భవిష్యత్ బిఆర్ఎస్ దే..!

భవిష్యత్ బిఆర్ఎస్ దే..!

#ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో బి ఆర్ఎస్ తడాఖా చూపెట్టాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు డా: బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

బారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అన్ని విధాలుగా ప్రభుత్వం విఫలం చెందిందని. కావున రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టని అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చేసిన కృషిని ప్రజలకు తెలియపరుస్తూ. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండలానికి చేసిన అభివృద్ధిని చూపెడుతూ స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో అధికారం చేపట్టే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల వలె పని చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ ఛైర్మెన్ చెట్టుపల్లి మురళీధర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ సర్పంచ్ నాన బోయిన రాజారాం యాదవ్, నాయకులు గందె శ్రీనివాస్ గుప్తా, పాండవుల రాంబాబు, క్యాతం శ్రీనివాస్, వక్కల చంద్రమౌళి, లావుడియా తిరుపతి, సామల దేవేందర్, గుమ్మడి వేణు, జన్ను జయరాజ్, గోనెల నరహరి, చిట్యాల సీతారాం రెడ్డి, పోడేటి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

విధేయుడు తిరుపతి రెడ్డికే పట్టం.

విధేయుడు తిరుపతి రెడ్డికే పట్టం.

నల్లబెల్లి, నేటిదాత్రి:

కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వ్యక్తి చిట్యాల తిరుపతి రెడ్డికి మరోసారి మండల అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్,, కర్దూరి కట్టయ్య ఎన్నికయ్యారు.

సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది

సొమ్ము కేంద్రానిది
సోకు రాష్ట్రానిది

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక్క కిలో బియ్యం మాత్రమే

ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది

ఊర నవీన్ రావు
మండల అధ్యక్షులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం
ప్రతి ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం ఒక్కో కిలో కు40 రూపాయలను వెచ్చిస్తున్నది
ఈ మొత్తం కూడా కేంద్రమే భరిస్తున్నది అలాగే కరోనా ఆపద సమయం నుంచి పేదలకు ఇబ్బంది కాకుండా ఉచిత పథకాన్ని నిరాటంకంగా ఇప్పటికీ కేంద్రం కొనసాగిస్తున్నది కేంద్రం ఐదు కిలోలు అందియగా రాష్ట్రం ఒక్క కిలో మాత్రమే కలుపుతున్నారు
సన్నబియ్యానికి 10 రూపాయలు మాత్రమే కలిపిన రాష్ట్ర ప్రభుత్వం
దీంతో మొత్తం మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుతుంది ఇవన్నీ స్థానిక ఎన్నికల కోసమే మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లో
విఫలమై ప్రజలను మార్చడానికి
కేంద్ర పథకాన్ని కూడా వాడుకోవడానికి దిగజారారు ఇక మీ మాయ మాటలు ప్రజలు నమ్మరు. రాబోయే కాలంలో స్థానికఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగైపోతుంది. అని ఆయన అన్నారు.

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే.

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే….
– జాగృతితోనే బతుకమ్మ సంబరాలకు పునర్జీవం
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
– మంథనిలో ఘనంగా కవితక్క జన్మదిన వేడుకలు

మంథని :- నేటి ధాత్రి

మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచస్థాయిలో చాటిన ఘనత కల్వకుంట్ల కవితక్కకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్లో బాగంగా గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కూతురు అయినా ఒక సాధారణ నాయకురాలిగా కవితక్క తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సైతం తనవంతుగా ముఖ్య పాత్ర పోషించిందని, ప్రజల్లో అనునిత్యం మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకునేవారన్నారు. జాగృతి సంస్థను ఏర్పాటుచేసి అనేక సేవలు అందించడంతో పాటు ప్రపంచంలోని తెలుగువాళ్లకు మన సంస్కృతిని చాటి చెప్పారన్నారు. అలాగే ప్రతి గ్రామంలో బతుకమ్మ ఆటలు ఆడుకునేవారని, కానీ జాగృతి సంస్థ ద్వారా కవితక్క అంగరంగ వైభవంగా బతుకమ్మసంబరాలు నిర్వహించి విశిష్టతను చాటారని, తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మకు పునర్జీవం ఇచ్చారని ఆయన కొనియాడారు. నిత్యం ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆలోచన చేసే కవితక్కకు మంథని నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అభిమానుల పక్షాన పుట్టిన రోజు శుభాకాంక్షలను ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version