మల్లన్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆంజనేయులు…

మల్లన్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆంజనేయులు

శేరిలింగంపల్లి , నేటి ధాత్రి

 

అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్‌లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మిస్తున్న మల్లన్న గుడి నిర్మాణ పనులను స్థానిక నాయకులు ఆంజనేయులు సాగర్ శనివారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, ఆలయ ప్రాశస్త్యాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయులు సాగర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక విలువల కేంద్రాలని పేర్కొన్నారు. మన డివిజన్‌లో ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని, ఆలయ నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లన్న గుడి కమిటీ అధ్యక్షులు బసవరాజు, సిద్దిక్ నగర్ కాలనీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, నాయకులు యాదయ్య గౌడ్, గోపాల్ గౌడ్, సంతోష్, రాము యాదవ్, రాము, సాగర్, ఆనంద్ మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అంతర్జాతీయ వేదికపై భారత పతాకం రెపరెపలు…

అంతర్జాతీయ వేదికపై భారత పతాకం రెపరెపలు
* అబుదాబిలో ఓపెన్ మాస్టర్స్ క్రీడల్లో రెండు బంగారు పతకాలు
* 3000 మీటర్లు, 1500 మీటర్ల పరుగుల్లో సత్తా చాటిన డాక్టర్ కొలన్ జగజ్జీవన్ రెడ్డి

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి 

ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల్లో నిలబడటం ఒక్కటే పెద్ద సవాలు కాగా, అందులోనే రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం అరుదైన ఘనతగా నిలుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఎమిరేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ మాస్టర్స్ గేమ్స్–2026లో భారతదేశానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ డాక్టర్ కొలన్ జగజ్జీవన్ రెడ్డి 3000 మీటర్లు, 1500 మీటర్ల పరుగుపందాల్లో మొదటి స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఫిబ్రవరి 6న ప్రారంభమైన ఈ క్రీడా మహోత్సవంలో 148 దేశాలకు చెందిన సుమారు 27 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, తీవ్ర పోటీ మధ్య ఆయన ప్రదర్శించిన పట్టుదల, స్థైర్యం ప్రత్యేకంగా నిలిచింది. • గత విజయాల జాడలోనే కొత్త రికార్డు: ఇప్పటికే 2024లో అమెరికాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఆయన, అదే ఆత్మవిశ్వాసంతో అబుదాబి వేదికపై మరోసారి ప్రతిభ చాటుతూ దేశానికి కీర్తి తీసుకువచ్చారు. • దేశ గౌరవమే లక్ష్యం: భారత పతాకం ఎగురవేయడం ప్రతి క్రీడాకారుడి కల కాగా, స్వర్ణ పతకాలతో దేశానికి గౌరవం తేవడం గర్వకారణమని డాక్టర్ జగజ్జీవన్ రెడ్డి పేర్కొన్నారు; రాబోయే రోజుల్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించి దేశ ప్రతిష్ఠను మరింత పెంచాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 169వ వారం అన్నదానం

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 169వ వారం అన్నదానం….

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 169వ అన్నదాన కార్యక్రమం శనివారం గంగారంలోని హోప్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో హోప్ సభ్యులతో పాటు చైర్మన్ కొండ విజయ్కుమార్, కొండా ప్రియాంక పాల్గొని ప్రజలకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ వారం అన్నదాన కార్యక్రమానికి సుమారు 2900 మంది పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. హోప్ చైర్మన్ విజయ్కుమార్ అభిమానూలు అన్నదాన కార్యక్రమంలొ పాల్గొన్నారు.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం చేపడుతున్న అన్నదానం కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నిత్యం పనులు చేసుకుంటూ జీవనం గడిపే తమకు ప్రతి వారం ఉచిత భోజనం అందజేయడం పట్ల హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోప్ సభ్యులు అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

166వ వారానికి చేరిన హోప్ ఫౌండేషన్ అన్నదాన యజ్ఞం

166వ వారానికి చేరిన హోప్ ఫౌండేషన్ అన్నదాన యజ్ఞం

​శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

 

నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా హోప్ ఫౌండేషన్ చేపట్టిన అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న

ఈ అన్నప్రసాద వితరణ శనివారం విజయవంతంగా 166వ వారానికి చేరుకుంద, కార్యక్రమంలో సుమారు 2,900 మంది పేదలు, కూలీలు మరియు స్థానికులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో గత 166 వారాలుగా ఈ సేవను నిర్విఘ్నంగా కొనసాగించడం మాకు ఎంతో సంతోషకరమని, కొండ విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు
తదితరులు పాల్గొన్నారు

లింగంపల్లి పురవీధుల్లో ఆకట్టుకున్న స్వయంసేవకుల కవాతు…

లింగంపల్లి పురవీధుల్లో ఆకట్టుకున్న స్వయంసేవకుల కవాతు…

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి స్వయంసేవకుల పథ సంచలన కార్యక్రమం వైభవంగా, స్ఫూర్తివంతంగా, కన్నులపండుగగా, పాల్గొన్నవారికే కాకుండా చూసేవారికి కూడా ఉత్సాహాన్నిచ్చే విధంగా జరిగింది.
ముందుగా జరిగిన సమావేశంలో సికింద్రాబాద్ విభాగ్ బౌధ్ధిక్ ప్రముఖ్ శ్రీ.అచ్చవెల్లి.భాను ప్రకాశ్
గారు తమ వక్త సందేశంలో భాగంగా మాట్లాడుతూ, హిందూ సంఘటన కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించబడింది అన్నారు. సంఘ్ స్వయంసేవకులకు క్రమశిక్షణ, దేశభక్తి వంటి ఉన్నతమైన సద్గుణాలు అలవడే విధంగా శిక్షణనిస్తుంది అన్నారు. సంఘం అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక సమాజసేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది అన్నారు. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద స్మారక కేంద్రం, శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తికేంద్రం, అయోధ్యలోని భవ్యమైన శ్రీరామ మందిరం సంఘ కృషివల్లనే నిర్మించబడ్డాయి అన్నారు. తిరుమల పవిత్రత ఏడుకొండలు కాక రెండు కొండలకు పరిమితం చేయాలన్న ప్రతిపాదన, రామసేతు విధ్వంస ప్రతిపాదన సంఘ ఉద్యమాలవల్ల ఆగాయి అన్నారు. సంఘ పనిని సమాజమంతాకలిసి వేగంగా ముందుకు తీసుకువెళ్లి భారతదేశాన్ని తిరిగి విశ్వగురువు స్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ విభాగ్ సహకార్యవాహ్ శ్రీ.నారాయణ మూర్తి గారు కూడా పాల్గొన్నారు.

తరువాత గణవేష్ (uniform) ధరించిన స్వయంసేవక్ లు అందరూ కాళ్ళు, చేతులు ఒకేసారి, ఒకే విధంగా కుదుపుతూ సైనిక కవాతులాగా మనోహరంగా పథసంచలన చేస్తూ, గుల్మోహర్ చౌరస్తా నుడి ప్రారంభము అయి ప్రశాంతి నగర్, బాపు నగర్, గోపీనగర్, నెహ్రూ నగర్ , ఆదర్శనగర్ బస్తీ వీధుల్లో సంచరించారు. సంఘ ఘోష్ (RSS musical band) లయబద్ధంగా వాదన చేస్తూ పథసంచలనకి అత్యంత ఉత్సాహం ఇచ్చింది. పరమపవిత్ర భగవాధ్వజాన్ని పుష్పాలంకృతమైన వాహనంలో తెచ్చారు. బస్తీవాసులు పూలుచల్లి అడుగడుగునా స్వాగతం పలికారు.

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న వరదల్లో మునిగిన సుదర్శన్ నగర్ కాలనీ.

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న వరదల్లో మునిగిన సుదర్శన్ నగర్ కాలనీ

శేరిలింగంపల్లిలో, నేటి ధాత్రి :

 

శేరిలింగంపల్లి, డివిజన్ శనివారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం ఒక్కసారిగా భారీగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి రోడ్లు పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీ రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండి చెరువును తలపించేలా మారింది. చిన్న పాటి వర్షం కురిసిన రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండిపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్

 

మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

హైదరాబాద్, ఆగస్టు 24: 10 ఏళ్ల పాటు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు సైతం ఆ పార్టీ గెలుచుకోలేక పోయింది. అయితే మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకొంటుంది.

అలాగే ప్రజల మధ్యకు వెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ గూటిలోకి చేరారు. అలాంటి నియోజకవర్గాలపై పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించింది.

దీంతో ఆ యా నియోజకవర్గాలకు చెందిన పార్టీ కేడర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆదివారం.. అంటే ఆగస్టు 24వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కేడర్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జ్‌ను కేటీఆర్ ప్రకటించనున్నారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అరికేపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ నియోకవర్గాల కేడర్‌తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆదేశించినట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version