కక్ష, కుట్రలతో కేసిఆర్‌ ను ఏమి చేయలేరు!

-కట్టుడు అంటే కూల్చినంత సులువు కాదు.

-కేసిఆర్‌ అంటేనే తెలంగాణ గుండె చప్పుడు!

-పిసి.ఘోష్‌ కమీషన్‌తో కొండను తవ్వి ఎలుకను పట్టారు!

-కమీషన్‌, కమీషన్‌ అని ఊదరగొట్టారు!

-కమీషన్‌ రిపోర్ట్‌ ఇచ్చిన తర్వాత 60 పేజీలు తెచ్చి ఏదో చేద్దామనుకున్నారు.

-అసెంబ్లీలో 600 పేజీలు నివేదిక పెట్టి తెల్ల మొహం వేశారు.

-అది పిసి. ఘోష్‌ కమీషన్‌ కాదు, కాంగ్రెస్‌ కక్ష సాదింపు అని తేలిపోయింది.

-ఎంత ప్రయత్నం చేసినా జనం నమ్మడం లేదని మరో నాటకానికి తెర తీశారు.

-కాంగ్రెస్‌, బిజేపి ఒక్కటే అని మళ్ళీ నిరూపించారు.

తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సమయం చూసి రెండు పార్టీలకు కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గర్లోనే వున్నాయి. అబద్దాల పునాదుల మీద ఏది నిలబడదు. బలమైన నిర్మాణం కాళేశ్వరం మీద పిల్లి శాపాలు పని చేయవు. ఇప్పటికైనా ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా బుద్ధిగా పాలన చేసుకుంటే బాగుంటుంది. కాళేశ్వరం తెలంగాణ గుండెకాయ. కేసిఆర్‌ తెలంగాణ రక్షకుడు. అలాంటి నాయకుడి మీద చరిత్రలో అక్షరం కూడా కదిలించలేరంటున్న మాజీ ఎమ్మెల్యే , బిఆర్‌ఎస్‌ నాయకుడు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు. ఆయన మాటల్లోనే…

-కాళేశ్వరం మీద కాంగ్రెస్‌ కుప్పిగంతులు!

-కాళేశ్వరం గొప్పదనం ప్రజలందరికీ తెలుసు!

-కాళేశ్వరం అనేది తెరిచిన పుస్తకం.

-కట్టిన నిర్మాణాలు మన కళ్ల ముందే వున్నాయి.

-అనేక రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు కనిపిస్తూనే వున్నాయి.

-తెలంగాణ మొత్తం ఇంటింటికి మంచినీరు అందుతోంది.

-పరిశ్రమలకు కావాల్సినంత నీరిస్తోంది.

-ఇదంతా కేసిఆర్‌ పుణ్యం కాదా!

-కాళేశ్వరం నిర్మాణం వల్లనే సాధ్యమైందన్నది నిజం కాకుండా పోతుందా!

-సిఎం రేవంత్‌ జిల్లా పాలమూరు పచ్చబడలేదా!

-వలసలు ఆగిపోలేదా! పాలమూరు కరువు పారిపోలేదా!

-తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందడం లేదా!

-కాళేశ్వరం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్‌ అని కాంగ్రెస్‌కు తెలుసు.

-కాళేశ్వరం తెలంగాణకు వర ప్రదాయినీ అని తెలుసు.

-కాంగ్రెస్‌ పార్టీ తన మనుగడ కోసం అబద్దాలు చెప్పిందని తెలుసు.

-ప్రజలకు పదే పదే అవాస్తవాలు చెప్పి, చెప్పి లబ్ధి పొందారు

-ఆ అబద్దాలతో అధికారంలోకి వచ్చి దిక్కులు చూస్తున్నారు

-ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు.

-కాళేశ్వరం మీద కక్షకడితే కొట్టుకుపోయేది కాంగ్రెస్సే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 కేసిఆర్‌ అనే మూడక్షరాలు ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. తెలంగాణ సమూహానికి సారధి. తెలంగాణ ప్రగతికి దారి. తెలంగాణ ఏర్పాటు కర్త. బంగారు తెలంగాణ ఆవిష్కర్త. అలాంటి నాయకుడిపై క్షక్ష పూరితమైన రాజకీయాలు ఎవరు చేసినా తెలంగాణ సమాజమే క్షమించరు. బిఆర్‌ఎస్‌ను రాజకీయ కుట్రల ద్వారా కనుమరుగు చేయాలని ఎవరైన కలలు గంటే వారి జేమమ్ములు దిగిరావాలే. అంతే తప్ప బిఆర్‌ఎస్‌ను, కేసిఆర్‌ను కదిలించే శక్తి ఈ ప్రపంచంలోనే లేదు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఒక అవకాశమిచ్చారు. ఒక్క ఛాన్స్‌..ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ ప్రజలను నిత్యం కాంగ్రెస్‌ నాయకులు వేడుకున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీని ఒక్కసారి నమ్మమంటూ కోరుకున్నారు. పోనీలే అని ప్రజలు అనుమానంతోనే అవకాశమిచ్చారు. ప్రజలు అనుకున్నదే కాంగ్రెస్‌ పాలకులు చేస్తున్నారు. ప్రగతిని గాలికి వదిలేశారు. అభివృద్దిని ఆమడ దూరం తరిమేశారు. బిఆర్‌ఎస్‌ పార్టీ మీద కక్ష కట్టారు. తెలంగాణ జాతి పిత కేసిఆర్‌ను ఏదో రకంగా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కాని ఎక్కడా వీలు పడకపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు ప్రస్టేషన్‌కు గురౌతున్నారు. ముఖ్యంగా సిఎం. రేవంత్‌రెడ్డి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. తన కక్ష తీర్చుకోవాలని అనుకుంటున్నారు. కాని అది ఈ జన్మలో సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోంది. కేసిఆర్‌ మీద కోపంతో ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఎన్నికల నాడు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కారు. వాటి అమలు చేయాలన్న చిత్తశుద్దిని ఏనాడో వదిలేశారు. డైవర్టు పాలిటిక్స్‌ సాగిస్తున్నారు. కేసిఆర్‌ కుటుంబంమీద పగ పెంచుకున్నారు. ఎలాగైనా కేసిఆర్‌ను, కేటిఆర్‌, హరీష్‌రావులను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నారు. సమయం చూసి కాంగ్రెస్‌, బిజేపిలకు కర్రు కాల్చి వాత పెడతారు. అబద్దాల పునాదుల మీద ఏది నిలబడదు. పిల్లి శాపాలకు ఉట్టి తెగిపోదు. కాళేశ్వరం మీద ఎన్ని రకాల విన్యాసాలు కాంగ్రెస్‌ చేసినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఇప్పటికీ నిత్యం పదిలక్షల క్యూసెక్కుల వరద గత నెల రోజులుగా మేడిగడ్డ నుంచి వెళ్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాదే మేడిగడ్డ నుంచి సుమారు 25లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వెళ్లింది. అప్పుడు కూడా ఒక్క ఇంచ్‌ కదిలింది లేదు. కాని కాళేశ్వరం కూలుతుందని అబద్దాలు ప్రచారం చేసి అదికారంలోకి వచ్చారు. అది కూలాలని కలలుగంటున్నారు. అది కూలే కట్టడం కాదు. కలకలకాలం నిలబడే కట్టడం. తరతరాలకు తెలంగాణకు నీళ్లందించే వరప్రసాదం. బుద్దిగా పాలన సాగించకుండా, తెలంగాణ సాగును ఆగం చేస్తున్నారు. రైతుల నోట్లో మట్టికొట్టాలని చూస్తున్నారు. కాళేశ్వరం తెలంగాణ గుండెకాయ. కేసిఆర్‌ తెలంగాణ రక్షకుడు. కేసిఆర్‌ అనే మూడక్షరాల తెలంగాణ మేరు పర్వతమంటి కేసిఆర్‌ కీర్తినిగాని, ఆయన చరిత్రలో ఒక్క అక్షరాన్ని కూడా రేవంత్‌ రెడ్డి కదిలించలేరు. అది సిఎం.రేవంత్‌ రెడ్డే కాదు, వాళ్ల తాతలు దిగి వచ్చినా సాద్యమయ్యేది కాదంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న తాజా రాజకీయ విశేషాలు ఆయన మాటల్లోనే…

రాష్ట్ర ప్రభుత్వం కేసిఆర్‌ను ఏరకంగా ఇబ్బంది పెట్టాలని చూసినా ముందుగా తెలంగాణ ప్రజలే ఊరుకోరు. తెలంగాణ సమాజం భగ్గుమంటుంది. ఈ విషయం రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. అయినా ఏదో రకంగా కేసిఆర్‌ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పిసి.ఘోష్‌ కమీషన్‌ వేశారు. ఇరవై నెలలు కొండను తవ్వారు. ఎలుకును కూడా పట్టుకోలేకపోయారు. అంటే కేసిఆర్‌ నిజాయితీ ఇక్కడే తేలిపోయింది. పిసి.ఘోష్‌ కమీషన్‌ ఆఖరుకు తేల్చిన విషయం ఒక్కటే..కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా ఆరు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. దానిని వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దాంతో రేవంత్‌రెడ్డికి దిక్కు తోచక, నివేదికను బూచీగా చూపించి కేసిఆర్‌ మీద పగ సాదించాలని చూశారు. అసెంబ్లీలో పెట్టినా ఆ కమీషన్‌ రిపోర్టుతో రేవంత్‌ రెడ్డి పప్పులు ఉడకవని తేలిపోయింది. పైగా ఈ కమీషన్‌ నివేదికను ఆసరా చేసుకొని ఎలాంటి దర్యాప్తు చేపట్టొదని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో రేవంత్‌ రెడ్డికి దారులన్నీ మూసుకుపోయాయి. దాంతో కమీషన్‌ పేరుతో కాకుండా నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధారిటీ నివేదినను ఆసరా చేసుకొని కాళేశ్వరం మీద సిబిఐకి అప్పగించాలని తీర్మానం చేశారు. సిబిఐకి లెటర్‌ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అలా ఉత్తరం రాయగానే సరిపోదు. అందుకు కేంద్రం అంగీకరించాలి. గతంలో కేసిఆర్‌ ప్రభుత్వంలో జారీ చేసిన జీవో. 50కి బదులు జీవో. నెం.51 తీసుకురావాలని చూస్తున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఈడీ, ఐటిలను జేబు సంస్ధలుగా చేసుకొని, ప్రతిపక్ష పార్టీలను వేదిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తుంది. రాహుల్‌ గాంధీని సిబిఐ విచారించేందుకు పిలిచిన రోజు కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలు చేశారు. సిఎం. రేవంత్‌ రెడ్డితో సహా, మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు రాజ్‌భవన్‌ దగ్గర ధర్నా చేసిన సంగతి రాష్ట్ర ప్రజలు అప్పుడే మర్చిపోయారని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నట్లున్నారు. ఏ సిబిఐ రాజకీయ కక్షల కోసం కేంద్రం వినియోగిస్తుందని సద్దుపూస ముచ్చట్లు చెప్పిన రేవంత్‌ రెడ్డి కాళేశ్వరం నిర్మాణాన్ని సిబిఐకి అప్పగించడం విడ్డూరం. అయినా సినిమాల్లో చూసినట్లు సిబిఐ అని పిలవగానే వచ్చేందుకు ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద సిబిఐ విచారణ చేయలేదు. కాళేశ్వరం నిర్మాణమేమీ జాతీయ హోదా వున్న ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మాణం జరగలేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ అదికారుల పర్యవేక్షలో జరిగింది. అందువల్ల సిబిఐ దర్యాప్తు జరిగేందుకు అవకాశం లేదు. ఒక తప్పు చేయడం మొదలు పెడితే దానిని కప్పి పుచ్చుకునేందుకు పదే పదే తప్పుల మీద తప్పులు చేయాల్సి వస్తుందని పెద్దలు అన్నారు. ఇప్పుడు సరిగ్గా రేవంత్‌ రెడ్డి అదే చేస్తున్నారు. పదే పదే నన్ను జైలుకు కేసిఆర్‌ పంపించారంటూ చెప్పుకొని, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు. అయితే రేవంత్‌ రెడ్డి అంటే కేసిఆర్‌ వ్యక్తిగత కుట్రలు చేయలేదు. కేసిఆర్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ పద్నాలుగు సంవత్సరాల పాటు కొట్లాడి, అరవై ఏళ్ల తెలంగాణ కల సాకారం చేశారు. అలా తెచ్చుకున్న తెలంగాణను విఫల ప్రయత్నంగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తూ రేవంత్‌ రెడ్డి పట్టుబడ్డారు. పట్టపగలు రూ.50లక్షలు లంచంతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిపోయారు. ఓటుకు నోటు కేసులో జైలు కెళ్లారు. అంతే తప్ప ఆయన తెలంగాణ ఉద్యమం కోసం జైలుకెళ్లలేదు. ఏనాడు జై తెలంగాణ అన్న నాయకుడు రేవంత్‌రెడ్డికాదు. అరవై ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు పడిన గోస నుంచి బైటపడి ఆత్మగౌరవంతో బతకాలనుకుంటుంటే తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా, తెలంగాణ రాజకీయాలలో అస్ధిరతను సృష్టించాలని చూసి, జైలుకు వెళ్లడం కూడా గొప్పదనమని రేవంత్‌రెడ్డి భావించడం సిగ్గు చేటు. చేసిందే తప్పుడు పని. చేసిందే నేరం. అయినా తాను తప్పు చేయలేదు. తనను పట్టుకోవడం కేసిఆర్‌ చేసిన తప్పు అని రేవంత్‌రెడ్డి అనుకోవడం అంత మూర్భత్వం మరొకటి లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఏ దారి దొరకడం లేదని రేవంత్‌రెడ్డి మధనపడుతూ కుట్రలకు తెరతీస్తున్నారు. కాళేశ్వరం అనేది తెరిచిన పుస్తకం. ఆ నిర్మాణాలన్నీ ప్రజల కళ్లముందే వున్నాయి. కాని కాంగ్రెస్‌ మసిబూసి మారేడు కాయ చేయాలని చూస్తోంది. తెలంగాణ రాక ముందు పరిస్ధితులు ఏమిటి? తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్ధితులు ఏమిటో తెలిసి కూడా కాంగ్రెస్‌ నాటకాలు ఆడడం ప్రజలు నిశితంగానే గమనిస్తున్నారు. రైతులు ఓ వైపు ఎరువులు కావాలంటుంటే అందించే శక్తి లేదు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఎలా ఆడుకోవాలన్న సోయి లేదు. ఎంత సేపు బిఆర్‌ఎస్‌ పార్టీమీద అబద్దాలు ఎలా ప్రచారం చేయాలి. కేసిఆర్‌ను ఎలా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు. దుర్మార్గపు పాలన సాగిస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పాలన దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ప్రజలు ఇప్పటికీ సారే రావాలంటున్నారు. కేసిఆర్‌ కావాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ గాలిలో కాంగ్రెస్‌, బిజేపిలు అడ్రస్‌ లేకుండా కొట్టుకుపోవడం ఖాయం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version