మొగులపల్లి పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా ఎం. సురేష్ బాధ్యతలు స్వీకరణ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి పోలీస్ స్టేషన్కు నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఎం. సురేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొగులపల్లి మండలంలో చట్టం మరియు శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.
ప్రజలు పోలీస్ శాఖపై విశ్వాసం ఉంచాలని, ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలియజేయాలని ఆయన కోరారు. నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
