కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పట్టుదల క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలి.

విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రత్యేక అధికారులు సంబంధిత సిబ్బంది ముందుకు సాగాలని, పిల్లలకు అందించే సౌకర్యాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.

బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని (కేజీబీవీ) కస్తూరిబా గాంధీ విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్ గది, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు, డైట్ మెనూ, తరగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రానున్న పరీక్షల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఏలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వారికి అర్థమయ్యే విధంగా నూతన డిజిటల్ తరగతులు ప్రాక్టికల్స్ ద్వారా విద్యను అందించాలని, పక్కాగా డైట్ మెనూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం స్నాక్స్ అందించాలని, తద్వారా పిల్లలు మంచి వాతావరణంలో విద్యను కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఉపయోగపడతాయన్నారు.

ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించి సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రతి విద్యార్థిని, గమనిస్తూ ఉండాలని, విద్యలో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు.

ప్రత్యేక అధికారులు ఇప్పటికే వారికి కేటాయించిన విద్యా సంస్థలలో తనిఖీలు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వసతిగృహాలు, విద్యా సంస్థల నివేదికలు సమర్పించాలని సూచించారు.

కేజీబీవీ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, స్పెషల్ అధికారినీ సోమలక్ష్మిని పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని, లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, స్థానిక తహసిల్దార్ వివేక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రజాపాలనకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరిక…

ప్రజాపాలనకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరిక

– కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 మంది యువకులు

సిరిసిల్ల(నేటి ధాత్రి ):

 

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై యువత స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడితో పాటు మాజీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టౌన్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, బ్లాక్ అద్యక్షులు సూర దేవరాజు కండువా కప్పి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని అన్నారు. అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో భారీగా ప్రజాప్రతినిధులను గెలిపించుకునేలా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తున్న తరుణంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తు ముందుకెళుతున్నామని చెప్పారు. పార్టీ పట్టిష్టత కోసం నిబద్ధతతో పని చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నూతనంగా పార్టీలో చేరిన యువకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ జిల్లా సభ్యులు సంగీతం శ్రీనాథ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిమల్ల భాను, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పోగుల దేవరాజు, పట్టణ యూత్ మాజీ అధ్యక్షుడు చిందం శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ ఆకేని సతీష్, నాయకులు కలిం, ఆడెపు ప్రసాద్, రాపల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కలెక్టర్ స్నేహ శబరీష్

శాయంపేట నేటిధాత్రి:

 

మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం శాయంపేట మం డల కేంద్రంలోని జెడ్పిహె చ్ఎస్ బాలికల పాఠశాల ఆవర ణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీ లించారు పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా యా, పోలింగ్ ప్రక్రియ సజావు గా సాగుతుందా! లేదా! అని పరిశీలించింది. మండలంలోని ప్రజలు ప్రతి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకో వాలని సూచించింది.ఈ సందర్భంగా మండలంలో పోలింగ్ ప్రశాంతంగా నిష్పక్షపా తంగా కొనసాగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర, ఎమ్మా ర్వో, గ్రామపంచాయతీ సిబ్బం ది ప్రభుత్వ రంగంలో పనిచేసే అధికారులు పాల్గొన్నారు.

సేంద్రియ గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహానికి నూతన ఆరంభం..

సేంద్రియ గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహానికి నూతన ఆరంభం..

జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..

హన్మకొండ, నేటిధాత్రి:

ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా, సేంద్రియ వ్యవసాయం మరియు చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు శనివారం రోజున పబ్లిక్ గార్డెన్స్ లోని నేరెళ్ల వేణుమాధవ్ కళ వేదికలో ఏర్పాటు చేసిన జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల వినియోగం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గ్రామీణ రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఆహార పదార్థాలు, నేటి మారుతున్న మోడరన్ ఫుడ్ కంటే ఎంతో మెరుగైనవి అన్నారు.ఈ సంత ద్వారా స్థానిక రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. వినియోగదారులు కూడా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా రైతుల వద్ద నుండే పొందగలరు అని తెలిపారు.
తరువాత, ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంతలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రైతులు, చేనేత కార్మికులు, గిరిజన కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి ఉత్పత్తుల ప్రత్యేకతలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ప్రదర్శించిన సేంద్రియ పంటలు, చేనేత వస్త్రాలు, గిరిజన హస్తకళా ఉత్పత్తులను అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version