టెండర్‌ ప్యాడీ దోపిడీ! మిల్లర్‌కు ట్రాజెడీ!!

`టెండరింగ్‌ దళారులు మిల్లర్ల పాలిట విలన్లు!

`మిల్లర్‌ కెందుకు శాపం!

`టెండర్‌ ప్యాడీకెందుకు పెత్తనం.

`బకాయిలు చెల్లిస్తాం మొర్రో అంటున్న మిల్లర్లు!

`గడువు ముగిసిందని కిరికిరి పెడుతున్న టెండర్‌ ప్యాడీ దళారులు.

`ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య దళారులెందుకు?

`ఏ రాష్ట్రంలో లేని విధానం తెలంగాణలో ఎందుకు?

`మిల్లర్ల బకాయిలు వసూలుకు బోలెడు సిబ్బంది వున్నారు.

`పర్యవేక్షణకు వందలాది మంది అధికారులున్నారు.

`నలుగురు టెండర్‌ ప్యాడీ దళారులకు ఉద్యోగుల సహకారం ఎందుకు?

`క్వింటాలుకు దళారీ వ్యవస్థకు రూ. 230 ఇవ్వడమెందుకు?

`మిల్లర్ల నుంచి నిర్ణీత సమయంలో బకాయిలు వసూలు చేయాల్సిన బాధ్యత విస్మరించిన టెండర్‌ ప్యాడీ.

`మిల్లర్‌ చెల్లించకపోయినా నిర్ణీత గడువులో బకాయిలు చెల్లించాల్సింది టెండర్‌ ప్యాడీ.

`అందుకు మిల్లర్‌ బలికావడం సరైంది కాదు.

`గడువు ముగిసిందన్న నెపంతో మిల్లర్ల మీద అదనపు బారం మోపడం అన్యాయం.

`టెండర్‌ ప్యాడీ పొరపాటును మిల్లర్లను బలి చేయడం దుర్మార్గం.

`తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం విజయవంతం కావడంలో మిల్లర్లది కీలకపాత్ర.

`అలాంటి మిల్లర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

`దళారీ వ్యవస్థతో మిల్లర్లను మింగేయడం సరైందికానిది.

`ఇప్పటికైనా టెండర్‌ వ్యవస్థను రద్దు చేయండి.

`మిల్లర్‌ బకాయిలు వసూలులో టెండర్‌ ప్యాడీ పనితనమేమీ లేదు.

`అధికారుల చొరవ లేనిది ఏ పని కాదు.

`టెండర్‌ ప్యాడీని కోట్లు చెల్లించుకుంటూ మేపడం అవసరం లేనిది.

`టెండర్‌ ప్యాడీకి ఇచ్చే సొమ్మే మిల్లర్లకు ఇస్తే ప్రభుత్వానికి మేలు.

`సన్న బియ్యం పథకం మరింత విజయవంతమయ్యేందుకు తిరుగుండదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          ఎంత చెట్టుకంత గాలి, సీత కష్టాలు, సీతవి, పీత కష్టాలు పీతవి అని వింటుంటాం. అలాగే రైస్‌ మిల్లర్ల కష్టాలు కూడా కనిపించనంత పెద్దగానే వుంటాయి. కాని సమాజంలో రైస్‌ మిల్లర్లు అంటే ఒక రకమైన అభిప్రాయం వుంది. ఆ అభిప్రాయం అనేది నిజమా? కాదా? అన్నది లోతుగా తెలిసిన వాళ్లకే తెలుస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధానం ఒకటి తెలంగాణలో వుంది. గత ప్రభుత్వ హాయాంలో దీనిని ప్రవేశపెట్టడం జరగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వం రైస్‌ మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయలేదు. దాంతో అది పెరిగి కొండలా మారింది. నిజానికి బకాయిలు పెద్దవి చేసుకోవాలని ఎవరూ అనుకోరు. అప్పటి ప్రభుత్వ అలసత్వమో, అధికారుల నిర్లక్ష్యమో, సంబంధిత శాఖ పెద్దల ఉదాసీనతో గాని, మిల్లర్ల బాకాయిలు బాగానే పెరిగిపోయాయి. అంటే కొన్ని వేల కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణలో గత ప్రభుత్వం మారి, ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ బకాయిల గురించి పూర్తిగా బైట పడిరది. అయితే కొండలా పేరుకుపోయిన మిల్లర్ల బకాయిలు వసూలు చేయడానికి గత ప్రభుత్వం ప్రత్యేకంగా టెండర్‌ ప్యాడీ విధానాన్ని తెచ్చింది. నిజానికి అది అవసరం లేదు. కాని ఎవరు సూచించారో? ఎవరు సలహా ఇచ్చారో గాని, మొత్తానికి టెండర్‌ ప్యాడీ అనే వ్యవస్దను తెచ్చి మిల్లర్ల నెత్తిన పెట్టేశారు. అందులో ఓ నలుగురు వ్యక్తులు నాలుగు ఏజెన్సీలుగా టెండర్‌ ప్యాడీ దక్కించుకున్నారు. అప్పటి నుంచి మిల్లర్లకు వేధింపులు, ఇబ్బందులు మొదలయ్యాయి. నిజానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెండర్‌ ప్యాడీకి చెందిన వ్యవస్ధ మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమే కాదు, నిర్ణీత గడువులో వాటిని ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు కాలేకపోయినా, చేయలేకపోయినా ఆ ఏజెన్సీలు ప్రభుత్వానికి వున్న బకాయిలు చెల్లించాలి. ఇందులో మిల్లర్లకు ఎలాంటి సంబంధం లేదు. నిజానికి ఈ వ్యవస్ధ అనేదే వ్యర్ధం. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే సివిల్‌ సప్లై శాఖకు వేలాది మంది ఉద్యోగులున్నారు. వందలాది మంది ఉన్నతాదికారులున్నారు. పైగా ప్రతి జిల్లాలకు ఒక జాయింట్‌ కలెక్టర్‌ వున్నాడు. వారిపై పై స్దాయిలో కూడా మంత్రిత్వ శాఖలో కూడా ఉన్నతాదికారులున్నారు. ఇంత మంది వున్న తర్వాత గత ప్రభుత్వం టెండర్‌ ప్యాడీని కాల్‌ఫర్‌ చేసింది. నలుగురు టెండర్‌ ప్యాడీ పాడారు. కాని వారికి ఎలాంటి ప్రత్యేకమైన వ్యవస్ధ వుండదు. వారికి ప్రత్యేకమైన యంత్రాంగం ఏమీ వుండదు. ఆ ఏజెన్సీలకు ఉద్యోగులు కూడా వుండరు. ఆ టెండర్‌ ప్యాడీ ఆధారపడాల్సింది మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల మీదనే ఆదారపడి పనిచేయాలి. మిల్లర్ల వద్ద బకాయిల వసూలుకు సివిల్‌ సప్లై అదికారులను వినియోగించుకుంటుంటారు. మిల్లర్ల మీద ఒత్తిళ్లు తెస్తుంటారు. ఇలా ఈ రేవంత్‌ సర్కారు వచ్చిన తర్వాత సుమారు ఓ 20వేల కోట్ల వరకు వసూలు చేశారు. ఈ టెండర్‌ ప్యాడీనికి పాడుకునేందుకు కొంత మొత్తం ఈఎండి చేస్తారు. చాల వరకు ఈ టెండర్‌ మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేశారు. అయితే ఇంకా కొన్ని బకాయిలు మిగిలిపోయాయి. ఇలా మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడానికి ప్రభుత్వం టెండర్‌ ప్యాడీ వ్యవస్ధకు క్వింటాలుకు సుమారు రూ.230 వరకు ఇస్తుందని సమచారం. ఇలా కేవలం మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడానికి మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయలు రాయల్టీగా అందుకుంటున్నారు. ఇలా టెండర్‌ ప్యాడీకి ఇస్తున్న సొమ్మును మిల్లర్లకే ఇస్తే, మిల్లర్లు ఎంతో సంతోషంగా బకాయిలు చెల్లిస్తారు. ప్రభుత్వానికి సకాలంలో బియ్యం కూడా సరఫరా చేస్తారు. కాని ప్రభుత్వాలు ఆ పని చేయకుండా మధ్య దళారీ వ్యవస్ధను తయారుచేశారు. అది మిల్లర్లకు శాపంగా మారుతోంది. గతంలో టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ వసూలు చేయగాని ఇంకా కొన్ని బకాయిలు చాలా మంది మిల్లర్ల నుంచి వసూలు చేయాల్సి వుంది. ఆ బాకాయిలను టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ కావాలనే వసూలు చేయలేదన్నది మిల్లర్ల నుంచి వినిపిస్తున్న మాట. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ కావాలనే బకాయిల వసూలుకు రాకుండా, గడువు ముగిసేలా చేసిందని మిల్లర్లు చెబుతున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా మిల్లర్లనుంచి బకాయిలు వసూలు చేయకుండా, కాలయాపన చేసి, ఇప్పుడు వాటికి పెనాల్టీ వేసి వసూలు చేయడానికి టెండర్‌ ప్యాడీ సిద్దమైనట్లు తెలుస్తోంది. మా దగ్గర డబ్బులున్నాయి. మేం బకాయిలు చెల్లించేందుకు ఎప్పుడూ సిద్దంగా మొర్రో అని మిల్లర్లు మొత్తుకుంటున్నా, టెండర్‌ ప్యాడీ వినలేదు. పైగా ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు అందించి, మిల్లర్లను విలన్లను చేయాలని చూస్తున్నట్లు సమాచారం. నిజం చెప్పాలంటే ఇక్కడ టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ అనేది మిల్లర్లకు శాపంగా మారింది. మిల్లర్ల పాలిట టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ వేదించుకు తింటుందనే వాదన వుండనే వుంది. తమ చేతుల్లో పని వుండి, చేతుల్లో డబ్బులు వున్నప్పుడు బకాయిలు చెల్లిస్తామంటే తీసుకోవడం లేదనేది మిల్లర్లు చెబుతున్న మాట. తమ వద్ద డబ్బులు లేని సమయం చూసి బకాయిల వసూలు చేసేందుకు టెండర్‌ ప్యాడీ నోటీసులు ఇవ్వడం అంటే తమను వేదించడమే అని మిల్లర్లు వాపోతున్నారు. అయినా మిల్లర్ల మీద టెండర్‌ ప్యాడీ పెత్తనం ఎందుకు? అని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. తాము బకాయిలు చెల్లించడానికి ఈ సమయానికి కూడా సిద్దంగా వున్నామని మిల్లర్లు అంటున్నారు. అయినా టెండర్‌ ప్యాడీ కిరికిరి పెడుతుందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. తమ నుంచి పెనాల్టీలు వసూలు చేసి, ప్రభుత్వం వద్ద పేరు కొట్టేయడానికి, టెండర్‌ ప్యాడీని రెన్యువల్‌ చేసుకోవడానికి టెండర్‌ ప్యాడీ ఆడుతున్న నాటకమని మిల్లర్లు అంటున్నారు. ఏ రాష్ట్రంలోని లేని విదానాన్ని గత ప్రభుత్వం తెచ్చిన మా నెత్తిమీద రుద్దిందని, ఈ ప్రభుత్వం రద్దు చేయాలని మిల్లర్లు కోరుతున్నారు. తమకు చేతి నిండా పుష్కలంగా పని వుందని, ప్రభుత్వ బకాయిలు పూర్తిగా చెల్లించడానికి అభ్యంతరమేమీ లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా వున్న 3వేల మంది మిల్లర్లను పిలిచి మాట్లాడితే తమకున్న సమస్యలు, టెండర్‌ ప్యాడీ వల్ల ప్రభుత్వానికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తామంటున్నారు. తెలంగాణలో ఎంతో మంది సమర్ధవంతమైన అదికారులున్నారు. వారు చేయలేని పని టెండర్‌ ప్యాడీ చేయలేదు. పైగా అధికారుల సహాకారంతోనే టెండర్‌ ప్యాడీ పనిచేయాలి. అలాంటప్పుడు ఈ వ్యవస్ధ ఎందుకు అని మిల్లర్లు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో అన్ని విషయాలు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని మిల్లర్ల అసోసియేషన్‌ జిల్లాల అద్యక్ష, కార్యదర్శులు కోరుతున్నారు. నేటిదాత్రితో జిల్లాలకు చెందిన మిల్లర్‌ అసోసియేషన్‌ అద్యక్ష , కార్యదర్శులు మాట్లాడుతూ టెండర్‌ప్యాడీ వ్యవస్ధ మూలంగా మొత్తం సివిల్‌ సప్లై శాఖను చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నారని అంటున్నారు. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధకు కోట్ల రూపాయిలు ఇచ్చిన కూర్చుండ బెట్టి మేపడం తప్ప ఏమీ లేదని మిల్లర్లు అంటున్నారు. ఇలాంటి వ్యవస్ధ వల్ల మొత్తం మిల్లింగ్‌ వ్యవస్ధ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుందని అంటున్నారు. టెండర్‌ ప్యాడీకి ఇచ్చే రాయిల్టీ తమకే ఇస్తే, మాకుఎంతో ప్రభుత్వం మేలు చేసిందౌతుందంటున్నారు. దేశంలో ఎక్కడా లేని సన్న బియ్యం ప్రజలకు అందించే గొప్ప కార్యక్రమం అమలు జరుగుతోంది. అందుకు అవసరమైన బియ్యాన్ని సరఫరా చేయాల్సింది మిల్లర్లే. అలాంటి మిల్లర్లను ఇబ్బందుల పాలు చేస్తూ పోతే, ప్రభుత్వం అమలు చేసే సన్న బియ్యం పధకానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇంత పెద్ద వ్యవస్ధను ఓ నలుగురు వ్యక్తులు శాసిస్తూ, వేదిస్తూ పోతుంటే మిల్లర్లు అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version