కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి.

కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి

గుండాల(టీయూసిఐ)మేడే పిలుపు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా (టీయూసిఐ)
139 వ మేడే, పోస్టర్లను గుండాల మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ కార్యాలయం లో పోస్టర్లు
ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వెల్డింగ్ ఆటో అండ్ మోటర్ మెకానిక్ వర్కర్స్(టీయూసిఐ)
మండల నాయకులు మొక్క మరీ అధ్యక్షతన వహించగా
గుండాల మండల కమిటీ కార్యదర్శి గడ్డం రమేష్ మాట్లాడుతూ ప్రియమైన
కార్మికులారా 1886 మే ఒకటి పాలక వర్గాల ధమాకాండలో చికాగో (అమెరికా)
కార్మికవర్గం రక్తం చిందించి ఉరికంబాలను
సైతం లెక్కచేయక సాధించిన పోరాట ఫలితమే 8 గంటాల పనిని ప్రపంచం ఆమోదించాల్సి వచ్చింది,
139 సంవత్సరం ల క్రింద ఇంతగా శాస్త్ర సంకేతిక పరిజ్ఞానం రవాణా అభివృద్ధి చెందని కాలం మన దేశంలో ఆనాడు మనిషి సాగటు అయుర్దాయం 40 సం,రాలు
నేడు 70 సంవత్సరాల మానవ జాతినే నాశనం చేసిన కాలర మాసుచీ క్షయ
గత్తరలాంటి వ్యాధులను
తరిమి ఏసిన వైద్య విజ్ఞానం ఒక్కనాడు కరువుతో అల్లాడి లక్షలాది మంది తిండి లేక అమానుషంగా మరణించారు.కనీసం మంచినీరు కూడా అందించని
దురావస్థ నుండి తాగు నీరందించడంతో వ్యవసాయరంగం విప్లవాత్మక మార్పులతో ప్రపంచానికే తిండి గింజలు అందించే శక్తి వచ్చింది కరువు కాటకాల నుండి బయట పడ్డారు.కానీ పాలకుల చర్యల ఫలితంగా తిండి లేక అలమటించే స్థితి అవడం సిగ్గుచేటు.
నేడు యాంత్రీకరణతో
శ్రామికుడు 8.గం„ల పనిని 4.గం„లు కూడా చేసిన సరిపోతుంది పెట్టుబడిదారులు నేడు కార్మిక రక్తాన్ని మరింతగా పిల్సిపిప్పి చేసి సంపద పోగేసుకోవడానికి
12 గం„ల పని పెంపుదల ముందుకు తీసుకొస్తున్నారు.ఇన్పోసిస్ అధినేత నారాయణమూర్తి వారానికి 70 గం„లు పనిచేయాలని ఆదివారం కూడా పనిచేయాలని
ఎల్, టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గం„లు పని చేసి ప్రపంచంలోనే
అగ్రగామిగా నిలవాలని చీలుక పలుకులు వల్లిస్తున్నారు.దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ లో పని గంటల పెంపు ప్రతిపాదించారు. దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్లు
అధిక పనిగంటలతో శ్రమజీవుల రక్తాన్ని పీల్చిపిప్పి చేసే లక్ష్యం తప్ప మరొకటి కాదు 8 గంటల పనితోనే పారిశ్రామక వేతనాలు గణనీయంగా అభివృద్ధి అయ్యరు ప్రపంచంలోనే ఆదాని మూడవ స్థానానికి దేశంలో అంబానీలు అత్యంత సంపదగల వారిగా నిలిచారు
12 గంటాల పనితో ఎంతో అభివృద్ధి కావాలనుకున్నారు.
ఇప్పటికే 70 శాతం దేశ సంపద కేవలం ఐదు శాతం గల ధనికుల చేతుల్లో ఉందని 30 శాతం సంపద 95 శాతం గల ప్రజల చేతుల్లో ఉందని సర్వేలు ఘాోషిస్తున్నాయి.ఈ స్థితిలో పని గంటల పెంపును మే డే స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపుని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూసి ఐ నాయకులు మాచర్ల కోటేష్, మహేష్, తరుణ్, కార్తీక్, ఎస్.కె యాకూబ్, తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version