పండిత్ దిన్ డయల్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలి.
బిజెపి మండలధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.
చిట్యాల,నేటిధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో పండిత్ దీందాయల్ ఉపాధ్యాయ 109వ జయంతిని బిజెపి చిట్యాల మండల బుర్ర వెంకటేష్ గౌడ్ అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర లోని జీవితం నాగ్ల చంద్రబాన్ గ్రామంలో1916 సెప్టెంబర్ 25న జన్మించారని ఆయన చిన్ననాటి నుండే దేశభక్తిని అలవర్చుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ (సంఘ్ ఆర్ఎస్ఎస్) లో సహా ప్రచారక్ పనిచేశారని దేశం కోసం ధర్మం కోసం కీలకంగా పనిచేశారని మంత్రం శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి ప్రో బలంతో జనసంఘలో స్థాపనలో కీలకంగా వ్యవహరించాలని ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా వ్యవహరించి జన సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేశారని లక్నో దినపత్రిక స్వదేష్ లకు సంపాదకీలుగా ఏకాత్మత మానవ వాదం శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు హిందీలో చంద్రగుప్త మౌర్య నాటకం మరాటి వంటి ఆధ్యాత్మిక దృష్టిలో పెట్టుకొని మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని ఆయన నమ్మారని ,దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన దీన్ దాయల్ ఉపాధ్యాయ గారిని ఆదర్శంగా తీసుకొని ఆశయాలను కొనసాగించాలని వెంకటేష్ గౌడ్ అన్నారు ,ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు మైదం శ్రీకాంత్ చెక్క నరసయ్య నీలి సుధాకర్ రెడ్డి గుర్రపు రవి ఏ లేటి శ్రీనివాస్ రెడ్డి బండారి భద్రయ్య అనుప మహేష్ కేంసారాపూ ప్రభాకర్ మదరపు రాజు గొపగాని రాజు బురి తిరుపతి బోయిని అజయ్ కధం రాజు తదితరులు పాల్గొన్నారు.