పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T152502.610.wav?_=1

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలను పక్కన పెట్టిన ప్రభుత్వం…

హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గాలికి వదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. మందమర్రి పట్టణంలో జయశంకర్ ఏడడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తరలి వెళుతున్నామని అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణం నుండి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలేదని దుయ్యబట్టారు. సింగరేణి ప్రాంతంలో జీవో నెంబర్ 76 ప్రకారం వీళ్ళ పట్టాలు గత మా ప్రభుత్వంలో అందించడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు అందించడంలో విఫలమయ్యిందని అన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కులుస్తుందని ధ్వజమెత్తారు.

Congress government

20 నెలల పరిపాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

ఠాగూర్ స్టేడియంలో స్టేట్ లెవల్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్

ఠాగూర్ స్టేడియంలో స్టేట్ లెవల్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 9వ తేదీ నుండి 12 వ తేదీ వరకు జూనియర్ గర్ల్ స్టేట్ లెవెల్ ఫుట్ బాల్ ఛాంపియమా షిప్ పోటీలు నిర్వహించబడునని జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. స్థానిక స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని, పోటీల్లో పాల్గొనే వారికి బోజన వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ పోటీలకు సింగరేణి సంస్థ అన్ని విధాలుగా తోడ్పాటు అందించడం సంతోషదాయకమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు.

మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట.

మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవితకు పునాదులు

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని విద్యానగర్ సెక్టర్ లో గల మందమర్రి నాలుగవ కేంద్రం,ఒకటవ జోన్ లోని మూడవ కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని గురువారం రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి, సిడిపిఓ హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా బడిబాట ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ లో నూతనంగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, అంగన్వాడీ కేంద్రాలు అమ్మ ఒడిలాంటివి అని, పిల్లల భవిష్యత్తుకు పునాదులు లాంటివని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టి డబ్ల్యూ ఓ రోఫ్ ఖాన్, సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ సరిత, అంగన్వాడి టీచర్లు, ఆయమ్మలు, పిల్లల తల్లితండ్రులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మందమర్రిలోఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన.

మందమర్రిలోఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన

మందమర్రి నేటిధాత్రి

 

 

మందమర్రి పట్టణం
శ్రీపతి నగర్ 15 వ వార్డ్
ఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన ఏఈ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
గౌరవ చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గత రెండు రోజుల క్రితం శ్రీపతి నగర్ లో పర్యటించిన సందర్భంగా వార్డు ప్రజలు కరెంట్ ఫోల్స్ – వీడి దీపాలు- కరెంటు – సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
వెంటనే వివేక్ స్పందించి ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్ నీ ఆదేశించిన సందర్భంలో
ఈ రోజు శ్రీపతి నగర్ లో ఏఈ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వార్డు బాధ్యులు పైడిమల్ల నర్సింగ్ శ్రీపతి నగర్ లో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి కరెంట్ సమస్యలను ఎన్ని ఫోన్స్ అవసరం ఉంటాయి. స్ట్రీట్ లైట్లు ఎన్ని అవసరం ఉంటాయి. ఎన్ని సార్లు కరెంటు పోతుందని. తెలుసుకొని ఎమ్మెల్యే వివేక్ గారి సహకారంతో తొందరలోనే ప్రజల కరెంటు కష్టాలు తీరుస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో
ఏఈ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
మంద తిరుమలరెడ్డి.
ఎద్దు వెంకటాద్రి.
భోగి వెంకటేశ్వర్లు.
రామస్వామి సోమయ్య. సురేందర్..
కుండే రామకృష్ణ.
శనిగారపు చంద్రయ్య తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్నారు

పట్టణాన్ని మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ చాబుత్ర .!

మందమర్రి పట్టణాన్ని నేరా రహితంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ చాబుత్ర

మందమర్రి నేటి ధాత్రి :

 

 

మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి. అర్థరాత్రి ఆవారా గా తిరుగుతున్న 30 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్
18 బైకులు,1 కారు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
2 డ్రంకెన్ డ్రైవ్ కేస్ లు నమోదు 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు.

శనివారం అర్థరాత్రి మందమర్రి పట్టణం లో రావడం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి) ఐపిఎస్, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ గార్ల ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ గారి పర్యవేక్షణలో మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ముగ్గురు ఎస్ఐలు 25 మంది సిబ్బంది తో పెట్రోలింగ్ పార్టీలుగా మందమర్రి పట్టణాన్ని అష్టదిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 30 మందిని అదుపులోకి తీసుకొని మందమర్రి సిఐ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుండి 18 బైకులు, 1 కారు, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై డీడీ కేస్ లు నమోదు చేయడం జరిగింది.

Operation

 

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ….
అర్ధరాత్రి అరుగుల (చబుత్ర) మీద బాతకానీలు కొడుతూ, రోడ్లమీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాళ్లకు ఇబ్బందులకు గురిచేసిన, తాగి వాహనాలపై తిరుగుతూ . రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్న, గొడవలు సృష్టిస్తున్న మరియు అనుమానస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని ఇక మీద నుండి ఈ డ్రైవ్ క్రమ తప్పకుండా నిర్వహిస్తామని హెచ్చరించారు.

అలాగే ఇప్పుడు జరుగుతున్న నేరాలకు ముఖ్యంగా మైనర్లు మరియు 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే అధికంగా ఉంటున్నారని, వీళ్లకు కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొచ్చినట్లైతే చాలా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలియజేశారు.

మందమర్రి పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని దీనికి పట్టణవాసులు సహకరించాలని కోరడం జరిగింది.

ఆపరేషన్ చాబుత్ర కార్యక్రమం లో మందమర్రి, రామకృష్ణాపూర్, కాశిపేట ఎస్సైలు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

మందమర్రి రజక వృత్తిదారుల సంఘం.!

మందమర్రి రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సమావేశం….. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల్ల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని రజక అభివృద్ధి దారులకు కూడా అమలు చేయాలని మందమర్రి పట్టణంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ధోబిఘాట్లను పూర్తి చేయాలని అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

General Meeting

 

అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు జిల్లా అధ్యక్షులు తంగేళ్లపల్లి వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కే చందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్ ఉపాధ్యక్షులు కొత్తకొండ నరసయ్య బండి పోశయ్య రాసర రాములు పెనుగొండ సమ్మయ్య తోటపల్లి కళావతి తడిగొప్పుల భాగ్య తదితరులు పాల్గొన్నారు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి.!

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుల సంబరాలు

మందమర్రి నేటి ధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు ధార రవి సాగర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.పాత బస్టాండ్ ఏరియాలో ర్యాలీ నిర్వహించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.అనంతరం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Sindhu

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.

Sindhu

ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు.దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తు వారికి మానసిక ధైర్యం ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో మార్తా కుమార్, దీక్షితులు,వినయ్,రంగు శ్రీనివాస్,జకుల కంకయ్య,బస్టాండ్ వ్యాపార సంఘం నాయకులు తదితరు పాల్గొన్నారు.

మందమర్రి హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించ.!

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి కార్మల్ హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించి రంగులతో ముగ్గులు వేసి అలరించారు.

మందమర్రి నేటి ధాత్రి

Science

ఈ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తేదీ 4 -3 -2025 రోజున మన కార్మెల్ పాఠశాలలో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ రంగోలి కార్యక్రమంలో భౌతిక రసాయన శాస్త్రాలు మరియు జీవ శాస్త్రాలు యొక్క పటాలను విద్యార్థులు చాలా చక్కగా డ్రా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి డాక్టర్ ఫాదర్ జె.వి.ఆర్ రెక్స్ జె, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎమ్ కుమారస్వామి, జీవశాస్త్ర ఉపాధ్యాయిని ఐ సునీత మేడం ఇతర సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పిఈటి కృష్ణ గారు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని ఈ రంగోలి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version