పదో తరగతి ఫలితాల్లో.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు.

పదో తరగతి ఫలితాల్లో.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 10వ తరగతి విద్యార్థులు సత్తా చాటారు. అమృత 576/600, స్పందన 571/ 600, నందిని 571/600, జోత్స్న 569/600, మౌనిక 569/600 మార్కులు సాధించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కష్టించి వ్యవసాయం చేసి జీవిస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి అత్యధిక మార్పులు సాధించటంతో పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రెడ్డి, మరియు అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని అధ్యాపక బృందం ఆకాంక్షించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 55 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 5 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు గాను 40 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సింధు 503/600 మార్కులు సాధించింది. మండలంలోని 10 పాఠశాలల్లో.. మొత్తం 528 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 477 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version