ఠాగూర్ స్టేడియంలో స్టేట్ లెవల్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్

ఠాగూర్ స్టేడియంలో స్టేట్ లెవల్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 9వ తేదీ నుండి 12 వ తేదీ వరకు జూనియర్ గర్ల్ స్టేట్ లెవెల్ ఫుట్ బాల్ ఛాంపియమా షిప్ పోటీలు నిర్వహించబడునని జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. స్థానిక స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని, పోటీల్లో పాల్గొనే వారికి బోజన వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ పోటీలకు సింగరేణి సంస్థ అన్ని విధాలుగా తోడ్పాటు అందించడం సంతోషదాయకమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు.

68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు..

68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు ప్రారంభించిన

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జల్లెల చిన్నారెడ్డి

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి లో
68వ అండర్ 14 రాష్ట్ర స్థాయి బాల బాలికల ఫుట్ బాల్ సెలక్షన్ పోటీల ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు .ఈసందర్భంగా డాక్టర్
చిన్నా రెడ్డి మాట్లాడుతూ
ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడే వారు గేమ్ ఫుట్ బాల్ అని అన్నారు.వనపర్తి లో హాకీ,ఫుట్ బాల్ క్రీడా పోటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అనిఅన్నారు. వనపర్తి లో హాకీ క్రీడలో జాతీయస్థాయిలో ఆడిన క్రీడాకారులు చాలా ఎక్కువ మంది ఉన్నారని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మైదానంలో ఫుట్ బాల్ క్రీడను ఆడేవారని చిన్నారెడ్డి గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ క్రీడల పై ఇష్ట పడే వారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నా క్వార్టర్స్ లో ఫుట్ బాల్ ఆడటానికి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటూరని అన్నారు.వనపర్తి పట్టణం లో ఫుట్ బాల్ ,హాకీ స్టేడియాలను నిర్మించుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చిన్నారెడ్డి తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున క్రీడాకారులు ఎక్కువ నీళ్లు త్రాగాలని సూచించారు. పోటీపడే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి, స్నేహభావంతో ఆడి అండర్ 14 క్రీడలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఆడి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. ఈ
కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కృష్ణ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బాల్ రాజ్ ,వెంకట్,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగి వేణు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version