అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం రసూల్ పల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్. కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు కోవాల్సిన పోషకాహారం గురించి పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం గురించి వివరించారు.గర్భిణీ స్త్రీలలో రక్తహీనత రాకుండా ఉండాలంటే తాజా కూరగాయలు,పండ్లు ఆకుకూరలు,చిరుధాన్యాలు,పాలు సమృద్ధిగా తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు చిరు ధాన్యాలను వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని తెలియజేశారు.పిల్లలకి బయట జంక్ ఫుడ్ పెట్టొద్దని ఇంట్లో తయారుచేసిన పౌష్టికాహారం మాత్రమే పెట్టాలని సూచించడం జరిగింది.ఇందులో భాగంగా అక్షరాభ్యాసం,సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మల,ఆయా,గర్భిణీలు బాలింతలు,పిల్లల తల్లి తండ్రులు,ఇతరులు పాల్గొనడం జరిగింది.