అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్పీ కిరణ్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరె టేకుమట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినారు.స్టేషన్ లో రికార్డ్స్ ,కేసుల పురోగతి పరిశీలించారు.సిబ్బందితో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని,సంఘ విద్రోహ శక్తుల పైన నిఘా ఉంచాలని,తరుచుగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని సూచించారు తదుపరి సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ ఇసుక రవాణా మీద కఠిన చర్యలు తీసుకుంటామని,ఎవరైనా పోలీస్ వారి ఆదేశాలు ధిక్కరిస్తే కేసులు నమోదు చేసి జైల్ కి పంపిస్తామని,తీరు మార్చుకోకుంటే పిడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.మానేరు వాగులోనూ అక్రమ ఇసుక రవాణా చేసే అవకాశం వున్న స్థలాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్సై ప్రసాద్ కి సూచనలు చేశారు. ఎస్పీ వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు చిట్యాల సీఐ మల్లేశ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *