గంగాపూర్ లో రేషన్ షాపు లేక ప్రజల ఇక్కట్లు…

గంగాపూర్ లో రేషన్ షాపు లేక ప్రజల ఇక్కట్లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలోని గంగాపూర్ గ్రామం కొత్త పంచాయతీగా ఏర్పడి ఏళ్లు గడిచినా, ఇప్పటికీ రేషన్ దుకాణం లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ బియ్యం కోసం సమీపంలోని టేకూర్, ధర్మపూర్ గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఇది మరింత కష్టంగా మారింది. ప్రభుత్వం వెంటనే గంగాపూర్ లో రేషన్ షాపును ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సిద్ధపూర్లో ఘనంగా మహిళా శక్తి భవన భూమి పూజ…

సిద్ధపూర్లో ఘనంగా మహిళా శక్తి భవన భూమి పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పరిధిలోని సిద్ధపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ‘మహిళా శక్తి భవనం’ నిర్మాణానికి మరియు నూతన బోరు ను ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ విచ్చేసి, పూజా కార్యక్రమాల్లో పాల్గొని పనులను ప్రారంభించారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు అభినందనీయమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే గ్రామస్తుల నీటి అవసరాలను తీర్చేందుకు నూతన బోరు ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హఫీజ్, సిద్ధపూర్ గ్రామ సర్పంచ్ షరీఫ్ ఉప సర్పంచ్ విమలమ్మ, వార్డు సభ్యులు రామిరెడ్డి,, కాంగ్రెస్ నాయకులు కొల్లూర్ సంగన్న వేణుగోపాల్, శ్రీకాంత్ రెడ్డి, సంగ్రామ్ పాటిల్, ఆలయ కమిటీ ధర్మకర్త మాలి పటేల్ మల్లప్ప, నవిన్ పటేల్ యూసుఫ్, పీల్డ్ అసిస్టెంట్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బ‌ర్దీపూర్ ఆశ్రమంలో వైభవంగా దత్తగిరి మహారాజ్ ఆరాధన మహోత్సవాలు…

బ‌ర్దీపూర్ ఆశ్రమంలో వైభవంగా దత్తగిరి మహారాజ్ ఆరాధన మహోత్సవాలు

◆-: ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

◆-: డా౹౹ సిద్ధం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఝరాసంగం మండలంలోని సుప్రసిద్ధ బర్దీపూర్ ఆశ్రమం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.శ్రీ దత్తగిరి మహారాజ్ వార్షిక అమర తిథిని పురస్కరించుకుని ఆశ్రమ ప్రాంగణంలో మహా మృత్యుంజయ మంత్ర శత సహస్ర జపయజ్ఞం, దత్తహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.​ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. సిద్ధం ఉజ్వల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.బర్దిపూర్ ఆశ్రమ అప్ప వారిని శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ దత్తగిరి మహారాజ్ వంటి మహనీయుల ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని,లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ జపయజ్ఞం అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటునన్నారు. ఈ కార్యక్రమంలో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,నర్సింహారెడ్డి,అశ్విన్ పాటిల్,జగదీశ్వర్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ సర్పంచ్ కీర్తన ప్రభాకర్…

మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ సర్పంచ్ కీర్తన ప్రభాకర్

◆-: ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం కప్పా డ్ గ్రమంలో ఈరోజు గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కీర్తన ప్రభాకర్ , ఉప సర్పంచ్ బీరదర్ లక్ష్మి సురేష్ భూమి పూజా నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథులుగా హాజరై,న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ .ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “మహిళా సంఘాల సభ్యులు తమ సమావేశాలను మరియు ఇతర కార్యకలాపాలను సొంత భవనంలో నిర్వహించుకోవడం వల్ల వారి ఆర్థిక, సామాజిక సాధికారత మరింత మెరుగుపడుతుంది. గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది, ఈ భవనం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే, జహీరాబాద్ ఎంపి సురేష్ శెట్కార్ సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేతకి డైరెక్టర్ మల్లప్ప పాటిల్,మాజీ సర్పంచ్ నందప్ప పటేల్, కాంగ్రెస్ నాయకులు సంగ్రామ్ పటేల్ వేణుగోపాల్, డప్పుర్ సంగమేష్,శ్రీకాంత్ రెడ్డి,మారుతి రావు పాటిల్, రాజు స్వామి సుభాష్ బసవరాజ్ పటేల్ సయ్యద్ షకీల్ నావజ్ రెడ్ది, రాఘవేందర్ గోపాల్, సంఘమేశ్వర్ వార్డు సభ్యులు మొల్ల మౌలానా మంగలి సుధాకర్, మ్యాతరి మహేష్ గ్రామ సంఘం అద్యక్షురాలు బి. అనిత కార్యదర్శి సూకన్య,వి ఓ ఏ ఖాజా, రాజు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

“గ్రామ అభివృద్దే మా లక్ష్యం…

“గ్రామ అభివృద్దే మా లక్ష్యం”.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత నాజియా అంజూమ్ షైక్ సోహైల్ విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుమ్మనపల్లి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ప్రతి రూపాయితో తుమ్మనపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు.పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని, త్వరలోనే గ్రామ సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధి కార్యకలాపాలు చేపడతామని ఆయన అన్నారు.
గ్రామంలోని వార్డుల్లో సిసి రోడ్లు, సైడ్ డ్రెయిన్లు ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతి సింగిల్ ఫేజ్ మోటారు వద్ద ఒక మినీ ట్యాంకర్ ఏర్పాటు చేస్తామని, ముందుగా అత్యవసర పనులను పూర్తి చేస్తామని ఆయన అన్నారు.తుమ్మనపల్లి ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని, గ్రామంలో సమస్యలు లేకుండా అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుంటుందని సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ విశ్వాసం వ్యక్తం చేశారు.గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు అభివృద్ధి విషయాలలో తమకు సహకరించాలని ఆయన కోరారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని ఆయన అన్నారు.

ప్రజా బాటలో భాగంగా ఎలక్ట్రికల్ ఏఈ…

ప్రజా బాటలో భాగంగా ఎలక్ట్రికల్ ఏఈ

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

‘ప్రజా బాట’ కార్యక్రమంలో భాగంగా ఝరాసంగం మండలం మేడపల్లి గ్రామంలో ఎలక్ట్రికల్‌ ఏఈ సరళ, సబ్‌ ఇంజినీర్‌ హస్నౌద్దీన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ షాదుల్లా, ఏఎల్‌ఎం శేఖర్‌ పర్యటించారు. గ్రామ సర్పంచ్ కొల్లూరు అరుణ నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకుడు అభిలాష్ రెడ్డి, ఉప సర్పంచ్ మజార్ అహ్మద్ గ్రామంలోని విద్యుత్ సమస్యలను వారికి వివరించారు. దీనికి స్పందించిన ఏఈ మేడమ్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

బతుకు.. బండి..

బతుకు.. బండి..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా లోని నారాయణఖేడ్,కంగ్జి, వాసర, మనూర్ మండలాల నుంచి జహీరాబాద్ ప్రాంతంలోని ఝరాసంగం, న్యాల్ కల్, కోహిర్, మొగుడంపల్లి, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు చెరుకు తరలింపు పనుల కోసం నాలుగు నెలల క్రితం వలస వచ్చారు. చెరుకు పనులు ముగియడంతో ఎడ్లబండ్లపై తమ స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. గురువారం ఉదయం ఝరాసంగం మండలం మాచ్నూర్ నుంచి బర్దిపూర్కు వెళ్లే నిన్జ్ రహదారిపై ఎడ్లబండ్లపై కూలీలు వెళ్తుండటం కనిపించింది. “దిశ” వారిని పలకరించగా, నవంబర్ నెలలో కాంగ్జి నుంచి చెరుకు పనుల నిమిత్తం వచ్చామని, ప్రస్తుతం పనులు ముగియడంతో తిరిగి తమ గ్రామాలకు వెళ్తున్నామని తెలిపారు.

రేవంత్.. నిన్ను ప్రజలే పుట్ బాల్ ఆడుతారు: హరీష్ రావు..

రేవంత్.. నిన్ను ప్రజలే పుట్ బాల్ ఆడుతారు: హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన సర్పంచులను.ఝరాసంగం మండల కేంద్ర గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ మరియు మాజీ సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు, వారితో పాటు జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాజీ ఎంపీపీ మాజీ మండల అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రేవంత్ నువ్వు ఫుట్ బాల్ ఆడుడు కాదు. ప్రజలు నిన్ను ఫుట్ బాల్ ఆడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version