ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పలువురు కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం.

కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం శనివారం నిర్వహిచడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటి తహశీల్దార్ వర ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతీ పౌరుడు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇక కొన్ని ప్రాంతాలలో కుల వివక్ష కొనసాగుతుందని, దానిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిదంగా హక్కుల సాధన దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు.

స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు.

స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ వారు జూన్ 2 నుండి ఆన్లైన్ లో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్స్ చెల్లింపులకు స్లాట్ బుకింగ్ కు సంబంధించి కేవలం ఒక్క రోజులోనే 48 స్లాట్లు బుకింగ్ చేసుకోవచ్చని.

Slot Booking.

 

బుక్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ స్లాట్ నిర్దిష్టమైన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని జూన్ 2 నుండి అమలు కానున్న సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రజలకు ప్రకటన ద్వారా సిరిసిల్ల సబ్ రిజిస్ట్రార్ ఆర్.వి.వి. స్వామి తెలిపారు.

ఇంత‌కు ర‌ష్మిక ఉన్న‌ ఇల్లు ఎవ‌రిదంటా గురువు గారు.

ఇంత‌కు ర‌ష్మిక ఉన్న‌ ఇల్లు.. ఎవ‌రిదంటా గురువు గారు

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది. అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు.

 

నేటి ధాత్రి:

Rashmika Mandanna
Rashmika
నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక (Rashmika Mandanna) మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది.
అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు.
త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, తాజాగా ఎల్లో శారీలో దిగిన ఫొటోలు వాటి గురించి ర‌ష్మిక చెప్పిన మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) ల‌వ్‌లో ఉన్నారు..
ఏ క్ష‌ణంలోనైనా పెళ్లి పీట‌లు ఎక్కుతార‌నే వార్త‌లు ఎలాగో ఉన్నాయి.
అంతేగాక‌ త‌రుచూ ఇద్ద‌రు ఒక‌రితో ఒక‌రికి సంబంధం లేకుండా ఒకే లొకేష‌న్‌ ఫొటోలు షేర్ చూస్తూ నెటిజ‌న్ల‌కు దొరికి పోతుంటారు.
తాజాగా ఇలాంటి ఫొటోలే మ‌రోసారి వైర‌ల్ అయ్యాయి.
రీసెంట్‌గా ర‌ష్మిక (Rashmika Mandanna) ప‌సుపు ప‌చ్చ చీర ధ‌రించి ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌ల సినిమా లాంచింగ్‌కు ముఖ్య‌ అతిథిగా హ‌జ‌రైన‌ సంగ‌తి విధిత‌మే.
ఆపై ఆదే చీర‌పై ఫొటోషూట్ చేయుంచుకున్న ర‌ష్మిక ఈ ఫొటోల‌లో నాకు ఇచ్చినవి, విలువైనవి అన్నీ ఉన్నాయి.
Rashmika
ఇష్టమైన రంగుల చీర, గిఫ్ట్‌గా ఇచ్చిన స్పెషల్ లేడీ, ఈ ఫొటోలు తీసిన వ్యక్తి, ఇష్టమైన ప్లేస్ అన్నీ ఉన్నాయి అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఇంకేముంది విజ‌య్ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) అభిమానుల‌తో పాటు చాలామంది త‌మ బుర్ర‌ల‌కు, త‌మ అకౌంట్ల‌కు ప‌ని చెప్పి సోష‌ల్ మీడియాల్లో త‌మ స్టైల్ క్రియేటివిటీలతో హాల్‌చ‌ల్ చేశారు.
ఆ ఫోటోలు విజ‌య్ ఇంట్లోనే దిగిన‌వ‌ని, వాటిని విజ‌య్ స్వ‌యంగా తీశాడ‌ని, ఆ చీర‌ను విజ‌య్ అమ్మ‌గారు బ‌హూమ‌తిగా ఇచ్చారంటూ కామెంట్లు చేస్తూ హోరెత్తించారు.
గ‌తంలోనూ ఆ ఫొటోలో ఉన్న‌ బ్యాగ్రౌండ్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం క‌లిసి దిగిన ఓ పాత‌ చిత్రం ఉండ‌డంతో ఈ ఫొటోపై చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. ఇక‌నైనా విజ‌య్‌, ర‌ష్మిక‌లు త‌మ రిలేష‌న్‌ను బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌ని, ఇంకా ఎన్నాళ్లు దాచుతారంటూ హిత‌వు ప‌లుకుతున్నారు.

విద్యుత్ నిర్లక్ష్యం కాకూడదు భారీ మూల్యం.

విద్యుత్ నిర్లక్ష్యం కాకూడదు భారీ మూల్యం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

మందమర్రి మండలంలోని మామిడి గట్టు గ్రామ శివారులో గత వారం పది రోజుల నుండి ఈదురు గాలులకు ఒక చెట్టు వేర్లతో సహా విద్యుత్ వైర్లపై పడింది..
అయితే దానిని సదరు విద్యుత్ అధికారులు మరియు చుట్టుపక్కల వారు చూసి చూడనట్లుగా వెళుతున్నారు.. ఆ విధంగా ఆ విద్యుత్ తీగలపై ఆ చెట్టు ఒరిగి ఉన్నా సరే విద్యుత్ అధికారులు ఆ లైన్ గుండానే విద్యుత్తును సరఫరా చేస్తున్నారు.. ఒకవేళ ఎక్కువ గాలి వచ్చి ఆ తీగలు తెగితే ఆ దారి గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులకు కచ్చితంగా ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది….
కావున
సదరు విద్యుత్ అధికారులు వెంటనే పై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు…

టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు.

టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా ఎమ్మెల్యే గారు

మూడు నెలల్లో ఓపెనింగ్ అంటిరి

ముల్కల్ల రాజేంద్రప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు

చెన్నూరు శాసన సభ్యులుగా ఎన్నికైన అనంతరం మందమర్రి మార్కెట్ లో గల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం గత సంవత్సరం జనవరి 21వ తేదీన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు టాయిలెట్స్ కి శంకుస్థాపన చేసి మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన మీరు టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా అని ప్రశ్నించారు బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.
వెంటనే టాయిలెట్స్ పనులు పూర్తి చేసి ప్రజ వినియోగంలోకి తేవాలన్నారు, లేనియెడల మందమర్రి పట్టణ ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న MLA TSS CCDC.

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామంలోని రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు రాత్రి జరిగిన ఝరాసంఘం మండలం చీలేపల్లి గ్రామం మహ్మద్ హుస్సేన్ కుమారుడు మహ్మద్ ఆరిఫ్ వివాహా వలిమా వేడుకల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు,
మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, నాగన్న, శేషి వర్ధన్ రెడ్డి, దిగంబర్ రెడ్డి, సిద్దప్ప,అక్బర్ సహబ్, సభహ ,గ్రామ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్ రాజు,మల్ రెడ్డి,నబి సాబ్, చెంగల్ జైపాల్,మహ్మద్ అక్రమ్,మహ్మద్ హుస్సేన్,ఖాజామియా,మహ్మద్ ఆషిఫ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి.

— వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి
• వానపాము ఎరువుల ద్వారా దిగుబడి అధికం
• సైంటిస్ట్ చిన్నబాబు నాయక్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

వర్షాకాలం వరి సాగు పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ చిన్న బాబు నాయక్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. వర్షాకాలంలో పంటలపై వచ్చే రోగాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పురుగులు నారిమడి పోసినప్పుటి నుండి వరి ఆకులపై గుడ్లను పెట్టి వాటి ఉత్పత్తిని పెంచుకుంటుందన్నారు. వాటి నివారణకు మందులను వాడాలని సూచించారు. వానపాము ఎరువుల ద్వారా వరి పంట అధిక దిగుబడిని ఇస్తుందన్నారు. ఎరువులపై కూడా రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ఆధునిక పరిజ్ఞానం పరిధిలోని కూలీ, సమయం తగ్గించే విధంగా డ్రోన్ సహాయంతో మందును పిచ్కారి చేయవచ్చన్నారు. డ్రోన్ మిషన్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలత, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రైతులు ఊడెడు రాజయ్య, కూడవెల్లి చంద్రం, ఊడెపు శ్రీశైలం, కోమ్మిడి రాజు, బురాని మల్లేశం, మంగలి అమర్, మ్యాదరి కనకరాజు, సౌడ స్వామి, పాతూరి రాంరెడ్డి, రాకేష్, వేణు తదితరులు ఉన్నారు.

వలిమా వేడుక లో పాల్గొన్న TGIDC.

వలిమా వేడుక లో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల్ చిల్లపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ ఆరిఫ్ గారి వలిమా వేడుకలో పాల్గొని వరుడునికి శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వారితోపాటు మాజీ ఎంపిటిసి ఆఫీస్ కీజర్ ఖాన్ అశ్విన్ పటేల్ మొహమ్మద్ మోయిన్ మాణిక్ రెడ్డి మొహమ్మద్ ఏజాబ్ బాబా గోవర్ధన్ రెడ్డి జఫర్ అసద్ మతిన్ తదితరులు ఉన్నారు.

వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి.

నియోజకవర్గం వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా,నియోజకవర్గం, మండల,గ్రామల నూతన కమిటీ నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ అధ్యక్షులకు నియమించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిను సంగారెడ్డిలో కలసి వినతిపత్రం సమర్పించారు. అదేవిదంగా వివిధ మండలలాల నుండి నూతన కమిటీకి దరఖాస్తు చేసుకొన్నారు.ఈ సందర్బంగా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల క్రితం నుండి జహీరాబాద్ లో నూతన అధ్యక్షులకు మార్చిన దాఖలాలు లేవన్నారు. అందుకే 2018- 2023 అసంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని ఆమెకు తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తప్పకుండ నూతన మండల కమిటీని వేయడం జరుగుతుంది అన్నారు. త్వరలో జహీరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ముల్తాని మక్సుదలిసాబ్ హదునూర్ మస్తాన్ అలీ హదునూర్ సమీబాయి మిర్జాపూర్ నరసింహులు మలిగి రియాజ్ భాయ్ చాలు కి కోయిరు మండల్ మొగుడంపల్లి మండల్ న్యాల్కల్ మండల్ జైరాబాద్ టౌన్ నుంచి తదితరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మద్యం కోసం తాకట్లు….

మద్యం కోసం తాకట్లు….

◆ రూపాయిలు. 200 రూపాయిలు . 2000 వసూలు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వింత దోపిడీ జరుగుతోంది. మద్యం మత్తులో ఉన్న కొందరు తమ వద్ద డబ్బులు లేకపోతే వాచ్లు, చైన్లు, ఉంగరాలు, మొబైల్ ఫోన్లను తాకట్టుపెడుతున్నారు. అయితే, రెండు రోజుల్లో వాటిని విడిపిం చుకోకపోతే, రూ. 200 విలువైన మద్యం కోసం తాకట్టు పెట్టిన వస్తువుకు ఏకంగా రూ. 2000 డిమాండ్ చేస్తున్నారు. వైన్స్ షాపులకు అనుబంధంగా ఉన్న స్నాక్స్ షాపులు, ఇతర దుకాణాల్లో ఈ తరహా దోపిడీ ఎక్కువగా జరుగుతోందనే ఆరోప ణలు ఉన్నాయి. వైన్స్ పర్మిట్ రూముల్లో కూర్చుని మద్యం తాగిన తర్వాత, మరికొంత మద్యం తాగేందుకు డబ్బులు లేని వారు తమ వస్తువులను తాకట్టు పెడుతున్నారు. మరుసటి రోజు వాటిని విడిపించుకోవడానికి వెళ్లే వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైన్స్ దుకాణదారుల కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతోందని ప్రచారం సాగుతోంది.

అబ్కారీ సీఐ ఏమన్నారంటే..

CI Srinivas Reddy

 

 

వైన్స్ దుకాణాల్లో నగదు లేదా పేటీఎం ద్వారామాత్రమే మద్యం విక్రయించాలని జహీరాబాద్ అబ్కారీ సీఐ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైన్లో గానీ, వాటికి అనుబంధంగా ఉన్న షాపుల్లో గానీ వస్తు వులు తాకట్టు పెట్టుకుని మద్యం ఇచ్చిన ట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటా మని ఆయన హెచ్చరించారు.

బక్రీద్ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో “పీస్ మీటింగ్”ఏర్పాటు

బక్రీద్ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో “పీస్ మీటింగ్”ఏర్పాటు

★ఎస్సై నరేష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో ఎస్సై నరేష్, ఆధ్వర్యంలో జరిగిన “పీస్ మీటింగ్”నకు ఝరాసంగం లోని హిందూ,ముస్లిం మతాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై నరేష్, మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల పెద్దలు పోలీసువారికి సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు. నిజ నిజాలు తెలియకుండా మీకు వచ్చిన అసత్యపు సోషల్ మీడియా సందేశాలను దాని గురించి నిజామా అబద్దమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకుడదన్నారు.దాని వలన ఎలాంటి ప్రమాదమైన జరగవచ్చు కావున ప్రశాంత మైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు పోలీసులకి సహకరించాలని అన్నారు. ప్రజా భద్రత, లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేలా చూడడం పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలు,ప్రజా శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఝరాసంగం ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉండి ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా అందరికి,అన్ని ప్రాంతాల వారికీ ఆదర్శంగా నిలివాలని కోరారు.

కులగణనతో ఓబీసీ పార్టీలకు ఇబ్బందులు తప్పవా?

ఆధిపత్య ధోరణి వీడకపోతే ఓబీసీ పార్టీల మనుగడ కష్టం
ఓబీసీల్లో ప్రయోజనం పొందుతున్నది కొన్ని కులాలే
అగ్రవర్ణాలకు మించిన స్థాయిలో కొనాగుతున్న ఆధిపత్యం
ఎదుగుదల లేని అణగారిన కులాలు
ఓబీసీ ఆధిపత్య కులాల మెడకు కులగణన
కులం పేరుతో రాజకీయాలు నడపడం కష్టం కావచ్చు
అల్పజనసంఖ్య కలిగిన కులాల మనుగడ కష్టం
సామాజిక సమతుల్యతను సమూలంగా మార్చేసే కులగణన
డెస్క్‌ ,నేటిధాత్రి: 
కాంగ్రెస్‌ సహా విపక్షాలు కులగణన చేపట్టాల్సిందేనని పట్టుపట్టడం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తిచేశాయి. ఇక జనతాదళ్‌ (యు) బిహార్‌లో దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన పూర్తిచేసింది. కులగణనలో సశాస్త్రీతను ప్రశ్నించినవారు లేకపోలేదు. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో ప్రాబల్యాన్ని కలిగివున్న కులాలు తమ ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో ఈ కులగణను వ్యతిరేకించడాన్ని కూడా మనం చూశాం. బీజేపీ మొదట్నుంచీ కులగణను వ్యతిరేకిస్తోంది. ఓట్లకోసం హిందువులను విభజించి ప బ్బం గడుపుకోవాలన్న దురాశతోనే విపక్షాలు కులగణనను డిమాండ్‌ చేస్తున్నాయంటూ వాదించినా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తదితర విపక్షాలు దీన్ని ప్రధానాస్త్రంగా ఉపయోగించడంతో తప్పనిపరిస్థితుల్లో కేంద్రం వచ్చే జనగణనతోపాటు కులగణన కూడా చేపడతామని ప్రకటించింది. విచిత్రమేమంటే విపక్షాలు దేన్నయితే తమ ప్రధాన అస్త్రంగా మలచుకోవాలనుకుంటున్నాయో అది బూమరాంగ్‌ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రా ల్లో బలీయంగా వున్న కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఈ కులగణన ఫలితాలు ఇబ్బంది కలిగించేవి గా వున్నాయనేది ఇప్పుడిప్పుడే వెల్లడవుతుండటం తాజా పరిణామం. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌ (యునైటెట్‌) పార్టీల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓబీసీ కులాలకు చెందిన నాయకులకు కొత్త సమస్యలు పుట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడిరది. అదెట్లాగో పరిశీలి ద్దాం.
మింగుడుపడని సమస్య
ఎస్సీ వర్గాలను ఉపకులాలుగా వర్గీకరించమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ఆవర్గాల్లో సమస్యాత్మకంగా మారినట్టే, ఇప్పుడు కులగణన ఓబీసీ (ఇతర వెనుకబడిన కులా లు) రాజకీయాలపై ఆధారపడిన పార్టీలకు మింగుడు పడటంలేదు. పైకి కులగణన వల్ల అధిక జనాభా కలిగిన ఓబీసీ కులాలవారికి ప్రయోజనం కలుగుతుందని పైకి ఎంతగా విపక్షాలు వా  దించినా, ఓబీసీల్లోని కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యం వహిస్తున్న సంగతి ఇప్పుడు మరింత   ప్రస్ఫుటం కానుంది. అంటే ఓబీసీకులాల్లోనే అసమానతలు బహిర్గతమవుతున్నాయి. రాజ్యాం  గం ప్రసాదిస్తున్న రిజర్వేషన్ల ఫలాలను కూడా వీటిల్లోని కొన్ని కులాలుమాత్రమే అనుభవించడమేకాకుండా మరోపక్క రాజకీయ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో  కొన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వైనం కులగణన పుణ్యమాని మరింత స్పష్టంగా వెల్లడి కానుంది. ఇప్పటివరకు ఓబీసీ భజన చేస్తున్న విపక్షాలకు ఇదొక విరోధాభాస వంటిదేనని చెప్పాలి. 
కొన్ని కులాలదే ఆధిపత్యం
1931లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం దేశంలో కులగణన నిర్వహించిన తర్వాత, మళ్లీ దాన్ని చేపట్టడం ఇదే ప్రథమం. కేంద్రం నిర్ణయాన్ని ఎస్‌.పి, ఆర్‌జేడీ, జెడీ(యు), కాంగ్రెస్‌ పార్టీలు స్వాగతిం చాయి. కేంద్రం నిర్ణయం తీసుకోవడం తన ఘనతేనని జేడీ(యు) చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. కాకపోతే ఇప్పుడు ఎస్‌.పి, ఆర్‌జేడీలు కూడా ఈ అంశాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం తాజా పరిణామం. ఈ మూడు పార్టీలు జయ ప్రకాష్‌ నారాయణ్‌ యుగం, మండల్‌ కమిషన్‌ కాలం తర్వాత వెలుగులోకి వచ్చినవే. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ఓబీసీలకు చెందిన కొన్ని కులాల నాయకులు మాత్రమే! ఓబీసీల ఐక్యతారాగం వెనుక ఆయా కులాల ‘సామాజిక`ఆర్థిక వెనుకబాటు’ అనే ని నాదం ప్రధాన పాత్ర పోషించిందనేది కీలక సత్యం. ఇందులో భాగంగానే ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి, ములాయంసింగ్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ`క్షత్రియ ఆధిపత్యాన్ని దెబ్బతీసి ఓబీసీల పాలనను అందుబాటులోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇక లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ‘ఓబీసీ’ కులంకార్డుతో రాజకీ  యాలు నడిపి ఆర్‌జేడీ పాలనను తీసుకొచ్చారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అణగదొక్కామని ప్రచారం చేసుకున్న లాలూప్రసాద్‌ యాదవ్‌, వారిని తలదన్నే రీతిలో తన కుటుంబ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, ఓబీసీల్లో ఎవరినీ పైకి రానీయకుండా అప్రతిహతంగా బిహార్‌ను పాలించారు. ఇక నితీష్‌ కుమార్‌ విషయానికి వస్తే, ఆయన పై ఇద్దరు నాయకులంత దూకుడుగా కాకుండా, మధ్యేమా ర్గంలో తన ఓబీసీ రాజకీయాన్ని కొనసాగించారు.బిహార్‌ రాజకీయాల్లో యాదవుల (ఓబీసీలు) వెన్నుదన్నుతోనే ఆర్‌జేడీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో వీరి జనాభా     14% కావడం ఇక్కడ కీలకం. 
ఇక ఉత్తరప్రదేశ్‌ విషయానికి వస్తే యాదవుల జనాభా 8 నుంచి 10శాతం వరకు వుంటుంది. సమాజ్‌వాదీ పార్టీ ఓబీసీల్లోని ఇతర ఉపకులాలు, ముస్లింల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో నితిష్‌కుమార్‌ ప్రధానంగా కూర్మీలు (ఇది ఆయన కులం) మరియు కోయిర్లపై ఆధారపడి తన రాజకీయాన్ని నడిపారు. ఈ రెండుకులాలు కలిపితే 7 నుంచి 10శాతం వరకు వుంటారు. అయితే తీవ్రంగా వెనుకబడిన కులాల్లో (ఈబీసీ) ఆయన గట్టి పట్టును సంపాదించడం కూడా జేడీయూ అధికారంలోకి రావడానికి మరో కారణం. ఎందుకంటే ఈబీసీల జనాభా రాష్ట్రంలో36% వరకు వుంది. 
ఇక ఓబీసీ పల్లవి కష్టం
ఈవిధంగా ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌కుమార్‌లు ఓబీసీ రాజకీ యాల నేపథ్యంలో ఎదిగినా, చివరకు ఈ వర్గాల్లో కేవలం ఒక్క కులం మాత్రమే ఆధితపత్యం వహించడం చివరకు చోటుచేసుకున్న పరిణామం. ఇప్పుడు చేపట్టిన కులగణన వల్ల, ఓబీసీల్లో ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారన్న నిజం బయటకు రావడం ఈ నాయకులకు మింగుడుపడటం లేదు. అంటే ఓబీసీల్లో ఎన్నో కులాలున్నప్పటికీ కేవలం ఒకే ఒక కులం అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో ఆధిపత్యం వహిస్తున్నదన్న సత్యం బహిర్గతం కావడంతో ఇప్పుడు ఆయా నాయకులకు ఓబీసీ పల్లవిని అందుకోవడం కష్టంగా మారింది. అంతా ఓబీసీలే అనేది ఒక సత్యమైతే, వీరిలో ఒక కులం మాత్రమే ఆధిపత్యం వహిస్తున్నదనేది మరో సత్యం. ఈవిధంగా కులగణనలో ఓబీసీ అనేది ఒక విరోధాభాసగా తయారైంది! దేశ జనాబాలో ఓబీసీలదే సింహభాగమని పై మూడు రాజకీయ పార్టీల వాదన. అందుకనే కులగణ చేపడితే ఓబీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీ యపరంగా న్యాయం జరుగుతుందని వీరు చేస్తున్న వాదన కూడా సహేతుకమే. అయితే ఉద్యోగ, ఉపాధి, రిజర్వేషన్‌ ప్రయోజనాలు, రాజకీయ ఆధిపత్యం ఓబీసీల్లో ఏదో ఒక కులం చేతిలోనే వున్నదనేది ఈ కులగణనద్వారా స్పష్టమవుతోంది. అంటే ఎస్సీ రిజర్వేషన్లలో మాలలు ప్రయోజ నం పొందినట్లుగానే, ఓబీసీల్లో యాదవుల వంటి కొన్ని కులాలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయని చెప్పవచ్చు. 
‘యాదవీకరణ’
ఓబీసీ రాగం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌లు ఓబీసీల్లోని ‘యాదవ’ కులానికి చెందినవారు. ఎప్పుడైతే సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌లు అధికారంలోకి వచ్చాయో అప్పుడు ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాల్లో కేవలం ఈ కులానికి చెందినవారే ఎక్కువగా ప్రయోజనం పొందడం మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పూర్తిగా ‘యాదవీకరణ’ జరిగిందనేది ప్రధానంగా వచ్చిన ఆ రోపణ. ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు యు.పి.లోని 1526 పోలీస్‌ స్టేషన్లలో,    600 యాదవ్‌ కులానికి చెందిన పోలీసు అధికార్ల ఆధిపత్యంలో వుండేవని ఒక నివేదిక వెల్లడిరచింది. లక్నో, మధుర, కాన్పూర్‌, ఘజియాబాద్‌, సంభాల్‌, బడౌన్‌ వంటి నగరాల్లోని పోలీస్‌ స్టేషన్లలో 40శాతం వరకు యాదవుల ఆధిపత్యంలోనే వుండేవి. సీనియర్‌ అధికార్ల అంచనా ప్రకారం 50శాతం పోస్ట్‌లను అనధికారికంగా యాదవ్‌లకు రిజర్వ్‌ చేసి వుంచేవారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. కేవలం ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడే ఇట్లా జరిగిందా అంటే, బీఎస్‌పీ అధికారంలో వున్న 2011వ సంవత్సరంలో కూడా ఇదే తంతు  కొనసాగడం విశేషం. బీఎస్‌పీ కాలంలో ప్రావెన్షియల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (పీసీఎస్‌) పరీక్షా ఫలితాల్లో 176 మంది ఓబీసీలు ఉత్తీర్ణులైతే వీరిలో 147మంది యాదవులు! దీంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగడంతో ప్రభుత్వం మరో 86మంది అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 54 మంది మళ్లీ యాదవులే వుండటం గమనార్హం! ఈ 54 మందిలో చివరకు   ఇంటర్వ్యూలో 50 మంది ఎంపికయ్యారు. 2011 నుంచి 2014 వరకు వివిధ రకాల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎక్కువ మంది యాదవ కులానికి చెందిన అభ్యర్థులే ఎంపికవడం గమ నార్హం. తర్వాతి కాలంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 8 నుంచి 14 టిక్కెట్ల ను యాదవులకే కేటాయించింది. 2024లో అఖిలేష్‌ యాదవ్‌ తమ కులానికి కేవలం నాలుగు టిక్కెట్లు మాత్రమే ఇచ్చారు. ఆ నలుగురూ కూడా ఆయన కుటుంబసభ్యులే! నెల క్రితం వరకు యు.పి.లోని 22 జిల్లాల్లో పార్టీ ఆధిపత్యం యాదవుల చేతుల్లోనే కొనసాగింది.
బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ
ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఐదేళ్లపాటు బిహార్‌ను పాలించారు. ఆయన పాలన దేశంలోనే గొప్ప అవినీతి, అరాచకాలకు బ్రాండ్‌గా మారిపోయింది. వివిధ శాఖలకు చెందిన అధికార్లు వేధింపుల భయంతో బదిలీలు చేయించుకున్నారు. కొద్దో గొప్పో సంపద కూడబెట్టుకున్న వారు దాన్ని బయటపెట్టడానికి భయపడ్డారు. భద్రతకోసం మహిళలు, పురుషులపై మరింతగా ఆధారపడాల్సి వచ్చింది. ఓబీసీ కులాల్లో పేదలు మరింత పేదలుగా మారగా, ధనికులు మరింతధనికులయ్యారు. లాలూ కాలంలో భూమి లావాదేవీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలైన వాటి ల్లో ఎక్కువ ప్రయోజనం పొందింది యాదవులే. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సురేంద్రయాదవ్‌, సాధుయాదవ్‌, సుభాష్‌ యాదవ్‌ వంటివారు రాష్ట్ర యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఏకఛ  త్రాధిపత్యంగా అధికారాన్ని చెలాయించారు. బిహార్‌లో 2023లో నిర్వహించిన కులగణన ప్రకారం, ప్రభుత్వ సర్వీసుల్లో 6,21,4811 మంది ఓబీసీలుండగా వీరిలో 2,89,538 (46.59%) మంది యాదవులే! ఆవిధంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓబీసీల్లో యాదవులను ఎంతగా పైకి తీసుకొచ్చారో మిగిలినవారిని అంతగా నిర్లక్ష్యం చేశారు. ఉదాహరణకు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం టిక్కెట్లను కేవలం యాదవులకే ఇచ్చిన ఘనత లాలూది. 2023లో 15 జిల్లాల్లో పార్టీకి నాయకత్వం వహించింది యాదవులే! లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కులపిచ్చి ఎంతగా ముదిరిపో యిందంటే ఆఖరుకు ముస్లింలు ఆధిపత్యం వహించే స్థానాల్లో కూడా యాదవులకే టిక్కెట్లు ఇచ్చేస్థాయికి చేరుకుంది. 
కూర్మీ కోయిర్లు మరియు లవ్‌కుశ్‌ ఐకమత్యం
నితిష్‌కుమార్‌ కూర్మీ`కోయిర్‌ కులాలను ఒకే విధంగా చూస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమతు ల్యాభివృద్ధి వుండాలనేది ఆయన అభిమతం. అందుకనుగుణంగానే ఆయన విధానాలు కొనసా గుతాయి. ఉపేంద్ర కుశావహ, శకుని చౌదరి (బిహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి తండ్రి) నితిష్‌కు గట్టి మద్దతుదార్లుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కూర్మీ`కోయిరీ సంయోజనను లవ్‌`కుశ్‌గా రాష్ట్ర ప్రజలు పరిగణిస్తారు. భూకమతాలను కలిగివుండి వ్యవసాయంపై ఆధారపడే ఈ వర్గాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలను నితిష్‌ ప్రభుత్వం క ల్పించింది. ప్రస్తుతం బిహార్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్‌లో 46.6% యాదవులే వున్నారు. అదే లవ్‌`కుశ్‌వర్గం ఓబీసీ రిజర్వేషన్లలో 36.9% కొనసాగుతున్నారు. మరి రాష్ట్ర జనా భాలో యాదవులు 14.27% కాగా కోయిరీ`కూర్మీ ప్రజలు 7.09%. ఇప్పుడు మొత్తం ఉద్యోగాల్లో కోయిరీ`కూర్మీ ప్రజలు కేవలం 2.47పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. అంటే ఇక్కడ జనాభా సంఖ్యకు, పొందుతున్న ఉద్యోగాలకు పొంతన వుండటంలేదనే అర్థం! ఎందుకంటే ప్రభుత్వ ఉ ద్యోగాల్లో యాదవుల ప్రాతినిధ్యం 1.55గా వుంది మరి!!
ఇతర రాష్ట్రాల్లో కూడా
ఈవిధంగా జనాభా సంఖ్యకు, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యానికి పొంతనలేకపోవడం కేవలం బిహార్‌కు మాత్రమే పరిమితం కాదు. జార్కండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అంటే ఓబీసీ వర్గాల్లోని ఆధిపత్య కులాలు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతుండగా, మిగిలినవారికి అవి అందుబాటులో లేవు. ఆర్‌జేడీ, ఎస్‌.పి., జెడీ(యు) వంటి ప్రాంతీయ పార్టీలు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తొలగించి వెనుకబడిన తరగతులకు అధికారాన్ని కట్టబెట్టాయని కొందరు ప్రచారం చేస్తున్నప్పటికీ, వెనుకబడిన కులాల్లో అట్టడుగున వున్న కులాల స్థితిగతుల్లో ఏవిధమైన మార్పు లేదన్నది అక్షరసత్యం. అందువల్ల కులగణన అనేది కేవలం  సంఖ్యకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక, ఆర్థికాభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీనివల్ల ఓబీసీ వర్గాల్లోని కొన్ని కులాలు అగ్రవర్ణాలను మించిన స్థాయిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అన్ని రంగాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. జనాభాపరంగా తక్కువగా వున్న కులాలు, తమ అస్తిత్వంకోసం ఒక ఆధిపత్య కులానికి మద్దతు పలకాల్సి వస్తుండటంకూడా గమనించాలి. ఇప్పుడు బిహార్‌లో తేజస్వీ యాదవ్‌ను చాలామంది యాదవులు అనుమాన దృక్కులతో చూస్తున్నారు. కుశావహలకు అనుకూలంగా ఆయన మెలగడమే కారణం. జార్ఖండ్‌ లో గత ఎన్నికల్లో సురేష్‌ మెహతో నేతృత్వంలో ఆల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పార్టీ (ఏజేఎస్‌యూపీ) ఏర్పాటైంది. సురేష్‌ మెహతోను తరచుగా కూర్మీ మెహతోగా పిలిచేవారు. అయితే 2024 అ సెంబ్లీ ఎన్నికల్లో జైరామ్‌ మెహతో నాయకత్వంలోని జార్ఖండ్‌ లోక్‌తాంత్రిక్‌ క్రాంతికారి మోర్చా కూర్మీల్లో ఎక్కువ మద్దతును సాధించింది. అంటే కూర్మీలు జైరామ్‌ మెహతా పార్టీపైనే విశ్వాసం వుంచారు.ఏతావాతా చెప్పొచ్చేదేమంటే కులగణన ఓబీసీ పార్టీల్లో కొనసాగుతున్న సమతుల్యతను దెబ్బతీయవచ్చు. తమకు సంద్రాయంగా విధేయులుగా వున్న వర్గాల్లో తమ బలాన్ని నిలుపుకుంటూనే, త మను తాము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటే తప్ప ఓబీసీ పార్టీల మనుగ డ కష్టం.

‘‘అణువంత రూపం’’ కాదు…’’హనుమంతుడి స్వరూపం’’!

`ఒడిదొడుకులెన్ని వున్నా ఒకే ఒక్కడు రేవంత్‌!

`కాంగ్రెస్‌ ను కష్టకాలంలో ఆదుకున్నాడు.

`రవ్వంత అన్న కళ్ల ముందు కొండంత ఎదిగాడు.

revanth reddy

`అణువంత అనుకున్న వారి ముందు హనుమంతుడై దడ పుట్టిస్తున్నాడు.

`కాంగ్రెస్‌ కు సంజీవనీ అయ్యాడు.

`కేసీఆర్‌ కు ఎదురు తిరిగాడు.

`కేసీఆర్‌ ను ఎదిరించి నిలిచాడు.

`కేసులకు వెరవలేదు. జైలుకు భయపడలేదు.

`లక్ష్యం ముందు సమస్యలను చీపురుపుల్లలనుకున్నాడు.

`చిందరవందర రాజకీయాన్ని చక్కదిద్దాడు.

`తెలంగాణ రాజకీయాలలో ఎదురులేని స్థాయికి ఎదిగాడు.

`ఎవరినైనా ఎదిరించి నిలబడి తొడగొట్టాడు.

`కేసీఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు.

`ఏడాదిన్నర పాలన కూల్‌గా నడిపించాడు.

`బీఆర్‌ఎస్‌ కు సున్నం పెట్టి, సున్నా చుట్టించాడు.

`బీఆర్‌ఎస్‌ రాజకీయాన్ని నిలువునా మింగేశాడు.

`తెలంగాణ రాజకీయాలలో బీఆర్‌ఎస్‌ ఉనికి ప్రశ్నార్థకం చేశాడు.

`కారులో కుదుపులు కాంగ్రెస్‌ కు కలిసొచ్చేలా చేశాడు.

`కేసీఆర్‌ లాంటి నాయకుడిని కేసులతో వణికిస్తున్నాడు.

`కేసీఆర్‌ కు భయం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు.

`పార్టీని మొత్తం తన కంట్రోల్‌ లోకి తెచ్చుకున్నాడు.

`సమిష్టి ప్రభుత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయమంటే మాటలు కాదు. ఎదురీతలు. నిలదీతలు. పడిగాపులతో కూడిన ఎదురుచూపులు. ఎవరు ఎప్పుడు ఎంత ఎదుగుతారో..ఎవరు ఎక్కడ ఆగిపోతారో అన్నది తెలిసే ముచ్చట కాదు. కాకపోతే రాజకీయం అంటే కాలం కలిసి రానప్పుడు రాజీ పడాలి. కాలాన్ని తనవైపు తిప్పుకొని ఎగిరిపడాలి. తనంతటి వారు లేరని నిరూపించుకోవాలి. నాయకులకు ఆశలుండాలి. లక్ష్యాలుండాలి. తాను ఎమ్మెల్యే కావాలనుకంటే సరిపోదు. అయినా అవకాశాలు రాకపోవచ్చు. అందుకే రాజకీయాల్లో అవకాశాల కోసం ఎంత వెంపర్లాడాలో..అంతే వాసిగా కొట్లాడి కూడా సాదించాలి. అప్పుడు నాయకుడు, మహా నాయకుడౌతారు. రాజ్యం ఏలే శక్తిని కూడగట్టుకుంటాడు. పాలకుడై పాలిస్తాడు. అలాంటి వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకరు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్‌ పార్టీలో నాయకుడు కావడం అంటే ఏటికి ఎదురీదడమే..గెలిచి నిలవాటంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొవాలి. అందర్ని కలుపుకుపోవాలి. అందరి చేత నాయకుడని జేజేలు కొట్టించుకోగలగాలి. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. ఎదిగేవారిని ఎవరు లాగుతారో తెలియదు. నిచ్చెన మీద వున్నవారిని ఎవరు కిందకు తోస్తారో తెలియదు. అలాంటి పార్టీలో అందర్నీ దాటుకొని ముందుకు వెళ్లడం అంటే పరుగుపందెం కన్నా పెద్ద ప్రయత్నమే చేయాలి. అందర్నీ నెట్టేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కాంగ్రెస్‌లో గెలుపు. అప్పుడే కాంగ్రెస్‌లో పదవులు. నాయకుడి విలువ ప్రతిపక్షంలో వున్నప్పుడు తెలుస్తుందని అంటారు. నాయకుడు కావాలనుకున్నప్పటి నుంచి అలుపెరగని పోరాటం చేసే వారు మాత్రమే ముఖ్యమంత్రి స్దాయికి చేరుకుంటారు. అలాంటి వారిలో కీలకంగా చెప్పుకోవాల్సిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఒక్కడుగా రాజకీయం మొదలు పెట్టారు. ఒక్కడుగా అడుగులేశాడు. ఒక్కడుగానే విజయాలు సొంతం చేసుకున్నాడు. ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి ఎంతో తేడావుంది. సిఎం. రేవంత్‌ రెడ్డి, మూడు దశాబ్ధాల క్రితం ఈ స్దాయి నాయకుడై వుంటే, ఇప్పటికే దేశ ప్రధాని అయ్యేవారు. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి పెద్ద చాలెంజ్‌లు లేవు. ఇప్పుడున్న పధకాల గోల లేదు. ప్రభుత్వమంటే పని చేసుకుంటూ పోవడం తప్ప, ప్రజలకు ఇప్పుడిస్తున్న సంక్షేమ పధకాలతో కూడిన పూర్తి స్ధాయి మ్యానిపెస్టోలు వుండేవి కాదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి ఏదో ఒకరకమైన ప్రభుత్వ పధకం అందాల్సిందే. అందని వారిని వాటిని అర్హులను చేయాల్సిందే. వారికి కూడా ప్రభుత్వ పధకాలు అందేందుకు కృషి చేయాల్సిందే. కాని గతంలో ఒకటో, రెండో పధకాలు మాత్రమే వుండేది. అందులో రేషన్‌ తప్ప మరే పథకాలు కనిపించేవి కాదు. ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఒత్తిడి వుండేది కాదు. కాని రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఎండాకాలంలో ఉక్కపోతలా వుండేది. ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకునేంత రాజకీయం నెరిపేవారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఏడాది కాలం కూడా సరిగ్గా పాలన సాగించలేని ఉద్దండ నాయకులు కూడా వున్నారు. అందులో మర్రి చెన్నారెడ్డి, మాజీ ప్రధాని పవి. నర్సింహారావు లాంటి వారు కూడా వున్నారు. కాంగ్రెస్‌ రాజకీయ చరిత్రలో అత్యధిక సీట్లు సాధించిన పి.వి. నర్సింహారావు కూడా పదమూడు నెలలు పాలన సాగించేందుకు ఆపసోపాలు పడ్డారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు కూడా దినదిన గండంగానే పాలన సాగించారు. వారందరితో పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి పడినన్ని రాజకీయ కష్టాలు, కక్షలు ఏ నాయకుడు అనుభవించలేదు. నిత్యం నరకం చూశారు. అయినా కేసిఆర్‌ను ఎదరించి నిలిచారు. పోరాడి ప్రజా క్షేత్రంలో కేసిఆర్‌ను మట్టి కరింపించారు. రాజకీయాల్లో ఆరోపణలు మరీ దారుణమైన స్ధితికి బిఆర్‌ఎస్‌ నాయకులు దిగజార్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిత్వ హననం చేసేవారు. ఆయన ఆహార్యం మీద ఆరోపణలు చేసేవారు. అయినా రేవంత్‌ రెడ్డి చిరునవ్వుతో వాటిని స్వీకరించేవారు. అంతే దాటిగా విమర్శలు చేసిన వారిని కూడా మాటలతో తూటాలు పేల్చేవారు. చాల మంది బిఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి మీద చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. పైగా అణవంత రెడ్డి, రవ్వంత రెడ్డి అంటూ హేళన చేసేవారు. ఇప్పుడు ఆ నాయకుడు రేవంత్‌ రెడ్డి కొండంత కనిపిస్తున్నాడు. ఒక్కక్కరి వెన్నులు వణకు పుట్టిస్తున్నాడు. ఎన్ని ఒడుదొడుకులైనా ఆనాడు ఎదుర్కొన్నాడు. ఇప్పుడూ ఎదురీదుతూనే వున్నారు. సహజంగా ఏ నాయకుడైనా అధికార పార్టీలో చేరి పదవులు పొందాలనుకుంటారు. నాయకుడిగా ఒక్కొ మెట్టు ఎదుగాలనుకుంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం విభిన్నం. ఆయన రాజకీయం ప్రత్యేకం. అందుకే తన మొదటి ఎంపిక ప్రతిపక్షంలో వున్న పార్టీనే ఎంచుకున్నారు. ఇండిపెండెంటుగానే జడ్పీటీసి అయ్యారు. ఇండిపెండెంటుగానే ఎమ్మెల్సీ అయ్యారు. 2007 ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశంలో చేరారు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలోనే వుంది. 2014లో తెలుగుదేశంలోనే వున్నాడు. అప్పుడూ ప్రతిపక్ష పాత్రనే పోషించారు. ఎందుకంటే ఆయన పదవులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద పొందాలనుకోలేదు. కాంగ్రెస్‌లో చేరినా ఆ పార్టీ ప్రతిపక్షంలోనే వుంది. ఆ పార్టీ అప్పుడు నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలోనే వుంది. భవిష్యత్తులో పుంజుకుంటుందన్న నమ్మకం లేని స్దితిలోనే వుంది. అలాంటి సమయంలోనే కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. పార్టీకి కొండంత అండగా నిలిచారు. పార్టీలో ఎదురయ్యే సమస్యలనే కాదు, అప్పటి పాలకపక్షం నుంచి ఎదురైన ఇబ్బందులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు. పాలమూరు పులి బిడ్డ అని నిరూపించుకున్నారు. ఒకనాడు అణువంత అన్నవారి ముందు హనుమంతుడంతై, వారికి దడి దడ పుట్టిస్తున్నాడు. కాంగ్రెస్‌కు సంజీవని అయ్యారు. పార్టీని నిలబెట్టేందుకు అనేక కష్టాలు పడ్డారు. ఆఖరుకు తన కూతురు పెళ్లిని కూడా కళ్ల నిండా చూడలేనంత కష్టాన్ని అనుభవించాడు. పదే పదే కేసిఆర్‌ పాలనలో జైలు జీవితాన్ని అనేక సార్లు భరించారు. కేసులకు ఏనాడు భయపడలేదు. జైలు జీవితం గురించి చింత చెందలేదు. ఎన్ని నిర్భంధాలనైనా సరే అవలీలగా ఎదుర్కొన్నాడు. ప్రజల హృదయాలను గెల్చుకున్నాడు. కాంగ్రెస్‌ పెద్దల నమ్మకం చూరగొన్నాడు. బలమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని ప్రచారం సాగుతున్న వేళ కేసిఆర్‌కు ఎదరించి నిలిచాడు. ప్రతి పధకాన్ని ఎండగట్టాడు. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు , అక్రమాలు జరుగుతున్నాయని ఆనాడే గొంతెత్తి నినదించాడు. తెలంగాణ సొమ్మును బిఆర్‌ఎస్‌ నాయకులు నీళ్లలా కొల్లగొడతున్నారని ప్రజలను చైతన్యం చేశారు. మల్లన్న సాగర్‌ ప్రాంతాల్లో నిర్వాసితులకు అండగా వున్నారు. ప్రభుత్వంతో కొట్లాడి వారికి పరిహారం అందేందుకు కృషి చేశారు. ఎన్ని అవాంతరాలెదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రతి సమస్యను పూచిక పుల్లతో సమానమనుకున్నాడు. తాను ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేశాడు. ఓ వైపు కేసిఆర్‌ను ఎదుర్కొంటూనే, మరో వైపు కాంగ్రెస్‌లో వున్న చిందర వందర రాజకీయాన్ని చక్కదిద్దారు. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఎదిగారు. తిరుగులేని శక్తిగా మారారు. తన రాజకీయం ముందుకు కేసిఆర్‌ లాంటి నాయకుడి నాయకత్వాన్నే తుత్తునీయం చేశాడు. తనకు ఎదురు వచ్చే వారందరినీ ఎదరించాడు. కేసిఆర్‌ను ఒక దశలో తొడగొట్టి సవాలు చేశాడు. కేసిఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు. జైలుకెళ్లిన సమయంలో కూడా బెబ్బులిలా గర్జించాడు. ఎన్ని సవాళ్లు ఎదురౌతున్నా ఏడాదిన్న కాలం పాటు కూల్‌గా పాలన సాగిస్తున్నాడు. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల చేత సున్నం పెట్టించి, సున్నా చుట్టేలా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ను నిలువునా మింగేశాడు. తెలంగాణ దాటి దేశ రాజకీయాలను ఏలుతామని ప్రగల్భాలు పలికిన వారి రాజకీయ ఉనికినే ప్రశ్నార్ధం చేశాడు. ఇల్లు దాటలేని పరిస్దితి తెచ్చాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడిని కూడా కేసులతో వణికిస్తున్నాడు. ఎవరికీ భయపడడని గొప్పలు చెప్పుకునే కేసిఆర్‌కు భయం ఏమిటో రుచి చూపిస్తున్నాడు. దినదినం వణుకు అంటే ఎలా వుంటుందో చూపిస్తున్నాడు. పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. ప్రజా ప్రభుత్వానికి నిజమైన నిర్వచనం చెబుతున్నాడు.

భగీరథుడి పట్టుదల అందరిలో ఉండాలి

*”నేటిధాత్రి”,వనపర్తి.*

*గంగను దివి నుంచి భూమికి దింపిన మహా తపస్వి భగీరథుడని భగీరథుడి సహనం పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం వనపర్తి పట్టణంలోని మర్రికుంటలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏకశిల భగీరథ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగీరథుడి పట్టుదల మనందరిలోన ఉండాలని మనం చేపట్టే పనులను పూర్తి చేసే వరకు వదిలిపెట్టకూడదని ఎమ్మెల్యే సూచించారు

తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించబోతుందని అందులో సగరులకు సైతం రాజకీయపరమైన అవకాశాలు రాబోతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వనపర్తి నియోజకవర్గంలో జిల్లా స్థాయి నామినేటెడ్ పదవికి మన సగర సోదరుడైన గోవర్ధన్ సాగర్ ను నియమించామని ఎమ్మెల్యే తెలిపారు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి హయాంలోని సగరులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ప్రభుత్వం ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే గుర్తులు చేశారు సగరుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామని మీ సంఘంలోని ముఖ్యులు మాట్లాడుకునే సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు వనపర్తి పట్టణంలోని సగరుల కోసం కళ్యాణ మండపాన్ని సంబంధించి నివేదికలు తయారు చేయాలని ఎమ్మెల్యే సంఘం నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంగం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, జిల్లా అడక్ కమిటీ కన్వీనర్ మోడల తిరుపతయ్య సాగర్ , జిల్లా గ్రంధాల అధ్యక్షుడు గోవర్ధన్ సగర, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం సాగర్ , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హరికిషన్ సాగర్ , రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆర్బి ఆంజనేయులు, రాష్ట్ర సగర సంగం ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, మరికుంట సగర అధ్యక్షులు చీర్ల ఆంజనేయులు ,రాష్ట్ర మహిళా మాజీ అధ్యక్షురాలు మహేశ్వరి సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవి సగర,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర,కోశాధికారి దిండి రామస్వామి సగర,గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి సీతారాం సగర,నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు సగర, గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ సగర, వనపర్తి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పల్లె సత్యనారాయణ సాగర రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చీర్ల విష్ణు సగర, మాజీ కౌన్సిలర్ చీర్ల సత్యం సగర, వనపర్తి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు చీర్ల జనార్ధన్ సగర, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రావుల నాగరాజు సాగర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు చిలుక జ్యోతి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి చీర్ల జ్యోతి,గొబ్బూరి చంద్రాయుడు సగర ఛీర్ల నాగేంద్రం సగర, టౌన్ యూత్ అధ్యక్షులు చీర్ల మహేష్ సాగర్, మర్రికుంట ప్రధాన కార్యదర్శి చీర్ల రాజు సగర కోశాధికారి మో డల శివసాగర్ ఉపాధ్యక్షులు యాదగిరి సాగర్ పట్టణ మాజీ అధ్యక్షులు చీర్ల పెదనాగులు సగర,. ప్రధాన కార్యదర్శి చీర్ల రాజు. గౌరవ అధ్యక్షులు చీర్ల నాగేంద్రం. కోశాధికారి మోడల్ శివ. ఉపాధ్యక్షులు మోడల్ యాదగిరి. చీర్లనాగ స్వామి. చీర్ల జనార్ధన్. చీర్ల శ్రీనివాసులు. చీర్ల అయ్యన్న చీర్ల సత్యం చీర్ల నాగరాజు. మహేష్. గుంటి సుధాకర్. గుంటి మహేష్. రాజు.ఛీర్ల శాంతన్న సగర, తదితరులు పాల్గొన్నారు.*

వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి.

నియోజకవర్గం వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా,నియోజకవర్గం, మండల,గ్రామల నూతన కమిటీ నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ అధ్యక్షులకు నియమించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిను సంగారెడ్డిలో కలసి వినతిపత్రం సమర్పించారు. అదేవిదంగా వివిధ మండలలాల నుండి నూతన కమిటీకి దరఖాస్తు చేసుకొన్నారు.ఈ సందర్బంగా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల క్రితం నుండి జహీరాబాద్ లో నూతన అధ్యక్షులకు మార్చిన దాఖలాలు లేవన్నారు. అందుకే 2018- 2023 అసంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని ఆమెకు తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తప్పకుండ నూతన మండల కమిటీని వేయడం జరుగుతుంది అన్నారు. త్వరలో జహీరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ముల్తాని మక్సుదలిసాబ్ హదునూర్ మస్తాన్ అలీ హదునూర్ సమీబాయి మిర్జాపూర్ నరసింహులు మలిగి రియాజ్ భాయ్ చాలు కి కోయిరు మండల్ మొగుడంపల్లి మండల్ న్యాల్కల్ మండల్ జైరాబాద్ టౌన్ నుంచి తదితరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఘనంగా మచ్చలేని మహనీయులు పుస్తకావిష్కరణ.

ఘనంగా మచ్చలేని మహనీయులు పుస్తకావిష్కరణ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున ఉదయం చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో డాక్టర్ జనపాల శంకరయ్య విరచితమైన (మచ్చలేని మహనీయులు పుస్తక ఆవిష్కరణ )ఘనంగా జరిగినది ఈ సందర్భంగా ఆకునూరి పూర్వ గ్రంథాలయ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ పిల్లల కోసం మహనీయుల చరిత్రలు రాయడం శుభదాయకం అన్నారు ముఖ్యఅతిథి మాట్లాడుతూ పిల్లలు కేవలం సెల్లుకు బానిసలు అవుతున్న నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు కోసం మార్గదర్శకంగా చిన్న చిన్న పదాలతో రాయడం సృజనాత్మకవుకు నిదర్శనం అన్నారు అంతేకాకుండా చందమామ కోరస్ లో చక్కని కథా గేయంగా మలచడం భవిష్యత్తులో మంచి పేరు ఉంటుందని ఆశించారు.

 

Book launch

 

 

 

పేర్కొన్నారు.ముఖ్య అతిథిగా ఆకునూరి శంకరయ్య ,జిందం చక్రపాణి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడెపు రవీందర్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య ,గీతా ప్రచార సమితి అధ్యక్షులు కోడం నారాయణ, వ్యాపార సంఘం అధ్యక్షులు పాములకు పత్తి దామోదర్ , కార్యదర్శి గౌడ రాజు ,ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, జిల్లా కవులు, రచయితలు బూర దేవానందం, అంకారపు రవి, మల్లేష్ చక్రాల,సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాసు బంధు వర్గం ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి 50 సంవత్సరాల పెళ్లి వేడుక కూడా ఘనంగా జరిగినది

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు.

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు

చిన్నతనం నుండే ఫిమేల్ వాయిస్ తో రాణింపు

దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బొటికే సుదర్శన్..

నర్సంపేట నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన బొటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ అవార్డు వరించింది.ఈనెల 28న నిర్వహించిన ఖమ్మం వారి సర్వమాలిక కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా దుగ్గొండి మండలానికి చెందిన బోటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అచీవ్మెంట్ 2025 అవార్డు దక్కింది. ఈ అవార్డును తుమ్మలపల్లి నాగేశ్వరరావు తనయుడు తుమ్మలపల్లి యుగేందర్ చేతుల మీదుగా తీసుకున్నాడు.తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నుండి ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది అని సుదర్శన్ తెలియజేశ

అలాగే గత ఏప్రిల్ 13 న ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకోవడం జరిగిందని సుదర్శన్ పేర్కొన్నారు.కాగా విశాఖపట్నంలోని డాలి ఫంక్షన్ హాల్ లో సినీ హీరో నరేన్ తేజ్,పబ్లిక్ ఫైటర్ మహేష్ యాదవ్ చేతుల మీదగా ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకున్నాడు.గత ఫిబ్రవరి 27 న కరీంనగర్ లో జరిగిన వెంకట్ మ్యూజికల్ తరపున ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫిమేల్ అవార్డు ఏసిపి విజయ్ కుమార్ చేతుల మీదగా తీసుకున్నాడు.   చిన్నతనం నుండి సుదర్శన్ ఫిమేల్ వాయిస్ లో పాట పాడడం అలవాటు చేసుకున్నాడు. 2025 సంవత్సరంలో ఇన్ని అవార్డులు రావడం చాలా గౌరవంగా ఉందని సుదర్శన్ తెలియజేశారు.ఈ సందర్భంగా సుదర్శన్ కు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు పలువిధాల సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే ముందు ముందు మంచి అవార్డులు తీసుకొని దుగ్గొండి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు.

◆ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గుంతలమైన అల్గొల్ బైపాస్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్ నుండి భరత్ నగర్ ,అల్గోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు శుక్రవారం స్థానిక నాయకులు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ & అండ్ బి ఈఈ , సీఈ తో ఫోన్లో సంభాషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు . గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు సమస్య పరిష్కారానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేశామని , కాంట్రాక్టర్ కేవలం బ్రిడ్జ్ మాత్రమే నిర్మించి అప్ప్రోచ్ రోడ్డు నిర్మించకుండా వదిలేసాడని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని తొందరగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని లేనియెడల ధర్నాకు దిగుతామని హెచ్చరించారు, ఈ రోడ్డు ద్వారా వెళ్లే వాహనదారులు క్షేమంగా వెళ్లే విధంగా తక్షణమే తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని ఎమ్మెల్యే స్థానిక అధికారులకు ఆదేశించారు ,కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, యువ నాయకులు మిథున్ రాజ్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్పా,నాయకులు పురుషోత్తం రెడ్డి,దీపక్ ,నరేష్ రెడ్డి,సందీప్,ఫయాజ్,అశోక్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, అనిల్ ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు

ఏవో గంగాజమున

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని గల సాయి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును మండల వ్యవసాయ అధికారి గంగా జమున తనిఖీ చేయడం జరిగింది. అందులో లైసెన్స్ మరియు పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు, లూజుగా అమ్మే విత్తనాలను వ్యాపారం చేయకూడదని సూచించడం జరిగింది, రిజిస్టర్లు బిల్లు బుక్కులను మరియు రైతు వారిగా విక్రయాల వివరాల తోకూ డినటువంటి రిజిస్టర్లను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని సూచించడం జరిగింది, రైతులు అధికృత డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి,బిల్లు రసీదులను కచ్చితంగా తీసుకోవాలి, రసీదుల మీద షాపు యజమాని మరియు రైతు యొక్క సంతకం తప్పని సరిగా ఉండాలి. ఈ యొక్క బిల్లును రైతులు పంట కాలం అయిపోయే వరకు కూడా భద్రపరుచుకోవాలని సూచిం చడం జరిగింది. రైతులు తమకు నచ్చిన రకాన్ని ఎంచుకొని సాగుచేసుకొ నవచ్చు, మంచి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version