10 వ తరగతి ఫలితాలలో ఐలోని పాత్ ఫైండర్ ప్రభంజనం
నేటిధాత్రి ఐనవోలు :-
పదవ తరగతి ఫలితాలలో అయినవోలు పాత్ ఫైండర్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలలో ఐలోని ఫాత్ ఫైండర్ విద్యార్థినిలు ఆర్ జ్యోతి 600 మార్కులకు గాను 572 ఈ అక్షిత 567 జి సంజయ్ 563 మార్కులతో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. 13 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఈ ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సుభానొద్దీన్ మాట్లాడుతూ సంవత్సరము ఈ
పాఠశాల నుండి మొత్తం 31 మంది విద్యార్థులు హాజరై అందరూ ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉంది. ఈ పరీక్షల్లో పాఠశాల మొత్తం ఉత్తీర్ణత శాతం 100% సాధించి పాఠశాల ఖ్యాతిని మరింత పెంచారు. ఈ విజయానికి పాఠశాల ఉపాధ్యాయుల నిరంతర శ్రమ విద్యార్థుల కృషి మరియు తల్లితండ్రుల సహకారం ప్రధాన కారణాలుగా నిలిచాయి. పాఠశాల యాజమాన్యం డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర రావు వైస్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయిని ఉపాధ్యాలు.విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.