మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను.

మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను బలోపేతం చేద్దాం

టియుసిఐ నేత కొమరం శాంతయ్య

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

టియుసిఐ గుండాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) కార్యాలయం వద్ద టియుసిఐ జెండాను ఆ సంఘం గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం శాంతయ్య ఆవిష్కరించారు. జవ్వాజి సెంటర్ లో టియుసిఐ గుండాల ఏరియా కమిటీ అధ్యక్షులు గడ్డం రమేష్ ఆవిష్కరించారు. పెట్రోల్ బంకు వద్ద టియుసిఐ ఏరియా కమిటీ సభ్యులు వసంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో టియుసిఐ ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం శాంతయ్య, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) జిల్లా నాయకులు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్ లు మాట్లాడుతూ కార్మికులు చికాగో నగరంలో 1986 మే 1న పాలకవర్గాల దమన కాండలో తమ రక్తాన్ని చిందించి, ఉరికొయ్యాలని సైతం లెక్కచేయకుండా పోరాడిన పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినాన్ని ప్రపంచమంతా ఆమోదించిందని వారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కుల్ని కాలరాస్తుందని, కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ ,మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోడులను ఆమోదించి అమలు చేయడం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని అన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాంత్రీకరణ పేరుతో ఎనిమిది గంటల పనిని పెంచుతూ 12 గంటలు పనిచేయిస్తూ కార్మికుల రక్తాన్ని మరింత పీల్చి పిప్పి చేస్తున్నారని వారన్నారు. భారత రాజ్యాంగం, కోర్టుల గురించి గొప్పలు వల్లించే పాలకులు సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. శ్రామిక వర్గం జీవించడానికి సరిపడే వేతనాలు ఇచ్చేంతవరకు కార్మిక లోకం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం కార్పోరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించడం హేయమైన చర్యాగా వారు పేర్కొన్నారు. కార్మిక లోకం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ,కార్మికుల రెగ్యులరైజేషన్ ,సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగ భద్రతకై జీవించడానికి సరిపడే వేతనాలు ,పెన్షన్ పెంపు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలు నిలుపుదల కోసం 139వ మే డే స్ఫూర్తితో పోరాటాలను ఉదృతం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ ఏరియా కమిటీ నాయకులు మొక్క నరి, కోడూరి జగన్, మాచర్ల కోటి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు పూనెం మంగయ్య, తెల్లం రాజు , పూనెం లక్ష్మయ్య ,ఈసం కృష్ణ , వూకే శ్రావణ్, ధరావత్ వాగ్య, కల్తి వెంకన్న, సనప కిషెంధర్, మోకాల పాపయ్య, ధరావత్ ఆల్యా ,ధరావత్ మోహన్, ఉప్పు రాజ్ కుమార్, ఉప్పు వెంకటేశ్వర్లు, జాటోత్ భాను , ఎస్ కే వసీం, నునావత్ శంకర్, ఉప్పు మహేష్ ,గంగాధరి కార్తీక్, నాగెల్లి తరుణ్ ,వాగబోయిన జగ్గారావు, ఎస్కె కర్ముళ్లా, ఎస్కె బిల్లా తదితరులు పాల్గొన్నారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు.

 

President

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ,

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 892 వ బసవ జయంతి మహోత్సవ శోభా యాత్రలో పాల్గొన్న

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ జహీరాబాద్ పట్టణంలో రాష్ట్రీయ బసవ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుని శోభా యాత్రలో పాల్గొని ప్రజలకు బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వీరశైవ సమాజం సభ్యులతో కలిసి బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా
మాజీ మంత్రి,మాట్లాడుతూ బసవన్న చూపిన మార్గంలో అందరూ నడవాలని మరియు మహిళ సాధికారత కోసం,బడుగు బలహీనవర్గాల సమానత్వం కోసం, అస్పృశ్యత నివారణ కోసం,వారు ఎంతో కృషి చేసిన గొప్ప మహానియుడని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బసవ దళ్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్,మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు,ఏయంసి.డైరెక్టర్ శేఖర్,కాంగ్రెస్ నాయకులు హుగెల్లి రాములు,వీరశైవ సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అద్భుతమైన ఫలితాలు సాధించిన మామిడి గి పాఠశాల.!

అద్భుతమైన ఫలితాలు సాధించిన మామిడి గి పాఠశాల విద్యార్థులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిగి లో మొత్తం 30 మంది విద్యార్థులు ఈ సారి పదవ తరగతి పరీక్షలకు హాజరైనారు. అందులో 30 మంది విద్యార్థులు కూడా పాసైనారు గత సంవత్సరం లాగా ఈసారి కూడా పాఠశాల విద్యార్థులు 100% ఫలితాలు సాధించడం జరిగింది.

Students

 

A1 గ్రేడ్ సాధించిన విద్యార్థులు ముగ్గురు ఉన్నారు. 500 లకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 30 లో 19 మంది విద్యార్థులు ఉన్నారు.

పది ఫలితాల్లో 99.75 శాతం ఉత్తీర్ణత : ఎంఈఓ.

పది ఫలితాల్లో 99.75 శాతం ఉత్తీర్ణత : ఎంఈఓ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

2024 25 విద్యాసంవత్సరానికి గాను -నిర్వహించిన పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మండలంలో 99.75 శాతం ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి మారుతి రాథోడ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం విడుదలైన పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో వివరాలను వెల్లడించడం జరిగిందన్నారు. మండలంలో 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థునులు 416 గురు పరీక్షలు రాయగా 415 గురు ఉత్తీర్ణులయ్యారని ఎంఈఓ తెలిపారు. మిర్జాపూర్ (బి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని సాదియా సౌసీన్ 600 గాను 579 మార్కులు సాధించి మండలంలోని టాపర్ గా నిలిచింది.

Exams

 

మెటల్ కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి 600 గాను 565 మార్కులు, మిర్జాపూర్ (బి) ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని నవీనా 600 గాను 561, మమ్మద్ జునీద్ 600 గాను 559 మార్కులు సాధించి ప్రతిభను చాటారు. న్యాల్ కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గొల్ల సాయి మార్చ్ 20న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలవడంతో కేవలం మొదటి రోజు పరీక్షను మాత్రమే వ్రాసి మిగిలిన 5 పరీక్షలు వ్రాయలేక పోవడంతో మండలంలో శతశాతం ఉత్తీర్ణత సాధించలేక పోయింది. 416 గురు విద్యార్థునులకు గాను 415 గురు విద్యార్థునులు వార్షిక పరీక్షల్లో హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన విద్యార్థునులు అందరు ఉత్తీర్ణత సాధించారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం ముస్లిం షాది ఖానా పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

 

Congress

షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హాయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షలు మంజూరైన నిధులు మంజూరు చేశారన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ లో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం.

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపల్ పట్టణం కేంద్రంలో కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ బుధవారం ప్రారంభోత్సవం జరిగింది, కేజియన్ ఎంటర్ప్రైజెస్ యజమాన్యం సాన్ ఉల్ఖాన్, ఇస్రార్ ఖాన్, కేసముద్రం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటు ధరలలో ఇంటీరియర్ డెకరేషన్ ఫాల్ సీలింగ్ వినియోగదారులకు అతి తక్కువ ధరలలో ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ డెకరేటర్ చేసి అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు కేసముద్రం పట్టణంలో ఫాల్స్ సీలింగ్ మెటీరియల్ తో ఫిట్టింగ్ చేసేవారు అందుబాటులో లేరని ఇకనుండి కేసముద్రం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అందరికీ సరైన అందుబాటు ధరల్లో సౌలభ్యం ఉంటుందని అన్నారు. వినియోగదారులు ఎవరైనా పాల్ సీలింగ్ డిజైన్ చేయించుకోవాలనుకునేవారు కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ పట్టణ కేంద్రంలో పొట్టి శ్రీరాములు సెంటర్ కూడలిలో షాప్ నూతనంగా ప్రారంభించామని వినియోగదారులు నేరుగా మమ్మల్ని సంప్రదించి మీకు అందుబాటు ధరల్లో పాల్ సీలింగ్ మెటీరియల్ తో మీకు నచ్చిన డిజైన్ లో ఫిటింగ్ చేసి అనుకున్న టైంలో అందిస్తామని పేర్కొన్నారు.

అభ్యుదయ కవితా పతాక శ్రీ శ్రీ.

అభ్యుదయ కవితా పతాక శ్రీ శ్రీ

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 30:

 

 

సమాజంలోని అసమానతలపై తన రచనలతో అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ, శ్రామిక జీవన సౌందర్యాన్ని ఎలుగెత్తి చాటిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు అని కొనియాడారు.
బుధవారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం మరియు అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా
తిరుపతిబాలోత్సవం అధ్యక్షులు
నడ్డి నారాయణ అధ్యక్షతన
శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన రచనలను చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం ప్రధానకార్యదర్శి మల్లారపు నాగార్జున, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యువశ్రీ మురళి, డాక్టర్ నెమిలేటి కిట్టన్న,తిరుపతి జిల్లా రచయితల సంఘం కార్యదర్శులు మన్నవ గంగాధర ప్రసాద్,పేరూరు బాలసుబ్రమణ్యం
సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ ఓ.వెంకటరమణ,
తదితరులు పాల్గొన్నారు.

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం.!

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపల్ పట్టణం కేంద్రంలో కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ బుధవారం ప్రారంభోత్సవం జరిగింది, కేజియన్ ఎంటర్ప్రైజెస్ యజమాన్యం సాన్ ఉల్ఖాన్, ఇస్రార్ ఖాన్, కేసముద్రం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటు ధరలలో ఇంటీరియర్ డెకరేషన్ ఫాల్ సీలింగ్ వినియోగదారులకు అతి తక్కువ ధరలలో ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ డెకరేటర్ చేసి అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు కేసముద్రం పట్టణంలో ఫాల్స్ సీలింగ్ మెటీరియల్ తో ఫిట్టింగ్ చేసేవారు అందుబాటులో లేరని ఇకనుండి కేసముద్రం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అందరికీ సరైన అందుబాటు ధరల్లో సౌలభ్యం ఉంటుందని అన్నారు. వినియోగదారులు ఎవరైనా పాల్ సీలింగ్ డిజైన్ చేయించుకోవాలనుకునేవారు కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ పట్టణ కేంద్రంలో పొట్టి శ్రీరాములు సెంటర్ కూడలిలో షాప్ నూతనంగా ప్రారంభించామని వినియోగదారులు నేరుగా మమ్మల్ని సంప్రదించి మీకు అందుబాటు ధరల్లో పాల్ సీలింగ్ మెటీరియల్ తో మీకు నచ్చిన డిజైన్ లో ఫిటింగ్ చేసి అనుకున్న టైంలో అందిస్తామని పేర్కొన్నారు.

తిప్పనగుల్లలో పౌర హక్కుల దినోత్సవం.

తిప్పనగుల్లలో పౌర హక్కుల దినోత్సవం

నిజాంపేట్, నేటి ధాత్రి

నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ల గ్రామంలో బుధవారం రోజున పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ జైపాల్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశాలను తెలుపడం జరిగింది. గ్రామంలో ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో ఎవరైనా దూషిస్తే మా దృష్టికి తీసుకురావాలని గుడిలోకి, బడిలోకి, రానివ్వకుండా కులం పేరుతో మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, హోటళ్లల్లో అందరికీ ఒకేలాగా ఒకే తీరు గ్లాసులల్లో చాయ్ ఇవ్వాలని మీకు వేరు మాకు వేరు అనే పద్ధతిని ఉంటే అటువంటి అంశాలపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని కోనేరు రంగారావు సిఫారసుల మేరకు ప్రతినెల చివరి రోజున మండలంలోని ఏదో ఒక గ్రామంలో ఇలాంటి పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం చేపడతామని, ఆ గ్రామాలలో ఏవైనా కులాల వారీగా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జీవించాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన విద్య అందరికీ అందించే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమాద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి శ్యామల పోలీస్ సిబ్బంది గ్రామస్తులు చంద్రం, యాదగిరి, రాజు, నవీన్, గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి.

కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి

గుండాల(టీయూసిఐ)మేడే పిలుపు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా (టీయూసిఐ)
139 వ మేడే, పోస్టర్లను గుండాల మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ కార్యాలయం లో పోస్టర్లు
ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వెల్డింగ్ ఆటో అండ్ మోటర్ మెకానిక్ వర్కర్స్(టీయూసిఐ)
మండల నాయకులు మొక్క మరీ అధ్యక్షతన వహించగా
గుండాల మండల కమిటీ కార్యదర్శి గడ్డం రమేష్ మాట్లాడుతూ ప్రియమైన
కార్మికులారా 1886 మే ఒకటి పాలక వర్గాల ధమాకాండలో చికాగో (అమెరికా)
కార్మికవర్గం రక్తం చిందించి ఉరికంబాలను
సైతం లెక్కచేయక సాధించిన పోరాట ఫలితమే 8 గంటాల పనిని ప్రపంచం ఆమోదించాల్సి వచ్చింది,
139 సంవత్సరం ల క్రింద ఇంతగా శాస్త్ర సంకేతిక పరిజ్ఞానం రవాణా అభివృద్ధి చెందని కాలం మన దేశంలో ఆనాడు మనిషి సాగటు అయుర్దాయం 40 సం,రాలు
నేడు 70 సంవత్సరాల మానవ జాతినే నాశనం చేసిన కాలర మాసుచీ క్షయ
గత్తరలాంటి వ్యాధులను
తరిమి ఏసిన వైద్య విజ్ఞానం ఒక్కనాడు కరువుతో అల్లాడి లక్షలాది మంది తిండి లేక అమానుషంగా మరణించారు.కనీసం మంచినీరు కూడా అందించని
దురావస్థ నుండి తాగు నీరందించడంతో వ్యవసాయరంగం విప్లవాత్మక మార్పులతో ప్రపంచానికే తిండి గింజలు అందించే శక్తి వచ్చింది కరువు కాటకాల నుండి బయట పడ్డారు.కానీ పాలకుల చర్యల ఫలితంగా తిండి లేక అలమటించే స్థితి అవడం సిగ్గుచేటు.
నేడు యాంత్రీకరణతో
శ్రామికుడు 8.గం„ల పనిని 4.గం„లు కూడా చేసిన సరిపోతుంది పెట్టుబడిదారులు నేడు కార్మిక రక్తాన్ని మరింతగా పిల్సిపిప్పి చేసి సంపద పోగేసుకోవడానికి
12 గం„ల పని పెంపుదల ముందుకు తీసుకొస్తున్నారు.ఇన్పోసిస్ అధినేత నారాయణమూర్తి వారానికి 70 గం„లు పనిచేయాలని ఆదివారం కూడా పనిచేయాలని
ఎల్, టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గం„లు పని చేసి ప్రపంచంలోనే
అగ్రగామిగా నిలవాలని చీలుక పలుకులు వల్లిస్తున్నారు.దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ లో పని గంటల పెంపు ప్రతిపాదించారు. దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్లు
అధిక పనిగంటలతో శ్రమజీవుల రక్తాన్ని పీల్చిపిప్పి చేసే లక్ష్యం తప్ప మరొకటి కాదు 8 గంటల పనితోనే పారిశ్రామక వేతనాలు గణనీయంగా అభివృద్ధి అయ్యరు ప్రపంచంలోనే ఆదాని మూడవ స్థానానికి దేశంలో అంబానీలు అత్యంత సంపదగల వారిగా నిలిచారు
12 గంటాల పనితో ఎంతో అభివృద్ధి కావాలనుకున్నారు.
ఇప్పటికే 70 శాతం దేశ సంపద కేవలం ఐదు శాతం గల ధనికుల చేతుల్లో ఉందని 30 శాతం సంపద 95 శాతం గల ప్రజల చేతుల్లో ఉందని సర్వేలు ఘాోషిస్తున్నాయి.ఈ స్థితిలో పని గంటల పెంపును మే డే స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపుని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూసి ఐ నాయకులు మాచర్ల కోటేష్, మహేష్, తరుణ్, కార్తీక్, ఎస్.కె యాకూబ్, తదితరులు పాల్గొన్నారు,

భూభారతి రైతులకు ఒక వరం.

భూభారతి రైతులకు ఒక వరం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారదా

#నెక్కొండ,

నేటి ధాత్రి;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని దరిదాపుల్లో లేకుండా చేసి భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ భూభారతి రైతుకు ఒక వరం రైతులు ఈ భూభారతిని సరైన విధంగా వినియోగించుకోవాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుధవారం అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి రికార్డుల్లో తప్పులు సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సెక్షన్ 5, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆపిల్ వ్యవస్థ రివిజన్ అధికారాలు, గ్రామ రెవెన్యూ రికార్డులు, రికార్డుల నకలు పొందడం ఎలా, తదితర అంశాలపై రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తున్నదని, అధికారులు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు భూభారతి విధివిధానాల కరపత్రాలు గ్రామాల్లో పంపిణీ చేయాలని, ఆయన అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, 39 గ్రామపంచాయతీలు ఉన్నాయని, మండలంలో మొత్తం విస్తీర్ణం 49,466 ఎకరాల భూమి ఉందని, 33,250 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, అలాగే 6862 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, 25491.36 ఎకరాల భూమికి పట్టాదారు పాస్బుక్కులు ఇప్పటివరకు ప్రభుత్వం సరఫరా చేసిందని,6293 ఎకరాల భూములపై వివాదాస్పదమైన ఆరోపణలతో కేసులు ఉన్నాయని అలాగే 4120, వివిధ కారణాలతో పట్టా భూములకు ఇంకా పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా రైతుకు సులభమైన మార్గంలో మీ భూ సమస్యలు పరిష్కారానికై ఈ భూభారతి విధానం వచ్చిందని అన్నారు. నెక్కొండ మండలంలో భూ యజమానులు 15145 ఉన్నారని, 15145 ఖాతా నెంబర్లు కలిగి ఉన్నారని, ఇప్పటివరకు మండలంలో ఆర్ఓఆర్ కంప్యూటర్ లో నిక్షిప్తం అయినావి 15145, ఇవి కాక 6293 పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి, ఏ డి ఏ దామోదర్ రెడ్డి, నెక్కొండ తహసిల్దార్ వేముల రాజ్ కుమార్, నెక్కొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ,నర్సంపేట వ్యవసాయ మార్కెట్ఠ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, పలు గ్రామాల మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు మహిళా సంఘ ప్రతినిధులు మహిళ సంఘల మహిళలు, రైతులు, మహిళ రైతులు,లతోపాటు సిఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్ఐ మహేందర్లు, బందోబస్తు నిర్వహించారు.

ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి.

ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు గత మూడు నెలలుగా రావడం లేదని ఎంపీడీవోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేసి పేస్కేల్ అమలు చేయాలి అని ఎం పి డి ఓ రాజి రెడ్డి కి లెటర్ ఇవ్వడం జరిగిందన్నారు. గత మూడు నెలలుగా వేతనాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని వారు అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలతో పాటు పేస్కేల్ ను అమలు చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టి ఏలు రవితేజ, మమత, సి ఓ లు అనిల్, శ్రీధర్, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న టీజీఐడిసి.!

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల్ ఎస్ ఆర్ కె గార్డెన్లో మాజీ ఎంపీటీసీ దేశెట్టి గారి సోదరి వివాహ వేడుక లో పాల్గొని మరియు సదాశివపేట్ పట్టణంలోని ఎస్ వి ఎస్ కన్వెన్షన్ హాల్లో ముంగి నరసింహారెడ్డి బావమరిది వివాహ వేడుక లో పాల్గొని అక్షింతలు వేసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు వారితో పాటు మాజీ సర్పంచ్ మల్ రెడ్డి మాజీ సర్పంచ్ అమీర్ శివకుమార్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీధిశునకం సైరవిహారం*

వీధిశునకం సైరవిహారం*
ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో బాలుడిపై దాడి
ఇల్లందకుంట: నేటిధాత్రి

 

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో బాలుడు రామంచ అయాన్ రెండు సంవత్సరాల బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేయగా తీవ్ర గాయాలైనట్లు తెలిపారు హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం గతంలో కూడా పలుమార్లు వీధి కుక్కలు దాడి చేశాయని అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని గ్రామస్తులు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉగ్రవాదుల దాడి అమానుషం.

ఉగ్రవాదుల దాడి అమానుషం

సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో సామాన్యులపై ఉగ్రదాడిని ఖండిస్తున్నామని, ఈ సంఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపి ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలని సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో జాతీయ అవార్డు గ్రహీత గోకా రామస్వామి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో డాక్టర్ పరికిపండ్ల అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, స్థానికులు జెండాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జం ప్రభాకర్, భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడేపూ రాజేంద్రప్రసాద్, వారణాసి మోహన్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ,శుభ లతోపాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

10 వ తరగతి ఫలితాలలో ఐలోని.!

10 వ తరగతి ఫలితాలలో ఐలోని పాత్ ఫైండర్ ప్రభంజనం

నేటిధాత్రి ఐనవోలు :-

పదవ తరగతి ఫలితాలలో అయినవోలు పాత్ ఫైండర్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలలో ఐలోని ఫాత్ ఫైండర్ విద్యార్థినిలు ఆర్ జ్యోతి 600 మార్కులకు గాను 572 ఈ అక్షిత 567 జి సంజయ్ 563 మార్కులతో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. 13 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఈ ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సుభానొద్దీన్ మాట్లాడుతూ సంవత్సరము ఈ
పాఠశాల నుండి మొత్తం 31 మంది విద్యార్థులు హాజరై అందరూ ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉంది. ఈ పరీక్షల్లో పాఠశాల మొత్తం ఉత్తీర్ణత శాతం 100% సాధించి పాఠశాల ఖ్యాతిని మరింత పెంచారు. ఈ విజయానికి పాఠశాల ఉపాధ్యాయుల నిరంతర శ్రమ విద్యార్థుల కృషి మరియు తల్లితండ్రుల సహకారం ప్రధాన కారణాలుగా నిలిచాయి. పాఠశాల యాజమాన్యం డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర రావు వైస్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయిని ఉపాధ్యాలు.విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

పదో తరగతి ఫలితాల్లో.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు.

పదో తరగతి ఫలితాల్లో.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 10వ తరగతి విద్యార్థులు సత్తా చాటారు. అమృత 576/600, స్పందన 571/ 600, నందిని 571/600, జోత్స్న 569/600, మౌనిక 569/600 మార్కులు సాధించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కష్టించి వ్యవసాయం చేసి జీవిస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి అత్యధిక మార్పులు సాధించటంతో పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రెడ్డి, మరియు అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని అధ్యాపక బృందం ఆకాంక్షించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 55 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 5 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు గాను 40 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సింధు 503/600 మార్కులు సాధించింది. మండలంలోని 10 పాఠశాలల్లో.. మొత్తం 528 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 477 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

కర్రెగుట్టలలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి.

కర్రెగుట్టలలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి

ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ లు ముంజాల బిక్షపతి గౌడ్, మాదాసి సురేష్.

ములుగు జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల బారీ ర్యాలీ..

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్.

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి.

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి/ ములుగు,నేటిధాత్రి:

 

 

కర్రెగుట్టలలో మోహరించిన కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రజాసంఘాల జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్, హనుమకొండ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు.ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా బుధవారం దళిత,గిరిజన,ఆదివాసి,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేలాదిమందితో భారీ ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విలువైన కనజ సంపదను సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసమే ఆపరేషన్ కాగలరు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని వారు విమర్శించారు.తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు సోమ రామ్మూర్తి, సాయిని నరేందర్,వట్టంఉపేందర్, బొట్ల బిక్షపతి,జై సింగ్ రాథోడ్,తెలంగాణ కొమురయ్య, కర్ణాటకపు వావిలాల లక్ష్మణ్, మోరే ఐలయ్య, అమ్ముల అశోక్,మాదాసు జితేందర్ తదితరులు పాల్గోన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న.!

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి

మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎస్.వి.కె.గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన గుడుపల్లి గ్రామం కాల్వ ముత్యాల్ రెడ్డి కుమారుని వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ వివాహా వేడుకల్లో సుదర్శన్ రెడ్డి,రాజేందర్ రెడ్డి,వినాయక్ రెడ్డి,చెంగల్ జైపాల్,విజయ్, సి.యం.అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version