పాలనపై పట్టు..ఎన్నికలలో హిట్టు!

`జూబ్లీ గెలుపుతో ‘‘రేవంత్‌’’ గ్రాఫ్‌ ఎవరెస్టు

`‘‘సీఎం. రేవంత్‌’’ ప్రచారం జూబ్లీ విజయం

`‘‘రేవంత్‌’’ పట్టుదల ముందు బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది

`‘‘రేవంత్‌’’ పాలనే బాగుందనుకున్నారు

-‘‘బీఆర్‌ఎస్‌’’ కన్నా మెరుగే అని విశ్వసించినట్లున్నారు

-జూబ్లీ ఎన్నికల ముందున్న ఆలోచనలన్నీ పటా పంచెలు

REVANTH REDDY VICTORY IN JUBLIEE HILLS BY-ELECTION

-ఇక ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’కి తిరుగులేదు

-పార్టీలోనూ ఎదురులేకుండా చూసుకున్నారు

-వరుస విజయాలతో దూసుకుపోతున్నారు

-సాధారణ ఎన్నికలు ఒంటి చేత్తో గెలిపించారు

-ఉప ఎన్నికలన్నీ గెలుస్తూ వస్తున్నారు

-పార్లమెంటు ఎన్నికలలోనూ మెరుగైన ఫలితాలు సాధించిపెట్టారు

-ఈ విజయాల పరంపర కొనసాగిస్తే ‘‘రేవంత్‌ రెడ్డి’’ కి ఎదురుండదు

అంచనాలకు అందని నాయకుడు ‘‘సిఎం. రేవంత్‌ రెడ్డి’’. రాజకీయంగా స్వయం కృషితో బాటలు వేసుకొని విజయాలు సొంతం చేసుకోవడం ‘‘రేవంత్‌ రెడ్డి’’ కి కొత్త కాదు. అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీ హిల్స్‌ CONGRESS‌ కైవసం ఒక చరిత్ర. జూబ్లీ హిల్స్‌ ఎలక్షన్‌లో వార్‌ వన్‌ సైడ్‌ చేసి అఖండ మెజారిటీతో అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ను గెలిపించారు. దటీజ్‌ ‘‘రేవంత్‌ రెడ్డి’’ అని నిరూపించారు. బిఆర్‌ఎస్‌ ఆశలను పటాపంచెలు చేసి కాంగ్రెస్‌ కు విజయాన్ని అందించారు. అటు పాలనలో దూసుకుపోతున్నారు. ఇటు పార్టీకి ఎన్నికల వరుస విజయాలు అందిస్తున్న ‘‘రేవంత్‌ రెడ్డి’’ వ్యూహాలను చేధించడం ఎవరి వల్ల కాదని మరోసారి నిరూపించారు. గెలుపంటే ఇదీ అని రాజకీయాలకే ఒక పాఠం నేర్పి, పార్టీకి మరింత బలాన్ని ‘‘రేవంత్‌ రెడ్డి (REVANTH REDDY) ’’ పెంచారు. అంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ‘‘రోహిన్‌ రెడ్డి’’(ROHIN REDDY), నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే…

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కాని ప్రతి ఎన్నికను గెలిపించుకోవాల్సిన అవసరం వుంటుంది. అలా ప్రతి ఎన్నికను గెలిపించుకునే నాయకులు చిరిత్ర సృష్టిస్తారు. అందులో సిఎం. రేవంత్‌ రెడ్డి వుంటారు. ఇది అతిశయోక్తి అసలే కాదు. ఎందుకంటే సిఎం. రేవంత్‌ రెడ్డి ఒంటి చేత్తో అందించిన విజయాలు రాష్ట్రంలో అనేకం వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో నమ్మకం కల్గించడంలో రేవంత్‌ రెడ్డి పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. తెలంగాణ ఇచ్చినా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పదేళ్లపాటు కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో వుంది. అనేక అపజయాలు చవి చూడాల్సి వచ్చింది. అది ఏ ఒక్కరి లోపం కాదు. కాని గెలవలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. అయితే ప్రజల్లో నమ్మకం నింపే నాయకుడు పార్టీలకు కావాలి. పాలకులుగా వుండాలి. ముందు ఏ నాయకుడైనా పార్టీకి ధైర్యం కావాలి. నాయకులకు భరోసా కల్పించే స్దితిలో వుండాలి. ప్రజలకు నమ్మకం కల్గించాలి. పార్టీ మీద ప్రజలకు విశ్వాసం నింపాలి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో వున్నా గెలుపు తీరాలకు చేర్చే పూర్తి భాధ్యతను భుజాన వేసుకునే నాయకుడుగా కాంగ్రెస్‌ అధిష్టానానికి రేవంత్‌ రెడ్డి కల్పించారు. అది సామాన్యమైన విషయం కాదు. అందుకు ఎంతో శ్రమ పడాల్సి వుంటుంది. పార్టీ పెద్దలకు నమ్మకం కల్పించాల్సి వుంటుంది. ఏ రకమైన సవాలునైనా స్వీకరించే స్ధితిలో నాయకుడు వుండాలి. అన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తివంతుడై వుండాలి. అవన్నీ సిఎం. రేవంత్‌ రెడ్డిలో వున్నాయి. అందుకే కాంగ్రెస్‌లో చేరిన అనతి కాలంలోనే ఆయన పార్టీకి పిసిసి. అధ్యక్షుడు కాగలిగారు. పార్టీని గాడిలో పెట్టగలిగారు. ఆనాడు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతి కుటుంబ పెద్దకు ఇంటి సమస్యలుంటాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పుడు కుటుంబమైనా, రాజకీయ పార్టీ అయినా దారిలో పడుతుంది. అందుకు ఆ పెద్దకు ఎంతో ఓపిక కావాలి. ఒక కుటుంబంలోనే నలుగురు నాలుగు రకాలై ఆలోచనలతో వుంటారు. రాజకీయ పార్టీలో కొన్న లక్షల మంది వుంటారు. అందర్నీ సంతృప్తి పర్చుకుంటూ ముందుకు సాగినప్పుడే పార్టీ నిలబడుతుంది. అని బలంగా నమ్మిన నాయకుడు సిఎం. రేవంత్‌ రెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌ రెడ్డి ఎవరి అంచనాలకు అందని నాయకుడు. ఆయన వేసే అడుగులు ఎంత బలంగా వుంటాయో…ఆయన వ్యూహాలు ప్రత్యర్ధులకు అంతు చిక్క కుండా వుంటాయి. అందుకే తాజాగా గెలిచిన జూబ్లీ బైపోల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ గెలుపొందారు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే వరకు పరిస్దితి ఎలా వుందో అందిరికీ తెలుసు. కాకపోతే అవన్నీ బిఆర్‌ఎస్‌ ఊహలు మాత్రమే. ప్రభుత్వం మీద ఎంతో ప్రజల్లో వ్యతిరేకత వున్నట్లు సోషల్‌మీడియా ద్వారా విసృతంగా ప్రచారం చేశారు. నిండు కుండ తొనకదు అన్నట్లు రేవంత్‌ రెడ్డి ఎప్పుడూ స్పందించలేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంత ప్రచారం చేసుకుంటుందో చేసుకోని అని చూశారు. బిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని సిఎం. రేవంత్‌ రెడ్డికి తెలుసు. బిఆర్‌ఎస్‌ చేస్తున్న అబద్దపు ప్రచారంలో అర్ధం లేదు. నిజం అంతకన్నా లేదని ప్రజలకు తెలుసు. సిఎం.రేవంత్‌ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన గుంభనంగా వున్నారు. కాని బిఆర్‌ఎస్‌ ఎగిరెగిరి పడిరది. ఆఖరుకు ఏమైంది. సిఎం. రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగారు. వార్‌ వన్‌సైడ్‌ చేశారు. అదీ నాయకుడి గొప్పదనం. బిఆర్‌ఎస్‌ అనేది ఉద్యమ కాలంలో ఒక రకమైన సెంటిమెంటు, అధికారంలో వున్నప్పుడు అబద్దాలు విసృతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు జనాలకు బిఆర్‌ఎస్‌ అంటే ఏమిటో పూర్తిగా తెలిసిపోయింది. ఆ పార్టీ అంతా పైన పటారం, లోన లొటారం అనేది తెలిసింది. అందుకే జూబ్లీలో ప్రజలు మరోసారి బిఆర్‌ఎస్‌ను బండకేసి కొట్టారు. అందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి పాలనే నిదర్శనం. కాంగ్రెస్‌ ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ కన్నా ఎంతో బాగుంది. రేవంత్‌ రెడ్డి పాలన ఎంతో మెరుగ్గా వుంది. అందుకే బిఆర్‌ఎస్‌కు వీలుకాని ఏ ఉప ఎన్నికలో వీలుకాని మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ను గెల్చుకున్నది. సిఎం. రేవంత్‌ రెడ్డి స్వయం ప్రకాశవంతమైన నాయకుడు. స్వయంకృషితో ఎదిగిన నాయకుడు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాలలోకి వచ్చిన నాయకుడు. పేద ప్రజలు కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. ఆశలు తెలుసు. వారి ఆలోచనలు కూడా రేవంత్‌ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ప్రజలు కూడా మా నాయకుడు. పేదల నాయకుడు అని గుండెల్లో పెట్టుకున్నారు. సమయం వచ్చింది. జూబ్లీ ఉప పోరులో సిఎం. రేవంత్‌ రెడ్డిపై వున్న మమకారం మరోసారి చూపించారు. రేవంత్‌ రెడ్డి అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్‌ పార్టీకి ఒక చరిత్ర. జూబ్లీ ఉప ఎన్నికను వార్‌ వన్‌ సైడ్‌ చేసి కాంగ్రెస్‌ అభ్యర్ది నవీన్‌ యాదవ్‌ అఖండ మెజార్టీతో గెవడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి పోషించిన పాత్ర రాజకీయ పండితులే అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే అభ్యర్ధి ఎంపిక నాడే గెలుపును కాంగ్రెస్‌ వైపు తిప్పిన నాయకుడు సిఎం. రేవంత్‌ రెడ్డి. అంత దూరదృష్టితో ఎన్నికలను ఎదుర్కొవడం ఒక్క రేవంత్‌ రెడ్డికే సాద్యమైంది. ఆరు నెలలుగా బిఆర్‌ఎస్‌ పెంచుకున్న ఆశలను వారం రోజుల్లో పటాపంచెలు చేసి, కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అటు పాలనలో సిఎం. రేవంత్‌ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇటు ఎదురయ్యే ఎన్నికలను గెలిపించుకుంటూ పార్టీకి వరుస విజయాలు అందిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి రచించే వ్యూహాలు చేదించడం బిఆర్‌ఎస్‌ వల్ల కాదని మరోసారి నిరూపించారు. తన రాజకీయం ముందు బిఆర్‌ఎస్‌ రాజకీయాన్ని తుత్తునీయం చేశారు. గెలుపుంటే ఇదీ అని మరోసారి బిఆర్‌ఎస్‌ గుండెలు అదిరేలా కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన రాజకీయాలకే పాఠం నేర్పిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. ఇక జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక విజయంతో రాష్ట్ర స్ధాయిలోనే కాదు, జాతీయ స్దాయిలో కూడా సిఎం. రేవంత్‌రెడ్డి గ్రాఫ్‌ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా తెలంగాణ వైపు చూసేలా చేశాయి. రేవంత్‌ రెడ్డి నాయకత్వ పటిమ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌ రెడ్డి పట్టుదల ముందు బిఆర్‌ఎస్‌ వరుస ఓటములను మూటగట్టుకుంటోంది. జూబ్లీహిల్స్‌ ప్రజుల సిఎం. రేవంత్‌ రెడ్డి పాలనకు డిస్టింక్షన్‌ మార్కులేశారు. బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన కన్నా సిఎం. రేవంత్‌రెడ్డి పాలన ఎంతో బెటర్‌ అని నిరూపించారు. సాదారణ ఎన్నికలను ఒంటి చేత్తో సిఎం. రేవంత్‌ రెడ్డి గెలిపించారు. తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు కాంగ్రెస్‌కు సాదించిపెట్టారు. 8 మంది పార్లమెంటు సీట్లను గెలిపించారు. బిఆర్‌ఎస్‌కు రాష్ట్ర రాజకీయాల్లో చోటు లేకుండా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ సున్నా చుట్టేలా చేశారు. తర్వాత వచ్చిన వరుస ఉప ఎన్నికలు గెలిపిస్తూ వస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిపించారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తున్నారు. పార్టీకి కొండంత బలాన్ని అందిస్తున్నారు. వరుస గెలుపులను పార్టీకి అందిస్తూ పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి ఉత్తమైన పాలన అందిస్తున్నారు. ఏ ానాయకుడైనా తన పాలన చరిత్రలో నిలిచిపోవాలనే కోరుకుంటారు. అలాగే తనదైన పాలన సాగించేందుకు, తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దేందుకు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version