డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

ఘనంగా డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో ఎమ్మెల్యే .పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్
134వ జయంతి సందర్భంగా డాక్టర్..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ మేధావి,నవభారత నిర్మాత,బహుముఖ ప్రజ్ఞాశాలిగా అణగారిన పేద,బడుగు,బలహీన వర్గాల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు..అత్యంత మేధోసంపతితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ .అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించి వారి జీవితాల్లో సామాజిక విప్లవ స్ఫూర్తి నింపిన ప్రదాత అంబేద్కర్ అని పేర్కొన్నారు..స్వాతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు,మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించి భావితరాలకు సమ సమాజాన్ని అందించాలని కాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానీ రచించారన్నారు..అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో
మండల కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు , మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ , మండల నాయకులు షేక్ రఫీ , బరపటి వెంకన్న , చందా నాగేశ్వరరావు , ఒగలబోయిన శ్రీను , పూజారి వెంకన్న, కొమరం వెంకటేశ్వర్లు , బిలపాటి సంపత్ , తోలేం కృష్ణ , గాంధర్ల రామనాథం , పోలేబోయిన చందర్రావు అశ్రపునిసా , కార్యకర్తల,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version