పిల్లల పాలిట పాపిష్టిజ్యోతి! ఇదేం చదువు చెప్పే రీతి.

-వీపు అంతా వాతలు! కమిలిపోయేలా దెబ్బలు!!

-రాచిరంపాన పెడుతున్న పరంజ్యోతి.

-మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం.

-మాటలు రాని విద్యార్థిని చితకబాదిన టీచర్‌.

-ఏడ్చిన కన్నీళ్లు తప్ప మాట్లాడలేని పసిపిల్లాడు

-యూకేజీ విద్యార్థిని అంతగా కొట్టాల్సిన అవసరం ఏముంటుంది!

oasis school warangal incident

-దెబ్బలకు విద్యార్థి చనిపోతే బాధ్యులెవరు?

-భారతీయత అనే వాట్సాప్‌ గ్రూప్‌ లో పిల్లల దెబ్బల ఫోటోలు వైరల్‌.

-ఏ మీడియా ఏం చేయలేదని పరంజ్యోతి వాక్యాలు?

-మూగ విద్యార్థి మీద టీచర్‌ ప్రతాపం.

oasis school warangal incident

-పాఠాలు చెబుతున్నారా! కోపాలు తీర్చుకుంటున్నారా!

-మీకు పిల్లలు లేరా! వారిని ఇలాగే కొడతారా!!

-పసివాడన్న కనికరం లేని టీచర్లు.

-ఎంత కొట్టినా ఏడ్వలేడు పిల్లాడు 

-చేతులెలా వచ్చాయో టీచర్‌ కు..

-వరంగల్‌ ఒయాసిస్‌ స్కూల్‌ టీచర్‌ నిర్వాకం.

-టీచర్‌ కొడుతున్నా అరవలేడు.

-ఏడ్చినా కన్నీళ్లు తప్ప మాటలు రావు.

-అలాంటి విద్యార్థిని కొట్టేందుకు టీచర్‌కు చేతులెలా వచ్చాయి.

-మాటలు రాని విద్యార్థి మీద కనికరం లేకుండా దెబ్బలు.

-యూకేజీ విద్యార్థిపై ఇంత దాష్టికమా?

-విద్యార్థికి మాటలు రాకపోవడం నేరమా

-మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం.

-తల్లిదండ్రులను పిలిచి బుజ్జగింపులు.

-తల్లిదండ్రులతో పరంజ్యోతి బేరసారాలు.

-ఫీజులో రాయితీ కల్పిస్తామని తల్లిదండ్రులను వేడుకలు.

-ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని స్కూల్‌ ను మూసేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌.

-విద్యాశాఖ సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు.

-చైల్డ్‌ వెల్పేర్‌ వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                     

అతను యూకేజీ చదువుతున్న పసివాడు. రోజూ స్కూలుకు వెళ్లినట్లే వెళ్లి ఇంటికి వచ్చాడు. తల్లి స్కూల్‌ యూనిఫామ్‌ మార్చేందుకు అబ్బాయి షర్టు విప్పింది. అంతే ఆ అబ్బాయిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నది. గుండెలు పిండేలా ఆ తల్లికి ఏడుపు వచ్చింది. ఆ అబ్బాయి వీపంతా తడిమి చూసింది. ఆ తల్లి చేయి వీపు మీద పడగానే ఆ పసివాడు విలవిలలాడిపోయాడు. ముట్టుకుంటేనే జంకుతున్నాడు. వీపంతా ఎర్రగా మారిపోయింది. రక్తం కనిపించేలా వీపు మీద వాతలు తేలాయి. ఏం జరిగిందో చెప్పడానికి ఆ పసివాడికి మాటలు రావు. సహజంగా చిన్న పిల్లలకు మాటలు రాకపోవడం వేరు. కాని ఆ అబ్బాయికి పుట్టుకతోనే మాటలు రావు. కాని ఆ తల్లిదండ్రులు తమ పిల్లాడు చదువుకోవాలని ఆశించారు. అది కూడా ఎంత ఖర్చయినా సరే మంచి ప్రైవేటు స్కూలుకు పంపాలని అనుకున్నారు. ఫీజులు చెల్లిస్తున్నారు. మాటలు రాకపోయినా, మన మాటలు వింటాడు. మనం ఏం చెబుతాడో అర్ధం చేసుకోగలడు. అందువల్ల స్కూలుకు పంపిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కాని స్కూలు నుంచి ఇంటికి విచ్చన ఆ పసివాడి వీపు నిండా వాతలే వున్నాయి. అది కూడా వీపంతా కమిలిపోయేలా దెబ్బలు కనిపిస్తున్నాయి. ఆ తల్లి తట్టుకోలేక ఏమైంది నాన్నా, అని అడిగినా ఏదీ చెప్పలేని మూగ జీవితం ఆ పసివాడిది. కనీసం టీచర్‌ కొట్టాడని చెప్పలేడు. టీచర్‌ కొడుతుంటే ఏడ్వలేడు. తన భాధను కన్నీటి రూపంలో తప్ప మరో రకంగా చెప్పలేడు. అందులోనూ టీచర్‌ కర్కషంగా కొట్టినా ఆ పసివాడు వద్దని వారించే వయసు కాదు. కొట్టకండి సార్‌ అనేందుకు నోరు లేదు. ఎదురుతిరిగే వయసు అసలే కాదు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్చించలేడు. కొడుతుంటే చూస్తూ ఊరుకోవడం, బాధను ఓర్చుకోవడం తప్ప ఆ పసివాడు ఏమీ చేయలేని నిస్సహాయుడు. అలాంటి పసివాడిని కసి తీరా కొట్టిన ఆ టీచర్‌ ఎవరో గాని అతను కర్కోటకుడా? లేక రాక్షసుడా? ఒక పసివాన్ని ఇంతలా కొట్టడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? అసలే మూడు నాలుగేళ్ల పిల్లవాడు. మాటలు రాని మూగ వాడు. అలాంటి పిల్లాన్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని మరింత పాఠాలు చెప్పాల్సిన మానవత్వం ఆ టీచర్‌కు వుండాలి. అంతే కాని ఆ పిల్లాడిని కసి తీరా కొట్టేంత దుర్మార్గుడు టీచర్‌ గా పనిచేయడానికి అనర్హుడు. శిక్షార్హుడు. అలా పిసి పిల్లవాడిని కొట్టిన టీచర్‌ను నిజంగానే చెట్టుకు కట్టేసి కొట్టితా తప్పులేదు. ఆ టీచర్‌ మిడిమిగి జ్ఞానం వున్నవాడైనా కావాలి. లేకుంటే ఆ స్కూల్‌ యాజమాన్యానిది వింత పోకడైనా కావాలి. ప్రైవేటు స్కూళ్లకి పంపిస్తే పిల్లలకు దగ్గరుండి చదువు చెబుతారని అనుకుంటారు. కాని ఇలా ఒళ్లు కమిలిపోయేలా కొట్టడాన్ని ఎవరూ సహించరు. అసలు కొట్టిన వాడికి పిల్లలున్నారా? లేరా? ఇంట్లో వాడి పిల్లలను అలాగే కొడుతున్నాడా? ఆరా తీయాలి. ఎందుకంటే బిఈడీ, టిటిసి ట్రైనింగ్‌ చీసుకునే చాత్రోపాద్యాయులకు పిల్లల గురించి ప్రత్యేకంగా బోధన జరుగుతుంది. చైల్డ్‌ సైకాలజీ చదువుకోవాలి. పిల్లల మనస్తత్వాలను గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల అందిరి మనస్తత్వం ఒక్కలా వుండదు. పిల్లలందిరకీ ఒకే రకమైన ఆలోచనలు వుండవు. కొంత మంది పిల్లలు స్వతహానే చదువుకుంటారు. మరి కొంత మంది పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటారు. కొంత మంది ఎప్పుడూ ఆటల మీదనే దృష్టిపెడుతుంటారు. మరి కొంత మంది విద్యార్ధులకు ప్రత్యేక నైపుణ్యాలుంటాయి. ఇలా ఒక్కొ విద్యార్ధికి ఒక్కొ రకమైన జ్ఞానం సొంతంగా వుంటుంది. వాటిని గమనించి వారి వారి ఆలోచనలకు అనుగుణంగా పాఠాలు చెప్పడమే చైల్డ్‌ సైకాలజీ. ఇలా పిల్లాడిని వీపుంతా కమిలిపోయేలా కొట్టిన వాడి చదువు సంధ్యలేమిటో తెలుసుకోవాలి. పిల్లల్లో అల్లరి చేసేవాళ్లు కొంత మంది వుంటారు. అయితే యూకేజీ చదువుకునే పిల్లల అల్లరి ఆనందంగానే వుంటుంది. అలాంటి విద్యార్ధుల అల్లరిని చూసి కోపం తెచ్చుకునేవాడు టీచర్‌గానే పనికిరాడు. అందులో నోటి నుంచి మాట రాని ఓ మూగ పిల్లవాడు చెసే అల్లరి ఏముంటుంది? అలాంటి పిల్లలు అల్లరి చేయడానికి కూడా ఇష్టపడరు. ఎంత సేపు తోటి పిల్లలను గమనిస్తూ వుంటారు. అంతే తప్ప వాళ్లు ఇతర పిల్లలతో పోట్లాడేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. అందరి వైపు ఒక రకమైన చూపులతో చూస్తూ మిగతా వారు గలగల మాట్లాడుతుంటే, నేనేందుకు మాట్లాడడం లేదన్న భావన తన మనసు ఆ పసి హృదయాన్ని ప్రశ్నిస్తూనే వుంటుంది. అలాంటి పిల్లాడిని కొట్టిన స్కూల్‌ యాజమాన్యంలో కనీసం పశ్చాత్తాపం లేదు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పేందుకు కూడా యాజమాన్యానికి ఇష్టం లేదు. ఏ మీడియా నన్ను ఏమీ చేయలేదంటూ ఏం జరిగిందని ప్రశ్నించిన మీడియాతో యజమాని పరంజ్యోతి చిర్రుబుర్రులాడడం వింతగా వుంది. విచిత్రంగా వుంది. తాజాగా ఆ పిసివాడిని కొట్టిన దెబ్బలకు సంబంధించిన ఫోటోలు పెద్దఎత్తున భారతీయత అనే వాట్సాప్‌ ద్వారా పెద్దఎత్తున వైరల్‌ అవుతున్నాయి. వరంగల్‌ జిల్లా మొత్తం పాకిపోయింది. అది గమనించిన ఒయాసిస్‌ స్కూల్‌ యజమాని ఆ పసివాడి తల్లిదండ్రులను పిలిపించుకొని బేర సారాలకు దిగినట్లు కూడ సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని తల్లిదండ్రులను కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. తమ పిల్లాడి ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ స్కూల్‌ మేనేజ్‌ మెంటు ఆ తల్లిదండ్రులకు ఆశలు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దఎత్తున సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవుతుండడంతో మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే వారిని పరంజ్యోతి బెదిరిస్తున్నారు. నా వెనుక పెద్ద పెద్ద నాయకులున్నారంటూ చెబుతున్నట్లు మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఈ విషయం కొంత మంది పోలీసు అదికారుల దృష్టికి వచ్చింది. ఏ జరిగింది? మీ స్కూలు బస్సులు ఇలా రోడ్డు మీద వుంటే ఎలా? అని ఆ పోలీసులు అదికారులు ప్రశ్నిస్తే మీపై ఆఫీసర్‌కు ఏం కంప్లయింట్‌ చేస్తావో చేసుకో అని వారిని కూడా పరంజ్యోతి బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలా స్కూల్‌లో దుర్మార్గాలు జరుగుతుంటే ప్రశ్నించిన వారిని బెదిరించే స్దాయికి విద్యా సంస్ధలు ఎదగడం అనేది వ్యవస్దకే నష్టం. అందువల్ల విద్యా శాఖ జరిగిన సంఘటనపై వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. విద్యార్ధిని అంతలా చితకబాదినా డిఈవో, ఎంఈవోలు ఇంత వరకు స్పందించలేదు. ఆ స్కూల్‌లో ఏం జరిగిందన్నదానిపై వివరణ తీసుకునే ప్రయత్నం చేసినట్లు లేదు. ఇప్పుడు జరిగింది చిన్న సంఘటన కాదు. పసివాడిని వీపులో పిడికిలితో టీచర్‌ గుద్దితే ఆ పిల్లోడి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఎవరు బాధ్యులు? అదృష్టం బాగుండి పిల్లవాడుచేయని తప్పుకు శిక్షను అనుభవించాడు. అదే ప్రాణాల మీదకు వస్తే అప్పుడు పరిస్దితి ఏమిటి? ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా వుంది. అంత జరిగితే ఆ విషయాన్ని బైట పెట్టకపోవడం కూడా తప్పే. ఇవాళ ఈ అబ్బాయికి జరిగింది. మరోసారి మరో అబ్బాయికి జరగదన్న గ్యారెంటీ ఏముంది? ఈ తల్లిదండ్రులను బెదిరించినట్లే ఇతర తల్లిదండ్రులను కూడా స్కూల్‌ యాజమాన్యం బెదిరిస్తుంది. భయపెడుతుంది. కనీసం మాటలు రాని పిల్లాడిని ఎలా కొట్టారని ప్రశ్నించే ధైర్యం తల్లిదండ్రులకు లేదా? ఫీజుల్లో రాయితీ ఇస్తామని చెబితే అంగీకరిస్తారా? మీ పిల్లాడి ప్రాణాలకన్నా, చదువు ఎక్కువకాదు. ఆ స్కూల్‌ ఫీజు రాయితీ అంతకన్నా పెద్దది కాదు. ఇప్పటికైనా ప్రైవేటుస్కూళ్లలో చదువుకునే తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. వారి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తున్నారు? తమ పిల్లలను టీచర్లు ఎలా ట్రీట్‌ చేస్తున్నారన్నది కూడా తెలుసుకుంటుండాలి. లేకుంటే స్కూళ్ల యజమాన్యాల వేషాలు మితిమీరిపోతుంటాయి. విద్యా శాఖతోపాటు, చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖ వెంటనే స్పందించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విద్యార్ధిని కొట్టిన టీచర్‌ను, ఆ స్కూల్‌ యజమాని పరంజ్యోతిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే కట్టడి చేయకపోతే మిగతా స్కూళ్లు కూడా ఇలాగే తయారౌతాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version