విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య

విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గీతం!

ఉద్యమానికి మనోబలం తెచ్చిన శబ్ద తరంగం!
వందేమాతరానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా, పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కలనల్ సెంతిల్ రామదురై, పరిపాలన అధికారి రవి సోనహరే వారి ఆదేశాల మేరకు జడ్పీహెచ్ఎస్ మొగుల్లపల్లి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎస్.భాగ్యశ్రీ, ఎన్సిసి అధికారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్సిసి విద్యార్థులచే జాతీయ గీతం అయిన వందేమాతరం పూర్తి గేయాన్ని మూడు నిమిషాల ఆలపించి, మొగుళ్లపల్లి వీధుల గుండా ర్యాలీగా వెళ్లి,చౌరస్తాలో మానవహారం ఏర్పరిచి మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, సమక్షంలో వందేమాతర గీతాన్ని ఆలపించి దాని యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎన్సిసి అధికారి మాట్లాడుతూ వందేమాతరం యొక్క పుట్టుక, దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టి. వెంకన్న,
బి. కుమారస్వామి, కె. ప్రవీణ్
ఎం. రాజు, డి. పద్మ, పి. లలిత,
జి. విజయభాస్కర్. ఆర్. చందర్ ఎండి. మజార్, బి. వేణు, ఎన్సిసి విద్యార్థులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

 

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version