మల్లక్కపేటలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
పరకాల,నేటిధాత్రి
పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చెరువు వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు గ్రామ సర్పంచ్ దొమ్మటి కవిత మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెరువుల పరిరక్షణ,నీటి వినియోగం,సాగునీటి సదుపాయాలపై అవగాహన కల్పించారు.గ్రామాభివృద్ధిలో చెరువుల పాత్ర కీలకమని,రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్,మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,మాజీ ఎంపీటీసీ దుమాల కిషోర్,వార్డ్ మెంబర్ అల్లం కార్తీక్,గ్రామ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
