అంగన్వాడి సెంటర్లో ఘనంగా పిల్లల జన్మదిన వేడుకలు.

అంగన్వాడి సెంటర్లో ఘనంగా పిల్లల జన్మదిన వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడీ నెంబర్ వన్ సెంటర్ లో సూపర్వైజర్ జయప్రద ఆదేశాల మేరకు విద్యార్థుల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శీలపాక నాగరాజు వనితల కుమారుడు సాహసమిత్ర పుట్టినరోజు సోమవారం నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉష కంపెనీ అసిస్టెంట్ సేల్స్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ మెండు వెంకట్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ల నుండి అందుతున్న పౌష్టికాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడి సెంటర్లో ఆట పాటల విద్యతో విద్యార్థుల భవితవ్యాన్ని సక్రమంగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ టీచర్స్ ఆయాలు చేస్తున్నటువంటి కృషిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంధ్యారాణి ఆయా లావణ్య తదితరులు పాల్గొన్నారు.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయండి.
న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ*

నర్సంపేట,నేటిధాత్రి:

 

బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరితాడును ముద్దాడిన యువ కిశోరులు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల 94వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ నర్సంపేట పట్టణంలోని న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.పిడిఎస్యు, పివైఎల్, సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు 94 వ వర్ధంతి వారోత్సవాలను జరపాలని పిలుపునిచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత విద్యార్థి నిరుద్యోగులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న దురాహంకారానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఈపి 20-20 మరియు యుజిసి ముసాయిదాలను రద్దు కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్స్ లర్ విద్యార్థి సంఘాలు చేసే ఆందోళన ఇతర కార్యక్రమాలపై నిషేధం ఎత్తివేతకు పోరాడాలని కోరారు.నేడు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గట్టి కృష్ణ,ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భోగి సారంగపాణి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు పూలక్క,గుగులోతు భద్రాజి భీమగాని మల్లయ్య,బరిగల కుమార్, గొర్రె ప్రదీప్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

నవత విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.

నవత విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.
– పట్టణ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన
– లుసిడా చేతివ్రాతలో ప్రభంజనం
– ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో జాతీయ మొదటి బహుమతి
– విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి నిమిషం కృషి
– ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
– పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థుల ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడంలో పురోగతిని సాధిస్తున్నామని అన్నారు. పట్టణ ప్రాంత పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని, అందుకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించాలనే సత్సంకల్పంతో ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో డిజిటల్ తరగతుల బోధనలు ప్రారంభించగా మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఆడియో వీడియో విజువలైజేషన్లో తరగతుల నిర్వహణతో విద్యార్థుల సామర్థ్యాలు పెరిగాయని అన్నారు. ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి శిక్ష అవార్డు పొందామని తెలిపారు. అలాగే విద్యార్థి భవిష్యత్తుకు చక్కటి చేతి వ్రాత ఎంతో అవసరమని అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో లుసిడ చేతి వ్రాత తరగతులు నిర్వహించామని, చేతివ్రత పోటీలలో నవత విద్యాలయం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారని అన్నారు. నవత విద్యార్థుల ప్రతిభతో అక్షర చేతివ్రాత ఫౌండేషన్ అధ్యక్షులు మీరజ్ అహ్మద్ ఆశ్చర్యపోయారన్నారు. రాష్ట్రస్థాయి సూపర్ 10 లో మూడు బహుమతులు, స్టేట్ 50లో 12 బహుమతులతో పాటు వివిధ కేటగిరీలో మొత్తం 90 అవార్డులు సాధించి రాష్ట్రంలోనే మరే ఇతర పాఠశాల సాధించని ఘనత సాధించామని తెలిపారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తల్లిదండ్రులు ఎల్లవేళలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Anniversary Celebration

సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు.

సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి

Farewell Day Party

సింగరేణి ఉన్నత పాఠశాలలో 2024 /25 సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా నిర్వహించారు.

మందమర్రి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ కు విద్యార్థులు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు హాల్ టికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకు గౌరవాన్ని అందిస్తూ చదువు పూర్తి చేసుకుని పాఠశాలను వదిలి వెళుతున్న వారి కోసం ఏర్పాట్లు అభినందనీయమని కొనియాడారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల శిక్షణలో విద్యను అభ్యసించిన అందరూ పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశాభవం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా చదువు పైనే దృష్టి పెట్టి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. సింగరేణి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలతో పాటు ఉచితంగా పుస్తకాలు యూనిఫాం పంపిణీ చేస్తూ మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు.

ప్రభుత్వ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాల నైన్ పాక లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నిర్వహించడం జరిగింది. పాఠశాల విద్యార్థిని విద్యార్థులుఒకరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడుగా వ్యవహరించి వారి ప్రతిభను ప్రదర్శించారు.దీనికి సంబందించిన సమావేశంలో ఒకరోజు ప్రధానోపాధ్యాయులు గా వ్యవహరించిన ఎండీ సన మాట్లాడుతూ ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించడానికి గత 3 రోజుల నుండి కష్ట పడి తరగతి గదిలో పాఠం చెప్పడం చాలా భయం వేసిందని, రోజూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కష్టపడే విధానం నాకు నచ్చిందని చెప్పడం జరిగింది. మిగతా విద్యార్థులు కూడా వారి వారి అనుభవాలు చెప్పడం జరిగింది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాముకుంట్ల తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షనతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఊర్మిళ గారు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా ఎంపీపీఎస్ కొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు బి నాగరాజు గారు వ్యవహరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ కైరున్నీసా హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్, ఇక్రమోద్దీన్, సదానందం, అనిల్ గవస్కర్, హసీనా, రాజేష్ మరియు ఒక్కరోజు ఎంఈఓ గా రేపాల శ్రేయాన్షి ఉపాధ్యాయులుగా , సాత్విక్, తనుశ్రీ, అనుశ్రీ, హర్షవర్ధన్, శ్రీ తేజ, యువీన, చైత్ర, శార్వాణి, సోను, నిహారిక, వైష్ణవి, జనని, తదితరులు పాల్గొన్నారు అనంతరం ఒక్కరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బహుమతులు అందజేయడం జరిగింది.

ఘనంగా సీనియర్ జర్నలిస్టు సురేష్ జన్మదిన వేడుకలు.

ఘనంగా సీనియర్ జర్నలిస్టు సురేష్ జన్మదిన వేడుకలు.*

జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..

నర్సంపేట,నేటిధాత్రి:

Journalists

నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభిమాని సీనియర్ జర్నలిస్టు మన తెలంగాణ నర్సంపేట డివిజన్ ఆర్సీ ఇంఛార్జి కుండే సురేష్ జన్మదిన వేడుకలు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట వార్త ఆర్సీ రడం శ్రీనివాస్ గౌడ్ ,నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబీ వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శులు బిట్ల మనోహర్, జన్ను మురళి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరం భరత్ రెడ్డి, మేడం కుమార్, చెన్నబోయిన సాయి శ్రావణ్ దాస్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..

*సీనియర్ జర్నలిస్టు కుండే సురేష్ జన్మదిన వేడుకలు నర్సంపేట డివిజన్ పరిధిలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు ఎర్రబెల్లి విద్యాసాగర్, కందుల శ్రీనివాస్ గౌడ్,మహాదేవుని జగదీశ్వర్,బుర్ర వేణు గౌడ్, హింగే రాజు,ప్రసాద్ రెడ్డి,గాదం రవి,మోహన్,వడ్లకొండ
రాజ్ కుమార్ గౌడ్,కక్కర్ల రంజిత్ కుమార్ గౌడ్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

హద్య కోచింగ్ సెంటర్ వార్షికోత్సవ ఉత్సవాలలో.!

హద్య కోచింగ్ సెంటర్ వార్షికోత్సవ ఉత్సవాలలో వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణం బండార్ నగర్ లో హధ్య కోచింగ్ సెంటర్ వార్షికోత్సవ ఉత్సవాలలో వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి పాల్గొన్నారని కోచింగ్ సెంటర్ .నిర్వహికులు హేమెందర్ ఒకప్రకటనలో తెలిపారు ఈసందర్భంగా రూరల్ ఎస్సై జలందర్ రెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు అంటే భయపడకుండా చదువు అంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను ఎదగాలని సూచించారు విద్యార్థులకు దిశ నిర్దేశిస్తూ, ప్రత్యక్షంగా తను అనుసరించిన విధి విధానాలను వారి పూర్తి అనుభవాలను విద్యార్థులకు క్లుప్తంగా వివరిస్తూ ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని కోరారు ప్రత్యేకంగా వనపర్తి చుట్టుపక్కల చిన్నచిన్న గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు కూడా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను బోధన కల్పిస్తున్నందుకు ఇన్స్టిట్యూట్ యాజమాన్యం హేమెందర్ ను రూరల్ ఎస్సై అభినందించారు. అనంతరం ఎస్సై ని యాజమాన్యం శాలువ తో ఘనంగా సన్మానించారు..

Anniversary

వార్షికోత్సవాలకు హాజరై మరియు వారి విలువైన సూచనలను అందించినందుకు విద్యార్థులు ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాన్సిరాం జయంతి వేడుకలు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాన్సిరాం జయంతి వేడుకలు….

తంగళ్ళపల్లి నీటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావానపల్లి బాలయ్య ఆధ్వర్యంలో మాన్య వార్ కాన్సిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ వై తాళికుడు కాన్సిరాం భారత దేశ రాజకీయాల్లో బహుజన రాజ్య స్థాపనకు అహర్నిశలు కృషి చేశారని బీసీలకు మండల కమిషన్ అమలు చేయుటకు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద దీక్ష ఫలితమే ఈనాటి బీసీల రిజర్వేషన్ ఆయన ఆశయం అని మాకు బహుజన రాజ్యాంగ వ్యవస్థాపనకు ఎమ్మార్పీఎస్ మండల కమిటీ అహర్నశలు పోరాడుతుందని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మల్యాల లక్ష్మణ్ చదల రాజేష్ మునిగే శంకర్ సగు పట్ల నరేష్ అక్కెనపల్లి కృష్ణ భగవాన్ ఎడ్ల రవి కొల్లాపురం సురేష్ మల్లారపు నరేష్ ఎడ్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు

ఏ వైఎస్ ఆధ్వర్యంలో కాన్షీరామ్ 91వ జయంతి వేడుకలు.

ఏ వైఎస్ ఆధ్వర్యంలో కాన్షీరామ్ 91వ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

దేశ వ్యాప్తంగా ఉన్న బహు జనులకు న్యాయం జరుగాలంటే బహు జనులు రాజ్యాధికారం చేపడితేనే సమాన న్యాయం జరుగుతుందని వారు రాజ్యాధికారం చేపట్టాలని అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మాన్య శ్రీ కాన్షీరాం* గారని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారు .
శని వారం రోజున చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ ఆధ్వర్యంలో మాన్య శ్రీ కాన్షీరాం 91వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు పూలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాన్షీరాం గారు మహానీయుల ఆశయాలను సిద్ధాంతాలను భావజాలాన్ని పూర్తిగా తెలుసుకుని బహు జనులు రాజ్యాధికారం చేపడితేనే అందరికి సమాన న్యాయం జరుగుతుందని గ్రహించి బహు జనులకు రాజ్యాధికారం అందించడం కోసం సైకిల్ పై ఒంటరి పోరాటం చేశాడని తెలిపారు.. గ్రామాల్లో సైకిల్ పై తిరుగుతూ ప్రజలను చైతన్య వంతులను చేస్తు ఉత్తర ప్రదేశ్ లో దళితురాలైన మాయావతిని ముఖ్య మంత్రిని చేసిన ఘనత మాన్య శ్రీ కాన్షీరాం గారిదే అని కొనియాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను అనుసరించి బహు జనులకు రాజ్యాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహు జన వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని అందించి దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించిన మహొన్నత రాజకీయ శిఖరం అని కొనియాడారు. దేశానికి బహు జనులకు ఆయన చేసిన సేవలు మరువలేనివని మహానీయుల ఆశయాల తో పాటు కాన్షీరాం సేవలు కొనసాగించడానికి నేటి యువత ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి మండల నాయకులు పాముకుంట్ల చందర్ శీలపాక ప్రణిత్ తదితరులు పాల్గొన్నారు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు..

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామం లో గల మారుతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు రంగు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఎదగాలని అదేవిధంగా మా కష్టాలు తొలగాలని వేడుకల్లో కోరుకోవడం జరిగింది.ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఆటోలు నడపలేకపోతున్నామని, ఫ్రీ బస్సుల వల్ల మా ఆటో డ్రైవర్ల ఫ్యామిలీలు రోడ్డున పడవలసి వచ్చింది కాబట్టి మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉందని, ప్రభుత్వం మా ఆటో డ్రైవర్ల బాధలు అర్థం చేసుకొని మాకు న్యాయం చేకూర్చాలని ఆటో డ్రైవర్లకు ఈ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సాయం ఇస్తానని చెప్పడం జరిగింది.కానీ ఇప్పటి వరకు డ్రైవర్లకు రూపాయి కూడా రాలేదని,ఇప్పటికైనా దయచేసి ఈ సంవత్సరానికి 12 వేల ఆర్థిక సాయం అందజేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో యూనియన్ సభ్యులంత పాల్గొనడం జరిగింది.

హోలీ సంబరాల్లో మహిళా మణులు.

హోలీ సంబరాల్లో మహిళా మణులు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని షిర్కే కాలనీలో మహిళా మణులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.ముందుగా మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.అలాగే చెడుపై మంచి విజయం సాధించినందుకు వసంత రుతువు శోభతో ప్రకృతి పులకించేవేళ సమాజంలో సాఖ్యాతను పెంచుతూ అందరూ కలసి మెలసి ఉండాలని చెప్పే హోలీ పండుగను మహిళలు అందరూ కూడా సంతోషంగా శుక్రవారం జరుపుకున్నారు.హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకొని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు ఈ సందర్భంగా కోరుకున్నారు.

అంబరన్ని అంటిన హోలీ సంబరాలు.

బెల్లంపల్లి బాబు క్యాంప్ బస్తీలో అంబరన్ని అంటిన హోలీ సంబరాలు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

హోలీ పండుగ సందర్భంగా బెల్లంపల్లి
పట్టణంలో బాబు క్యాంప్ బస్తీ సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగంగా వైభవంగా హోలీ పండుగ జరుపుకున్నారు పండుగను సంతోషంగా బస్తీ వాసులు పెద్దలు చిన్నారులు పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని
రంగులతో హోలీ పండుగ జరుపుకున్నారు.వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోట.శ్రీను సామల శ్రీనివాస్ అట్ట సత్యనారాయణ నాగుల దేవయ్య.పి సురేష్ మహిళలు పిల్లలు
పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలు…

ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ నలుమూల లా చాటారని కవితక్క ఆమె ఎంతో గొప్ప నాయకురాలని మరెన్నో ఉన్నత పదవులు అందుకోవాలని ముందు ముందు తెలంగాణ ప్రజల మనసులో స్థిర స్థాయిగా ఉండేలా మరిన్ని మంచి పదవులు పొందాలని ఆశిస్తూఆమె నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు మండల కేంద్రంలోని బి.ఆర్.ఎస్ పార్టీ కార్యంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వలిగొండ వేణుగోపాలరావు పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ మోహన్ రెడ్డి కురుమ రాజయ్య బండి జగన్ దేవేందర్ యాదవ్ నవీన్ రావు కనకరాజు నేరెళ్ల అనిల్ గుండు ప్రేమ కుమార్ సిలివేరి చిరంజీవి వెంగళ రమేష్ మామిడాల విజయ్ పూస పెళ్లి రామచంద్రం కడారి నవీన్ రెడ్డి ఉమాశంకర్ మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి.

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి

ఎస్సై నరేష్

ముత్తారం :- నేటి ధాత్రి

హోలీ వేడుకలను ప్రజలు సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలి సహజ సిద్దమైన రంగులను ఉపయోగించాలని సూచించారు మధ్యం మత్తులో వాహనాలు నడపటం మధ్యం మత్తులో రోడ్లపై వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం అసభ్యంగా ప్రవర్తించడం వాహనాల పై రంగులు చల్లడం చట్ట విరుద్ధంమని తెలిపారు శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకొనబడునని ఎస్సై నరేష్ తెలిపారు

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా హోలీ సంబరాలు.

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా ముందస్తు హోలీ సంబరాలు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలు జరుపుకున్నారు శార్వాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాడెంట్ దాయకపు శ్రీనివాస్ మాట్లాడుతూ హోలీ సంబురాలు ఎంత ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నారో విద్యార్థుల జీవితాలు సంతోష కరమైన రంగులమయం కావాలని వారి జీవితాలు ముందుకు సాగాలని కోరుకుంటూ విద్యార్థుల కు ఉపాధ్యాయులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రాంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ రాజేశ్వరి వెంకటరమణ శారద ఏర్పాటు చేసిన సమావేశానికి జయప్రద సూపర్వైజర్ హాజరయ్యే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదట తన భర్త జ్యోతిరావు పూలే సహాయ సహకారంతో ఆ రోజుల్లో ఆడవారు వంటింటికే పరిమితం ఆడవారికి చదువులెందుకు అని సమాజం ఎన్నో రకాల హేళన చేసిన తన చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆడవారందరికీ ఆదర్శంగా నిలిచి 1848 సంవత్సరంలో పూనే లో మొట్టమొదట పాఠశాల శూద్ర కులాల వారికి ఏర్పాటు చేసి రాను రాను 17 విద్యాసంస్థలను నెలకొల్పి ఆడవారందరికీ చదువుల తల్లి అయి సామాజిక సేవలు చేస్తూ ఆదర్శమూర్తిగా నిలిచి ఈ రోజుల్లో ఆడవాళ్లందరూ అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అంటే అందుకు సావిత్రిబాయి పూలే గారే మనందరికీ ఆదర్శం ఆ తల్లికి ఘనంగా టీచర్స్ మహిళలు పిల్లలతో కలిసి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఆమె చిత్రపటానికి పూల మాలలతో అలంకరణ చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ కిరణ్ గారు, ఆదర్శ , మహిళలు, అంగన్వాడీ టీచర్స్, శారద, రాజేశ్వరి, వెంకటరమణ హాజరైనారు.

క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 102 వర్ధంతి వేడుకలు.

క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 102 వర్ధంతి వేడుకలు..

రామాయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)

క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 128 వ వర్ధంతి కార్యక్రమాన్ని రామాయంపేట పట్టణంలోని పూలే విగ్రహాల చెంత ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా ఫౌండర్ అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద ఆలు పెరగని పోరాటం చేసి మహిళా హక్కులను సాధించిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు.
అలాగే ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి అని, సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి అనేక ప్రయత్నం చేసిన సామాజిక ఉద్యమకారిని సావిత్రిబాయి పూలే అని అన్నారు.
అలాగే మహాత్ములు చూపిన బాటలో యువత నడుస్తూ చెడు మార్గాన్ని వదిలిపెట్టి సన్మార్గంలొ నడుస్తూ మంచి లక్షణాలను అలవాటు చేసుకొని మంచి యువకులుగా ఎదగాలని, సమాజానికి మన వంతుగా ఎంతో కొంత సహాయం చేయాలని, మహనీయుల ఆశయాలను పునికిబుచ్చుకొని మన చుట్టూ ఉన్న ప్రాంతమునకు, ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అబ్రమైన గంగా రాములు , సుంకోజు దామోదర్ , అల్లాడి వెంకట్, శశికాంత్ ,రెడ్డమైన నరేష్ , దేవుని రవి, పిట్ల శ్రీశైలం, పుట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి ;

ఆనాటి కాలంలో ఎవరికి ఏమి తెలియని వారికి విద్య ద్వారా అందరినీ చైతన్య వంతులను చేయాలని ముందుగా స్త్రీల విద్యాభివృద్ధికి మరియు వారి హక్కుల కోసం ఎంతో కృషి చేసిన తొలి ఉద్యమ కారిని సావిత్రి భాయి ఫూలే అని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారూ,చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో *సావిత్రిబాయి పూలే వర్ధంతి*వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మల్లయ్య మాట్లాడుతూ పూర్వ కాలంలో ప్రజలు అమాయకత్వం తో బానీసలుగా బ్రతుకులు బ్రతుకుతున్న వారిని చూసి విద్యి ద్వారా చైతన్య వంతులను చేయాలని పట్టుదలతో మొదటి పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీల తో పాటు ప్రజలందరికి విద్యను అందించిన గొప్ప సంఘసంస్కర్త అన్నారు. మహిళల తో పాటు ప్రజల హక్కుల కోసం ఎదురించి అలుపెరుగని పోరాటం చేసిన ఉద్రమ కారిని సావిత్రి భాయి ఫూలే అని తెలిపారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి విశేష కృషి చేసిందని తెలిపారు. ఆమె చేసిన సేవలు మరువలేనివని స్త్రీలతో పాటు ప్రజలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ ఎమ్మార్పీఎస్ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్ పాముకుంట్ల చందర్ శీలపాక ప్రణిత్ దాసారపు సాంబయ్య మహిళలు పాల్గొన్నారు.

మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలు.!

మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలి..

రామయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే జయంతుల, వర్ధంతుల కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తున్నప్పటికీ రామాయంపేట మున్సిపల్ నాయకులకు మాత్రం తమకు సంబంధంలేని అంశం అంటూ గాలికి వదిలేస్తున్నారని
మహనీయుల పండగల రోజు సైతం కార్యక్రమాన్ని చేస్తున్న తామే అక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పని తొలగించి మహనీయులను నీటితో శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని పోచమ్మ అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఈ పరిస్థితి మారాలంటే ఎంత సమయం పడుతుంది, ఎప్పటికీ మున్సిపల్ అధికారులకు కనువిప్పు కలుగుతుందో , ఈ విషయాలను ప్రజలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు, నాయకులు గమనించాల్సిందిగా కోరుచున్నాము. అని పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా జయంతి ఉత్సవాలు అధికారికంగా స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పట్ల ఆవేదన. చేశారు.

కమిషనరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

వరంగల్, నేటిధాత్రి

celebrations

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, పరిపాలన విభాగం మహిళా అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. మహిళా పోలీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఉమెన్స్ డే సందర్భంగా ఇంతేజార్ గంజ్ స్టేషన్ లోని మహిళా కానిస్టేబుళ్లను అభినందిస్తూ వారితో కలసి ఫొటోస్ దిగారు.

celebrations
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version