్కువ ప్రయోజనం పొందింది యాదవులే. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సురేంద్రయాదవ్‌, సాధుయాదవ్‌, సుభాష్‌ యాదవ్‌ వంటివారు రాష్ట్ర యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఏకఛ  త్రాధిపత్యంగా అధికారాన్ని చెలాయించారు. బిహార్‌లో 2023లో నిర్వహించిన కులగణన ప్రకారం, ప్రభుత్వ సర్వీసుల్లో 6,21,4811 మంది ఓబీసీలుండగా వీరిలో 2,89,538 (46.59%) మంది యాదవులే! ఆవిధంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓబీసీల్లో యాదవులను ఎంతగా పైకి తీసుకొచ్చారో మిగిలినవారిని అంతగా నిర్లక్ష్యం చేశారు. ఉదాహరణకు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం టిక్కెట్లను కేవలం యాదవులకే ఇచ్చిన ఘనత లాలూది. 2023లో 15 జిల్లాల్లో పార్టీకి నాయకత్వం వహించింది యాదవులే! లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కులపిచ్చి ఎంతగా ముదిరిపో యిందంటే ఆఖరుకు ముస్లింలు ఆధిపత్యం వహించే స్థానాల్లో కూడా యాదవులకే టిక్కెట్లు ఇచ్చేస్థాయికి చేరుకుంది. 
కూర్మీ కోయిర్లు మరియు లవ్‌కుశ్‌ ఐకమత్యం
నితిష్‌కుమార్‌ కూర్మీ`కోయిర్‌ కులాలను ఒకే విధంగా చూస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమతు ల్యాభివృద్ధి వుండాలనేది ఆయన అభిమతం. అందుకనుగుణంగానే ఆయన విధానాలు కొనసా గుతాయి. ఉపేంద్ర కుశావహ, శకుని చౌదరి (బిహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి తండ్రి) నితిష్‌కు గట్టి మద్దతుదార్లుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కూర్మీ`కోయిరీ సంయోజనను లవ్‌`కుశ్‌గా రాష్ట్ర ప్రజలు పరిగణిస్తారు. భూకమతాలను కలిగివుండి వ్యవసాయంపై ఆధారపడే ఈ వర్గాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలను నితిష్‌ ప్రభుత్వం క ల్పించింది. ప్రస్తుతం బిహార్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్‌లో 46.6% యాదవులే వున్నారు. అదే లవ్‌`కుశ్‌వర్గం ఓబీసీ రిజర్వేషన్లలో 36.9% కొనసాగుతున్నారు. మరి రాష్ట్ర జనా భాలో యాదవులు 14.27% కాగా కోయిరీ`కూర్మీ ప్రజలు 7.09%. ఇప్పుడు మొత్తం ఉద్యోగాల్లో కోయిరీ`కూర్మీ ప్రజలు కేవలం 2.47పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. అంటే ఇక్కడ జనాభా సంఖ్యకు, పొందుతున్న ఉద్యోగాలకు పొంతన వుండటంలేదనే అర్థం! ఎందుకంటే ప్రభుత్వ ఉ ద్యోగాల్లో యాదవుల ప్రాతినిధ్యం 1.55గా వుంది మరి!!
ఇతర రాష్ట్రాల్లో కూడా
ఈవిధంగా జనాభా సంఖ్యకు, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యానికి పొంతనలేకపోవడం కేవలం బిహార్‌కు మాత్రమే పరిమితం కాదు. జార్కండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అంటే ఓబీసీ వర్గాల్లోని ఆధిపత్య కులాలు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతుండగా, మిగిలినవారికి అవి అందుబాటులో లేవు. ఆర్‌జేడీ, ఎస్‌.పి., జెడీ(యు) వంటి ప్రాంతీయ పార్టీలు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తొలగించి వెనుకబడిన తరగతులకు అధికారాన్ని కట్టబెట్టాయని కొందరు ప్రచారం చేస్తున్నప్పటికీ, వెనుకబడిన కులాల్లో అట్టడుగున వున్న కులాల స్థితిగతుల్లో ఏవిధమైన మార్పు లేదన్నది అక్షరసత్యం. అందువల్ల కులగణన అనేది కేవలం  సంఖ్యకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక, ఆర్థికాభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీనివల్ల ఓబీసీ వర్గాల్లోని కొన్ని కులాలు అగ్రవర్ణాలను మించిన స్థాయిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అన్ని రంగాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. జనాభాపరంగా తక్కువగా వున్న కులాలు, తమ అస్తిత్వంకోసం ఒక ఆధిపత్య కులానికి మద్దతు పలకాల్సి వస్తుండటంకూడా గమనించాలి. ఇప్పుడు బిహార్‌లో తేజస్వీ యాదవ్‌ను చాలామంది యాదవులు అనుమాన దృక్కులతో చూస్తున్నారు. కుశావహలకు అనుకూలంగా ఆయన మెలగడమే కారణం. జార్ఖండ్‌ లో గత ఎన్నికల్లో సురేష్‌ మెహతో నేతృత్వంలో ఆల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పార్టీ (ఏజేఎస్‌యూపీ) ఏర్పాటైంది. సురేష్‌ మెహతోను తరచుగా కూర్మీ మెహతోగా పిలిచేవారు. అయితే 2024 అ సెంబ్లీ ఎన్నికల్లో జైరామ్‌ మెహతో నాయకత్వంలోని జార్ఖండ్‌ లోక్‌తాంత్రిక్‌ క్రాంతికారి మోర్చా కూర్మీల్లో ఎక్కువ మద్దతును సాధించింది. అంటే కూర్మీలు జైరామ్‌ మెహతా పార్టీపైనే విశ్వాసం వుంచారు.ఏతావాతా చెప్పొచ్చేదేమంటే కులగణన ఓబీసీ పార్టీల్లో కొనసాగుతున్న సమతుల్యతను దెబ్బతీయవచ్చు. తమకు సంద్రాయంగా విధేయులుగా వున్న వర్గాల్లో తమ బలాన్ని నిలుపుకుంటూనే, త మను తాము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటే తప్ప ఓబీసీ పార్టీల మనుగ డ కష్టం.

‘‘అణువంత రూపం’’ కాదు…’’హనుమంతుడి స్వరూపం’’!

`ఒడిదొడుకులెన్ని వున్నా ఒకే ఒక్కడు రేవంత్‌!

`కాంగ్రెస్‌ ను కష్టకాలంలో ఆదుకున్నాడు.

`రవ్వంత అన్న కళ్ల ముందు కొండంత ఎదిగాడు.

revanth reddy

`అణువంత అనుకున్న వారి ముందు హనుమంతుడై దడ పుట్టిస్తున్నాడు.

`కాంగ్రెస్‌ కు సంజీవనీ అయ్యాడు.

`కేసీఆర్‌ కు ఎదురు తిరిగాడు.

`కేసీఆర్‌ ను ఎదిరించి నిలిచాడు.

`కేసులకు వెరవలేదు. జైలుకు భయపడలేదు.

`లక్ష్యం ముందు సమస్యలను చీపురుపుల్లలనుకున్నాడు.

`చిందరవందర రాజకీయాన్ని చక్కదిద్దాడు.

`తెలంగాణ రాజకీయాలలో ఎదురులేని స్థాయికి ఎదిగాడు.

`ఎవరినైనా ఎదిరించి నిలబడి తొడగొట్టాడు.

`కేసీఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు.

`ఏడాదిన్నర పాలన కూల్‌గా నడిపించాడు.

`బీఆర్‌ఎస్‌ కు సున్నం పెట్టి, సున్నా చుట్టించాడు.

`బీఆర్‌ఎస్‌ రాజకీయాన్ని నిలువునా మింగేశాడు.

`తెలంగాణ రాజకీయాలలో బీఆర్‌ఎస్‌ ఉనికి ప్రశ్నార్థకం చేశాడు.

`కారులో కుదుపులు కాంగ్రెస్‌ కు కలిసొచ్చేలా చేశాడు.

`కేసీఆర్‌ లాంటి నాయకుడిని కేసులతో వణికిస్తున్నాడు.

`కేసీఆర్‌ కు భయం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు.

`పార్టీని మొత్తం తన కంట్రోల్‌ లోకి తెచ్చుకున్నాడు.

`సమిష్టి ప్రభుత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయమంటే మాటలు కాదు. ఎదురీతలు. నిలదీతలు. పడిగాపులతో కూడిన ఎదురుచూపులు. ఎవరు ఎప్పుడు ఎంత ఎదుగుతారో..ఎవరు ఎక్కడ ఆగిపోతారో అన్నది తెలిసే ముచ్చట కాదు. కాకపోతే రాజకీయం అంటే కాలం కలిసి రానప్పుడు రాజీ పడాలి. కాలాన్ని తనవైపు తిప్పుకొని ఎగిరిపడాలి. తనంతటి వారు లేరని నిరూపించుకోవాలి. నాయకులకు ఆశలుండాలి. లక్ష్యాలుండాలి. తాను ఎమ్మెల్యే కావాలనుకంటే సరిపోదు. అయినా అవకాశాలు రాకపోవచ్చు. అందుకే రాజకీయాల్లో అవకాశాల కోసం ఎంత వెంపర్లాడాలో..అంతే వాసిగా కొట్లాడి కూడా సాదించాలి. అప్పుడు నాయకుడు, మహా నాయకుడౌతారు. రాజ్యం ఏలే శక్తిని కూడగట్టుకుంటాడు. పాలకుడై పాలిస్తాడు. అలాంటి వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకరు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్‌ పార్టీలో నాయకుడు కావడం అంటే ఏటికి ఎదురీదడమే..గెలిచి నిలవాటంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొవాలి. అందర్ని కలుపుకుపోవాలి. అందరి చేత నాయకుడని జేజేలు కొట్టించుకోగలగాలి. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. ఎదిగేవారిని ఎవరు లాగుతారో తెలియదు. నిచ్చెన మీద వున్నవారిని ఎవరు కిందకు తోస్తారో తెలియదు. అలాంటి పార్టీలో అందర్నీ దాటుకొని ముందుకు వెళ్లడం అంటే పరుగుపందెం కన్నా పెద్ద ప్రయత్నమే చేయాలి. అందర్నీ నెట్టేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కాంగ్రెస్‌లో గెలుపు. అప్పుడే కాంగ్రెస్‌లో పదవులు. నాయకుడి విలువ ప్రతిపక్షంలో వున్నప్పుడు తెలుస్తుందని అంటారు. నాయకుడు కావాలనుకున్నప్పటి నుంచి అలుపెరగని పోరాటం చేసే వారు మాత్రమే ముఖ్యమంత్రి స్దాయికి చేరుకుంటారు. అలాంటి వారిలో కీలకంగా చెప్పుకోవాల్సిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఒక్కడుగా రాజకీయం మొదలు పెట్టారు. ఒక్కడుగా అడుగులేశాడు. ఒక్కడుగానే విజయాలు సొంతం చేసుకున్నాడు. ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి ఎంతో తేడావుంది. సిఎం. రేవంత్‌ రెడ్డి, మూడు దశాబ్ధాల క్రితం ఈ స్దాయి నాయకుడై వుంటే, ఇప్పటికే దేశ ప్రధాని అయ్యేవారు. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి పెద్ద చాలెంజ్‌లు లేవు. ఇప్పుడున్న పధకాల గోల లేదు. ప్రభుత్వమంటే పని చేసుకుంటూ పోవడం తప్ప, ప్రజలకు ఇప్పుడిస్తున్న సంక్షేమ పధకాలతో కూడిన పూర్తి స్ధాయి మ్యానిపెస్టోలు వుండేవి కాదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి ఏదో ఒకరకమైన ప్రభుత్వ పధకం అందాల్సిందే. అందని వారిని వాటిని అర్హులను చేయాల్సిందే. వారికి కూడా ప్రభుత్వ పధకాలు అందేందుకు కృషి చేయాల్సిందే. కాని గతంలో ఒకటో, రెండో పధకాలు మాత్రమే వుండేది. అందులో రేషన్‌ తప్ప మరే పథకాలు కనిపించేవి కాదు. ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఒత్తిడి వుండేది కాదు. కాని రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఎండాకాలంలో ఉక్కపోతలా వుండేది. ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకునేంత రాజకీయం నెరిపేవారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఏడాది కాలం కూడా సరిగ్గా పాలన సాగించలేని ఉద్దండ నాయకులు కూడా వున్నారు. అందులో మర్రి చెన్నారెడ్డి, మాజీ ప్రధాని పవి. నర్సింహారావు లాంటి వారు కూడా వున్నారు. కాంగ్రెస్‌ రాజకీయ చరిత్రలో అత్యధిక సీట్లు సాధించిన పి.వి. నర్సింహారావు కూడా పదమూడు నెలలు పాలన సాగించేందుకు ఆపసోపాలు పడ్డారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు కూడా దినదిన గండంగానే పాలన సాగించారు. వారందరితో పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి పడినన్ని రాజకీయ కష్టాలు, కక్షలు ఏ నాయకుడు అనుభవించలేదు. నిత్యం నరకం చూశారు. అయినా కేసిఆర్‌ను ఎదరించి నిలిచారు. పోరాడి ప్రజా క్షేత్రంలో కేసిఆర్‌ను మట్టి కరింపించారు. రాజకీయాల్లో ఆరోపణలు మరీ దారుణమైన స్ధితికి బిఆర్‌ఎస్‌ నాయకులు దిగజార్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిత్వ హననం చేసేవారు. ఆయన ఆహార్యం మీద ఆరోపణలు చేసేవారు. అయినా రేవంత్‌ రెడ్డి చిరునవ్వుతో వాటిని స్వీకరించేవారు. అంతే దాటిగా విమర్శలు చేసిన వారిని కూడా మాటలతో తూటాలు పేల్చేవారు. చాల మంది బిఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి మీద చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. పైగా అణవంత రెడ్డి, రవ్వంత రెడ్డి అంటూ హేళన చేసేవారు. ఇప్పుడు ఆ నాయకుడు రేవంత్‌ రెడ్డి కొండంత కనిపిస్తున్నాడు. ఒక్కక్కరి వెన్నులు వణకు పుట్టిస్తున్నాడు. ఎన్ని ఒడుదొడుకులైనా ఆనాడు ఎదుర్కొన్నాడు. ఇప్పుడూ ఎదురీదుతూనే వున్నారు. సహజంగా ఏ నాయకుడైనా అధికార పార్టీలో చేరి పదవులు పొందాలనుకుంటారు. నాయకుడిగా ఒక్కొ మెట్టు ఎదుగాలనుకుంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం విభిన్నం. ఆయన రాజకీయం ప్రత్యేకం. అందుకే తన మొదటి ఎంపిక ప్రతిపక్షంలో వున్న పార్టీనే ఎంచుకున్నారు. ఇండిపెండెంటుగానే జడ్పీటీసి అయ్యారు. ఇండిపెండెంటుగానే ఎమ్మెల్సీ అయ్యారు. 2007 ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశంలో చేరారు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలోనే వుంది. 2014లో తెలుగుదేశంలోనే వున్నాడు. అప్పుడూ ప్రతిపక్ష పాత్రనే పోషించారు. ఎందుకంటే ఆయన పదవులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద పొందాలనుకోలేదు. కాంగ్రెస్‌లో చేరినా ఆ పార్టీ ప్రతిపక్షంలోనే వుంది. ఆ పార్టీ అప్పుడు నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలోనే వుంది. భవిష్యత్తులో పుంజుకుంటుందన్న నమ్మకం లేని స్దితిలోనే వుంది. అలాంటి సమయంలోనే కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. పార్టీకి కొండంత అండగా నిలిచారు. పార్టీలో ఎదురయ్యే సమస్యలనే కాదు, అప్పటి పాలకపక్షం నుంచి ఎదురైన ఇబ్బందులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు. పాలమూరు పులి బిడ్డ అని నిరూపించుకున్నారు. ఒకనాడు అణువంత అన్నవారి ముందు హనుమంతుడంతై, వారికి దడి దడ పుట్టిస్తున్నాడు. కాంగ్రెస్‌కు సంజీవని అయ్యారు. పార్టీని నిలబెట్టేందుకు అనేక కష్టాలు పడ్డారు. ఆఖరుకు తన కూతురు పెళ్లిని కూడా కళ్ల నిండా చూడలేనంత కష్టాన్ని అనుభవించాడు. పదే పదే కేసిఆర్‌ పాలనలో జైలు జీవితాన్ని అనేక సార్లు భరించారు. కేసులకు ఏనాడు భయపడలేదు. జైలు జీవితం గురించి చింత చెందలేదు. ఎన్ని నిర్భంధాలనైనా సరే అవలీలగా ఎదుర్కొన్నాడు. ప్రజల హృదయాలను గెల్చుకున్నాడు. కాంగ్రెస్‌ పెద్దల నమ్మకం చూరగొన్నాడు. బలమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని ప్రచారం సాగుతున్న వేళ కేసిఆర్‌కు ఎదరించి నిలిచాడు. ప్రతి పధకాన్ని ఎండగట్టాడు. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు , అక్రమాలు జరుగుతున్నాయని ఆనాడే గొంతెత్తి నినదించాడు. తెలంగాణ సొమ్మును బిఆర్‌ఎస్‌ నాయకులు నీళ్లలా కొల్లగొడతున్నారని ప్రజలను చైతన్యం చేశారు. మల్లన్న సాగర్‌ ప్రాంతాల్లో నిర్వాసితులకు అండగా వున్నారు. ప్రభుత్వంతో కొట్లాడి వారికి పరిహారం అందేందుకు కృషి చేశారు. ఎన్ని అవాంతరాలెదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రతి సమస్యను పూచిక పుల్లతో సమానమనుకున్నాడు. తాను ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేశాడు. ఓ వైపు కేసిఆర్‌ను ఎదుర్కొంటూనే, మరో వైపు కాంగ్రెస్‌లో వున్న చిందర వందర రాజకీయాన్ని చక్కదిద్దారు. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఎదిగారు. తిరుగులేని శక్తిగా మారారు. తన రాజకీయం ముందుకు కేసిఆర్‌ లాంటి నాయకుడి నాయకత్వాన్నే తుత్తునీయం చేశాడు. తనకు ఎదురు వచ్చే వారందరినీ ఎదరించాడు. కేసిఆర్‌ను ఒక దశలో తొడగొట్టి సవాలు చేశాడు. కేసిఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు. జైలుకెళ్లిన సమయంలో కూడా బెబ్బులిలా గర్జించాడు. ఎన్ని సవాళ్లు ఎదురౌతున్నా ఏడాదిన్న కాలం పాటు కూల్‌గా పాలన సాగిస్తున్నాడు. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల చేత సున్నం పెట్టించి, సున్నా చుట్టేలా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ను నిలువునా మింగేశాడు. తెలంగాణ దాటి దేశ రాజకీయాలను ఏలుతామని ప్రగల్భాలు పలికిన వారి రాజకీయ ఉనికినే ప్రశ్నార్ధం చేశాడు. ఇల్లు దాటలేని పరిస్దితి తెచ్చాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడిని కూడా కేసులతో వణికిస్తున్నాడు. ఎవరికీ భయపడడని గొప్పలు చెప్పుకునే కేసిఆర్‌కు భయం ఏమిటో రుచి చూపిస్తున్నాడు. దినదినం వణుకు అంటే ఎలా వుంటుందో చూపిస్తున్నాడు. పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. ప్రజా ప్రభుత్వానికి నిజమైన నిర్వచనం చెబుతున్నాడు.

నివేశన స్థలాల సర్వేకోసం ‘స్వామిత్వ’ పథకం

`డ్రోన్‌ సర్వేతో ఇళ్లకు సరిహద్దుల నిర్ణయం

`అమలు చేస్తున్న కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్‌ ఇండియా 

`డ్రోన్ల సహాయంతో సర్వే ఫలితాలు కచ్చితం

`కచ్చితమైన మార్కింగ్‌తో యాజమాన్య హక్కు పత్రాలు

`ఎన్నో సమస్యలకు పరిష్కారం

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాల సరిహద్దు సమస్యలకు అద్భుతమైనపరిష్కారం చూపుతున్న పథకం ‘స్వామిత్వ’ (సర్వే ఆఫ్‌ విలేజ్‌ ఆబాదీ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజెస్‌). దీన్ని ప్రధాని నరేంద్రమోదీ 2020, ఏప్రిల్‌ 24న ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో అధికశాతం మందికి సరైన పత్రాలు లేకపోవడంతో, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ వారి ఇళ్లను కూల్చివేసేందుకు కోర్టులు ఆదేశాలిస్తున్నాయి. తాతలు, తండ్రుల కాలంనుంచి నివాసముంటున్న తమకు ఇటువంటి దు స్థితేంటని ఆయా నివాసగృహాలకు యజమానులు లబోదిబోమనడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వీరి నివేశనస్థలాల సర్వే చేసి అధికారిక పత్రాలను జారీచేయడం ఒక్కడే పరిష్కారమన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ప్రవేశపెట్టిన పథకమే ‘స్వామిత్వ’. ఈ పథకాన్ని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్‌ ఇండియా (ఎస్‌ఓఐ)లు దేశవ్యాప్తంగా ఉమ్మడిగా అమలు చేస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని గృహయజమానులకు సరైన పత్రాలు లేకపోవడంతో, ఇళ్ల సరిహద్దులు నిర్ధారించడం ఒక ప్రధాన సమస్య కాగా, వీరినుంచి శాస్త్రీయంగా పన్నువసూలు, గ్రామాల అభి వృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లోని భీ మ్‌వాలా గ్రామానికి చెందిన వినోద్‌ అనే 21 సంవత్సరాల యువకుడికి రెండేళ్ల క్రితం వరకు తన నివేశన స్థలానికి సంబంధించి ప్రభుత్వంతో వివాదం నడిచింది. అతను నివసిస్తున్న ఇంటికి యాజమాన్య హక్కులను నిర్ధారించే పత్రాలేవీ లేకపోవడంతో ప్రభుత్వం దీన్ని అక్రమంగా ఆక్రమించి చేసిన నిర్మాణంగా పరిగణించి కూల్చివేయడానికి సిద్ధం కావడంతో వివాదం కోర్టుకు చే రింది. ఒకప క్క కోర్టు కేసు నడుస్తుండగానే 2023లో స్వామిత్వ పథకం కింద గ్రామాన్ని డ్రోన్‌ల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ విధంగా నిక్కచ్చి సర్వే నిర్వహించి గ్రామస్థులకు యాజమా న్య హక్కుల పత్రాలను అందజేశారు. వినోద్‌ తండ్రి కూడా సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు డ్రోన్‌ సర్వే నిర్వహించిన తర్వాత అతని ఇంటిని కచ్చితమైన మార్కింగ్‌తో యాజమా న్య హక్కు పత్రాన్ని ప్రభుత్వం జారీచేసింది. దీన్ని ఉత్తరాఖండ్‌ హైకోర్టులో సమర్పించగానే, ఇంటిని కూల్చవద్దని ప్రభుత్వాధికార్లను ఆదేశించింది. స్వామిత్వ పథకం వల్ల కలిగే ప్రయోజనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!

నిజం చెప్పాలంటే ఇటువంటి భూవివాద కేసులో దేశవ్యాప్తంగా కోర్టుల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి వుంటున్నాయి. ప్రపంచబ్యాంకు అధ్యయనం ప్రకారం భారత కోర్టుల్లో కేసులు పెద్ద ఎత్తున పెండిరగ్‌లో వుండటానికి భూవివాదాలే కారణమని స్పష్టం చేసింది. దేశంలో 66% సివిల్‌ కేసులు ఆస్తుల తగాదాలకు సంబంధించినవేనని సంస్థ పేర్కొంది. ఇటువంటి కేసులు పరిష్కారం కావడానికి కనీసం 20 ఏళ్లయినా పడుతోంది! అదీకాకుండా గతంలో సుప్రీకోర్టు ఇచ్చిన 25% తీర్పులు కేవలం భూవివాదాలకు సంబంధించినవే కావడం గమనార్హం. కోర్టులో ప్రస్తు తం పెండిరగ్‌లో వున్న ప్రతి మూడు కేసుల్లో రెండు ఆస్తి వివాదాలకు సంబంధించినవే కావడం గమనార్హం. 

స్వామిత్వ పథకం కింద డ్రోన్‌ సర్వేల ఆధారంగా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, కర్ణాటక,పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 5వేల గ్రామాల్లో ఇళ్లస్థలాల యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభించింది. నిజానికి 2020లో సర్వే ఆఫ్‌ ఇండియా మొట్టమొదటిసారి భూమి మ్యాపింగ్‌ కోసం డ్రోన్‌ల కొనుగోలు ప్రారంభించింది. ప్రస్తుతం సర్వే నిర్వహించడానికి మైక్రో డ్రోన్లు (250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు) మరియు చిన్న డ్రోన్లు (2 కిలోల నుంచి 25 కిలోల బరువు) వాడుతున్నారు. 

సర్వే ఏవిధంగా మొదలైంది?

నిజం చెప్పాలంటే మనదేశంలో భూ సర్వే నిర్వహించడం అత్యంత క్లిష్టమైన కార్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ కష్టం. ఎందుకంటే ఎవరివద్దా ఎటువంటి పత్రాలు లేకపోవడం, సరైన రికార్డులు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. బ్రిటిష్‌ వలస పాలనలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఇళ్లను ని ర్మించుకోవడం ఆనవాయితీగా వుండేది. వీటికి ఎటువంటి యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేదా మరే ఇతర ఆధారాలు వుండేవి కావు. ఇటువంటి ఆవాస ప్రాంతాలను ‘ఆబాదీ’గా వ్యవహ రించేవారు. అ పేరునే ఇప్పటికీ వాడుతున్నారు. బ్రిటిష్‌ వారి కాలం లేదా స్వాతంత్య్రానంతర కాలంలో ఇటువంటి ఆవాసాల విషయంలో ఏవిధమైన సర్వే నిర్వహించలేదు. ఫలితంగా తరతరాలుగా ఏవిధమైన పత్రాలు లేకుండానే ఆయా గ్రామాల్లో ప్రజలు నివసిస్తూ వస్తున్నారు. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. ఆయా గ్రామ పంచాయతీలకు ఇళ్ల పన్నులు వసూలు చేయ డం, సరిహద్దు నిర్ధారణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు సంబంధించిన వివాదాల పరిష్కారం పెద్ద సమస్యగా మారింది. వివాదాలు వచ్చినప్పుడు తరతరాలుగా నివసిస్తున్నప్పటికీ తమవద్ద ఎటు వంటి పత్రాలు లేకపోవడంతో ఆయా గృహ యజమానులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనడం మొదలైంది. కొన్ని రాష్ట్రాల్లో భర్త చనిపోయిన మహిళకు తన భర్త వాటాను ఇవ్వకుండానే, వెళ్లగొట్టిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. 

మొట్టమొదటగా వున్న మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించడానికి 2019లో సర్వే ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది. డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిఈ గ్రామాల్లో ఇళ్లకు కచ్చితమైన సరిహద్దులను నిర్ణయించడంతో ఇంటిపన్ను వసూళ్లు, సరిహ ద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇటువంటి సమస్యలను పరిష్కరించే క్రమంలో మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మహారాష్ట్ర గ్రామాల్లో డ్రోన్‌ టెక్నాలజీ సహాయంతో సమస్యను పరిష్కరించిన విధాన్ని వివరించడంతో, నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ‘స్వామిత్వ’ పేరుతో పథకాన్ని అమల్లోకి తెచ్చారు. విశేషమేంటంటే 2020 సంవత్సరంలో ఏప్రిల్‌ 24వ తేదీన కోవిడ్‌ తీవ్రంగా వున్నప్పుడే దీన్ని ప్రారంభించడం విశేషం. అంతేకాదు అదే ఏడాది అక్టోబర్‌ నాటికి లక్ష ప్రాపర్టీ కార్డులు కూడా తయారయ్యాయి. 2025 ఏప్రిల్‌ నాటికి స్వామిత్వ పథకం ప్రారంభమై ఐదేళ్లు పూర్తయింది. మే మొదటివారం నాటికి దేశంలో ఈ పథకం కింద నోటిఫై అయిన 3.45లక్షల గ్రామాల్లో, 3.22 లక్షల గ్రామాల్లో సర్వే పూర్తయింది. సర్వే మొదలైన దగ్గరినుంచి ఇప్పటివరకు 10.46 కోట్ల ఇళ్ల స్థలాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేసారు. 1.67 గ్రామాలకు సంబంధించి 2.54కోట్ల ప్రాపర్టీ కార్డులు కూడా తయారయ్యాయి.  

మాన్యువల్‌ సర్వేలో పొరపాట్లు

భూమి సర్వేలో ఎంతో నైపుణ్యమున్న సర్వేయర్లను నియమించినా, పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రజలు సర్వేయర్లను అనుమతించని సందర్భాలు కూడా చాలానే వున్నాయి. అదీకాకుండా సర్వేలు నిర్వహించడానికి సుదీర్ఘ సమయం పట్టడం కూడా సం ప్రదాయ సర్వే విధానాలు పెద్దగా విశ్వసనీయతను పొందకపోవడానికి మరో కారణం. పోనీ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సర్వే నిర్వహించాలనుకున్న, అవి కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో వుండటంతో సర్వే కచ్చితంగా సాధ్యంకాదు. ఈ ఫలితాలు గ్రామీణ భూకమతాలను నమోదు చేయడానికి సహకరించవు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల సర్వేకు అసలు పనిచేయవు. వీటి సర్వేకు కొద్ది సెంటీమీటర్ల మీటర్ల తేడాతో కూడిన కచ్చితత్వం కావాలి. ఇవి ఉపగ్రహ చిత్రాల ద్వారా సాధ్యం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికే డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు. 

డ్రోన్లతో ప్రయోజనం

ఉదాహరణకు కొన్ని రకాల డ్రోన్లు 35 నుంచి 45 నిముషాల కాలంలో ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో సర్వే నిర్వహించగలవు. ఇదే సమయంలో 4.35 కిలోల బరువును కూడా మోయ గలవు. మరికొన్ని డ్రోన్లు 40 నిముషాల వ్యవధిలో 4 కిలోమీటర్లు, మరికొన్ని 60 నిముషాల వ్యవధిలో 5 కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలుగుతాయి. సగటున 40 నిముషాల కాలంలో 1 చదరపు కిలోమీటరు సర్వే పూర్తి చేస్తాయి. మరి ఇదే ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణాన్ని 3`4 సభ్యులతో కూడిన బృందం సర్వే పూర్తి చేయడానికి 20 రోజులు పడుతుంది. అంతేకాదు పోస్ట్‌ ప్రాసెస్డ్‌ కైనమాటిక్స్‌ (పీపీకే) సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సర్వేలో ఎటువంటి తేడా రాకుండా మరింత కచ్చితంగా వుండేలా చూస్తున్నారు. ఇదే సమయంలో 567 కంటిన్యూవస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేటస్‌ (సీఓఆర్‌ఎస్‌) స్టేషన్లను కూడా ఈ సర్వేలో భాగంగా నెలకొల్పారు. ఈ సీఓఆర్‌ఎస్‌ నెట్‌వర్క్‌ భూమిపై కచ్చితమైన ప్రదేశాల్లో మార్కింగ్‌ చేయడానికి ఉపయోగపడతా యి. 

సర్వే కొనసాగే విధానం

ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే ఆఫ్‌ ఇండియాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలి. రాష్ట్ర చట్టాల పరిధిలో సర్వే చేయాల్సిన గ్రామాల జాబితాను సర్వే ఆఫ్‌ ఇండియా కు అందజేయాలి. 

శిక్షణ పొందిన రెవెన్యూ అధికారులు మరియు గ్రామ పంచాయతీకి సర్వేకు సంబంధించిన సమాచారం అందిస్తారు. 

సర్వే ఆఫ్‌ ఇండియా టీమ్‌లు, అవసరమైన సీఓఆర్‌ఎస్‌ మరియు గ్రౌండ్‌ కంట్రోలింగ్‌ పాయింట్లను ఎంపిక చేస్తాయి.

సర్వే చేయాల్సిన ప్రాంతాన్ని గ్రామసభలో నిర్ణయిస్తారు.

సర్వేకు ముందు గ్రామంలోని ఇళ్ల సరిహద్దులను తెల్లని గీతలతో మార్క్‌ చేస్తారు. 

తర్వాత డ్రోన్‌లు సర్వే చేయాల్సిన ప్రదేశంపై ఎగిరి ఫోటోలు తీస్తాయి. 

ఈ చిత్రాలను 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో ప్రాసెస్‌ చేస్తారు.

ఈ మ్యాప్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. వీటి ఆధారంగా ప్రభుత్వం నిజమైన యజమానులను గుర్తించి, మరోసారి క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుంటుంది.

ఆవిధంగా అప్‌డేట్‌ అయిన తర్వాత ఈ మ్యాప్‌లను సర్వే ఆఫ్‌ ఇండియాకు పంపుతారు.

తప్పులు సరిదిద్దిన తర్వాత యజమానులకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను తయారు చేస్తారు.

గ్రామాల్లో చేపట్టే ప్లానింగ్‌ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ మ్యాప్‌లనే ఆధారంగా తీసుకుంటారు. 

ఇప్పుడు దేశవ్యాప్తంగా నివేశన స్థలాల సర్వేలకు డిమాండ్‌ పెరగడంతో సర్వే ఆఫ్‌ ఇండియా డ్రోన్‌ల సేకరణకు టెండర్లను పిలిచింది. గతంలో టెండర్లు పిలిచినప్పుడు కేవలం మూడు డ్రోన్‌ కంపెనీలు మాత్రమే ముందుకు రాగా, తాజాగా పిలిచిన టెంటర్లలో 20 కంపెనీలు పాల్గనడం దేశంలో డ్రోన్‌ సర్వేకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. ‘స్వామిత్వ’ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, భూ సర్వేలో డ్రోన్‌లను ఉపయోగించడానికి ముందుకు రావ డం విశేషం. ఇదే సమయంటో పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డులను అప్‌డేట్‌ చేయడానికి ‘నేషనల్‌ జియోస్పే షియల్‌ నాలెడ్జ్‌`బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హాబిటేషన్స్‌ (నక్షా)ను అమలు చేస్తున్నారు. ఉదాహరణకు బెంగళూరు నగరానికి సంబంధించి ‘డిజిటల్‌ ట్విన్‌’ను అభివృద్ధి పరు స్తున్నారు. నగరాభివృద్ధి ప్రణాళికను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

సామాజిక యుద్ధం ‘‘కవిత’’

`సామాజిక తెలంగాణ ‘‘కవిత’’ తోనే సాధ్యం.

`’’కవిత’’ రాజకీయ పార్టీ పెడితే ‘‘బహుజన ప్రభంజనం’’.

`తెలంగాణ సామాజిక భవిత ‘‘కవిత’’.

`’’కవితే’’ సామాజిక ‘‘సైన్యం’’.

`’’కవిత’’ బహుజన ‘‘సామాజిక స్వరం’’.

`తెలంగాణలో సామాజిక న్యాయం కోసం సవరించిన గళం.

`’’కవిత’’ ఒక సామాజిక బాధ్యత.

`’’కవిత’’ సామాజిక తెలంగాణ విజ్ఞత..

`సామాజిక బాధ్యతను నిర్వర్తించిన వారిలో అగ్రకులాల సామాజిక వేత్తలే ఎక్కువ.

`సతీ సహ గమనం రద్దుకు కారణం రాజా రామ్మోహన్‌ రాయ్‌.

`వితంతు వివాహాలు జరిపించినది వీరేశలింగం పంతులు.

`కన్యాశుల్కం రాసింది గురజాడ.

`సహపంక్తి భోజనాలు పెట్టిన పలనాటి బ్రహ్మనాయుడు.

`అదే బాటలో ఇప్పుడు ‘‘కవిత’’.

`బహుజన రాజకీయం కోసం కదిలిన తెలంగాణ ‘‘కాళిక’’ కవిత.

`భవిష్యత్తులో బడుగుల రాజ్యం కోసం ‘‘కవిత’’ తపన.

`బడుగులను ఏకం చేసే యజ్ఞంలో తొలి అడుగు ‘‘కవిత’’.

`ఇంత కాలం బడుగులను, బడుగులే నమ్మలేదు.

`బడుగులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు.

`సామాజిక తెలంగాణ ఆవిష్కరణ కోసం ‘‘కవిత’’ కదలివస్తోంది.

`బడుగులంతా ఏకమైతే నవ రాజకీయం నిర్మాణమౌతుంది.

`’’కవిత’’ కు పల్లె తెలుసు..పల్లె జీవితం తెలుసు.

`’’కవిత’’ అంటే పువ్వుకు తెలుసు.

`తెలంగాణలో వున్న ప్రకృతి ప్రతి కొమ్మకు తెలుసు.

`’’కవిత’’ పిలుపు తెలంగాణ ఉద్యమానికి తెలుసు.

`తెలంగాణ ఉద్యమ రాజకీయానికి బతుకమ్మగా తెలుసు.

`’’కవిత’’ అంటే డిల్లీ రాజకీయానికి ధీర వనితగా తెలుసు.

`మహిళా రిజర్వేషన్‌ కోసం ‘‘కవిత’’ చేసిన పోరాటం తెలుసు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:                             

కవిత తెలంగాణ సామాజిక యుద్దం. నిరంతర ప్రజాసంగ్రామం. కవిత ఒక సామాజిక న్యాయం. కవిత ఒక సామాజిక ధ్యేయం. కవిత ఒకసామాజిక లక్ష్యం. కవిత తెలంగాణ సామాజిక పోరాట గుమ్మం. సామాజిక తెలంగాణ ఆలోచనలు చేసిన వారు చాలా మంది వున్నారు. అటు వైపు అడుగులు వేసిన వారు లేరు. కాని చెప్పినట్లే ప్రయాణం మొదలు పెట్టిన కవిత. మూగబోయిన బడుగుల గొంతౌతున్న కవిత. బడుగుల కోసం గొంత్తిత్తి నినదిస్తున్నది కవిత. బిసిలలో సామాజిక చైతన్యం రగిలించే యజ్ఞం కవిత. ఈ తరంలో సామాజిక తెలంగాణ ఆలోచన మొదలైన కవిత తోనే సామాజిక నిర్మాణం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడుతోంది. సామాజిక తెలంగాణ కవితతోనే సాధ్యమౌతుందన్న భరోసా ఏర్పడుతోంది. కవిత ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే బహుజన ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు. కాని ఎమ్మెల్సీ కవిత పట్టుదల ఎలాంటిదో అందరికీ తెలుసు. కవిత మొండి ధైర్యం గురించి కూడా తెలుసు. అందుకే కవిత విషయంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. రాజకీయపార్టీ అంటే కుటుంబ సమస్య కాదు. ప్రజా సమస్య. ప్రజల కోసం ఆలోచించే సమస్య. ప్రజల వైపు నుంచి దృక్కొణం వుండాల్సిన సమస్య. అందువల్ల ఎలాగైనా కవితను రాజకీయ యవనిక మీద ప్రత్యేక గుర్తింపు రావడం కొన్ని రాజకీయ పక్షాలకు ఇష్టం వుండదు. అంతే కాదు స్వపక్షంలో కూడా అలాంటి అభిప్రాయం ఎవరికైనా వుండొచ్చు. అందుకే కవిత సూటిగా, స్పష్టంగానే కేసిఆర్‌ చుట్టూ దెయ్యాలున్నారని కుండబద్దలు కొట్టిచెప్పారు. కాసేపు ఆ రాజకీయం పక్కన పెడితే, కవిత ఆది నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఆరాటం వుండేది. అందుకే ఆమె తనదైన శైలిలో ఉద్యమ స్వరూపానికి నాంది పలికింది. ముందు తెలంగాణలో జాగృతి అనే సంస్ధ ద్వారా తెలంగాణ సమజాన్ని చైతన్య పర్చేందుకు అడుగులు వేసింది. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ సమాజంలో ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు మరొకరు లేరు. నేరుగా కవిత ఉద్యమంలోకి వెళ్లొచ్చు. ఉద్యమ కారిణిగానే గుర్తింపు పొందొచ్చు. కాని ఆమె తెలంగాణ నవ సమాజం గురించి ఆలోచనలు చేసింది. ఉద్యమం ఓ వైపు కేసిఆర్‌ చేస్తున్నప్పుడు, తాను తెలంగాణయువతకు ఎలా సాయ పడాలన్న ఆలోచన చేయడం అంటే కన్న తల్లి పిల్లల గురించి ఆలోచన చేయడం లాంటిదే అని చెప్పకతప్పదు. అలా అప్పటి యువతకు అవసరమైన ఎడ్యుకేషన్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోసం కృషి చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. యువతలో ఉద్యమ చైతన్యం రగిలించడంలో కవిత ప్రదాన పాత్ర పోషించింది. అందుకే జాగృతి అనే సంస్ధకు అంతటి పేరు వచ్చింది. ఒక దశలో బిఆర్‌ఎస్‌కు సమాంతరంగా జాగృతి నిర్మాణం జరిగింది. అలా చిన్న వయసులోనే కవిత తెలంగాణ సమాజ గతి కోసం, ప్రగతి కోసం ఆలోచనే కాదు, ఆచరణ కూడా చూపించింది. అందుకే అందరి మన్ననలు పొందింది. అంతే కాకుండా కవిత తెలంగాణ ఉద్యమ కాలమంతా బీద, బిక్కి, బడుగుల జీవితాలు చాల దగ్గరుండి చూశారు. పల్లె జీవితాన్ని కళ్ల నిండా చూశారు. పల్లె బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బతుకమ్మ పేరుతో ఊరూరు తిరిగినప్పుడు పల్లె వేధనలు తెలుసుకున్నారు. చిద్రమైన ఆనాటి పల్లె బతుకులు చూసి చలించిపోయారు. ఉద్యమ సమయంలోనే ఆమె సామాజిక సృహను కూడా తన దాతృత్వంతో చూపించారు. అప్పుడే తెలంగాణలో సామాజిక న్యాయం రాజకీయ పరంగా అందితే తప్ప అంతరాలు, అవరోధాలున్న సమాజంలో మార్పులు తీసుకురావొచ్చని ఆలోచన చేశారు. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే తెలంగాణ సామాజిక భరోసా కవిత అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నంత కాలం కవిత ఏం చేసిందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదీ ఏక కాలంలో పూర్తి కాదు. అన్ని సమస్యలు ఒకే సారి నెరవేరవు. ఆ సమయంలో సామాజిక తెలంగాణ కన్నా, సాగు నీటి తెలంగాణ ముఖ్యం. అన్న పూర్ణ తెలంగాణ ముఖ్యం. ఆకలిని తరిమేసే తెలంగాణ ముఖ్యం. తెలంగాణలో ఆకలి కేకలు లేకుండా చూడాల్సిన సమయం. తెలంగాణలో ఎప్పటికైనా సామాజిక తెలంగాణ సాదించొచ్చు. కాని ముందుకు తెలంగాణ నుంచి ఆకలిని తరిమేయాలి. అనారోగ్యాన్ని తరిమేయాలి. నీటి గోసలు లేకుండా చూసుకోవాలి. గుక్కెడు మంచి నీటికోసం తల్లడిల్లిన తెలంగాణ గుండెను చూసిన వారికి మాత్రమే కొన్ని విషయాలు అర్దమౌతాయి. తెలంగాణలో మొదటి ప్రాదాన్యతగా ప్రాజెక్టుల నిర్మాణం. సాగు సంపద పెంచడం. రైతును రాజును చేయడం వంటి బృహత్తరమైన ప్రణాళికలతో కేసిఆర్‌ ముందుకు సాగారు. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత చెబుతారు. కడుపు నిండా తిన్న తర్వాతే కంటికి కునుకైనా, పక్కవారితో కబుర్లైనా చెప్పుకునే అవకాశం వుంటుంది. ఓ వైపు ఆకలి దహిస్తుంటే నిద్ర వస్తుందా? పక్కవారితో సంబాషణ సాగుతుందా? అది అప్పటి తెలంగాణపరిస్దితి. ఇప్పుడు తెలంగాణ పరిపుష్టికరమైన తెలంగాణ. ఆకలి తెలంగాణ పొలిమేర దాటిపోయింది. రైతు సంతోషంగా వున్నారు. విద్య, వైద్యం ఎంతో కొంత బాగానే అందుతోంది. ఇక మిగిలింది..రావాల్సింది సామాజిక చైతన్యం. సామాజిక తెలంగాణ నిర్మాణం. బడుగులకు రాజకీయ ప్రాధాన్యం. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అందుకు కవిత కంకణం కట్టుకొని భయలుదేరింది. కవితే ఒక సమాజిక సైన్యంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తోంది. అందరికన్నా ముందు సామాజిక తెలంగాణకు గళమైంది. తన స్వరం పెంచింది. నిజాన్ని నిర్భయంగా చెప్పింది. సామాజిక తెలంగాణ సాధన జగాల్సిన అవసరాన్ని గుర్తించింది. సామాజిక తెలంగాణ ఆవిష్కారం జరిగితే తెలంగాణ రాష్ట్ర పరిపూర్ణమౌతుందన్నారు. ఇంతకన్నా తెలంగాణ కోసం గొప్పగా ఆలోచించేవారు ఎవరుంటారు. ఇదే సమయంలో కవిత రాజకీయ స్వార్ధం కోసం బహుజన వాదం ఎత్తుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారి పరిస్ధితి ఎలా వుంటుందంటే అమ్మ పెట్టా పెట్టదు..అడుక్కు తిననివ్వదన్న సామెతను నిజం చేస్తుంటారు. బిసిలై వుండి బిసిల ఐక్యత కోసం పాకులాడరు. ప్రయత్నం చేయరు. కాని బిసిలలో చైతన్యం కోసం కవిత ప్రయత్నం చేస్తుంటే ఆమె ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. బిసిలను ఏకం చేయడానికి బిసిలే అవసరం లేదు. సామాజిక సృహ వున్న వారు ఎవరైనా సరే ఆ బాధ్యతను తీసుకోవచ్చు. ఇప్పుడు కవిత కూడా అదే చేస్తున్నారు. చరిత్రలో సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన వారిలో ఎక్కువ మంది అగ్ర కులానికి చెందని వాళ్లే వున్నారు. సామాజిక న్యాయం కోసం వాళ్లే కృషిచేశారు. అందుకే చరిత్రలో నిలిచారు. చరిత్ర గతిని మార్చారు. స్వాతంత్య్రానికి ముందు ఆంగ్లేయులు పాలనలో ఎంతో దుర్మార్గమైన ఆచారం వుండేది. భర్త చనిపోతే వెంటనే ఆమెను కూడా భర్తచితిపై వేసేవారు. దానికి సతీ సహగమనం అని పేరు పెట్టి, సజీవంగా వున్న మహిళను ఆ మంటల్లోనే తగలబెట్టేవారు. దాన్ని సంప్రదాయం అనేవారు. కాని అలాంటి అనాగరిక చర్యను వ్యతిరేకించింది రాజారామ్మెహన్‌ రాయ్‌. ఇంగ్లీషువారితో పోరాటం చేసి, వారిని ఒప్పించి, మెప్పించి సతీసహగమనాన్ని రద్దు చేయించారు. సామాజిక రుగ్మతను పారద్రోలాడు. ఇక చిన్న వయసులోనే పెళ్లిల్లుచేసి, భర్త చనిపోతే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతున్న మహిళల జీవితాల్లో మళ్లీ వివాహం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వీరేశలింగం పంతులుది. అందుకే ఇప్పటికీ ఏపిలో కొట్టుకొని పోయేను కొన్నికోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు…అని ఆ ఆంధ్ర సమాజం వేనోళ్ల పొగుడుతుందంటే కారణం వీరేశలింగం చూపిన దారి. ఆ వీరేశలింగం అగ్ర కులానికి చెందిన సామాజిక వేత్తే. అలాగే వరకట్న సమాజంలో ఆడపిల్ల నలిగిపోతుంటే, కన్నాశుల్కం వస్తే గాని ఆడ పిల్ల జీవితం బాగు పడదని ఎలుగెత్తి చాటి గురజాడ అప్పారావు కూడా ఉన్నత వర్గానికి చెందని మహానుభావుడే. ఇక మనుషుల్లో తేడాలు వుండొద్దని, చిన్నా, పెద్ద అనే తేడా వయసులో, గుణంలో తప్ప కులంలో కాదని చెప్పేందుకు పలనాటి బ్రహ్మనాయుడు చాప కూడుతో సహపంక్తి భోజనాలు పెట్టించేవారు. సమ సమాజ నిర్మాణం కోసం ఆనాడే కృషి చేశాడు. ఆయన నిమ్మ వర్గం కాదు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలగాలని కోరుకోవడంలో అగ్ర కులాలు ముందుండి ప్రశ్నించడాన్ని నిరసించడం అజ్ఞానానికి,అవివేకానికి నిదర్శనమౌతుంది. ఆంగ్లేయులతో ఆనాటి రాజులెంతో మంది పోరాటం చేశారు. వాళ్లంతా తమ రాజ్యాల రక్షణ కోసం పోరాటం చేశారు. వారి పేర్లకు చరిత్రలో పెద్దగా ప్రాధాన్యత లేదు. కాని ప్రజా స్వామ్యం కోసం, ప్రజా పాలన కోసం గాంధీజీ పోరాటం చేశారు. అందుకే మహాత్ముడయ్యారు. దేశానికిస్వాతంత్య్రం తెచ్చిపెట్టారు. ఆయనను ఆనాడు మీరెందుకు అని ఎవరూ ప్రశ్నించలేదు. ఇప్పుడు కూడా కవితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. సామాజిక న్యాయం కోసం కవిత వేసే అడుగులు వెనక్కి పడేది లేదు. అందుకే సామాజిక న్యాయం కోసం కవితది అపర కాళిక అవతారం చూస్తారంటున్నారు.

పార్టీ పదవులు కొలిక్కి..మంత్రి పదవులు వెనక్కి!!

`మంత్రి పదవుల కోసం మరింత సమయం!

`పార్టీ పదవులు మాత్రం సిద్దం!

`దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం!

`పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం.

`రోహిన్‌ రెడ్డి కి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

`సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం.

`నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం.

`పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం.

`అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం.

`స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యం.

`ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు తక్కువ రాకుండా నాయకత్వం పటిష్టం.

`ప్రతి పక్షాల కన్నా ముందే ప్రజల్లోకి నాయకులు వెళ్లాలని ఆదేశం.

`ప్రభుత్వ పథకాలపై, నిర్ణయాలపై పకడ్బందీగా ప్రచారం.

`సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ యువ వికాసం, రేషన్‌ కార్డులపై ప్రజల్లో అవగాహన పెంచడం.

`మంత్రి వర్గ విస్తరణపై ఎటూ తేల్చలేకపోతున్న అధిష్టానం!

`ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర యంత్రాంగం.

`కావాలనే వాయిదా పడుతున్నట్లు సంకేతం.

`తప్పని పరిస్థితుల్లోనే దూరం జరుపుతున్నట్లు సందేశం.

`ఆరు పదవులు అందరికీ పంచలేక తల పట్టుకుంటున్న అధిష్టానం

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:
ఒక రకంగా కాంగ్రెస్‌ పార్టీలో వున్న కొంత మంది నాయకులకు సంతోషకమైన వార్త. మరో రకంగా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులకు కొంత చేదు గుళిక. ఎందుకంటే మంత్రి పదవుల పంపకం మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఎంత వడబోసినా, ఎక్కడో సరైన సమ ప్రాధాన్యత అందరికీ కలిగించాలన్న ఆలోచనతోనే కాస్త ఆ ముహూర్తం దూరం జరుగుతోంది. కాకపోతే ఎంత ఆలస్యమైనా, సరే బెస్ట్‌ అనిపించుకునేలా విస్తరణ వుండాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కోరుకుంటోంది. సహజంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రులు కావాలని కోరిక వుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యేదాకా అదో తంటా. ఏళ్లకేళ్లు ఎదురుచూసి, చూసి, అవకాశం వచ్చినా రాజకీయ పరిస్ధితులు అనుకూలించక ఎమ్మెలు కాని వాళ్లు చాల మంది వుంటారు. వాళ్లలో అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, ఓడిపోయి, గెలిచిన వాళ్లుంటారు. మరికొంత మంది ఎమ్మెల్యే కావడానికి పెద్దగా ఇబ్బందులు పడే పరిస్ధితి రాదు. అలాంటి వారు మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలు అవుతుంటారు. రాజకీయ పరిస్దితులు రాష్ట్రంలో ఎలా వున్నా, ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వుంటారు. అటు ఓడిపోయిన వారైనా, ఇటు ఎప్పుడూ గెలుస్తుండేవారైనా పార్టీకి సేవ చేస్తూనే వుంటారు. అలా అవకాశాలు వచ్చి, ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రులు కావాలనుకోవడం తప్పు కాదు. మంత్రులు కావాలన్న వారి కోరిక మొదటిసారే తీరే వారు కొందరుంటారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యేలు అయినా మంత్రులు కాని వారు కూడా చాలా మంది వుంటారు. అయినా ఎక్కడో ఆశ వారిలో సజీవంగా వుంటంది. ఒక్కసారైనా మంత్రి కావాలని బలంగా కోరుకుంటారు. కాని ఇక్కడ మరో మతలబు వుంటుంది. ఒక్కసారి మంత్రి అయిన నాయకుడు సీనియర్‌ మంత్రిగా పదే పదే పార్టీ అధికారంలో వున్నంత కాలం మంత్రులుగా పనిచేయాలని కోరుకుంటారు. అలా అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడున్న కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అందరికన్నా ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా చిరిత్ర సృష్టించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా వున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అంతే..ఆయన ఏ పార్టీలో వున్నా మంత్రిగా వుంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి, తర్వాత బిఆర్‌ఎస్‌ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి మంత్రి పదవి అందుకున్నారు. ఇలాంటి అవకాశం అందిరికీ రాదు. చాలా అరుదుగా వస్తుంది. గతంలో మంత్రిగా పనిచేసిన మంధని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇప్పుడు మరోసారి మంత్రి అయ్యారు. ఇలా కొంత మందిని పదవులు వాటంతటవే వరిస్తుంటాయి. చాలా మందికి మంత్రి పదవి దక్కినట్లే దక్కి చేజారిపోతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో మంత్రి కావాల్సిన కమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. నల్లగొండ నుంచి మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా అలా అవకాశాలు కలిసివచ్చి ఇప్పుడు కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో పలుసార్లు మంత్రిగాపనిచేసిన నిజాబామాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన మైనార్టీ నాయకుడు షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో వున్నా అదృష్టవంతుడు అనే పేరు వుంది. కాని ఈసారి ఆయన మంత్రి కాలేకపోతున్నారు. కాని ఆయన పేరు కూడా వినిపిస్తూనే వుంది. కాని ఆయనకు దక్కకపోవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తే, తాను గెలిస్తే మంత్రి కావాలనుకున్న మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన గతంలో విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలి బిజేపిలో చేరారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడు అనే పేరు వుంది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండేది. కాని దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే కాలేకపోయారు. నిజంగా ఆయన గత ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్‌ రాజకీయమే వేరేలావుండేదని ఆయన సన్నిహితులు అంటుంటారు. అలా అదృష్టం ఖాతలో మొదటిసారి ఎమ్మెల్యే అయినా బిసి నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ మంత్రి అయ్యారు. అంటే రాజకీయ పదవులు కూడా అదృష్టంతో ముడిపడి వుంటాయని చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలనే అని చెప్పాలి. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడూ కూడా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆందోల్‌ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ ఈసారి మంత్రి అయ్యారు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు మంత్రులౌతారన్న వాటికి కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలు దాటితేనే మరి కొంత మందికి అవకాశం వస్తుంది. మంత్రులయ్యే ఛాన్సు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆరు మంత్రి పదువులు ఖాళీగా వున్నాయి. వాటిలో ఓ నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ఎందుకంటే మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, పిపిసి. అధ్యక్షుడుగా పనిచేసిన వి. హనుమంతరావు మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాని ఆయన పలుసార్లు టికెట్‌ ఇచ్చినా గెలవలేదు. ఆయనకు చాలా కాలంగా కాలం కలిసి రావడం లేదు. ఆయన ఆశ తీరే పరిస్దితి ఇక కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో నిజామాబాద్‌ జిల్లాకు ప్రాదాన్యత లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి పేరులో ఎలాంటి మార్పు లేకుండా వినిపిస్తోంది. అయితే షబ్బీర్‌ అలీ పేరును ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయన ఆశ తీరుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ఇటీవల పార్టీ అధిష్టానం భుజ్జగించిందని, ఆయన అందుకు ఒప్పుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంత వరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. ఆయనను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి తీసుకొమ్మని చెప్పినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కాకపోతే చాల మందికి తెలియని విషయం ఏమిటంటే జాతీయపార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు సహజంగానే పార్టీ ఉపాధ్యక్షులు అని చెప్పుకుంటారు. ఎంత మంది ఎమ్మెల్యేలున్నారో వాళ్లంతా ఉపాధ్యక్షులే అవుతారు. అలాంటి వారికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు ఇచ్చినంత మాత్రాన బాద్యతలు ఎక్కువగా వుండకపోవచ్చు. కాని గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా వున్న జగ్గారెడ్డికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చారు. దాంతో ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చి బుజ్జగించే అవకాశాలున్నాయి. కాకపోతే వర్కింగ్‌ ప్రెసిడెంటు అనేది ఆరో వేలు లాంటిదే..అలాంటి పదవిని రాజగోపాల్‌రెడ్డి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. ఇక మరో జిల్లా ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యే గడ్డం సోదరులు ఇద్దరూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వివేక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పేర్లు మాత్రంపదే పదే వినిపిస్తున్నాయి. కాని పదవులు పంపకాలు ఆలస్యమౌతున్నాయి. ఇదే సమయంలో పార్టీ పదవుల పంపకాలకు మాత్రం ముహూర్తం ఫిక్స్‌ అయిందనే అంటున్నారు. నిజానికి మంగళవారం పార్టీ పదవుల జాబితా విడుదలౌతుందన్న ప్రచారం విసృతంగా జరిగింది. అందులో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు వున్నట్లు తెలుస్తోంది. పూర్తి జాబితాను ఈ నెల 30లోగా ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం వుందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఏది ఏమైనా మంత్రి పదవులు ఇంకా ఆలస్యమైనా సరే, పార్టీ పదవులు తొందరగా పంపకాలు జరుగుతాయని తెలుస్తున్నందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

’’నేటిధాత్రి’’ కథనానికి స్పందించిన మంత్రి ‘‘కొండ సురేఖ.’’

`మంచినీటిని కాలుష్యం చేస్తున్న మిల్లులపై చర్యలు: మంత్రి ‘‘కొండా సురేఖ.’’

`’’కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ కథనానికి మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందన.

`‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన ‘‘కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ అనే వార్తకు రాష్ట్ర అటవీ, పొల్యూషన్‌ శాఖ మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందించారు. 

`ఈ మేరకు ‘‘నేటిధాత్రి’’ తో మంత్రి మాట్లాడుతూ మంచినీటిలో బాయిల్డ్‌ మిల్లుల కెమికల్‌ నీటికి కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన వార్తపై వివరాలు సేకరించమని అధికారులను ఆదేశించారు.

`నగరంలో ఇలాంటి మిల్లులు ఎన్ని వున్నాయి, వారి వివరాలు కూడా అందించమని మంత్రి ‘‘కొండా సురేఖ’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు కూడా సూచించారు. తాను ప్రస్తుతం డిల్లీ వెలుతున్నట్లు, వచ్చిన వెంటనే పూర్తి సమాచారం ఆధారాలు అందించమని వాటి ఆధారంగా తగు చర్యలకు ఆదేశిస్తామని ఎడిటర్‌ ‘‘కట్టరాఘవేంద్రరావు’’కు మంత్రి చెప్పారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వ్యాపారంలో మానవత్వం పూర్తిగా మర్చిపోతున్నారు. మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? అనే విచక్షణ పూర్తిగా కోల్పోతున్నారు. వ్యాపారంలో అడ్డ దారులు తొక్కడం చాలా మంది చేస్తారు. కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే అడ్డ దారులు వెతుక్కుంటున్న వాళ్లు కూడా వుంటున్నారు. ప్రజల ప్రాణాలతో, జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పైకి చూస్తే మాత్రం అవి బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మాత్రమే. ఆ మిల్లులకు అవసరమైన నీటిని వాడుకొని, వదిలేసే సమయంలో మానవత్వం మర్చిపోతున్నారు. ఎవరి ప్రాణాలు ఏమైతే మా కేమిటి అనే ధోరణి అవలంభిస్తున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన రాంపూర్‌ లో వున్న బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యజమానులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థపు నీటిని ఏకంగా మంచి నీటి కాలువలోకి వదిలేస్తున్నారు. హన్మకొండ, వరంగల్‌ నగరాలకు మంచి నీటిని సరఫరా చేసే కాలువలలో మిల్లు కెమికల్‌ నీటి వ్యర్థాలు యదేచ్చగా వదిలేస్తున్నారు. రాంపూర్‌లో వున్న మిల్లులన్నీ ఇలాంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నాయి. మంచి నీటి కాల్వలోకి మిల్లుల కెమికల్‌ వాటర్‌ వదిలి నీటిని కాలుష్య కాసారం చేస్తున్నారు. ఇందుకు అధికారులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. మిల్లుల నిర్వాకం నిర్వకానికి సహకరిస్తూ అమ్యామ్యాలకు అలవాటు పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే సహజంగా రైస్‌ మిల్లుల నుంచి వ్యర్థాలు అంటే గాలిలో కలిసే ఊక మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ భయంకరమైన కెమికల్‌ వ్యర్థాలు ..అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట మారిపోయింది. అయినా మురుగునీటిని మంచి నీటిలో కలుపుతున్నామన్న సోయి కొంచెం కూడా లేకపోతోంది. సొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు మిల్లర్లు యదేచ్చగా సాగిస్తున్న దుర్మార్గాన్ని వెనకేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి బాయిల్డ్‌ మిల్లులో వెలువడిన మురుగునీటిని శుద్ధి చేసే యంత్రాంగం వుంటుంది. అందుకు ప్రత్యేకమైన ప్లాంటు ఏర్పాటు జరుగుతుంది. కానీ అది తూతూ మంత్రంగానే వినియోగిస్తున్నారు. ఆ నీటి శుద్ధి ప్లాంట్‌ను వినియోగించడమే కొన్ని సంవత్సరాలుగా మానేశారు. ఆ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వాటిని వినియోగించడమే మానేశారు. దాంతో మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా మంచి నీటి కాలువలు మొత్తం కలుషితమైపోతున్నాయి. మిల్లులు సాగిస్తున్న ఈ దుర్మార్గం మూలంగా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతోంది. ఆ వ్యర్థాలు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారులకు పట్టిన అవినీతి రోగం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. మిల్లుల మూలంగా ఆ నీరు కొన్ని సంవత్సరాలుగా కాలువలో చేరడం వల్ల కాలువలు కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. ఎక్కడిక్కడ కాలువలకు చెందిన రిటైనింగ్‌ వాల్స్‌ దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల పొడవునా మంచి శుద్దమైన మంచి నీరు పారాల్సిన చోట మురుగునీటి మూలంగా అడ్డంకులు ఏర్పడడంతో పాటు, కలుషితమైపోతున్నాయి. కాలుష్య కాసారంగా మారిపోతున్నాయి. మురుగునీటి నుంచి వచ్ఛే వ్యర్థాలు కాలువల మధ్యలో గుట్టలుగా చేరిపోతున్నాయి. దాంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతోంది. మొత్తంగా అక్కడ పేరుకుపోయిన కెమికల్‌ ప్రతి నీటి చుక్క కాలుష్యాన్ని మొసుకుపోతోంది. ఇక ఆ పక్కనే వున్న చెరువులోకి కూడా కొన్ని మిల్లుల నుంచి కెమికల్‌ నీరు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. ప్రభుత్వం ఏటా చెరువులో చేపలు పెంచే లక్ష్యం నిర్వీర్యమౌతోంది. ఏటా చేపల లక్ష్యం కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ కెమికల్‌ వాటర్‌ చెరువులోకి చేరడం మూలంగా చేప పిల్లలు చనిపోతున్నాయి. ఈ విషయం మత్య్స శాఖ దృష్టికి వచ్చినా ఆ అధికారులు కూడా కళ్లు మూసుకుంటున్నారు. వాటర్‌ బోర్డు అధికారులు ఆ కాలువల వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కదలకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. నేటిధాత్రి కథనంలో దానికి సంబంధించిన ఫోటోలు ప్రచురించడం జరిగింది. మిల్లుల కెమికల్‌ నీరు కాలువలో కలవడమే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాంపూర్‌ మిల్లులు వదిలిన రసాయన నీరు..మంచి నీటి కాలువలో చేరుతూ వుండడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. పాపానికి సంకేతం. పర్యావరణం మీద చిన్న పాటి నిర్లక్ష్యం కూడా వహించకూడని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారుల జాడెక్కడ? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నీ తెలిసినా అధికారులు చోద్యం చూడడం అంటే ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం తప్ప మరేం లేదు. హనుమాన్‌ ఇండస్ట్రీస్‌ ,కామదేను ట్రేడర్స్‌ ,వినాయక ఇండస్ట్రీస్‌ ,మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్‌ ,శ్రీ ధనలక్ష్మి ఇండస్ట్రీస్‌ ,శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్‌ ,శ్రీ శ్రీనివాస ఇండస్ట్రీస్‌ ,సూర్య ఇండస్ట్రీస్‌ ,సూర్య తేజ ఇండస్ట్రీస్‌లు సాగిస్తున్న అరాచకం సొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు తెలుసు. అందువల్ల పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు కళ్లు మూసుకొని మొద్దు నిద్రపోతున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ముక్కుపుటాలు అధిరేలా వాసన వస్తున్నా అధికారులు తొంగి చూడొద్దనుకుంటున్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కెమికల్‌ కలిసిన మిల్లుల క్రిటికల్‌ వాటర్‌ మంచినీటి కాలువను కలుషితం చేస్తున్నా కనిపించడం లేదా? నిలదీస్తున్నా స్పందన కరువౌతోంది. అవే నీటిని మున్సిపల్‌ వాటర్‌ బోర్డు ప్రజలకు పంపిస్తున్నారన్న సంగతి కనిపించడం లేదా?ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం అనుకునేలా మిల్లర్లకు వరంగా మారి ప్రజలకు శాపమౌతోంది. కలుషిత నీటిని తాగుతున్నారన్న సోయి కూడా అధికారులకు లేకపోవడం వారి బాధ్యతారిత్యానికి నిదర్శనమనే చెప్పాలి. వరంగల్‌ ప్రజలకు శాపంగా మారుతున్నా మిల్లులకు సహకరిస్తూ, ఉదాసీనత చూపిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, ఇరిగేషన్‌ డిపార్ట్మెంట్‌, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌. అధికారులను గత కొన్ని సంవత్సరాలుగా మామూళ్లతో మెయింటైన్‌ చేస్తున్న కిలాడి మిల్లర్‌ ఎర్రబెల్లి..

దేశంలో నమోదవుతున్న కోవిడ్‌`19 కేసులు

భయపడాల్సిన అవసరం లేదు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

చిన్నచిన్న ఉత్పరివర్తనాలు సహజం భయం వద్దు: డాక్టర్లు

దేశవాసుల్లో రోగనిరోధకశక్తి బాగా పెరిగింది: డాక్టర్లు

రాకపోకలపై ఆంక్షలు లేవు: కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి

ముంబయి ప్రశాంతం

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కోవిడ్‌ భయం లేదు

ద.కొరియా, జపాన్‌ దేశాల్లో పెరిగిన కోవిడ్‌ ఔషధ కంపెనీల షేర్ల ధరలు

సింగపూర్‌లో వేగంగా విస్తరిస్తున్నా మరణాలు లేవు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటకలతో పాటు గుజరాత్‌, ఢల్లీి, మహారాష్ట్రల్లో గత కొద్ది రోజులుగా కోవిడ్‌`19 కేసులు బయటపడుతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన అడ్వయిజరీలో, వ్యాధి తీవ్రత చాలా తక్కువగా వున్నదని, ఎటువంటి భయం అవసరంలేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం మే 19 నాటికి దేశ వ్యాప్తంగా 257 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. నమోదైన వాటిల్లో అత్యధిక కేసుల్లో తీవ్రత చాలా తక్కువగా వున్నందువల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రాలేదని పేర్కొంది. ఇంటివద్దనే వీటికి చికిత్స తీసుకుంటే సరిపోతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, ఢల్లీి, మహారాష్ట్రల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు రోజువారీ సమాచారం వెల్లడిస్తోంది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయా రాష్ట్రాలు అడ్వయిజరీలు జారీచేశాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం మే 19 నాటికి కేరళలో 95G, మహారాష్ట్ర 56G, తమిళనాడు 66G, కర్ణాటక 8G, గుజరాత్‌ 6G, ఢల్లీి 3G కోవిడ్‌ కే సులు నమోదయ్యాయి. కోవిడ్‌కు ఇప్పుడు ఇతర వైరల్‌ వ్యాధుల మాదిరిగానే చికిత్స అందించవచ్చునని భయపడాల్సిన అవసరంలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మాస్క్‌లు ధరించడం, పరిశుభ్రతను పాటించడం, పెద్ద సమూహాలకు దూరంగా వుండటం వంటి ముందు జా గ్రత్త చర్యలు పాటిస్తే, కోవిడ్‌ను నివారించవచ్చునని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీఎస్‌పీ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీ సెర్చ్‌ (ఐసీఎంఆర్‌)లు ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ా19 తీవ్రతపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కేరళలో అత్యధికంగా కోవిడ్‌ కే సులు నమోదవుతున్నాయి. ఇదిలావుండగా పుదుచ్చేరి, రాజస్థాన్‌, సిక్కిం, హర్యానా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా కోవిడ్‌ కేసులు నమోదు కావడం, దేశంలో వ్యాధి విస్తరిస్తున్న తీరును వెల్లడిస్తోంది. 

రోగుల డిశ్చార్జ్‌

మే 12 నుంచి దేశవ్యాప్తంగా 112 మంది కోవిడ్‌ సోకిన రోగులకు చికిత్స అందించి, తగ్గిన తర్వాత ఇళ్లకు పంపేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ఇదిలావుండగా మే 29న డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నేతృత్వంలో దేశంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులపై ఒక సమావేశం జరిగింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ రిలీఫ్‌ డివిజన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన నిపుణులు ఈ సమావేశంలో పాల్గన్నారు. ఇదిలావుండగా కోవిడ్‌కు సంబంధించిన లక్షణాలతో ఇద్దరు రోగులు గత జనవరిలో మృతిచెందినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే వీరిద్దరికి ఇతర మెడికల్‌ కాంప్లికేసన్స్‌ వున్నట్టుకూడా స్పష్టం చేసింది. మహారాష్ట్రలో గత జనవరి నెలలో 6,066 స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించగా వీటిల్లో 106 కోవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్టు కూడా ఆ ప్రకటన తెలిపింది. వీటిల్లో 101కేసులు ముంబ యిలో కాగా మిగిలినవి, పూణె, ఠాణె మరియు కొల్హాపూర్‌లో నమోదయ్యాయని వివరించింది.కేవలం మనదేశంలో మాత్రమే కాదు, దక్షిణకొరియా, చైనా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ దేశాల్లో కూడా కోవిడ్‌ వేగంగా విస్తరిస్తోంది. అయితే భయపడాల్సిన అవసరంలేదని, తగిన చికిత్స అందుబాటులో వున్నదని ఆయా దేశాలు హెల్త్‌ అడ్వయిజరీలు జారీచేశాయి. అంతేకాదు వ్యాక్సినేష న్‌ గురించిన తాజా సమాచారాన్ని తమకు తెలపాలని, కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చునని ఆయా దేశాలు ఆరోగ్య మంత్రిత్వశాఖలు అడ్వయిజరీలు జారీచేశా యి. 

బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు మౌనంగా వుండాలని పిలుపునిచ్చింది. ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితి అదుపుతప్పకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అత్యవసర పరస్థితి ఏర్పడితే ఎదుర్కొనేందు కు ఆసుపత్రుల్లో అవసరమైన పడకలు సిద్ధం చేశామని కూడా వివరించింది. ఇదిలావుండగా బెంగళూరులో 84ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌`19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత మరణించినట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వైట్‌ఫీల్డ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తూ ఈ వృద్ధుడు మే 17న మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికార్లు ధ్రువీకరించారు. ఆయన మే 13న ఆసుపత్రిలో చేరగా, కోవిడ్‌`19 పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన మరణించిన తర్వాత వచ్చిన రిపోర్ట్‌లో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో కర్ణాటకలో కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికార్లు అప్రమత్తమయ్యారు. వీటిల్లో 32 కేసులు కేవలం బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావు ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తమ రోజువారీ కార్యకలాపాలను నిరభ్యంతరంగా నిర్వహిస్తూనే, కొన్ని సాధారణ ముం దు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రజల రాకపోకల పై ఏవిధమైన ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మూడు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ మం త్రి సత్యకుమార్‌ యాదవ్‌ శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడిరచారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా చాలాకాలం తర్వాత రాష్ట్రం లో తొలికేసు తీరప్రాంతమైన విశాఖపట్టణంలో బయల్పడటం గమనార్హం. రోగి కుటుంబ సభ్యులు, చికిత్స చేసిన డాక్టర్‌కు ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఇదిలావుండగా తెలంగాణలో ఒక కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. ఈ వ్యాధి సోకింది ఒక వైద్యుడికి కాగా, ఆయనకు ప్రయాణ చరిత్ర వున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. అయితే ఐదు రోజులు ప్రొటకాల్‌ పాటించిన తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ కోవిడ్‌ లక్ష ణాలు లేవు. ఇదిలావుండగా కోవిడ్‌ వైరస్‌కు చిన్నచన్న ఉత్పరివర్తనాలు సహజమని, ప్రజల్లో ఇప్పటికే రోగనిరోధకశక్తి బాగా పెరిగిపోవడంతో, భయపడాల్సిన అవసరంలేదని డాక్టర్లు చెబుతున్నారు. 

రెండు మ్యుటేషన్లు కారణం

ఒమిక్రాన్‌ బిఎ.2.86కు సంబంధించిన జెఎన్‌.1 వేరియంట్‌కు చెందిన ఎల్‌.ఎఫ్‌.7, ఎన్‌.బి.1.8మ్యుటేషన్లు తాజాగా బయల్పడుతున్న కోవిడ్‌`19 కేసుల్లో కనిపిస్తున్నాయని అధికార్లు చెబుతు న్నారు. ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్‌, హాంకాంగ్‌ల్లో కోవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడిరచిన సమాచారం ప్రకా రం జె.ఎన్‌.1 వేరియంట్‌కు సంబందించి 30 మ్యుటేషన్లున్నాయి. వీటిల్లో ఎల్‌.ఎఫ్‌.7, ఎన్‌.బి.1.8 వర్షన్లు తాజా కేసుల్లో కనిపిస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఇదిలావుండగా హాంకాంగ్‌లో కోవిడ్‌ా19 పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలలకోమారు కోవిడ్‌ చురుగ్గా కనిపిస్తుండటాన్ని గుర్తించారు. దీన్నొక సైక్లిక్‌ ప్రాసెస్‌గా అక్కడి వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. కాగా దక్షిణ కొరియాలో 65 సంవత్సరాలు దాటినవారికి ఇచ్చే వ్యాక్సినేషన్‌ కాలపరిమితిని జూన్‌ నెలాఖరు వరకు పొడిగించారు. గత మూడేళ్ల కాలాన్ని నిశితంగా పరిశీలిస్తే కోవిడ్‌ ప్రధానంగా చలి, ఎండాకాలాల్లో బాగా వ్యాపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇదిలావుండగా సింగపూర్‌లో ఏప్రిల్‌ 27 నుంచి మే 3 మధ్యకాలంలో అంటే వారంరోజుల్లో 14,200 కోవిడ్‌ కేసులు నమోదయ్యా యి. అంతకు ముందువారం దేశంలో నమోదైన కోవిడ్‌ కేసుల సంఖ్య 11,100. 

పెరిగిన కోవిడ్‌ ఔషధ కంపెనీల షేర్లు

 కోవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన కోవిడ్‌ కిట్‌ తయారీ కంపెనీలు, హ్యుమాసిస్‌ కంపెనీ, ల్యాబ్‌ జీనోమిక్స్‌ కంపెనీ, సీజిన్‌ ఇన్‌కార్పొరేషన్‌, ఎస్‌.డి. బయోసెన్సార్‌ ఇన్‌కార్పొషన్‌ షేర్లు అమాంతం పెరిగిపో యాయి. ఇక ద.కొరియాకు చెందిన ఎస్‌.కె. బయోసైన్స్‌ కంపెనీ షేర్లు ఏకంగా 7.2% వృద్ధి నమోదు చేయడం గమనార్హం. ఒక కొరియాకు చెందిన డయాగ్నస్టిక్‌ కిట్‌ తయారీ సంస్థ సుజన్‌ టెక్‌ ఇన్‌కార్పొరేషన్‌ షేర్లు ఏకంగా 29% పెరిగాయి. ఇక జపాన్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ డైసీ శాంక్యో సంస్థ షేర్లు 7.4% పెరిగాయి. ఇక హాంకాంగ్‌కు చెందిన షాంఘై జున్సీ బయోసైన్సెస్‌ కంపెనీ షేర్లు కూడా వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 

గ్లోబల్‌ పాండమిక్‌ అగ్రిమెంట్‌

ఆసియా దేశాల్లో కోవిడ్‌`19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఒ) మే 19న సమావేశమైంది. ఈ సందర్భంగా కోవిడ్‌`19పై ప్రపంచ దేశాల మధ్య గ్లోబల్‌ పాండమిక్‌ అగ్రిమెంట్‌ను కోరుతూ స్లొవేకియా ప్రవేశపెట్టిన తీర్మానానికి 124 సభ్యదేశాలు అనుకూలంగా ఓటువేశాయి.

హైడ్రాపై నేటిధాత్రి అందించిన కథనం బాగుంది: హైడ్రా కమీషనర్ రంగనాధ్.

హైడ్రాపై ప్రజల్లో వస్తున్న చైతన్యంపై నేటిధాత్రి కథనానికి కమీషనర్ ప్రశంస.

ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కథనాలు ఎంతో అవసరం.

హైడ్రా వల్ల జరగనున్న మంచి పరిణామాలపై మరింత లోతైన విశ్లేషణలు అందించాలని కోరిన రంగనాధ్.

రంగనాధ్ ను కలిసిన నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం.

శివ సుబ్రహ్మణ్యంతో అనేక విషయాలు చర్చించిన రంగనాధ్.

హైడ్రాపై మీడియా పరంగా నేటిధాత్రి ఇచ్చిన సపోర్ట్‌కు అభినందనలు చెప్పిన రంగనాధ్.

హైడ్రాపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించే విధంగా నేటిధాత్రి దిన పత్రిక, నేటిధాత్రి డిజిటల్ మీడియాలో వచ్చిన కథనం చాలా బాగుందని కమీషనర్ రంగనాధ్ ప్రశంసించారు. హైడ్రా కమీషనర్ రంగనాధ్‌తో నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం శని వారం బుద్ద భవన్‌లో వున్న కార్యాలయంలో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివ సుబ్రహ్మణ్యంతో కమీషనర్ మాట్లాడుతూ ప్రజలను సామాజికంగా చైతన్యం చేయడంలో నేటిధాత్రి విశేషంగా కృషి చేస్తోందని అభినందించారు. తాను నిత్యం నేటిధాత్రి దిన పత్రిక‌ను తప్పకుండా చూస్తుంటానని చెప్పారు. హైడ్రా పని తీరు, ప్రజల నుంచి ఇటీవల వస్తున్న స్పందనలను ఎంతో విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగిందన్నారు. అంతే కాకుండా హైడ్రా వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ ఎలా వుండబోతోంది, పర్యావరణ పరిరక్షణలో హైడ్రా ఎలాంటి పాత్ర పోషించబోతోందనే విషయాలు ఎంతో స్పష్టత చెప్పారని రంగనాధ్ తెలిపారు. హైడ్రా లాంటి గొప్ప కార్యక్రమం విజయవంతం కావాలంటే నేటిధాత్రి లాంటి మీడియా సపోర్ట్ ఎంతో అవసరమని గుర్తు చేశారు. హైడ్రాపై ఇంకా చైతన్యం తీసుకొచ్చే బాధ్యతను మీడియా పరంగా నేటిధాత్రి తీసుకోవాలని రంగనాధ్ కోరారు. హైడ్రా విషయంలో ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా వుంటామన్నారు. హైడ్రా కార్యాలయం ప్రారంభమైన రోజు నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తమ, తమ కాలనీలలో దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న సమస్యలను వివరిస్తూ విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారని రంగనాధ్ తెలియజేశారు. హైడ్రాతో తాము కొన్ని దశాబ్దాలగా అనుభవిస్తున్న సమస్యలు తీరుతుండడంతో ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని రంగనాధ్ గుర్తు చేశారు. అలాంటి అంశాలతో కూడిన నేటిధాత్రి కథనం కూడా అద్భుతంగా వుందని కమీషనర్ చెప్పారు.

సింధు, సట్లెజ్‌ ప్రవాహాలను చైనా అడ్డుకుంటుందా?

గతంలో నీటిని ఆయుధంగా వాడుకున్న చరిత్ర చైనాది

నీటి వాడకంపై అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయని చైనా

నీటి వాడకంపై దానికి పూర్తిస్వేచ్ఛ

దౌత్యం తప్ప మరో పరిష్కారం లేదు

కొన్ని పరిమితుల్లో ఈ నదుల నీటిని ఆపగలదు

అయితే భౌగోళిక స్వరూపం చైనాకు పెద్దగా అనుకూలించదు

డెస్క్‌,నేటిధాత్రి: 

పహల్గామ్‌ దాడుల తర్వాత మనదేశం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడం, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేవరకు ఈ ఒప్పందంపై మాట్లాడే ప్రసక్తే లేదని భారత్‌ తెగేసి చెప్పింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్‌, సింధ్‌ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిరది. సింధ్‌లో నీటికోసం ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఏకంగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఇంటిపై దాడిచేశారు. తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసుల్ని చితకబాదారు. సింధ్‌ రాష్ట్రానికి నీరు రాకుండా, పంజాబ్‌ అడ్డుకుంటుండటం సింధ్‌ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి ప్రధాన కారణం. ఇదిలావుండగా ‘మాకు సింధూజలాలను ఆపితే భారత్‌ ప్రజల ఊపిరి ఆపేస్తామంటూ’ పాకిస్తాన్‌ సైనిక ప్రతినిధి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు వారిలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. గతంలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ కూడా సరిగ్గా ఇవే వ్యాఖ్య లు చేయడం గమనార్హం. ఇటువంటి దుస్థితికి ప్రధాన కారణం పాకిస్తాన్‌ పాలకుల వైఖరే! పహల్గామ్‌లో ఉగ్ర దాడులకు పాల్పడి వుండకపోతే ఈ దుస్థితి ఏర్పడివుండేది కాదు. పాక్‌ను శిక్షించడానికి భారత్‌సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత కూడా మనదేశాన్ని బెదిరిస్తున్నది తప్ప, ఉగ్రవాదులను శిక్షిస్తామని కాని లేదా ఉగ్రవాదం నుంచి వైదొలగుతామని గాని చెప్ప డంలేదు. ఎందుకంటే అదొక ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రం. అటువంటి ధూర్త దేశానికి ఈ శిక్ష సరైందే! ఇక మరో దౌర్భాగ్యదేశం చైనా. ఎంతసేపూ ఎప్పుడో శతాబ్దాలనాటి లెక్కలు చెబుతూ, ఇతర దేశాల భూభాగాలన్నీ తమవేనని వాదించే ఒక మూర్ఖ దేశం! నిరంతర కాలగమనంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వీటికి అనుగుణంగా మనల్ని మనం మలచుకొని జీవించడమే ఉత్తమ మార్గం! దీన్ని వదిలేసి ఇతరదేశాల భూభాగాలను తమవేనంటూ కాలగతిలో కలిసిపోయిన చరిత్రను చూపుతూ వర్తమానాన్ని అశాంతిమయం చేసుకుంటున్న దేశం ఒక్క చైనా మాత్రమే! దాని పాలకుల సిద్ధాంతాలు అటువంటివి!!

అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సింధూనది ఒప్పందాన్ని మనదేశం నిలిపేయడం వల్ల, పాకి స్తాన్‌లోకి సింధూనది దాని ఉపనదుల ప్రవాహం నిలిచిపోయింది. నిజానికి ఈ సింధూ, సట్లెజ్‌ నదుల పుట్టుక స్థానాలు చైనా ఆధీనంలోని టిబెట్‌లో వుండటంతో ఈ సమస్య ఒక సంక్లిష్ట కో ణంలోకి మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింధూనదీ జలాల ఒప్పందం ప్రకారం తూర్పున ప్రవహించే సట్లెజ్‌, బీయాస్‌, రావి నదుల నీటిని మనం వాడుకోవచ్చు. అదే పశ్చిమాన ప్రవహించే సింధూ, జీలం, చీనాబ్‌ నదుల నీటిని పాక్‌ వినియోగించుకోవాలి. పహల్గామ్‌ దాడితో ఈ ఒప్పందాన్ని మనదేశం నిలిపేసింది. ఈ చర్యవల్ల పాకిస్తాన్‌కు చుక్కనీరు పోవడంలేదు. ఇందుకు ప్రతీకారంగా టిబెట్‌లో జన్మించిన సింధూ, సట్లెజ్‌ నదీ ప్రవాహాలను మనదేశంలోకి రాకుండా చైనా అడ్డుకునే అవకాశముందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు ధూర్త దేశాల మధ్య స్నేహం ‘తేనెకంటే తియ్యనైనది’ కాబట్టి!

ఈ నదుల పుట్టుక స్థానాలు

మానససరోవరం సరస్సుకు సమీపంలోని సెంగ్‌ ఖబాబ్‌ హిమానీనదం సింధూనదికి జన్మస్థానం.ఇది కైలాస పర్వతానికి కూడా దగ్గరిగానే వుంటుంది. ఐదువేల మీటర్ల ఎత్తులో జన్మించిన ఈ నది టిబెట్‌ గుండా ప్రవహించి మనదేశంలోని లద్దాఖ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ జన్‌స్కర్‌, సయోక్‌ఉపనదులు ఇందులో కలుస్తాయి. ఆ తర్వాత మనదేశంగుండా ప్రవహించి, పాక్‌లోకి ప్రవేశి స్తుంది. ఆవిధంగా సుమారు 3180 కిలోమీటర్ల దూరం ప్రవహించిన సింధూనది చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. ప్రాచీన సింధూ నాగరికత ఈ నదీ పరీవాహక ప్రాంతంలోనే పరిఢవిల్లింది. ప్రస్తుతం ఈ నది భారత్‌, పాకిస్తాన్‌లకు జీవనాడి వంటిది. ఎన్నో జలవిద్యుత్‌ కేంద్రాలు దీనిపై నిర్మించారు. కొన్ని లక్షల ఎకరాల సాగుకు ఈ నది నీరే ఆధారం. 

ఇక సట్లెజ్‌ నది, రాక్షస్‌తాల్‌కు సమీపంలోని లంగ్‌ఛన్‌ ఖబాబ్‌ హిమానీనదంలో పుడుతుంది. 4600 నుంచి 5వేల మీటర్ల ఎత్తున వుండే ఈ గ్లేసియర్‌ నుంచి టిబెట్‌ గుండా ప్రవహిస్తుంది. భారత్‌లోని హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిప్కిలా పాస్‌ గుండా ప్రవేశించడానికి ముందు ఈ నదిలో స్పిటీ ఉపనది ఇందులో కలుస్తుంది. తర్వాత ఇది కిన్నర్‌ కైలాష్‌ ప్రాంతం గుండా ప్రవహించి పంజాబ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ రాష్ట్రంలోనే భక్రా ప్రాజెక్టును మనదేశం నిర్మించింది. ఈ ప్రాజ ెక్టుకు ప్రదాన నీటివనరు సట్లెజ్‌! చివరకు పాక్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇది సింధూనదిలో కలుస్తుంది. మొత్తం 1450 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది పంజాబ్‌కు గుండె వంటిదని చెప్పడంలో సందేహం లేదు. 

ఈ నదుల ప్రవాహాన్ని చైనా ఆపగలదా?

సాంకేతికంగా చెప్పాలంటే ఈ రెండు నదుల నీటిని చైనా ఆపగలదు. సెంగే త్సాంగ్‌పో, నగరి షికాన్వే జలవిద్యుత్‌ కేంద్రాలను, సింధూనది జన్మస్థానం వద్ద నిర్మించింది. ఇక సట్లెజ్‌ నదిపై జడా గోర్జ్‌ బ్యారేజ్‌ను కూడా నిర్మించింది. ఈ నిర్మాణాల ద్వారా చైనా మనదేశంలోకి ఈ రెండు నదుల నీటి ప్రవాహాన్ని నియంత్రించగలదు. ఇప్పటికే చైనా తమదేశంలోని నదులపై ఎన్నో ప్రాజెక్టులు నిర్మించింది. ముఖ్యంగా ‘సౌత్‌`నార్త్‌ వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టు’ ద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది, ఇంకా చేపడుతోంది. ఈ ప్రాజెక్టుకింద నదీ జాలాలను తమదేశంలోని నీటి ఎద్దడి ప్రాంతాలకు తరలిస్తోంది. అయితే ఇప్పటివరకు సింధు, సట్లెజ్‌ నదులపై ఇటువంటి నీటి తరలింపు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదు. 2017లో బ్రహ్మపుత్రానదికి సంబంధించిన వరద సమాచారాన్ని భారత్‌ అందించని రీతిలో, ఈ నదుల ప్రవాహ సమాచారాన్ని మనదేశంతో పం చుకోకపోవచ్చు. ఈ రెండు నదుల విషయంలో ఇప్పటివరకు ఆటువంటి చర్యకు పూను కోలేదు. నీటిని భౌగోళిక రాజకీయ ఉపకరణంగా గతంలో చైనా కొన్నిసార్లు మనదేశంపై ప్రయోగించింది. 2016లో బ్రహ్మపుత్ర ఉపనది షియాకు ప్రవాహాన్ని నిలిపేసి, మనదేశానికి ఒక హెచ్చరికను పంపింది. 2020లో గల్వాన్‌ సంఘటన తర్వాత ఈ నదినీటి ప్రవాహాన్ని నిలిపేసింది. పలితంగా ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడిరది. గల్వాన్‌ నది సింధూనదికి ఉపనది. 2004లో పరెచునదిపై ఒక కృత్రిమ సరస్సును సృష్టించింది. పరెచు నది సట్లెజ్‌కు ఉపనది. ఈ కృత్రిమసరస్సు ను ‘నీటిబాంబు’గా చైనా ఉపయోగించవచ్చునని భయాందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. అ యితే ఇక్కడి నీటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత్‌కు అందిస్తూ పరిస్థితి చేజారిపోకుండా చైనా జాగ్రత్తపడటం విశేషం!

ప్రస్తుతం భారత్‌ సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసిన నేపథ్యంలో, ఇందుకు ప్రతీకారంగా టిబెట్‌లోని సింధు, సట్లెజ్‌ ప్రవాహాలను చైనా నియంత్రించే అవకాశముందని కొందరు నిపుణుల అభిప్రాయం. ఇదే సమయంలో తమదేశంలో పెరుగుతున్న నీరు, విద్యుత్‌ డిమాండ్‌ నేపథ్యంలో ఈ నదీ జలాలను ఆయా ప్రాంతాలకు తరలించకూడదనేంలేదని కూడా ఈ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కొన్ని పరిమితుల్లో మాత్రమే చేయగలదు

ఈ నదుల నీటిని భౌగోళిక రాజకీయ ఆయుధంగా ఉపయోగించాలంటే చైనాకు కొన్ని పరిమితులున్నాయి. సింధు, సట్లెజ్‌ నదుల నీటిలో వరుసగా 10%`15% మరియు 20% మాత్రమే టిబెట్‌లో ప్రవహిస్తాయి. ఈ ప్రాంతం భూకంపాలకు ఆలవాలం కనుక, పెద్దఎత్తున డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం, పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుంది. అంతేకాకుండా నీటిని ఆవిధంగా నిలిపేయడం ‘హిల్సింకి’ వంటి అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం. చైనా తీవ్ర విమర్శలకు గురికాకతప్పదు. అయితే యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌కోర్సెస్‌ కన్వెన్షన్‌ను ఇప్పటివరకు చైనా అంగీక రించలేదు. చైనా తన నీటివనరులపై సార్వభౌమాధికారం విషయంలో ఎంతమాత్రం పట్టు సడ లించడంలేదు. దీన్ని ఆమోదించనంతవరకు నీటి ప్రవాహానికి దిగువన ఉండే దేశాలకు చట్టబ ద్ధంగా అడిగే హక్కు వుండదు. అప్పుడు దౌత్యం, ప్రపంచదేశాలు కలుగజేసుకోవడం వంటి ప్రక్రియల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతానికి భారత్‌ చైనాల మధ్య 2002 మరియు 2018 సంవత్సరాల్లో బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదీ ప్రవాహాలకు సంబంధించిన స మాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై ఒప్పందాలు కుదిరాయి. అయితే ఈ ఒప్పందాల కాలపరిమితి 2023తో ముగిసినా, చైనా సమాచారాన్ని పంచుకోవడాన్ని మాత్రం ఇప్పటివరకు ఆపలేదు. అదీకాకుండా రెండు దేశాల మధ్య ప్రత్యేకించి నదీజలాల ఒప్పందాలేవీ లేనందువల్ల, తమదేశంలో ప్రవహించే నదుల విషయంలో చైనా తనకు అనుకూలంగా పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించే అవ కాశాలే నూటికి నూరుశాతం వున్నాయి.

కాల్పుల హోరు నుంచి ప్రగతి కాంతులవైపు

అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఛత్తీస్‌గఢ్‌
హైదరాబాద్‌,నేటిధాత్రి:
వామపక్ష తీవ్రవాద పీడిత రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ కూడా ఒకటి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పుల సంఘటనలతో ఎప్పటికప్పుడు పతాకశీర్షికల్లో నిలిచే రాష్ట్రంగా పేరుపడిరది. అందువల్ల చత్తీస్‌గఢ్‌ అంటేనే నక్సల్స్‌ మరియు ఎన్‌కౌంటర్‌ వార్తలు తప్ప మరే యితర సమాచారం మనలకు పెద్దగా లభ్యమయ్యేది కాదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదనేది కాదు ప్రశ్న, అభివృద్ధి పథంలో ఏవిధంగా ముందుకెళుతున్నదనేది ప్రధానం! వామపక్ష తీవ్ర వాదం వల్ల చోటుచేసుకున్న హింసాకాండ నేపథ్యంలో అభివృద్ధి మసకబారినట్టు కనిపించిన నేపథ్యంలో ఇక్కడి ప్రగతి ఉషోదయ కాంతులు, ఇతర రాష్ట్రాలకు తెలియకపోవడం సహజమే. ఈ నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌ అభివృద్ధి కోణాన్ని స్పృజిస్తే మనకు తెలియని ఎన్నో విషయాలు అవగాహనకు వస్తాయనేది మాత్రం సుస్పష్టం. ఒక్కసారి ఈ కోణంలో చత్తీస్‌గఢ్‌ను పరిశీలిద్దాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల నేపథ్యంలో క్రమంగా మావోయిస్టుల ప్రభావం తగ్గుతున్న క్రమంలో, మరోవైపు రాష్ట్రంలో తయారీ, సేవా రంగాలు క్రమంగా ఊపందుకోవడం వర్తమాన పరిణామం. రాష్ట్రంలో రూ.4.5లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు రంగం సిద్ధమైంది. మేనెల మొదట్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డే టా పార్క్‌కు శంకుస్థాపన చేయడంతో, దేశంలోనే మొట్టమొదటి ఏఐ సెంట్రల్‌ పార్క్‌ ఏర్పాటు చేసిన రాష్ట్రంగా నిలిచింది. అంతకు ముందు అంటే గత ఏప్రిల్‌ నెలలో సెమికండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గాలియం నైట్రైడ్‌ ఆధారిత చిప్‌ల తయారీకేంద్రం. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించి ఆ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ముమ్మరమైంది. కేంద్రం ఒకపక్క రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చర్యలు చేపడుతుండటం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం 2024 నవంబర్‌ 1నుంచి అమల్లో వుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన కేవలం ఆర్నెల్ల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.4.5లక్షల కోట్ల వి లువైన పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5.09లక్షల కోట్లుగా నమోదైంది. ఈ అవగాహనా ఒప్పందాల మొత్తం జీఎస్‌డీపీలో సింహభాగమనదగ్గ స్థాయిలో వుండటం విశేషం. నిజానికి ఈ అవగాహనా ఒప్పందాలన్నీ వాస్తవరూపం దాలిస్తే రాష్ట్ర జీఎస్‌డీపీ దాదాపు రెట్టింపు అవుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. కానీ అవగాహనా ఒప్పందాలు కుదరడం మొదటిదశ అయితే, వీటి అమలు రెండోదశగా భావించాల్సి వుంటుంది.
గత ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడంపై దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం అప్పటివరకు అమల్లో వున్న పారిశ్రామిక విధానంలో ఏఏ మార్పులు తీసుకురావాలో నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏ ర్పాటు చేసి మేధోమధనం జరిపారు. అంతేకాదు నూతన పారిశ్రామిక విధానానికి తుదిరూపం ఇవ్వడానికి ముందు, దీనికి సంబంధించిన భాగస్వాములు, పారిశ్రామికవేత్తల సలహాలను, సూ చనలను పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ముసాయిదాను రూపొందించే స మయంలో రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక మరియు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. రాష్ట్రం లో బాక్సైట్‌, బగ్గు నిక్షేపాలు అపరిమితంగా వున్న నేపథ్యంలో, ఈ రెండిరటిని కీలక పరిశ్రమ లుగా అభివృద్ధి చేయాలన్న దృష్టితో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. ఇదే సమయంలో కేవలం బాక్సైట్‌, బగ్గు నిక్షేపాలే రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌గా స్థిరపడకుండా, ఇతర రంగాలు ముఖ్యంగా సేవారంగానికి ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాదు ఔషధాలు, వస్త్రపరిశ్రమ, వ్యవసాయ ఆధారిత ఆహార పరిశ్రమలు, విద్యుత్‌ మరియు ఎలక్ట్రానిక్‌ రంగాలపై కూడా ఈ విధాన రూపకల్పనలో దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం నవ రాయ్‌పూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా రూపొందిన నేపథ్యంలో దీన్ని ఐ.టి. హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని బస్తర్‌, సర్గూజా జిల్లాల్లో ఒక్క పరిశ్రమ స్థాపన ఇప్పటివరకు జరగలేదు. ఈ ప్రాంతా ల్లో కూడా పారిశ్రామికాభివృద్ధికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకపోవడానికి ప్రధాన కారణం రెడ్‌టేపిజం. అనుమతులు రావాలంటే ఒక ప్రభుత్వ శాఖనుంచి మరో శాఖకు తిరగడం తప్ప ఫలితం వుండని పరిస్థితి నెలకొంది. అంతేకాదు అనేక శాఖల అనుమతులు తీసుకోవాల్సి రావడం ప్రధాన అడ్డంకిగా మారింది. రాష్ట్రం లో భూమి కొనుగోలు చేయాలన్నా, లీజుకు తీసుకోవాలన్నా కఠిన నిబంధనలు అమల్లో వున్నా యి. పరిశ్రమలు రాకపోవడానికి ఇదికూడా ఒక కారణం. ఇదేసమయంలో ఎవరైనా పరిశ్రమ లు పెట్టాలనుకున్నా, ప్రభుత్వం తరపున ఎటువంటి ప్రోత్సాహకాలు అందవు! రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇండస్ట్రియల్‌ పార్క్‌లు లేవు. అసలు కొత్త తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు అనుగుణమైన నిబంధనలే లేవు. ఈ ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి 2024, అక్టోబర్‌ నెలలో మంత్రివర్గ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్ల కాలానికి అనుగుణంగా ఈ ముసాయిదా రూపకల్పన చేసింది. అంటే 2030 మార్చి 31 వరకు ఈ విధానం అమల్లో వుంటుంది.
ఈ నూతన పారిశ్రామిక విధానం అమలుకోసం ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపును అనేకరెట్టు పెంచింది. పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు కేటాయింపులను మూడురెట్లు పెంచింది. ఈ నేపథ్యంలోనే 2025`26 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక`వాణిజ్య శాఖకు ఏకంగా రూ.709.87 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 34 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసివున్నందున, వీటిల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన మద్దతు ఇవ్వనుంది. అనుమతుల సమస్యను అధిగమించేందుకు ‘సింగిల్‌ విండో’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ఇ ప్పుటికు అమల్లో వున్న నిబంధనల్లో 350 మార్పులు చేశారు. కొత్తతరం పరిశ్రమలకు అనుకూ లంగా కొత్త నిబంధనలను చేర్చారు.
ఈ నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామిక రంగాన్ని రెండు కీలక సెక్టార్లుగా విభజించింది. మొదటిది ‘చోదక రంగం’ కాగా రెండవది ‘ముఖ్యమైనవి లేదా కీలకమైనవి’. ఔషధాలు, వస్త్రపరి శ్రమ, వ్యవసాయం మరియు ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌, ఏఐ, రోబోటిక్స్‌, కంప్యూటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డేటా సెంటర్లను ‘చోదక’ విభాగంలో చేర్చారు. ఈ విభాగం కింద పెట్టు బడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి పెద్దమొత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తారు. అంతేకాదు ఈ విభాగంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే మొదటి ఐదు పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సా హకాలు అందిస్తారు. ఇక సంప్రదాయిక పరిశ్రమలైన స్టీల్‌, సిమెంట్‌, అల్యూమినియం, థర్మల్‌, సోలార్‌ ప్లాంట్లను ప్రభుత్వం విస్మరించలేదు. ఈరంగంలో ఫిక్స్‌డ్‌ కేపిట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో నూటికి నూరుశాతం జీఎస్టీ ని మినహాయించారు. దీంతో పాటు ఇతర మినహాయింపులు కూడా ప్ర భుత్వం కల్పిస్తుంది.
రాష్ట్రంలో సమానంగా పారిశ్రామికాభివృద్ధి సాధనకు, జిల్లాలను మూడు గ్రూపులుగా ప్రభుత్వం విడగొట్టింది. వెనుకబడిన జిల్లాల్లో నెలకొల్పే పరిశ్రమలకు మరింత ఎక్కువ రాయితీలు మరియు ప్రోత్సాహకాలు లభిసాయి. ఇందుకోసం 2006లో కేంద్రం తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ చట్టం లో కేంద్రం 2020లో తీసుకొచ్చిన సవరణలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ముఖ్యంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు ఇచ్చిన నిర్వచనాల్లో కేంద్రం తీసుకొన్ని సవరణలనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ప్రమాణంగా తీసుకోవడం గమనార్హం. ఇందులో భాగంగా రూ.వెయ్యికోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా వెయ్యిమంది స్థానికులు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఆకర్షణీయ ప్రోత్సాహాకాలను ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో రూ.1లక్ష కోట్లు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపనకు సంబంధించినవి. ఇందులో రూ.40వేల కోట్లు ప్రభుత్వ రంగ పరిశ్రమలుకాగా, ఆదానీ వంటి ప్రైవేటు రంగ పరిశ్రమలు రూ.48వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఇక జిందాల్‌ పవర్‌ రాష్ట్రంలో థర్మల్‌, సౌర విద్యుత్‌ పరిశ్రమలను స్థాపించడానికి ముందుకొచ్చింది. వీటిల్లో రాయగఢ్‌లో 1600 మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్‌ ప్లాంట్‌కు రూ.12,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. అదేవిధంగా ఎన్టీపీసీ భాగస్వామ్యంతో 2500 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్‌ ప్లాంట్‌పై రూ.10వేలు పెట్టుబడి పెట్టనుంది. గత మార్చిలో రాయపూర్‌లో జరిగిన ‘చత్తీస్‌గడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌`2025’లో ఈ పెట్టుబడులకు హామీ లభించింది. గత ఏడాది డి సెంబర్‌ నెలలో రెన్యూ పవర్‌ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు కింద రూ.11500 కోట్లు పె ట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇక ఉక్కుపరిశ్రమ విషయానికి వస్తే నవీన్‌ జిందాల్‌ నేతృత్వంలోని ‘జిందాల్‌ స్టీల్‌’ రాయ్‌పూర్‌ బ్రాంచ్‌లో ఏటా 3.6మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నది. ఈ సంస్థ విస్తరణ కార్యక్రమం 2027 నాటికి పూర్తికాగలదు. ఇదే ఉక్కురం గంలో చిన్నతరహా పరిశ్రమల విషయానికి వస్తే గ్రీన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.1245 కోట్లమేర పెట్టుబడులు పెట్టనుండగా, 500 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 46వేల మిలియన్‌ టన్నుల ఉక్కుఉత్పత్తి అవుతుండగా 2030 నాటికి దీన్ని 65వేల మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఢల్లీి, ముంబయి, బెంగళూరుల్లో ఎనర్జీ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లు నిర్వహించింది. వీటిల్లో ఢల్లీి సదస్సులో రూ.15వేలకోట్లు, ముంబయి సదస్సులో రూ.6వేల కోట్లు, బెంగళూరు సదస్సులో రూ.3700 కోట్ల మేర పెట్టుబడులకు హామీలు లభించాయి.
వచ్చిన పెట్టుబడుల హామీలు ఇప్పుడిప్పుడే వాస్తవరూపం దాలుస్తున్నాయి. నవ రాయ్‌పూర్‌లో సెమికండక్టర్‌ ప్యాబ్రికేషన్‌ యూనిట్‌కు శంకుస్థాపన జరగడం ఇందుకు ఉదాహరణ. చెన్నైకు చెందిన ఒక కంపెనీ చిప్‌ తయారీకి సంబంధించి రూ.1143 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 5జి, 6జి టెలికమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాలకు అవసరమైన హై ఫ్రీక్వెన్సీ చిప్‌లను ఈ కంపెనీ తయారుచేయనుంది. ఇందుకోసం ఈ కంపెనీ అదనంగా రూ.10వేల కోట్లు పెట్టుబడి పెట్టను న్నట్టు ప్రకటించింది. సెమికండక్టర్‌ ప్యాబ్రికేషన్‌ యూనిట్‌తో పాటు రానున్న నెలల్లో కృత్రిమ మేధ ఆదారిత డేటా పార్క్‌కు వచ్చే నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్ట్‌ మొత్తం 5.5 హెక్టార్ల విస్తీర్ణంలో వుండగా, 500 ప్రత్యక్ష, 1500 పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. తొలిదశలో ఈ యూనిట్‌ను రాక్‌ బ్యాంక్‌ డేటా సెంటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 5మెగావాట్ల సామర్థ్యంతో ని ర్వహించనుంది. దీన్ని మరో రూ.2వేల కోట్ల పెట్టుబడితో 150 మెగావాట్ల సామర్థ్యానికి పెంచ నుంది.
ఇక రక్షణరంగానికి సంబందించిన భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌) జాంజ్‌గిర్‌` చంపా జిల్లాలో తయారీ యూనిట్‌కోసం వంద ఎకరాల భూమిని సేకరించింది. ఇదిలావుండగా నవ రాయ్‌పూర్‌లో ప్లాంట్‌ నెలకొల్పేందుకు యాష్‌ ఫాన్‌ అప్లయెన్సెస్‌కు, ముంగెలీలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఆదిత్య బిర్లా రినీవబుల్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీకి సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు కు ప్రభుత్వం భూమిని కేటాయించింది. నవ రాయ్‌పూర్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ ఏర్పాటుకు మంత్రి మండలి గత నెలలో ఆమోదం తెలిపింది. పరిశీలిస్తే 2000 సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఇంత ధైర్యంగా ముందుకు వెళుతుండటం ఇదే మొదటిసారని చెప్పక తప్పదు.

వరణుడి సంకేతం..రాబోయే కాలం సుభిక్షం!

-రేవంత్‌ పాలనకు మేఘ సందేశం!

-కాంగ్రెస్‌ పాలన అంటేనే వానా కాలం కలిసి రావడం.

-ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం వున్నంత కాలం కరువే.

-తర్వాత పదేళ్లు కాంగ్రెస్‌ పాలనంతా జలమే జలం.

-తెలంగాణ వచ్చిన తర్వాత జూన్‌ లో విస్తారమైన వానలెప్పుడూ లేవు.

-అవసరానికి రాని వానలు తిరోగమన రుతుపవనాలు కురిసేవి.

-నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసేవి.

-మళ్ళీ కాంగ్రెస్‌ వచ్చింది కరువు తెలంగాణలో మాయమైంది.

-గతంలో ఎప్పుడూ లేని విధంగా మేలోనే వాన పలకరింపు.

-తొలకరి సమయానికి పూర్తి వానలు.

-ఖరీఫ్‌ సాగుబాటుకు ముందే వాన ముహూర్తం.

-వాన కోసం ఎదురుచూడకుండానే వరణుడి కనికరం.

-గత యాభై ఏళ్లలో ఇలాంటి పరిస్థితి కనబడలేదు.

-ఈసారి పెద్దగా చెడగొట్టు వానలు లేవు.

-పంటలు చేతికొచ్చే సమయంలో రైతులు ఇబ్బందులు పడలేదు.

-ఈసారి రైతుకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.

-కాంగ్రెస్‌ అంటేనే రైతుకు కలిసొచ్చేకాలం.

                                    హైదరాబాద్‌,నేటిధాత్రి:  

 రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవడం అనేది పాలకుడి జాతకం మీద ఆదారపడి వుంటుందని లెక్కలేయడం పరిపాటి. అందుకు ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో కూడా ఈ విషయాలు వెల్లడిస్తుంటారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సమృద్దికరమైన వర్షాలు పడుతున్నాయి. గత ఏడాది మెండైన వానలే కురిశాయి. అందుకే గత పదేళ్ల కన్నా ఎక్కువగా రాష్ట్రంలో పంటలు పండినట్లు కూడా లెక్కలున్నాయి. పాలకుడి జాతకాలు కూడా వాతావరణ పరిస్దితుల మీద ప్రభావం చూపుతాయని అనేక సందర్భాలు కూడా రుజువు చేశాయి. గత యాభై ఏళ్ల కాలంలో మే నెల నుంచే వానలు కురవడం అన్నది ఎప్పుడూ లేదు. సహజంగా జూన్‌ మొదటి , రెండవ వారంలో మాత్రమే తొలకరి పలరింపులు జరుగుతుంటాయి. పైగా నైరుతి రుతుపవణాలు బలంగా వుంటే తప్ప ఆ తొలకరి కూడా పలకరించే అవకాశం వుండేది కాదు. కాని ఇంకా రుతుపవణాలు అండమాన్‌ నికోబార్‌ల్‌లను తాకమందు నుంచే వానలు కువడం అనేది చాలా అరుదు. మండు వేసవిలో ఇలా చల్లటి వాతావరణం కూడా చాలా అరుదు. సహజంగా మార్చి, ఎప్రిల్‌ నెలల్లో వడగండ్ల వానలు కురుస్తుంటాయి. ఇప్పుడు కొంత తక్కువైనా, గత ముప్పై, నలభైఏళ్ల కాలంలో ఎప్రిల్‌ నెలల్లో వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయిన సందార్భలు అనేకం వున్నాయి. వరి పంట పొట్టకొచ్చే సమయంలోనో, లేక పంట కోతల ముందో విపరీతమైన రాళ్ల వానలు పడుతుండేవి. దాంతో వరి కంకులు రాలిపోయేవి. పొలమంతా నీళ్లలో నానిపోయేది. రాళ్ల వానకు మొత్తం వరిగింజలన్నీ రాలిపోయేవి. ఇక ఇతర పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతూ వుండేవి. మామిడి వంటి తోటలకు తీవ్రమైన నష్టం జరుగుతుండేది. మార్చి, ఎప్రిల్‌ నెలల్లో పిందె దశలో వుండే మామిడికాయలు రాలిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోతుండేవారు. ఒక వేళ మామిడి చేతికొచ్చే దశలోనైనా కూడా ఖచ్చితంగా చెడగొట్టు వానలైన వడగండ్లు కురుస్తూ వుండేది. గాలి దుమారం పెద్దఎత్తున మామిడి తోటను నష్టపరుస్తూ వుండేది. అప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయి, ఏడాదికొక పంట చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలు రైతును కోలుకోకుండా చేసేవి. అదేంటో గాని ఈ నలభై సంవత్సరాల కాలంలో మొదటి సారిగా గత ఏడాది కూడా పెద్దగా చెడగొట్టు వానలు లేవు. అక్కడక్కడ తప్ప, పెద్దగా వడగండ్ల వానలు కురిసింది లేదు. రైతులు నష్టపోయింది లేదు. మామిడి రైతులు ఇబ్బందులు పడిన సందర్భం లేదు. ఈ ఏడాది కూడ అలాంటి వడగండ్ల వానలు పెద్దగా లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఒకటి రెండు చోట్ల చిన్నగా కురిశాయే గాని, రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు. సరిగ్గా ఈ ఏడాది ఉగాదికి ఒక రోజు ముందు గాలి దుమారం పెట్టింది. ఆ రాలిన కాయలు పండుగకు రైతులు తెచ్చి అమ్ముకున్నారు. లాభం పొందారు. ఇది అతిశయోక్తి కాదు. నూరు పైసల నిజం. ఉగాదికి ముందు రోజు గాలి దుమారం వల్ల రాలిపోయిన పండ్లుకూడా రైతులు అమ్ముకునే పరిస్థితి కూడా కలిసి రావడం అన్నది కూడా వింతైన అనుభవమనే చెప్పాలి. ఇక అప్పటినుంచి పెద్దగా చెడగొట్టు వానలులేవు. వడగండ్ల వానలు అసలే లేవు. గాలి దుమారం పెట్టినట్లు వార్తలు లేవు. రైతులు ఇబ్బందిపడే పరస్ధితి ఎదరుకాలేదు. కాకపోతే పంట చేతికొచ్చిన గత పదిహేను రోజుల మందు ఒకటి రెండు చెడగొట్టు వానలు కురిశాయి. కాని అవి తెలంగాణ అంతటా కురవలేదు. కొన్ని జిల్లాలకే పరిమితం కావడం వల్ల మిగతా ప్రాంతాల రైతులు ఎంతో సాఫీగా వరి కోతలు పూర్తి చేసుకున్నారు. వడ్లను ఐకేపి సెంటర్లకు తరలించుకున్నారు. అమ్ముకున్నారు. అయితే పంట ఒక నెల లేటుగా వేసుకున్న రైతులకు పంట చేతికి రావడానికి కొంత ఆలస్యమైంది. అలాంటి రైతుల వడ్లు ఇప్పుడు కళ్లాలలోనే వున్నాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వెంట వెంటనే కొనుగోలు చేస్తూనే వుంది. సహజంగా కొన్ని సందర్బాలలో రైతులు ఇబ్బందులు పడడం అన్నది సర్వ సాదారణం. అంటే తెలంగాణ సిఎం.రేవంత్‌రెడ్డి జాతకం కూడా ప్రజలకు ఎంతో కలిసి వస్తుంది. మేలు చేస్తుందని పండితులు కూడా అంటున్నారు. గత ఏడాది బిఆర్‌ఎస్‌ నాయకులు పంటలు ఎండిపోతున్నట్లు కొంత హడావుడిచేసే ప్రయత్నం చేశారు. ఏకంగా కేసిఆరే రైతుల వద్దకు వెళ్లి ఓదార్చే ప్రయత్నాలు చేశారు. కాని రైతులు నమ్మలేదు. ప్రజలు కూడా నమ్మలేదు. అదంతా బిఆర్‌ఎస్‌ ఆడుతున్న డ్రామా అని అందరూ తేల్చి చెప్పేశారు. కొంత మంది రైతులు అక్కడక్కడా నీటి సౌలత్‌కు మించి, వరి సాగు చేసుకున్నారు. వారికి వున్న వున్న బోర్ల మూలంగా నీరు సమృద్దిగా అందలేదు. అలాంటి కొంత మంది రైతుల వరి కొద్ది దశలో ఎండిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే అది రైతు తప్పు. వరి పంట పొట్టకొచ్చిన సమయంలోనో, గింజ వేవే సమయంలోనో, గింజ మరో పది రోజులైతే గట్టిపడుతుందనే సమయంలోనో నీళ్లు అందకపోతే అది నష్టంగా భావించొచ్చు. కాని అసలు వరి ఎదగకుండా ఎండిపోయే పరిస్దితి వచ్చిందంటే అది రైతు పొరపాటుగానే పరిగణించాల్సి వస్తుంది. అలాంటి ఒకరిద్దరు రైతులను గుర్తించి బిఆర్‌ఎస్‌ రాజకీయం చేయాలనుకున్నది. కాని కుదరలేదు. సరిగ్గా ఎన్నికల ముందు కేసిఆర్‌ నల్లగొండ సభతో ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నిందిదాద్దమనుకున్నాడు. బిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా చెబుతున్నదే నిజమని జనంలోకి వచ్చారు. ఒకరిద్దరు రైతుల పొలాలు సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. అక్కడే కేసిఆర్‌ మోసపోయాడు. లేని పరిస్దితులను సృష్టించి రాజకీయం చేయాలనుకొని కేసిఆర్‌ మొదటిసారి మోసపోయాడని కూడా చెప్పొచ్చు. సరిగ్గా అదే సమయంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ప్రజలు కనీసం ఆదరించలేదు. ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కనీసం కేసిఆర్‌ వెళ్లిన నియోజకవర్గంలో కూడా బిఆర్‌ఎస్‌ ప్రభావం చూపలేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొదటిసారి తెలంగాణలో అన్ని నియోజక వర్గాలలో మూడో స్దానానికి పడిపోయింది. పంటలు ఎండిపోయానని గగ్గోలు పెట్టిన సమయంలోనే రికార్డు స్దాయిలో తెలంగాణలో వరి పంట పండిరది. అంటే బిఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం ఒట్టిదే అని తేలిపోయింది. ఓ పక్క చెరువులు నింపామని, మరో పక్క కాళేశ్వరం నీళ్లు నిరంతరం ఇచ్చామని చెప్పుకున్న బిఆర్‌ఎస్‌ హాయం కన్నా, ఎక్కువగా వరి సాగైంది. అంతకు మించి నలభై శాతం అధికంగా పంటలు పండాయి. కాంగ్రెస్‌ వస్తే కరువని,కరంటు వుండదని బిఆర్‌ఎస్‌ ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదు. అంతెందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇంత వరకు రోడ్డెక్కిన సందర్భం లేదు. బిఆర్‌ఎస్‌ నాయకులు చేసే హడావుడి తప్ప ఎక్కడా రైతులు ఆందోళన చేసింది లేదు. ప్రజలు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు రాజ్యం తెచ్చిందని అని కూడా అనుకుంటున్నారు. అందుకే రికార్డు స్దాయిలో పంటలు పండిస్తున్నారు. అంతే కాదు తెలంగాణలో 92 శాతం మంది రైతులు సన్నాలు పండిస్తున్నారు. నిజానికి సన్నాలకు నీరు కూడా ఎక్కువ కావాలి. ఎరువులు,పురుగుల మందుల ఖర్చు కూడా ఎక్కువౌతుంది. అయినా రైతులు సన్న వరి పండిస్తున్నారంటే పంట చేతికి వస్తుందని, లాభం వస్తున్న నమ్మకంతోనే వేస్తున్నారు. పండిస్తున్నారు. కాళేశ్వరం నిర్మాణం చేశాం…ఇక భవిష్యత్తులో మూడు సంవత్సరాల పాటు కరువు వచ్చినా సరే, పంటలకు ఢోకా వుండదని, నీటి కొరత అసలే రాదని కేసిఆర్‌ పదే పదే చెప్పేవారు. ఇది కాళేశ్వరం పూర్తికాముందు అనేక సార్లు కేసిఆర్‌ చెప్పిన మాట. కాళేశ్వం పూర్తి చేసి, ప్రారంభించిన మరుసటి సంవత్సరమే వరి వేస్తే ఉరే అన్నారు. రైతులు వరి వేయొద్దని ప్రకటించారు. అసలు తెలంగాణలో కరువు అంటూ కనించదని చెప్పిన కేసిఆర్‌ నీళ్లు సరిపోవని వరి వేయొద్దని రైతులను హెచ్చరించాడు. పైగా రైతులు సన్నాలు పండిరచాలని ఓ ప్రయోగం చేశాడు. తర్వాత పంటకే సన్నాలు వద్దని వారించాడు. ఇలా రైతులను పదే పదే మోసం చేసిన సందర్భం వుంది. కాని రేవంత్‌ సర్కారు సూచనతో తెలంగాణ వ్యాప్తంగా రైతులను సన్నాలు పండిరచేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ పంటతో వచ్చిన బియ్యాన్ని దేశంలోనే తొలిసారిగా రేషన్‌ దుకాణాల ద్వారా పేద ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అంటే వాన దేవుని కరుణ రేవంత్‌ రెడ్డి మీద ఎంత వుందో చెప్పడానికి ఈ ఒక్క ముక్క చాలు.

దేశంలో సంపూర్ణ అక్షర్యాత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరం!

`అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు

`మితిమీరిన ప్రైవేటీకరణతో విద్యావ్యస్థకు పెనుముప్పు

`ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కరువు

`జవాబుదారీతనం కరువు కావడమే కారణం

`డ్రాపౌట్ల భయంతో డిటైనింగ్‌ను తొలగించడతో పడిపోతున్న ప్రమాణాలు

`ర్యాంకులకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి

`వైఫల్యాలనుంచి ఎవరికివారు తప్పించుకునే మార్గాల అన్వేషణ

డెస్క్‌ ,నేటిధాత్రి: 

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మొత్తం అక్షరాస్యతా శాతం కేవలం 14% మాత్రమే. తర్వాతి సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన వివిధ ప్రభుత్వాలు సంపూర్ణ అక్షరాస్యతా సాధనకో సం చేపట్టిన వివిధ కార్యక్రమాల కారణగా దేశంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. ఆవి ధంగా 2022 నాటికి మనదేశంలో అక్షరాస్యత 76.32శాతానికి పెరిగింది. అయితే అన్ని రాష్ట్రాలు అక్షరాస్యతలో సాధించిన ప్రగతి ఒకే మాదిరిగా లేదు. రాష్ట్రాల మధ్య తేడాలుండటంతో అందుతున్న సమాచారం ఇప్పటికీ సమగ్రంగా లేదనే చెప్పాలి. ఇదిలావుండగా మే 21న మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక ప్రకటన చేశారు. రాష్ట్రం పూర్తిస్థాయి అక్షరాస్యత సాధించిందన్నది ఈ ప్రకటన సారాంశం. అయితే విద్యామంత్రిత్వశాఖ నిర్దేశించిన 95% అక్షరాస్యత లక్ష్యాన్ని అధిగమించి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరం నిలవడం విశేషం. 2011 జనగణనలో మిజోరం అక్షరాస్యత లో దేశంలో మూడోస్థానంలో వుంది. నాటి అక్షరాస్యత 91.33%. ప్రస్తుతం 98.2% అక్షరాస్యతతో దేశంలోనే అత్యధిక అక్షరాస్యులు కలిగిన రాష్ట్రంగా గుర్తింపు సంపాదించుకుంది. ఇందుకుపూర్తి విరుద్ధంగా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లు 72.6%, 74.3%తో దేశం లోనే అట్టడుగున ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు 2023ా24 సంవత్సరం నాటికి ఏడేళ్ల వయసు పైబడిన స్త్రీ,పురుషుల్లో అక్షరాస్యత 80.9%. నిజంచెప్పాలంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధికి అక్షరాస్యతనే కొలమానంగా తీసుకుంటారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం ఏడేళ్ల వయసు పైబడినవారు ఏదైనా ఒక భాషను రాయడం, చదవడం, మాట్లాడటం చేయగలిగితే అటువంటివారిని అక్షరా స్యులుగా పరిగణిస్తారు. 2024 నాటికి మనదేశంలో అక్షరాస్యత విషయంలో తొలి పది స్థానాలుసాధించిన రాష్ట్రాలు వరుసగా మిజోరం(98.2%), లక్షద్వీప్‌ (97.3%), నాగాలాండ్‌ (95.7%), కేరళ (95.3%), మేఘాలయ (94.2%), త్రిపుర (93.7%), చండీగఢ్‌ (93.7%),గోవా (93.6%), పురుచ్చేరి (93.7%), మణిపూర్‌ 992%). 

ఇక అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న పది రాష్ట్రాలు వరుసగా ఆంధ్రప్రదేశ్‌ (72.6%), బిహార్‌ (74.3%), మధ్యప్రదేశ్‌ (75.2%), రాజస్థాన్‌ (75.8%), రaార్ఖండ్‌ (76.7%), తెలంగాణ (76.9%), ఉత్తరప్రదేశ్‌ (78.2%), ఛత్తీస్‌గఢ్‌ (78.5%), లద్దాఖ్‌ (81%), జమ్ముÊ కశ్మీర్‌ (82%). 

2011 జనగణలో అక్షరాస్యతలో మూడో స్థానంలో వున్న మిజోరం నేటికి దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం కేంద్రం ప్రవేశపెట్టిన సమగ్ర శిక్ష మరియు న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమేనని చెప్పాలి. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర శిక్ష మిజోరం కార్యక్రమం కూడా ఈ లక్ష్యసాధనలో గొప్ప చోదకశక్తిగా పనిచేసింది. మిజోరం ముఖ్యమంత్రి, రాష్ట్రం సాధించిన సంపూర్ణ అక్షరాస్యత గురించి ప్రకటించిన ప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వన్‌లాల్‌థలానా, కేంద్ర విద్యాశాఖసహాయమంత్రి జయంత్‌ చౌదరి కూడా వుండటం విశేషం. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘‘లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (యూఎల్‌ఎల్‌ఏఎస్‌)’’ కింద మిజోరంను సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటించారు. 

 క్లస్టర్‌ రోసోర్స్‌ సెంటర్‌ కోఆర్డినేటర్లు (సీఆర్‌సీసీ) ఆధ్వర్యంలో 2023 ఆగస్టుాసెప్టెంబర్‌ నెలల్లోమిజోరంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 15కంటే ఎక్కువ వయసున్నవారిలో 3026 మంది నిరక్షరాస్యులుగా వున్నట్టు గుర్తించారు. వీరిలో 1692మంది తర్వాత వివిధ అభ్యసన కార్యక్రమాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఆక్షరాస్యతా శా తం 98.2%కు చేరుకుంది. ఇదిలావుండగా రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు మిజోరం ప్రభుత్వం స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ లిటరసీ (ఎస్సీఎల్‌)ను ఏర్పాటు చేసింది. ఇది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎ డ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఈ సంస్థ మిజో భాషను నేర్చుకోవడానికి వీలుగా ‘వర్టియన్‌’ పేరుతో మరియు ఇంగ్లీషు భాషకోసం కార్యక్రమాలను అభివృద్ధి చేసి లాంగ్ట్‌లాయ్‌ జిల్లాలో అమలు చేశారు. వీటికి అనుబంధంగా ‘రోమై’ కార్యక్ర మాన్ని, నేర్చుకునేవారి కోసం, వాలంటీర్‌ టీచర్ల కోసం ‘మార్గదర్శిక’ పేరుతో మరో కార్యక్రమా న్ని అభివృద్ధి చేసి అమలు చేశారు. ఆవిధంగా మొత్తం 292 మంది వలంటీర్‌ టీచర్లను నియ మించి పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, వైఎంఏ లైబ్రరీల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమాలకు ‘‘లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (యూఎల్‌ఎల్‌ఏఎస్‌)’’ కింద సంపూర్ణ మద్దతు కల్పించారు. యూఎల్‌ఎల్‌ఏఎస్‌ కార్యక్రమాన్ని 2022 నుంచి 2027 వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. ముఖ్యంగా సంప్రదాయ విద్యను అభ్య సించలేకపోయిన 15ఏళ్ల వయసు పైబడినవారిని అక్షరాస్యులుగా చేయడం లక్ష్యంగా కార్యక్ర మం పనిచేస్తుంది. 

మిజోరం దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గుర్తింపు పొందగా, ఆంధ్రప్రదేశ్‌ అత్యల్ప అక్షరాస్యతారేటులో అట్టడుగున నిలిచింది. తెలంగాణ పరిస్థితి కూడా దారుణంగా వుంది. అట్టడుగు అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో ఆరోస్థానం ఆక్రమించింది! మిగిలిన కర్నాటక, తమిళనాడుల పరిస్థితి కూడా అక్షరాస్యతలో మెరుగ్గా ఏమీ లేదు. ఎందుకని ఈవిధంగా జరుగుతున్నదని ప్రశ్నిస్తే, విద్య కార్పొరేటీకరణ జరగడం. పలితంగా డబ్బున్న వారికి మాత్రమే విద్య అందుబాటులోకి రావడంతో నిరుపేదలకు విద్య అందని ద్రాక్షగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం,ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ విద్యాకార్యక్రమాలు, అమలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడంలేదన్నది ఒక అభియోగం. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్‌ టీచర్లుఅత్యధిక వేతనాలు తీసుకుంటూ పనిచేస్తున్నా, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న టీచర్లు కలిగిన ప్రైవేటు పాఠశాలలు అత్యధిక ర్యాంకులు సాధించడానికి కారణం ఏమిటన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రైవేటు విద్య అందుబాటులోకి రాకముందు, అన్ని వర్గాలవారు ప్ర భుత్వ పాఠశాలల్లోనే చదువుకునేవారు. ఉపాధ్యాయుల్లో కూడా నిబద్ధత కనిపించేది. కానీ రాను రాను విద్య ప్రైవేటీకరణ జరగడంతో, పాఠశాలల్లో విద్య నాణ్యత పడిపోవడం మొదలైంది. నిర్ల క్ష్యం, బాధ్యతారాహిత్యం, యూనియన్‌ కార్యకలాపాలు, ప్రైవేటు వ్యాపారాలపై మోజు పెరిగిపోవ డంతో ప్రభుత్వ విద్య క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. దీంతోపాటు తల్లిదండ్రుల్లో ర్యాంకులపట్ల మోజు పెరగడం కూడా ప్రైవేటు విద్యపై మక్కువ పెరగడానికి ప్రధాన కారణం. చివరకు పరిస్థితి ఏదశకు చేరకుందంటే ప్రభుత్వ పాఠశాలలతో, ప్రైవేటు పాఠశాలలు పోటీపడాల్సింది పోయి సీన్‌ మొత్తం రివర్సయింది. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలనే ప్రభుత్వ పాఠశాలలు అనుసరిస్తున్నాయి. ఇదిలావుండగా ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల, తరగతికి తగిన విద్యాప్రమాణాలు సాధించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తు న్నారు. ఫలితంగా విద్యార్థులు పేరుకే పైతరగతులకు వెళ్లడం తప్ప, వారికి ప్రాథమిక స్థాయి పరిజ్ఞానం కూడా లేకపోవడం చాలా సందర్భాల్లో రుజువైంది. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు బలమైన పునాదివేయకుండా పైతరగతులకు పంపడం కొనసాగినంతకాలం ప్రభుత్వ విద్య ఎప్పటికప్పుడు కునారిల్లుకుపోతూనే వుంటుంది. పదోతరగతి ఉపాధ్యాయులు, ఆ తరగతి ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన చేయలేని స్థితి. ఎందుకంటే విద్యార్థుల్లో ఆయా పాఠ్యాంశాలను అవగాహన చేసుకునే గ్రహణ సామర్థ్యం కొరవడటమే. ఐదారు దశాబ్దాల క్రితం డిటైనింగ్‌ పద్ధతి వుండేది కనుక, తగిన ప్రమాణాలు సాధించిన విద్యార్థులే పై తరగతులకు వెళ్లేవారు. ఫలితంగా ఉన్నత తరగతులకు చేరిన విద్యార్థులు ఆస్థాయి ప్రామాణిక విద్యను అర్థం చేసుకునేవారు. ఇప్పుడది పూర్తిగా కనుమరుగైపోయింది. డ్రాపౌట్ల భయంతో తగిన అర్హత సాధించని విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయడంతో అక్కడి ఉపాధ్యాయులపై పెను భారం పడుతోంది. చివరకు వైఫల్యాలలనుంచి తప్పించుకోవడానికి ఎవరికి వారు కారణాలు వెతుక్కుంటున్న దుస్థితి ఇప్పుడు నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ప్రభుత్వ ఉపాధ్యాయులకు కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లిస్తున్నా, వారు తమ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో చూపలేకపోవడానికి పైన చర్చించిన అంశాలు ప్రధాన కారణం. వీటిపై దృష్టి పెట్టకుండా, చేతిపై పుండుకు కాలికి వైద్యం చేసిన చందంగా చేపట్టే కార్యక్రమాలు విద్యాభివృద్ధికి ఎంతమాత్రం దోహదకారి కానేరవు.

మబ్బులు తొలగిపోతున్నాయి…ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

సీఎం రేవంత్‌ రెడ్డి పట్టుదలకు హైడ్రా తార్కాణం.

కమిషనర్‌ రంగనాథ్‌ దూకుడు పెంచారు.

`హైడ్రాతో పర్యావరణ పరిరక్షణపై ఆశలు రేకెత్తుతున్నాయి.

`హైడ్రా పని తీరుపై సానుకూల వాతావరణం ఏర్పడుతోంది.

`హైడ్రాపై ప్రజల్లో మారుతున్న అభిప్రాయాలు.

`ఆరంభంలో అవాంతరాలు సహజం.

`ఎదురయ్యే తలనొప్పులు అధిగమించడమే విజయ మార్గం.

`ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెరకపోవడమే రేవంత్‌ వ్యక్తిత్వం.

`పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న పాలకుడు రేవంత్‌.

`ఎన్ని అవాంతరాలెదురైనా ఎదుర్కొంటున్నారు.

`ఎన్ని విమర్శలు ఎదురైనా దిగమింగుకుంటున్నారు.

`మంచిపని ఎప్పుడూ తప్పుకాదు.

`అంతిమంగా విజయం దక్కకపోదు.

`హైదరాబాదు పర్యావరణ పరిరక్షణలో మొదటి స్థానం దక్కకపోదు.

`పచ్చిన హైదరాబాదు సాధ్యం కాకుండా పోదు.

`రేవంత్‌ కల నెరవేరే తరుణం ఎంతో దూరంలో లేదు.

`జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీలో పేరున్న నాయకుడు పల్లం రాజు ఇల్లు కూల్చారు.

`జయభేరి అక్రమ అప్పార్టుమెంట్లు

`మొదట్లో కొన్ని ప్రశ్నలు.

`ఎన్‌ కన్వెన్షన్‌ తో జనంలో కేరింతలు.

`తర్వాత కొన్ని వివాదాలు.

`పేదల నుంచి కూడా విమర్శలు.

`ప్రజల నుంచి తిట్లు, శాపనార్థాలు!

`న్యాయ స్థానాలనుంచి కొన్ని అభ్యంతరాలు.

`ఇప్పుడు హైడ్రా మీద అన్ని వర్గాల నుంచి అభినందనలు

`ఏపి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అక్రమ కట్టడాలు నేల మట్టం చేశారు

`హైడ్రాకు ప్రత్యేక పోలీసు స్టేషను ఏర్పాటు చేశారు.

`సంబంధిత అధికారులకు వాహనాలు అందించారు

`మల్లారెడ్డి అక్రమ భవనాలు మటాష్‌

`అసదుద్దీన్‌ ఓవైసీ చెరువు కబ్జా కహానీ ఖతం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అబద్దాలు అందంగా వుంటాయి. నిజాలు లోతుగా వుంటాయి. అబద్దాలు తియ్యగా వుంటాయి. నిజాలు చేదుగా వుంటాయి. ఎందుకంటే నిజం నిప్పులాంటిది. నిజాలు తేలేందుకు కొంత సమయం పడుతుంది. అబద్దం నమ్మడానికి కొద్ది సమయమే తీసుకుంటుంది. హైడ్రా విషయంలో అదే జరిగింది. హైడ్రా వల్ల ఏదో జరిగిపోతోందన్న భావన ప్రతిపక్షాలు కల్పించాయి. హైడ్రా పెద్దోళ్లను ఒదిలిపెట్టి, పేదోళ్ల మీద పడిరదన్నారు. హైడ్రా పక్కదారి పట్టిందన్నారు. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కాని నిజం నిలకడ మీద తేలుతుందని బలంగా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైడ్రా విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా సహించారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కొన్నారు. ఏ విషయంలో సిఎం. స్పందించినా హైడ్రా మీద ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోలేదు. అంతిమంగా హైదరాబాద్‌కు మంచి జరగాలనుకున్నప్పుడు మౌనమే శరణ్యమని అనుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి ఎంతో పట్టుదల కలిగిన మనిషి. నిజంలాగా ఎంతో లోతైన నాయకుడు. ఏ విషయానైన్నానా సరే కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి నిజం వైపు నిలిచారు. రాజకీయ జీవితంలో ఎవరూ అందుకోలేని విజయాలు అందుకున్నారు. అందుకే ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా సరే ప్రజలకు మంచి జరుగుతుందనుకున్నప్పుడు ఎవరి మాట వినని సీతయ్యగా పేరు పొందారు. ప్రజల కోణంలోనే ఆయన ప్రతి విషయాన్ని చూస్తారు. ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరినైనా ఎదురిస్తారు. అందుకే సిఎం. రేవంత్‌ రెడ్డి ఎవరూ ఎదుర్కొనన్ని విమర్శలు ఎదుర్కొంటుంటారు. ఇంటా, బైట ఎంత మంది వేలెత్తి చూపినా పట్టించుకోరు. ప్రజలకు మరింత న్యాయం జరగాలనుకున్నప్పుడు కొంత ఓపిక అవసరం అనుకున్నారు. ఇప్పుడు హైడ్రా విషయంలో అదే చేస్తున్నారు. తాను హైడ్రాపై ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారో అవి నెరవేరుతున్నాయి. ఆయన కలలు సాకారమౌతున్నాయి. హైదరాబాద్‌కు మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చే దిశలు అడుగులు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే హైడ్రామీద మబ్బులు తొలగిపోతున్నాయి. ప్రజలు నిజాలు తెసుకుంటున్నారు. వాస్తవాలు పరిశీలిస్తున్నారు. మొన్నటి వరకు సామాన్యులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన ప్రతిపక్షాలను కూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు. హైడ్రా వల్ల ఎంత మేలు జరుగుతుందో కూడా కళ్లారా చూస్తున్నారు. ప్రజల నుంచి హైడ్రాకు ప్రశంసలు మొదలౌతున్నాయి. హైడ్రా వల్ల పర్యావరణ పరిరక్షణ అన్నది ఎలా సాద్యామౌతుందో కూడా కళ్లతో చూస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి, చెరువులు, కుంటలు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన వారి గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెత్తుతున్నాయి. అన్యాయం చేసిన వాళ్లే తమకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. గతంలో అయితే ఇలాంటి విషయాల్లో ఎంతో మంది దూరిపోయేవారు. కాని సిఎం. రేవంత్‌ రెడ్డి ఏదైనా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే చేస్తారు. పోకిరి సినిమాలు ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనేలా సిఎం. రేవంత్‌ ముందుకు సాగుతున్నారు. అందుకే అక్రమార్కులను ఎవరూ కాపాడలేకపోతున్నారు. తప్పు చేశామని ఒప్పుకునే పరిస్దితి తెచ్చుకుంటున్నారు. తమ అక్రమ నిర్మాణాలను కాపాడుకునే క్రమంలో కొంత మంది కోర్టులను కూడా ఆశ్రయిస్తూ స్టేలు తెచ్చుకునే ప్రయత్నాలు కూడా చేశారు. కాని వాటిపై న్యాయ పోరాటం కూడా హైడ్రా తరుపున కమీషనర్‌ రంగనాధ్‌ కూడా చాలా పట్టుదలతో చేస్తున్నారు. అలాంటి కేసులు వీగపోయేలా, కోర్టులు కూడా హైడ్రాకు అనుకూలంగా తీర్పులిచ్చేలా నిజాలను న్యాయ స్దానం ముందు వుంచుతున్నారు. దాంతో అక్రమార్కులు పప్పులు ఉడకడంలేదు. తప్పులు చేసిన వారికి న్యాయం స్దానాల్లో కూడా చుక్కెదురౌతోంది. వారి అక్రమ నిర్మాణాలు నేలమట్టమౌతున్నాయి. ఇప్పుడు మాత్రం హైడ్రా మీద పూర్తిగా సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. మొన్నటి వరకు ప్రజల్లో వున్న అనుమానాలు పటాపంచలైపోతున్నాయి. హైడ్రా వల్ల ప్రజలకు పూర్తి స్దాయిలో మంచి జరుగుతున్న నమ్మకం బలంగా వినిపిస్తోంది. అందుకే ప్రజలు హైడ్రాను ఆహ్వానిస్తున్నారు. అలా ఈ మధ్య కొన్ని కూల్చివేతల మూలంగా ఎంతో మంది ప్రజలకు మేలు జరగింది. ఏపికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్‌ ఏకంగా రోడ్డును కూడా కబ్జా చేసి, 49 ఎకరాలను ఆక్రమించుకున్నట్లు హైడ్రా తేల్చింది. వెంటనే అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసినా సరే, వాటిని కూడా పూర్తి స్దాయిలో నేల మట్టం చేసింది. ఆయన మూసేసిన రోడ్డును తెరిపించి, ప్రజలకు ఎంతో మేలు చేసింది. దాంతో ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, హైడ్రాకు కృతజ్ఞతలు తెలిజేశారు. ఇటీవల కూకట్‌ పల్లిలో కూడా పెద్ద భూ బాగోతం వెలుగులోకి విచ్చింది. ఓ వ్యక్తి, చెరువు స్థలాన్ని, ప్రభుత్వ భూమిని ఆక్రమించి, రియల్‌ వ్యాపారం సాగిస్తున్నారు. హైడ్రా రంగంలోకి దిగడంతో ఆయన బండారం బైట పడిరది. అక్కడ కూడా రోడ్డు మూయడంపై ప్రజలు ఎప్పటినుంచో అభ్యంతరం తెలియజేస్తున్నారు. కాని ఎవరూ పట్టించుకున్నది లేదు. ఇటీవల హైడ్రాకు ప్రత్యేకమైన పోలీస్‌ స్టేషన్‌ సిఎం. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. వారికి వాహనాలు అందించారు. అప్పటి నుంచి హైడ్రా కార్యాలయానికి ప్రజలు క్యూ కడుతున్నారు. భూ అక్రమాలపై పిర్యాదలు పెద్దఎత్తున అందజేస్తున్నారు. వివరాలు తీసుకున్న హైడ్రా వెంటనే రంగంలోకి దిగుతోంది. తాజాగా మేడ్చల్‌ జిల్లాలోని మేడిపల్లిలో ఓ ప్రైవేటు స్కూలు రోడ్డును ఆక్రమించి, భవనాలు నిర్మాణం చేసింది. దాన్ని ఎప్పటినుంచో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని ఆ స్కూల్‌ యజమాని పట్టించుకోలేదు. రాజకీయ పలుబడితో అందర్నీ బెదిరిస్తూ వచ్చారు. దానిపై పిర్యాదు అందడంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా ఆ అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. రోడ్డు సౌకర్యం పునర్దురించింది. దాంతో ప్రజల్లో హర్షం వ్యక్తమౌతోంది. సహజంగా ఎంత మంచి పని చేపట్టినా అవాంతరాలు ఎదురు కావడం సహజం. వాటిని అధిగమించేందుకు కొంత సమయం పడుతుంది. వాటన్నింటినీ అధిగమించేందకు కొంత సమయం పట్టింది. ప్రజలకు నిజా, నిజాలు తెలియడంతో హైడ్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి విషయాలో ఆదిలో ఎన్నో ఒత్తిళ్లు సిఎం.రేవంత్‌రెడ్డికి వచ్చాయి. ఖైరతాబాద్‌ ఏమ్మెల్యే సైతం హైడ్రాను అడ్డుకున్నారు. హైడ్రాకు అడ్డంతిరిగారు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎవరినీ లెక్క చేయలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న సందర్భంలో మన, తర బేదాలు చూసుకోవద్దని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అంతెందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన, జాతీయ స్దాయిలో పార్టీ అధిష్టానానికి ఎంతో సన్నిహితుడైన నాయకుడి చెందిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. దాంతో పార్టీలో ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కాని సిఎం. రేవంత్‌రెడ్డి ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఆది నుంచి సిఎం. రేవంత్‌ ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా దిగిమింగుకున్నారు. మంచి పని ఎప్పుడూ తప్పు కాదని ముందుకు సాగారు. అంతిమంగా హైదరాబాద్‌ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్నారు. అంతిమంగా హైడ్రాకు విజయం దక్కకపోదన్న నమ్మకంతోనే రేవంత్‌ రెడ్డి వున్నారు. హైడ్రా అనుకున్న లక్ష్యాలు నెరవేరితే దేశంలోనే హైద్రాబాద్‌ పర్యావరణ పరిరక్షణలో మొదటి స్దానంలో వుంటుంది. గతంలో బెంగులూరు నగరాన్ని పర్యావరణ ప్రాంతంగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు హైదరాబాద్‌ను చెప్పుకునే రోజులు తప్పకుండా వస్తాయి. హైదరాబాద్‌ విషయంలో పర్యావరణ పరిక్షణ అంశంలో రేవంత్‌రెడ్డి కల నెరవేడానికి పెద్దగా సమయం కూడా పట్టేలా లేదు. ఆ తరుణం ఎంతో దూరం కూడా లేదు. ఎందుకంటే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చినప్పుడు ప్రజలు కేరిం తలు కొట్టారు. రాం నగర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చినప్పుడు కొంత మంది అడ్డుకున్నారు. మూసీ నదిలో అక్రమంగా ఇండ్లు కట్టుకొని వున్నవారిని తరలిస్తే రాజకీయం చేశారు. ఇప్పుడు వాళ్లందరికీ హైడ్రా పనితీరు పూర్తిగా అర్ధమైంది. హైడ్రాతో సుందరమైన, అందమైన నగరం మారుతుందన్న విశ్వాసం పెరిగింది. మూసీనది పరిరక్షణ, సుందరీకరణతో హైదరాబాద్‌ సరికొత్త సొగబులు దిద్దుకోవడానికి ఎంతో సమయం పట్టదు. దటీజ్‌ సిఎం. రేవంత్‌ రెడ్డి అని అందరూ కొనియాడే రోజు దగ్గర్లోనే వుంది.

సత్య వాది..నిత్య వాది రేవంత్‌ రెడ్డి.

-18 నెలలు ధరల పెరుగుదల లేకుండా పాలిస్తున్న ఏకైక సీఎం రేవంత్‌ రెడ్డి

-ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నిజమే చెబుతారు.

-యదార్ధ వాది లోక విరోధి..కానీ రేవంత్‌ ప్రజా సారధి.

-ప్రజల మేలు కోసం… తెలంగాణ వెలుగు కోసం రేవంత్‌ రెడ్డి.

-సంక్షేమ ప్రధాత, ప్రగతి విధాత రేవంత్‌ రెడ్డి.

-అబద్దాలు లేవు, ఆడంబరాలు లేవు.

-ప్రజా పాలనలో ప్రజా సంక్షేమం వెల్లివిరుస్తోంది.

-నిజాలు చెప్పడం మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

-ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేయడం లేదు.

-అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బైటపడేస్తున్నారు.

-వున్నదాంట్లోనే గొప్పగా పాలిస్తున్న పాలకుడు రేవంత్‌.

-పేదలకు సన్న బియ్యం అందిస్తున్న దేవుడు.

-పేదలకు సన్న బియ్యం అందిస్తున్న తొలి, ఏకైక రాష్ట్రం తెలంగాణ.

-ఎప్పటికప్పుడు ఉద్యోగ నియామకాలు వేగ వంతం చేస్తున్నారు.

-ఇప్పటికే 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు.

-స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు.

-యువత స్వయం ఉపాధి కోసం రాజీవ్‌ యువ వికాసం పథకం తెచ్చారు.

-రైతులకు ఏ రాష్ట్రంలో లేనంత మద్దతు ధర చెల్లిస్తున్నారు.

-పైగా సన్నాలకు బోనస్‌ కూడా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

-ఏక కాలంలో రైతులను రుణ విముక్తి చేశారు.

-తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఇందిరమ్మ ఇండ్లు.

-పదేళ్లుగా అందకుండా పోయిన వారికి కొత్త రేషన్‌ కార్డులు.

-అన్ని వర్గాల ప్రజల సంతోషం లక్ష్యంగా సాగుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజమైన పాలకుడు. పరిపాలనా దక్షుడు. గొప్ప పాలకుడు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే చరిత్రలో ఏ రాజు గురించి చెప్పుకోవాల్సి వచ్చినా, ఏ ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినా వారి పాలనలో ప్రజలు ఎలా వున్నారు అనేదే ప్రాతిపదిక. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో ప్రజలు సుఖశాంతులతోవున్నారు. సుబిక్షంగానే వున్నారు. అంతే కాదు గతంలో రాజులైనా, ప్రజా పాలకులైనా పన్నుల భారం లేని రాజ్యమే గొప్పది అని చెప్పుకునేవారు. అదే దారిలో నడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన కూడా అంతే గొప్పది. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ పాలన పోయి, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి సుమారు 18 నెలలు గడుస్తోంది. ఈ ప్రజా ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఎక్కడా ప్రజల తిరుగుబాటు జరిగింది లేదు. ప్రజా పోరాటాలు సాగింది లేదు. ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసింది లేదు. కేవలం సోషల్‌ మీడియా ప్రచారం తప్ప, ఏ ఒక్క వర్గం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెలెత్తి చూపించింది లేదు. తిరుగుబాటుకు తావే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ 18 నెలల కాలంలో ప్రజల మీద ఎలాంటి భారాలు వేయలేదు. చాటు మాటుగానైనా పన్నుల భారం మోపలేదు. ప్రజా శ్రేయస్సు కోరుకునే ఏ పాలకుడైనా ప్రజలను పీడిరచాలనుకోరు. ఇప్పుడు సిఎం.రేవంత్‌రెడ్డి కూడా అదే చేస్తున్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్దితి ఆయనకు బాగా తెలుసు. ప్రజల పరిస్దితి అంతకన్నా తెలుసు. ఇలాంటి పరిస్దితుల్లో పిండికొద్ది రొట్టె అనేలా పాలన సాగాలే తప్ప, ప్రజల ఇబ్బందులో వున్నప్పుడు బాదించకూడదనుకుంటున్నారు. పన్నుల భారం వేసి వేదించొద్దునుకుంటున్నారు. ఇంత కంటే గొప్ప పాలకుడు ఎవరూ వుండరు. పైగా గత నుంచి వస్తున్న సంక్షేమ కార్యాక్రమాలు ఎక్కడా ఆపడం లేదు. గత పాలకుల పథకాలను ఎక్కడా గండి కొట్టలేదు. వాటని యాదా తధంగా అమలు చేస్తున్నారు. వాటి అమలులో కూడా ఎక్కడా విమర్శలులేవు. గత పాలనలో ప్రజలకు అందుతున్న వృద్దాప్య పించన్లు అంతకన్నా మెరుగ్గానే అందుతున్నాయి. గతంలో కాస్త ఆలస్యమైన సందర్భాలున్నాయి. కాని రేవంత్‌రెడ్డి పాలనలో వృద్దాప్య పించన్లు గాని, ఇతర పించన్లకు ఎక్కడా ఇబ్బంది లేదు. ఆలస్యం కూడా ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. ఇక ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వ హాయాంలో నెలాఖరు వరకు కూడా కొన్ని శాఖలకు జీతాలు సరిగ్గా అందినసందర్భాలు చాలా తక్కువ. కాని ఇప్పుడు ఏ శాఖ ఉద్యోగులకైనా సరే ఒకటో తారీకే జీతాలు పడుతున్నాయి. గతమెంతో ఘనంగా చెప్పుకునే వాళ్లు ఉద్యోగులకు నెల నెల సకాలం జీతాలు చెల్లించిన పరిస్దితి లేదు. ఇక రైతుల విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. పైగా గతం కన్నా రైతులు సంతోషంగానే వున్నారు. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు నిర్విరామంగానే అందుతోంది. విమర్శలు ఎప్పుడూ వుంటాయి. రాజకీయ విమర్శలు పట్టించకోవాల్సిన అసవరం లేదు. నిజంగా రైతులకు ఇబ్బందులు వుంటే ఈపాటి రైతులు ఎప్పుడో రోడ్డెక్కెవారు. ఇక రైతు భరోసా కాస్త అటూ ఇటైనా సరే రైతులకు చేరుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం రైతు రుణమాఫీ. ఇది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పడంలో సందేహం లేదు. చెప్పిన సమయానికి రుణమాఫీ కాకపోవచ్చు కాని, మొత్తానికి ఏడాదిలో పూర్తి స్ధాయి రుణమాఫీ అందిరికీ జరిగింది. పై పెచ్చు రైతులకు బ్యాంకులు ఇచ్చే రుణాలు ఎక్కడా ఆగలేదు. ఏ రైతును బ్యాంకును ఇబ్బంది పెట్టింది లేదు. రైతులందరికీ బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చేశారు. రైతులకు పెట్టుబడి సాయాలు అందుకునేలా చూసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత మద్దతు ధర తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారు. ఇది ఏ రైతును అడిగినా చెబుతారు. గత పాలకులకన్నా ఎక్కువే ఇస్తున్నారు. వడ్లు ఎలా వున్నా ప్రభుత్వం సేకరిస్తూనే వుంది. తప్ప తేమ శాతం పేరుతో ఎక్కడా రైతులను ఇబ్బందులు పెట్టడం లేదు. అలాంటి వార్తలు ఎక్కడా లేవు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పూర్తి స్దాయిలో సేకరిస్తున్నారు. డబ్బులు కూడా రైతులకు వెంట వెంటనే అందజేస్తున్నారు. గతంలో రైతులకు డబ్బులు అందడంలో కొంత జాప్యం జరిగిన సందర్బాలున్నాయి. కాని రేవంత్‌ సర్కారులో ఎలాంటి జాప్యం లేదు. రైతుల నిరసన ఎక్కడా కనిపించలేదు. పైగా ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ఎక్కువ భాగం సన్నాలు పండిరచారు. గతంలో ఎప్పుడూ లేనంతగా రైతులంతా సన్నాలను పండిచేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం సన్నాలు పండిరచే రైతులకు ఇచ్చే బోనస్‌కు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. సన్నాలు పండిస్తున్నారు. గతంలో 2020లోనే రైతులను వరి వేయొద్దని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వడ్లు కొనుగోలు చేయమని హెచ్చరించింది. రైతులకు విత్తన వడ్లు అమ్మితే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా రైతులకు సన్నాలు పండిరచమని చెప్పి చేతులెత్తేశారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు తేడా లేకుండా చేసి రైతులను నష్టం కల్గించారు. తర్వాత వాణిజ్యపంటలు పండిరచాలని చెప్పి, వరి వేస్తే ఉరే అంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కాని రేవంత్‌ సర్కారు సన్నాలు పండిస్తే బోనస్‌ ఇస్తామన్నారు. ఇస్తున్నారు. తెలంగాణను సన్నాలు పండిరచే అన్న పూర్ణగా మార్చారు. అక్కడితో ఆగలేదు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మరో అడుగు ముందుకు పడిరది. ముఖ్యమంత్రి రేవంత్‌ సర్కారు రైతులు పండిచే సన్నాలను రేషన్‌ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్నారు. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన చర్య అని చెప్పాలి. తెలంగాణలో పేదలకు సన్నాలు అందించడం అనేది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం మొదలు పెట్టిన ఎన్టీఆర్‌ను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. తర్వాత ఎంత మంది పాలకులు అమలు చేసినా వారి పేరు చరిత్రలో నిలిచిపోలేదు. అలాగే పేదలకు మెరుగైన కార్పోరేట్‌ ఉచిత వైద్యం అందించిన రాజీవ్‌ ఆరోగ్య శ్రీ అనేది గొప్ప కార్యక్రమం. దానికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయన పేరు చిరస్దాయిగా ఈ పధకం ద్వారా నిలిచిపోతుంది. అలాగే పేద ప్రజలు ఉచితంగా సన్న బియ్యం అందించిన ఘనత మాత్రం సిఎం. రేవంత్‌రెడ్డికే దక్కుతుంది. పేద ప్రజలు రేషన్‌ ద్వారా సన్న బియ్యం తీసుకున్నంత కాలం రేవంత్‌ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక వేళ భవిష్యత్తులో ఏ పాలకుడైనా ఆ పధకానికి తూట్లు పొడవాలని చూసినా చరిత్ర క్షమించనంత గొప్పగా ఈ పథకం అమలుకు అనుములు రేవంత్‌ రెడ్డి రూపకల్పన చేశారు. పేదవారి కడుపు నింపుతున్నారు. రేవంత్‌ రెడ్డి పాలనలో గొప్ప కార్యక్రమం ఏమిటని చరిత్రను ప్రశ్నిస్తే చెప్పే గొప్ప కార్యక్రమం సన్న బియ్యం. పాలకులు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా, చరిత్ర మొత్తం చెప్పుకోవడంలో నిలిచిపోయేది ఒకటే వుంటుంది. అదే సన్న బియ్యం పధకం. గతంలో పేదలకు బియ్యం ఇస్తున్నామా? లేదా? అన్నట్లు వుండేది. కాని ఇప్పుడు సన్న బియ్యం సరఫరా ఒక గొప్ప విప్లవాత్మకమైన అడుగు అని చెప్పకతప్పదు. పైగా దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. తెలంగాణలో మాత్రమే మొదటి అడుగు పడిరది. అంతే కాకుండా రేపటి రోజు ఇతర రాష్ట్రాలలో సన్న బియ్యం అమలు కావాలన్నా తెలంగాణ నుంచే సన్న బియ్యం సరఫరా చేయాల్సి వుంటుంది. అలా తెలంగాణకు వరాన్ని, తన కీర్తిని ఏక కాలంలో పెంచుకున్న నాయకుడు రేవంత్‌ రెడ్డి. అన్నం ఉడికిందా? లేదా? తెలుసుకునేందుకు ఒక్క మెతుకు చాలు. రేవంత్‌ రెడ్డి పాలన గురించి చెప్పుకోవడానికి సన్న బియ్యం సరఫరా ఒక్కటి చాలు. నిజం చెప్పాలంటే రేవంత్‌ రెడ్డి పేదల పక్షపాతి. పల్లె నుంచి వచ్చిన నాయకుడు. ప్రజల జీవితాలు తెలిసిన నాయకుడు. ప్రజల బతుకులు బాగు చేయాలన్న లక్ష్యంతో రాజకీయం చేస్తున్న నాయకుడు. అందుకే తన 18 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలన సాగిస్తున్నారు. మరిన్ని మెరుగైన పధకాలు అమలు చేయాలని చూస్తున్నారు. ప్రజల చేత నిజమైన పాలకుడు అని అనిపించుకుంటున్నారు. ప్రజా పాలకుడుగా జేజేలు కొట్టించుకుంటున్నాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version