అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలి
-జక్కి శ్రీకాంత్
వర్దన్నపేట (నేటిదాత్రి)

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రజలు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న “మహనీయుల స్ఫూర్తి యాత్ర” లో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా నాయకులు దోమకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరుపట్ల బాబు, బిజెపి వర్ధన్నపేట ప్రధాన కార్యదర్శి డోలి సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ నాయకులు మహమ్మద్ జాఫర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కుల పెద్దమనుషులు బిరు యాకయ్య, బిర్రు మామునూర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపాది శ్రీనివాస్, తక్కలపల్లి వెంకటేశ్వరరావు, కాంభోజ యాకయ్య, కాంభోజ సాయిలు, బిర్రు కుమారస్వామి, బిర్రు చంద్రయ్య పిటి, మంద ఎల్లయ్య, సమ్మయ్య, వెంకటయ్య, సమ్మయ్య, సాయిలు, వివిధ కుల నాయకులు పాల్గొన్నారు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జన్నే యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసిన చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరీ రాజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ మండల ప్రధాన కార్యదర్శులు మడికొండ రవీందర్రావు ఏరుకొండ రాజేందర్ మండల నాయకులు బైరం భద్రయ్య పాండ్రాల వీరస్వామి దామెర రాజు మేడిపల్లి శ్రీనివాస్ వల్ల కొండ లింగారెడ్డి చిదిరాల సరోజన వినవంక శ్రీదేవి మైదము కరుణ ముల్కోజు ప్రవీణ్ సిద్ధోజు శ్రీకాంత్ చారి కైరిక రాజు గుండు నగేష్ కట్కూరి రాజేందర్ కట్కూరి కుమార్ (గని) అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పూలమాలలు వేసి నివాళులర్పించిన.!

డా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే శివసీన రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

 

భారతరత్న డాక్టర్ బి. ఆ ర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ
రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త మరియు అణగారిన వర్గాల హక్కుల పోరాట యోధుడు.దళిత కుటుంబంలో జన్మించిన ఆయన కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ విద్యను అభ్యసించడానికి అడ్డంకులను అధిగమించి, కొలంబియా విశ్వవిద్యాలయం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి డిగ్రీలను సంపాదించారని అన్నారు
ఈ కార్యక్రమంలో కేతపల్లి విష్ణువ
ర్డన్ రెడ్డి పి సి సి దెలిగేట్ టి శంకర్ ప్రసాద్ అధికారులు ఆర్డీవో తహిసిల్ దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోర్డినెటర్ డి వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారు_

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తున్న వేముల మహేందర్ గౌడ్

జయంతి అంటే పాలతో ఫోటోలు కడగడం కాదు..ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి..పేదల పక్షాన నిలబడిన మహోన్నతమైన నాయకుడు బి.ఆర్ అంబెడ్కర్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మనుషుల్ని మనుషులుగా చూడని ఈ దేశంలో మనుషులంతా సమానమేనని, తాను రచించిన రాజ్యాంగం ద్వారా నిరూపించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయన హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేందర్ గౌడ్ మాట్లాడారు. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఎన్నో అవమానాలు, కుల వివక్షతను ఎదుర్కొని దేశంలో ఎన్నో సంఘసంస్కరణలకు ఆద్యం పోసి వెలి వాడల నుంచి దేశానికే రాజ్యాంగాన్ని అందించిన గొప్ప దార్శనికుడు, బడుగు బలహీన వర్గాల బహుజన బాంధవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటితరం వారి స్ఫూర్తి, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని..కుల వివక్షతకు..కుల నిర్మూలనకు..అగ్రవర్ణాల అణచివేతకు..వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఎతైన విగ్రహాలు నెలకొల్పి..జయంతులు..వర్ధంతుల సందర్భంలో మాత్రమే అంబేద్కర్ ను గుర్తు చేసుకునే ఒరవడిని కాకుండా వారి స్ఫూర్తిని, చరిత్రను భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు.

చల్లగరిగలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.

చల్లగరిగలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

చిట్యాలమండలం లోని చల్లగరిగ గ్రామంలో నేడు అంబేద్కర్ చౌరస్తాలో డా: బిఆర్ అంబేద్కర్ 134,వ జయంతి వేడుకలు సామాజిక కార్యకర్త నోముల శివశంకర్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి అశోక్ గార్ల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి గారు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి,స్విట్స్ పంచిపెట్టాడం జరిగింది, అనంతరం
మాట్లాడుతూ డా: బిఆర్ అంబేద్కర్ గురించి 120 దేశ ల రాజ్యాంగం లను అవపాసన పట్టీ ప్రపంచంలో నే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన పాలన విదానాన్ని,తేలిపిన విశ్వ మేధావి అని కొనియాడారు, ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బండి రాజు గారు, సినియర్ నాయకులు నల్ల రాజిరెడ్డి , సిరి పెళ్లి జంపయ్య గారు, నోముల నాగరాజు గారు,సోమిడి రఘుపతి ,జరిపోతుల ఓదేలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి,దూడపాక సరోత్తం, మరియు, బిసి ఎస్టీ మైనార్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు..

రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ.

రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ.

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాశిబుగ్గ నేటిధాత్రి.

 

 

ఆదివారం గ్రేటర్ వరంగల్ 16 వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ నుండి కీర్తి నగర్ వరకు డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ ఆధ్వర్యంలో పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం పరిరక్షణ పాదయాత్రను ఉద్దేశించి రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం అవమానించిందని, రాజ్యాంగ పరిరక్షనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవటానికి పోరాటం చేయాల్సిన పరిస్థితి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిందని అన్నారు.ప్రతి గ్రామానికి,ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్లి రాజ్యాంగానికి జరుగుతున్న ప్రమాదాన్ని వివరించాలన్నారు. పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.కుల మతాలను రెచ్చగొడుతూ బిజెపి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని అన్నారు.దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరియు భారత రాజ్యాంగం పై బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, డివిజన అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

బి ఆర్ అంబేద్కర్ కు ఘనమైన నివాళులు.

బి ఆర్ అంబేద్కర్ కు ఘనమైన నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు కేసముద్రం మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు

అనంతరం కేసముద్రం మండలలో అంబేద్కర్ సంఘం భవనం నిర్మాణం కోసం కోటి 50 లక్షలు రూపాయలు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి, ఎమ్మెల్యే మురళి నాయక్ కు ఎంపీ బలరాం నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం , ఎస్సై మురళీధర్ రాజ్, పిసిసి సభ్యులు దశ్రు నాయక్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,వేముల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలపాక నాగరాజు,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ సిహెచ్ వసంతరావు, ఎండి అయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, దామరకొండ ప్రవీణ్, యాకూబ్, కనుకుల రాంబాబు, మహేందర్, సమ్మయ్య గౌడ్, సామల నరసయ్య, సారయ్య,చేడుపేల్లి ఎలేందర్,అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు వల్లందాస్ రవి, నిల్పుగొండ ఏలియా, మందుల కృష్ణమూర్తి, సోమారపు మదర్, జల్లంపల్లి శ్రీను, జల్లే యాకాబ్రాం,దండు శ్రీను,జలంధర్,ఆనందం, నేరెళ్ల శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో ర్యాలీ నిర్వహించి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ స్థాయి గర్వించదగ్గ గొప్ప మహనీయులని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి ప్రపంచ స్థాయిలో దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి అమలవుతుందని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ లోపల అభివృద్ధి కార్యక్రమాలు రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల మహిళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రతి ఒక్కరు ముందుగు సాగాలి.

అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రతి ఒక్కరు ముందుగు సాగాలి

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల, ఏప్రిల్ – 14(నేటి ధాత్రి):

 

మహానీయులను స్మరిస్తూ మాతృదేశానికి సేవ చేయడమే వారికి మనం ఇచ్చే ఘాన నివాళి అని, అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రతి ఒక్కరు ముందుగు సాగాలన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
సామాజిక వివక్షను జయించి,అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతిగా,అన్ని వర్గాల ప్రజలకు సమాన్యాయం కల్పిస్తూ భారత దేశ అభివృద్ధికి , అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు.
అంబేద్కర్ జీవితం,బోధనల నుండి ప్రేరణ పొంది,ఆయన ఆశయల దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ.

జహీరాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జహీరాబాద్ పట్టణంలో డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ సభకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈసందర్భగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ..ఆర్థికవేత్త రాజా నీతిజ్ఞుడు భారత రాజ్యాంగ రూపకర్త మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి జహీరాబాద్ పట్టణంలో పూలమాలవేసి నివాళులర్పించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.యావత్ భారత్ మొత్తం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్.కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మాజీ జెడ్పీటీసీలు రాందాస్,నరేష్,మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లుశేఖర్,తాహేరా బేగం,మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,హర్షద్ పటేల్,అశ్విన్ పాటిల్,తాహేర్ పాటిల్,కె.జగదీశ్వర్ రెడ్డి,రాజు నాయక్,సునీల్,నర్సింహా యాదవ్,అక్షయ్ జాడే,రాజు,జహీర్ అరబ్బీ,ప్రమోద్, జగదీష్,మోహిన్,నిజాం మరియు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి

మహోన్నతుడి ఆశయాలను కొనసాగించాలి సోమరపు శ్రీరాములు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మహోన్నతుడు మహనీయుడు భారతదేశపు రాజ్యాంగ పితామహుడు భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్) 135 వ జయంతి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మోహినుద్దీన్ ఆదేశాల మేరకు సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎన్ హెచ్ ఆర్ సి అండ్ డబ్ల్యు ఈ ఓ కేసముద్రం మండల ప్రెసిడెంట్ సోమారపు శ్రీరాములు, జన్ను శీను పూలమాలతో సత్కరించిన అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఈ గొప్ప మహనీయుడి జయంతి జరుపుకోవాలని చాలా సంతోషకరం వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిస్తూ  తెలియజేశారు.

అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంద

 

ర్భంగా ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని జమియత్ ఉలమా-ఇ-హింద్ మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్
ఘన నివాళులు అర్పించారు.అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని చెప్పారు.

డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

ఘనంగా డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో ఎమ్మెల్యే .పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్
134వ జయంతి సందర్భంగా డాక్టర్..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ మేధావి,నవభారత నిర్మాత,బహుముఖ ప్రజ్ఞాశాలిగా అణగారిన పేద,బడుగు,బలహీన వర్గాల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు..అత్యంత మేధోసంపతితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ .అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించి వారి జీవితాల్లో సామాజిక విప్లవ స్ఫూర్తి నింపిన ప్రదాత అంబేద్కర్ అని పేర్కొన్నారు..స్వాతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు,మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించి భావితరాలకు సమ సమాజాన్ని అందించాలని కాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానీ రచించారన్నారు..అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో
మండల కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు , మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ , మండల నాయకులు షేక్ రఫీ , బరపటి వెంకన్న , చందా నాగేశ్వరరావు , ఒగలబోయిన శ్రీను , పూజారి వెంకన్న, కొమరం వెంకటేశ్వర్లు , బిలపాటి సంపత్ , తోలేం కృష్ణ , గాంధర్ల రామనాథం , పోలేబోయిన చందర్రావు అశ్రపునిసా , కార్యకర్తల,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు.

జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సినారె గ్రంథాలయంలో
డాక్టర్,భీమ్ రామ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించారు.
అనంతరం గ్రంథాలయ విద్యార్థినీ,విద్యార్థులను పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జిల్లా గ్రంథాలయంలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి. మహనీయుడైన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు .
ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు కమటం మల్లయ్య, గ్రంథాలయ సిబ్బంది, సాయి,
మహేష్ మరియు, విద్యార్థులు,పాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు

పరకాల అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య

బాబా సాహెబ్ చిత్రపటానికి,విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు

 

పరకాల నేటిధాత్రి

 

సోమవారం రోజున పరకాల పట్టణంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన దేశంలోని అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి అగ్నిమాపక అధికారి వి. భద్రయ్య శ్రద్ధాంజలి ఘటించి మౌనంపాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు,కోల్డ్ స్టోరేజీలు, పరిశ్రమలు,మొదలైన వాటిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలని తెలిపారు.ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరకాల అగ్నిమాపక కేంద్రం 8712699306, 8712699307 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.అగ్ని ప్రమాద సమాచారం త్వరగా తెలియజేస్తే ప్రమాద నష్టం ఎక్కువగా జరగకుండా చూడవచ్చునని అన్నారు.

అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు

అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య భారత రాజ్యాంగ నిర్మాత 134వ జయంతి సందర్బంగా అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో అగ్నిమపక సిబ్బంది పాల్గొన్నారు.

డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 134వ జయంతి.

ప్రపంచ మేధావి, సమ సమాజ కాంక్షి,రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 134వ జయంతి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

అబ్రహం మాదిగ మాట్లాడుతూ… అంబేడ్కరిజం అంటే కేవలం అయన గారి జన్మ.మరణ దినాలు కాదు నిర్వహించాల్సింది,ఆయన ఆశయాలను కోనసాగించటమే అయనకు మనమిచ్చే నివాలి.
సమాజంలోని కుల వివక్షతకు,అంటరానితనానికి వ్యతిరేకంగా తన ఆఖరి శ్వాస వరకు పోరాటం చేసి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సాహెబ్ గారు.
ఎస్సీ వర్గీకరణ పై జీ ఓ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ పక్షాన ధన్యవాదములు తెలుపుతున్నాము…
ఈట్టి కార్యక్రమంలో… ఉల్లాస్ మాదిగ, జైరాజ్ మాదిగ, సుకుమార్ మాదిగ, రాజు మాదిగ, కిట్టు మాదిగ, టీంకు మాదిగ, రాజు మాదిగలు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్మించారు ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు కన్నె అరుణ్ కుమార్ జనరల్ సెక్రెటరీ కన్వీనర్ రెడ్డి మల్ల సుఖేందర్ పోకల శ్రీనివాస్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ బీజేవైఎం అధ్యక్షులుకోసిని వినయ్ యాదవ్ ఉపాధ్యక్షులు బక్క శెట్టి రాజు ఇటికల మహేందర్ సహాయ కార్యదర్శి రెడ్డి మల్ల ఆశీర్వాద్ మహేష్ బలగం భాస్కర్ గౌడ్ నిఖిల్ బాబు అధ్యక్షులు జంగం కిషన్ బుజ్జ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు…

– నివాళులర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్….

కొల్చారం, (మెదక్)నేటి ధాత్రి :-

 

 

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తా, పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

B.R. Ambedkar

ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, వివిధ కుల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు
అంబేద్కర్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి
ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

కల్వకుర్తిలో ఘనంగా బి”ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో భారతరత్న, రాజ్యాంగ ప్రధాత, ప్రపంచమేదావి, బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టణంలోని బిజెపి నాయకులు పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు తదనంతరం పాలమూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా తరలి వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్, మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్,
మాజీ అధ్యక్షులు బోడ నరసింహ,
జిల్లా కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ రెడ్డి,
బీసీ మోర్చా పాలకూర రవిగౌడ్,
మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుండోజు గంగాధర్,
పట్టణ ఉపాధ్యక్షులు కొల్లూరి శ్రీధర్, నాయకులు నాప శివ, వాకిటి శ్రీకాంత్,అరవింద్ రెడ్డి, లక్ష్మీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు

ప్రజాసేవయే నా జీవిత ఆశయం…

ప్రజాసేవయే నా జీవిత ఆశయం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల నక్క రవిపై.ప్రత్యేక కథనం. ఈ సందర్భంగా వారి మాటల్లోనే తాను చిన్నతనంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక ప్రముఖ వైద్యులు దగ్గర వైద్యం నేర్చుకొని ఎలాగైనా పల్లెటూరు ప్రజలకు వైద్య సేవలు అందించాలని నిశ్చయంతో ఊరిలో ప్రాక్టీసు ప్రారంభించానని తద్వారా ఏ రాత్రి అయిన గ్రామ ప్రజలకు గాని చుట్టుపక్కల ప్రజలకు గాని అత్యవసరమైన సమయంలో వైద్య సేవలు అందించడం నా పూర్వజన్మ సుకృత ముగ భావిస్తునని ఇలా ప్రజలకు ప్రథమ చికిత్స చేసి అత్యవసర సమయంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రక్రియ చేసి మెరుగైన వైద్యం కొరకు ప్రజలకు ముందుగాసేవ చేసే అదృష్టం ఆ దేవుడు నాకు కల్పించడానికి అదృష్టంగా భావిస్తున్నాను తెలియజేస్తూ అలాగే నాపై ఉన్న అభిమానంతో నేను గ్రామీణ ప్రజలకుచేస్తున్న సేవలను గుర్తించి ప్రజలు నాపై నమ్మకంతో రాజకీయాలకు రావాలని ఆహ్వానించడం మాజీ మంత్రి కేటీ రామారావు ప్రత్యేక ఆహ్వానంతో రాజకీయాలకు వచ్చి ప్రజలకు ప్రతి సమయంలో ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఇటువంటి అదృష్టం ఈ జన్మ కి.దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను తెలియజేస్తూ ఇట్టి మంచి అవకాశాన్ని దేవుడు నాకు ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని ప్రతి ప్రాదించడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఇంతకంటే అదృష్టం దేవుడు ఇవ్వడం అలాగే గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకముందు కూడా ప్రజలకు రాజకీయం గాని వైద్య వృత్తిలో గాని ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని వారికి ఎల్లవేళలా వైద్యపరంగా రాజకీయపరంగా కృషి చేస్తాననిఈ సందర్భంగా తెలియజేశారు దయచేసి ఏమైనా పొరపాట్లు ఉన్నచో గ్రామ ప్రజలు రాజకీయ నాయకులు దయచేసి పెద్ద మనసుతో మన్నించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version