సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు..

సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు

 

భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయి చెప్పారని.. సకలజనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారని చెప్పుకొచ్చారు. సత్యసాయి పుట్టపర్తి శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ(ఆదివారం) సత్యసాయి సమాధిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు.‘భగవాన్ సత్యసాయి 1926 నవంబర్ 23వ తేదీన ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రయాణాన్ని సాగించి సాయి సిద్ధాంతాన్నిప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. 1940 మే 23వ తేదీన సత్యసాయి వయసు 14 ఏళ్లు… అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

పండిత్ దిన్ డయల్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలి….

పండిత్ దిన్ డయల్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలి.

బిజెపి మండలధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.

చిట్యాల,నేటిధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో పండిత్ దీందాయల్ ఉపాధ్యాయ 109వ జయంతిని బిజెపి చిట్యాల మండల బుర్ర వెంకటేష్ గౌడ్ అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర లోని జీవితం నాగ్ల చంద్రబాన్ గ్రామంలో1916 సెప్టెంబర్ 25న జన్మించారని ఆయన చిన్ననాటి నుండే దేశభక్తిని అలవర్చుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ (సంఘ్ ఆర్ఎస్ఎస్) లో సహా ప్రచారక్ పనిచేశారని దేశం కోసం ధర్మం కోసం కీలకంగా పనిచేశారని మంత్రం శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి ప్రో బలంతో జనసంఘలో స్థాపనలో కీలకంగా వ్యవహరించాలని ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా వ్యవహరించి జన సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేశారని లక్నో దినపత్రిక స్వదేష్ లకు సంపాదకీలుగా ఏకాత్మత మానవ వాదం శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు హిందీలో చంద్రగుప్త మౌర్య నాటకం మరాటి వంటి ఆధ్యాత్మిక దృష్టిలో పెట్టుకొని మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని ఆయన నమ్మారని ,దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన దీన్ దాయల్ ఉపాధ్యాయ గారిని ఆదర్శంగా తీసుకొని ఆశయాలను కొనసాగించాలని వెంకటేష్ గౌడ్ అన్నారు ,ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు మైదం శ్రీకాంత్ చెక్క నరసయ్య నీలి సుధాకర్ రెడ్డి గుర్రపు రవి ఏ లేటి శ్రీనివాస్ రెడ్డి బండారి భద్రయ్య అనుప మహేష్ కేంసారాపూ ప్రభాకర్ మదరపు రాజు గొపగాని రాజు బురి తిరుపతి బోయిని అజయ్ కధం రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version