బడ్జెట్లో అంకెలు పెరిగితే దళితులకు ఒరిగేదేముంది..

బడ్జెట్లో అంకెలు పెరిగితే దళితులకు ఒరిగేదేముంది?

సబ్ ప్లాన్ కేటాయింపులు ఫుల్..ఖర్చులు నిల్

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టిన 2026- 27సం. 53 47,315 కోట్లబడ్జెట్ ప్రవేశ పెట్టింది. దేశంలో 20 శాతం ఉన్న దళితులకు సబ్ ప్లాన్ కింద 1,96,400 కోట్ల రూపాయల కేటాయించింది. కేటాయింపులు పెంచడం ద్వారా దళితులకు ఒరిగేదేముందని వాటి ని ఖర్చు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల దళితులకు మరింత అన్యాయం జరుగుతుందని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్
అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటాయించింది.102 శాఖల ద్వారా కేటాయింపులు చేసిందని,ప్రధానంగా 2025 26 బడ్జెట్ను పోలిస్తే చూస్తే బడ్జెట్ 13,611 కోట్లు కాగా, సబ్ ప్లాన్ కింద 1,68,478 కోట్లు, అంబరిల్లా బడ్జెట్ 9540 కోట్లు కేటాయించారని చెప్పారు సుమారు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినప్పటికీ అవి ఒకచోట పెట్టి ఫూల్ చేసి నోడల్ ఆఫీసర్ కేటాయించి ఖర్చు చేయకపోవడం వల్ల దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు చేయడం లేదని విమర్శించారు వివిధ శాఖల ద్వారా ఖర్చుపెట్టినప్పటికీ ప్రత్యేకంగా దళితులకు ఖర్చు చేయకపోవడంతో వారి సంక్షేమం కుంటుపడుతుందన్నారు దళితులలో 70శాతం కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు 60 శాతం మంది దళితులు సరైన దుస్తులు పౌష్టికాహారం కు నోచుకోవడం లేదన్నారు దళితుల జనాభా 20 నుంచి 25 శాతానికి పెరుగుతున్నప్పటికీ బడ్జెట్ మాత్రం 16% దగ్గరే ఆగిందన్నారు.జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయింపులు లేవ న్నారు గ్రామీణ ప్రాంతాలలో వలసలు పెరిగి పట్టణాలకు వలసలు
వస్తున్న అత్యధికులలో దళితులు ఉన్నారని చెప్పారు పట్టణాలలో వారికి సరైన నివాసం లేదన్నారు. ఆర్థికంగా అత్యంత బలహీనంగా సామాజికంగా అణిచివేతకు గురవుతున్న దాడులపై బిజెపి 12 ఏళ్ల పాలనలో దళితులపై మరిన్ని దాడులు పెరిగాయన్నారు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ విబిజీ రాంజీ బిల్లు తీసుకురావడం ద్వారా దళితుల నోటికాడబుక్క లాగేసిందాన్నారు గతంలో 90% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం భరించే దాని స్థానంలో ఇప్పుడు రాష్ట్రాల మీదికి వదిలేసి 60 శాతానికి కేంద్రం తగ్గించుకొని 40 శాతం రాష్ట్రాల పైన భారంమోపుతుందన్నారు 125 రోజుల పని దినాలు పెంచుతామన్న ప్రభుత్వం సుమారు 1.50 000 కోట్ల రూపాయల కేటాయించాలన్నారు.
ఆ చట్టం ప్రారంభ దినాలలో 1,18 000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నేడు దానిని తగ్గించిందన్నారు
బడ్జెట్ కేటాయింపులలో పెంచుతున్నట్లు ప్రకటిస్తున్న ప్రభుత్వం వాటిని ఖర్చు చేయడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదన్నారు మూడు విభాగాల ద్వారా దళితులకు కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం సబ్ ప్లాన్ కింద కేంద్రమే ఒక నోడల్ ఆఫీసర్ ను అపాయింట్ చేసి 102 శాఖల ద్వారా విడివిడిగా కాకుండా ఒకేచోట ఫూల్ చేసి దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు అయ్యే విధంగా ప్రత్యేక కృషి కొనసాగించాలన్నారు ప్రధానమంత్రి దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతి మూడు నెలలకోసారి ఈ బడ్జెట్ పై సమీక్ష చేయాలన్నారు అంకెల్లో పెంచడం తప్ప ఆచరణలో ఖర్చు చేయకపోవడం వల్ల దళితులకు ఒరిగేది ఏమి ఉండదు అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version