జీర్లపల్లి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు…

జీర్లపల్లి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరసంఘం మండల కేంద్రంలోని జీర్ణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పందిరిలో నృత్యాలు, పాటలు, స్కిట్లతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉపాధ్యాయులకు, స్నేహితులకు భావోద్వేగపూరితంగా వీడ్కోలు పలికారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, జిల్లా విద్యాధికారులు, కలెక్టర్ వంటి పాత్రలను స్వీకరించి ఒక రోజు పాటు బాధ్యతలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్…

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

బహుమతులు అందజేసిన ఎస్ఐ పవన్ కుమార్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ విజేతలకు ఎస్ఐ పవన్ కుమార్ కళాశాల చైర్మన్ సిరికొండ శ్రీనివాస్ లు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి సిరివెన్నెల,రెండవ బహుమతి ఎస్ఆర్ స్కూల్ ఉతమ్ శెట్టి,ప్రభుత్వ పాఠశాల నుండి మొదటి బహుమతి అక్షయలు బహుమతులు అందుకున్నారు.ఈ సందర్బంగా అతిధులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి వారి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని అలాగే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.మార్చి పద్నాలుగు నుండి జరగబోయే పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి భయం లేకుండా మంచిగా రాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ ఇన్చార్జి కల్పన,పద్మ, ధనలక్ష్మి,విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version