దయాకర్ రావు తెలంగాణ రాజకీయాల్లో టాల్ పర్సనాలిటీ.
దయాకర్ రావు లాంటి నాయకుడు కమెడియన్ ను పలకరించడమే ఎక్కువ?

`కడుపులో కత్తులు… నటనలో నక్కలు!
`రంగు మొఖాలు… బలుపు వేషాలు?
`తెలంగాణ అంటేనే చిన్న చూపు!
`తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతూనే ఉంటారు.
`కడుపులో వున్న కసరు కక్కుతూనే వుంటారు.
`బ్రహ్మానందం బలుపు చూశాం!
`అలాంటి నాయకుడంటే కమేడియన్ కు అంత చులకనా?
`మర్యాద లేని మూర్కులను దయాకర్ రావు పలకరించడమే తప్పు.
`తుప్పాషి వెదవను పిలచి పలచన కావడం అవసరమా?
`ఆడొక జఫ్ఫా అని తెలిసి వాడితో దయాకర్ రావు కు ఫోటో కావాలా?
`పదిమంది ముందు బ్రహ్మాండం గా తన బుద్ధి చూపించుకున్నాడు.
`తన వెకిలి గుణం చూపించుకున్నాడు.
`ఒక వేళ ‘‘బీఆర్ఎస్’’ అధికారంలో ఉంటే అదే దయాకర్ రావు ఎక్కడుంటే అక్కడకు బ్రహ్మానందం వెళ్లి వంగి వంగి దండం పెట్టేవాడు.
`నీతి మాలిన బ్రహ్మానందం మీద ఇప్పటికే అనేక ఆరోపణలు వున్నాయి.
`తెలంగాణ కామెడియన్లను తొక్కేశాడంటారు.
`సినిమా వాళ్ళను నెత్తిన పెట్టుకున్నదే ‘‘కేసీఆర్’’.
`ఎవరిని ఎక్కడుంచాలో ‘‘రేవంత్ రెడ్డి’’ అక్కడ ఉంచుతున్నారు.
`అందుకే కాంగ్రెస్ నాయకులంటే సినిమా వాళ్ళు భయపడుతున్నారు.
`కేసీఆర్ ఇచ్చిన అలుసుతో దయాకర్ రావు లాంటి వారిని కామెడియన్ కూడా లెక్క చేయకుండా పోతున్నారు
సుండిగాడి బుద్ది చూపుల్లోనే తెలుస్తుందని ఓ సామెత. పాండిత్యం తెలిసినంత మాత్రాన పండితులు కాలేరని మరోసారి రుజువైంది. పద్యాలు నేర్చుకున్నంత మాత్రాన బుద్ది పెరగదని తేలిపోయింది. పెద్దవాళ్లు తినే ఆహరం పేదవాడి ఆకలి చూపులతో ఎప్పుడో ఎంగిలిపడిరదన్న మాటలు చెప్పిన్పుడు ఎంత సామాజిక సృహ వుందో అనుకుంటే పొరపాటు. ఎంత ఎదిగినా తమ కురస బుద్దిని చూపించుకునే వారు చాలా మంది మన సమాజంలో వుంటారు. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెడితే ఎలా వుంటుందో ఎనుకటికి వెమన ఎప్పుడో ఇలాంటి వారి గురించి చెప్పారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? పేరులో ఆనందం తగిలించుకొని అపర బ్రహ్మగా తనను తాను ఊహించుకునే పిచ్చి, తిక్క వేషాల పాతచింతకాయ పచ్చడి జోకర్ బ్రహ్మానందం. నమస్కారానికి ప్రతి నమస్కారం తెలియని సినీ సన్నాసులు చాలా మంది వుంటారు. అందులో అందె వేసిన చెయిలాంటి జోకర్ బ్రహ్మానందం అని మరోసారి చూపించారు. ఎంతో ఆప్యాయతగా తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పేదల పెన్నిది, అందరి చేత దయన్నా అని పిలిపించుకునే ఎర్రబెల్లి దయాకర్ రావును ఏహే..పో…అంటూ చీర్కరించుకున్నంత పనిచేసిన బ్రహ్మానందాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు చీ కొడుతుంది. ఎందుకంటే తెలంగాణలో వున్న పెద్ద నాయకుల్లో ఆయన ఒకరు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనకు ఓ గౌరవం వుంది. తెలుగు ప్రజల్లో ప్రత్యేకమైన అభిమానం దయాకర్ రావుకు వుంది. అలాంటి వ్యక్తి ఎదురుపడి ఎంతో హుందాగా పలకరిస్తుంటే, చేతిని వదిలించుకుంటూ వెళ్లడం పరిహాసం కాదా? అహంబావంకాదా? అహం తలకెక్కడం కాదా? అలాంటి వెకిలి బ్రహ్మానందం నటించిన సినిమాలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తే తెలుస్తుంది. అంత పెద్ద నాయకుడు పది మందిలో పలకరిస్తే, కెమెరాలు వున్నాయన్న ఇంగితం కూడా బ్రహ్మానందంకు లేకుండాపోయింది. సినిమాల్లో చెప్పినట్లు దాన్నే బలుపంటారు. నడిమంత్రపు సిరి అని కూడా అంటారు. పది మందిలో సినీ పెద్దలు అనేక సార్లు బ్రహ్మానందంను ఎంత నీచంగా మాట్లాడారో తెలియందికాదు? సినీ వజ్రోత్సవాల సమయంలో బ్రహ్మానందం ఓ సందర్భంలో కోతిలాగా పళ్లు ఇకిలించి తన షూటింగ్ చూస్తుంటే పక్కకు వెళ్లమని తిట్టానని చిరంజీవి లాంటి వారు అన్నప్పుడు గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది లేని వాడికి అలాగే వుంటుంది. తెలంగాణకు చెందిన వారు అలాంటి మాటలు ఎవరైనా అంటే అక్కడే స్పందించేవారు. అదే విషయాన్ని ఆ తర్వాత పదే పదే చిరంజీవి అనేక సార్లు అనేక సభల్లోనూ చెప్పుకొచ్చారు. అయినా సిగ్గనిపించని తనం బ్రహ్మానందానిది. అలా అనిపించుకోవడం బ్రహ్మానందంకు సరదాగా వుంటే ఎవరికీ అవసరం లేదు. కాని తెలంగాణకు చెందిన నాయకుడి విషయంలో తన నక్క గుణం చూపించిన బ్రహ్మానందాన్ని తెలంగాన సమాజం క్షమించదు. కాళ్లు మొక్కి పైకొచ్చే వాడికి ఆత్మగౌవం ఏముంటుంది? అని కూడా సినీ పరిశ్రమలో బ్రహానందం గురించి పరి పరి విధాలుగా చెప్పుకుంటారు. ఓ ఇంటర్వూలో తన తోటి నటులైన కొంత మంది మీడియా సాక్షిగా చెప్పిన మాటలు అనేకం వున్నాయి. తనికెళ్ల భరణి ఓ సందర్భంలో బ్రహ్మానందం అతి తెలివిని గురించి ఓ పద్యం రాశారిని కూడా అంటుంటారు. అది తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నటుడు బాబూ మోహన్ పలు సందర్భాలలో బ్రహ్మానందం గురించి ప్రస్తావించారు. ఓ పెద్ద చానల్కు ఇచ్చిన ఇంటర్వూలో బాబూ మోహన్ గురించి చెబుతూ అది కనిపించని కత్తి అని అన్నారు. ఎప్పుడు గుచ్చుకుంటుందో కూడా తెలియకుండా వుంటుంది. అంటూ బ్రహ్మానందం గురించి చెప్పారంటే వ్యక్తిత్వం ఎంత చెడ్డదో అర్దం చేసుకోవుచ్చు. అందుకే తనికెళ్ల భరణి ఎక్కడ చెక్కాలో..ఎక్కడ నొక్కాలో బ్రహ్మానందంకు బాగా తెలుసని కవిత రాశాడట. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మానందం వెకిలి మనసత్త్వం ఎంత బుద్దిహీనమైందో అర్ధం చేసుకోవచ్చు. పైగా సభలలో బ్రహ్మానందం తన అతి తెలివిని ప్రదర్శిస్తుంటారు. తెలుగు సినీమా కొన్నేళ్లుగా అనేక సినిమాల్లో హరోలకు అమ్మగా నటించిన అన్నపూర్ణమ్మ అంటే సగటు తెలుగు ప్రేక్షకుడికి కూడా ఎంతో కొంత గౌరవం వుంటుంది. అలాంటి అన్నపూర్ణమ్మ అమ్మగా చేసిన సినిమాల్లో కూడా బ్రహ్మానందం అమ్మా అంటూ సంబోదించే పాత్రలు చేశారు. కాని ఓ సభలో మాత్రం ఆమె మీద వేసిన జోక్కు అన్నపూర్ణమ్మ నొచ్చుకున్నారు. కానీ ఏం చేయలేరు. తెలంగాణకు చెందిన నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి సనీ జీవితాన్ని ఎదగకుండా చేసిందే బ్రహ్మానందం అని అందరికీ తెలిసిందే. ఓ చానల్లోనే కాదు, అనేక యూటూబ్ చానల్స్లో కూడా ఈ విషయాన్ని పేరు చెప్పకుండా శివారెడ్డి తేల్చేశారు. అంటే తెలంగాణకు చెందిన కళకారులంటే బ్రహ్మానందంకు ఎంత చిన్న చూపో తేలిపోయింది. అంతే కాకుండా తాగుబోతు రమేశ్ అనే కరీంనగర్కు చెందిన నటుడు గురించి ఓ సందర్భంలో దర్శకుడు కృష్ణ వంశీ చెబితే..ఆహా..అంటూ దీర్ఘం తీసి తర్వాత ఎదగకుండా చేశారని చెప్పిన సందర్బాలున్నాయి. అంతేందుకు బాబూ మోహన్ వుంటే తాము సినిమాలో నటించమని కూడా బ్రహ్మానందం కొంత మంది దర్శకులకు చెప్పినట్లు స్వయంగా బాబూమోహనే చెప్పారు. ఇలా ఆంద్రాకు చెందిన కొంత మంది సినిమా నటులకు బలుప పెరగడానికి కారణం కేసిఆర్. అవును. ఈ విషయాన్ని చెప్పకతే తప్పవుతుంది. ఆంద్రా వాళ్ల కాలికి ముళ్లు దిగితే తన పంటితో తీస్తానని చెప్పి, వారికి ప్రాదాన్యత కల్పించడం వల్లనే పరిస్దితి ఇలా వుంది. పదేళ్ల తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం వున్నప్పటికీ పిల్మ్ డెవలప్ మెంటు కార్పోరేషన్ కార్యాలయలో తెలంగాణకు చెందిన నటులు, దర్శకుల ఫోటోలు కూడా ఇప్పటికీ పెట్టలేదు. ఆ విషయాన్ని ఆ మధ్య తెలంగాణ ఉద్యమ కారుడు పాశం యాదగిరి వెళ్లికార్యాలయంలో రచ్చ రచ్చ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్లో ఆంద్రా వాళ్ల ఫోటోలు ఎందుకున్నాయి? ఆ కార్యాలయంలో ఆంద్రాకు చెందిన వాళ్లే ఎందుకు పెత్తనం చేస్తున్నారు? ప్రపంచం తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి, ఆంద్రాకు చెందిన బ్రహ్మానందం లాంటి చిల్లర నటులను వేదిక మీద కూర్చుండబెట్టారు. తెలంగాణకు అంతకన్నా అవమానం ఏమైనా వుంటుందా? అందుకే అలాంటి చిల్లర నటులకు తెలంగాణ అంటే చిన్న చూపు. కేసిఆర్ కూడా పదే పదే ఆంద్రాకు చెందిన సినీ పెద్దలుగా చెలామణి అయ్యే గద్దలకు గౌరవం ఇస్తూ వచ్చారు. రామానాయుడు చనిపోతే అధికార అంత్యక్రియలు. నాగేశ్వరరావు చనిపోతే అధికారిక అంత్య క్రియలు. నటుడు కృష్ణ చనిపోతే, కృష్ణం రాజు చనిపోతే అదికారిక అంత్య క్రియలు. ఆఖరుకు కళా తపస్వి అని ముసుగేసుకొని సినిమాలు తీసిన సరసతపస్వి విశ్వనాద్ చనిపోతే కేసిఆర్ వెళ్లి నివాళులు అర్పించి వచ్చారు. దాంతో సినిమా వాళ్లకు తెలంగాణ చెందిన వాళ్లంటే ఇంకా చిన్న చూపు పెరిగింది. ఇప్పటికీ తమ ప్రాధాన్యతే పెరిగిందని అనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో కేసిఆర్ను తిట్టిన పవన్ కళ్యాన్ను పిలిపించుకొని కూర్చుండబెట్టుకుంటే ఎందుకు గౌరవిస్తారు? ఆఖరుకు ఆగష్టు 15 నాడు గవర్నర్ ఇచ్చే ఎట్ హోం కార్యాక్రమానికి పవన్ కాళ్యాన్ను ఆహ్వానించి అప్పటి గవర్నర్ ఆరడుగుల బుల్లెట్టు అని పొడుగుతుంటే కేసిఆర్ ముసి ముసి నవ్వులు నవ్విన సందర్భం వుంది. సినిమా వాళ్లు అడిగిన గొంతెమ్మ కోరికలు తీర్చుతూ వచ్చాడు. కాని అసలైన తెలంగాణ ఆత్మాభిమానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు. తెలంగాణ గడ్డ ఆత్మాభిమానాన్ని చాటుతున్నారు. తెలంగాణలో సినిమా వాళ్లు పిచ్చి వేషాలు వేస్తే తోలు తీసినంత పని చేస్తున్నారు. అలా కేసిఆర్ లేకనే ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి వారికి అవమానం జరిగింది. అదే దయకర్రావు మంత్రిగా వుంటే వచ్చి, వంగి వంగి దండాలు పెట్టకపోయేవాడా బ్రహ్మానందం. అయినా అలాంటి చిల్లరగాడితో ఫోటో కోరుకోవడం కూడాతప్పే. బ్రహ్మానందం నటించిన ఓ సినిమాలో బ్రహ్మానందం పాత్రనునుద్ధేశించి మరో పాత్రదారి కుక్కను సావిట్లో వుంచాలి. చెప్పును ఆరు బైటే వదిలేయాలని అన్నారు. నెత్తిన పెట్టుకోకూడదని జయప్రకాశ్రెడ్డి అంటారు. దయాకర్ రావు ఆ పని చేయాల్సిందిపోయి నెత్తిన పెట్టుకోవాలనుకున్నాడు. చెప్పు మీద కుచ్చు ఎగిరిపడినట్లు బ్రహ్మానందం కిరికి సప్పుడు చేయడంతో అసలు రంగు బైట పడిరది. తెలంగాణ నాయకులు ఇప్పటికైనా సరే ఆంద్రాకు చెందిన నటులతో వచ్చేది లేదు పోయేదిలేదు. వాళ్లను నెత్తిన పెట్టుకుంటే ఇదే జరుగుతుంది. మర్యాద తెలియని వాళ్లను పలకరించి చుకనైపోవడం ఎందుకు? చెప్పును నెత్తిన పెట్టుకోవాలనుకోవం ఎందుకు?