ఎనుమాముల మార్కెట్ లోని ఈవీయం ల వద్ద భద్రతను తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
నేటిధాత్రి, వరంగల్
ఈ నెల 13న జరిగిన వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో ఎనుమాముల మార్కెట్ నందు ఈవీఎం లు భద్రపరచిన స్ట్రాంగ్ రూముల బందోబస్తును వరంగల్ పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు 24గంటలు మూడంచెల భద్రతా నిఘా పెట్టాలని, అలాగే సీసీ కెమెరా అబ్జర్వేషన్ సక్రమంగా వుండేలా చూసుకోవాలి అని అధికారులకు ఆదేశాలు జారీచేసారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ వెంట ఎనుమాముల పోలీస్ స్టేషన్ సీఐ రమేష్, ఎస్ఐ శ్రీకాంత్, సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.