ప్రయాగ్రాజ్ అయోధ్యను దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల్ మల్గి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి తమ పార్టీ బిఆర్ఎస్ నాయకులు – సభ్యులతో మరియు గ్రామ మిత్రులు కలిసి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళను సందర్శించిపుణ్య స్నానాల ఆచరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభమేళా జరుగుతుందన్నారు. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందాని దీన్ని ఆదిశంకరాచార్యు లు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్స రసలు, జంతువులు, విషయం, అమృతం వంటివి బయటికొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణా ల్లో ఉన్నాయన్నారు. కోట్లాది సత్పురు షుల మధ్య స్నానం ఆచరించడం తన జీవితం ధన్యమైందని అన్నారు. అంతే కాకుండా వారణాసి అయోధ్య ఉజ్జయిని మహంకాళేశ్వరం ఓంకారేశ్వర్ ను వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు మాణిక్ యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు
ఆదివాసి వ్యక్తి పైన ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడి..
వ్యక్తికి ప్రక్కటెముకలు విరిగిన వైనం.
దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులను విధులు నుంచి తొలగించాలి.
ఫారెస్ట్ అధికారుల పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలి..
మానవ హక్కుల కమిషన్ Save ఫిర్యాదు చేస్తాం.
ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి..
నూగూర్ వెంకటాపురం, (నేటి ధాత్రి ):-
అటవీ శాఖా అధికారులు ఆదివాసీల పైన వరస దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి,ఉయిక శంకర్, పూనెం సాయి ఆరోపించారు. ఆదివారం అటవీ శాఖా అధికారుల చేత దాడికి గురై గాయాల పాలైన ఏకన్న గూడెం గ్రామానికి చెందిన కోరం సమ్మయ్య ను పరామర్శించారు. సమ్మయ్య ను, కుటుంబ సభ్యులను పూర్తి వివరాలు అడికి తెలుసుకున్నామని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. అడవికి వెళ్లిన ఆదివాసీ పైన అటవీ శాఖా అధికారులు మూడు ప్రక్కఎముకలు విరిగేలా అత్యంత పాశవికంగా దాడి చేయడం హేయమైన దుశ్చర్య అని మండిపడ్డారు. ఒకవేళ సమ్మయ్య తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయని, కొట్టడానికి అధికారులకు అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారు అని నిలదీశారు. తనని వదిలేయమని ఎంత ప్రాదేయ పడిన కనికరం చూపకుండా దాడి చేయడం అమానవీయ చర్య అన్నారు. బాధితుడి లుంగీ విప్పి తన మెడకు, మొఖానికి ముసుకు వేసి, చేతులు వెనక్కి కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేసినట్టు బాధితుడు సమ్మయ్య చెప్పినట్టు తెలియజేసారు. ఆదివాసీలు శతా బ్దాలు గా అడవిని కాపాడితే అటవీ శాఖా ఉద్యోగులు కంచే చేను మేసినట్టు అడవిని అమ్ముకుంటున్నారు అని విమర్శించారు. ఈ అమానవీయ ఘటన పైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ని, ఎస్సి ఎస్టీ కమిష్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు నాయకులు నర్సింహా మూర్తి, శంకర్, సాయి తెలిపారు. సమ్మయ్య కుటుంబం రోడ్డు పడిందని, నష్టపరిహారం గా 10 లక్షలు ఇవ్వాలని ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు… కోరం సమ్మయ్య కు న్యాయం జరగక పోతే చర్ల రేంజ్ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు..జి ఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్, ఏ ఎన్ ఎస్ మండల అధ్యక్షులు కుంజ మహేష్, వాసం నారాయణ తదితరులు పాల్గొన్నారు..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫిబ్రవరి 17 నుండి అమలులోకి వచ్చిన కొత్త ఫాస్ట్ట్యాగ్ నియమాలను ప్రకటించింది. NPCI ప్రకారం, టోల్ ప్లాజాలో ట్యాగ్ని స్కాన్ చేసిన క్షణం నుండి నిర్దిష్ట సమయ వ్యవధిలో ఫాస్ట్ట్యాగ్ చెల్లింపులు ధృవీకరించబడతాయి. కొత్త నియమాలు మోసాన్ని తగ్గించడం మరియు టోల్ చెల్లింపు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
NETIDHATHRI HYDERABAD: తెలుగు సినీ నిర్మాత డ్రగ్స్ వ్యాపారిగా మారిన కేపీ చౌదరి అలియాస్ సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, చౌదరి మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయినప్పటి నుండి గోవాలో ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఆర్థిక సమస్యలతో కలత చెందాడని ఫిల్మ్ సర్కిల్స్లోని అతని స్నేహితులు చెప్పారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కె.పి.చౌదరి 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.తెలుగు సినిమా కబాలికి నిర్మాతగా వ్యవహరించారు. 2023లో 93 గ్రాముల కొకైన్తో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చౌదరి ఖాతాదారులు తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు మరియు నటీమణులతో సహా సినీ సర్కిల్లలో మరియు వ్యాపార వర్గాల్లో కూడా విస్తరించి ఉన్నారని పోలీసులు కనుగొన్నారు.
అతను నైజీరియన్ జాతీయుడైన పెటిట్ ఎబుజర్ నుండి గంజాయిని సేకరించాడని మరియు దానిని తన సర్కిల్లలో స్వీయ వినియోగం మరియు సరఫరా కోసం ఉపయోగిస్తున్నాడని నివేదించబడింది. అతను గతంలో HNEW చేత అరెస్టు చేయబడిన డ్రగ్ కింగ్పిన్ ఎడ్విన్ నూన్స్తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.
గోవాకు మకాం మార్చిన చౌదరి అక్కడ క్లబ్ను ప్రారంభించాడు. అయితే, అతని వ్యాపారం మునిగిపోయింది. అతను ఇతర సినిమాలకు పంపిణీదారుడు కూడా. అతను నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ, చౌదరి పరిశ్రమలోని ప్రముఖులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు.
– భారీగా తరలి వచ్చిన భక్తులు – ప్రశాంతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
Shiva Parvathi
మహాశివరాత్రి సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం అగ్నిగుండం ప్రవేశం, స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, రుద్రస్వాహకార హెూమము, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భక్తజనుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనీసం స్వామివారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదు. ఇవన్నీ ఆలయం తరపున సమకూర్చుకున్నారు. కళ్యాణంలో పాల్గోన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా మహిళలకు వాయినాలు అందజేశారు. రాత్రికి స్వామిఅమ్మవారల ఉత్సవ మూర్తులను విమానరథంలో బసవేశ్వర మందిరం వరకు ఊరేగించారు. కళ్యాణోత్సవంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, ఆలయ ఈఓ శివరుద్రప్పస్వామి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. ‘గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షల్లో విద్యార్థులు పెయిల్ అయితే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటించిన రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ ఆ పరీక్షలోనూ ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది. అయితే ఎలిమెంటరీ విద్యా పూర్తయ్యే వరకు ఏ విద్యార్థని బహిష్కరించకూడదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.
VOICE భారత్ను స్పోర్ట్స్ పవర్హౌస్గా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా ఓ కీలకమైన అడుగు పడింది. విశ్వక్రీడలైన ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రెడీ అవుతోంది. 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. స్వదేశంలో తొలిసారి విశ్వక్రీడా పండుగను జరిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. 2036లో జరగబోయే విశ్వక్రీడల హక్కుల సాధన కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అక్టోబర్ 1వ తేదీన లెటర్ ఆఫ్ ఇంటెంట్ను పంపించినట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. భారత్లో ఒలింపిక్స్ వంటి మెగా క్రీడలను నిర్వహిస్తే ఐఓసి లాభం చేకూరే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అందుకే ఐఓసి కూడా భారత్కే ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత క్రీడా రంగానికి కొత్త జోష్ లభించడం ఖాయం
కలెక్టర్ కార్యాలయంలో కరెంట్ వృధా చేస్తున్న ఉద్యోగులు?
హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం G24లో, ప్రత్రి రోజు మధ్యాహ్నం 1నుండి 2.30 గంటల వరకు లంచ్ పేరుతో ఉద్యోగులు బయటకు వెళ్ళే క్రమంలో, వెళ్ళే ముందు తమ కార్యాలయంలోని లైట్లు, ఫ్యాన్లు బందు చేయకుండా వెళ్తున్న పరిస్థితి.
కార్యాలయంలో ఖాళీ కుర్చీలు, తిరుగుతున్న ఫ్యాన్లు, వేసి ఉన్న లైట్లు, ఆఫ్ చేయకుండా బయటకు వెళ్తున్న ఉద్యోగులు.
కరెంట్ ఆదా చేయాలనే ఆలోచన లేదా!!!, లేక ప్రభుత్వ కార్యాలయం అని ధీమా ఏమో…? ఆ సమయంలో ఏదైనా పని మీద ఆఫీసుకు వచ్చే ప్రజలకు ఖాళీ కుర్చీలు, తిరుగుతున్న ఫ్యాన్లు దర్శనం ఇస్తున్నాయి.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానానికి శంఖారావం పూరించారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారాయన. 2026 తమిళనాడు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు విజయ్. ఇందులో భాగంగానే విల్లుపురంలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఏకంగా 5 లక్షల మందికి పైగా వచ్చారని సమాచారం. ఇక తన స్పీచ్తోనూ అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్. మొత్తానికి విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే విజయ్ కు పలువురు సినీ సెలబ్రిటీలు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా టీవీకే అధినేతకు అభినందనలు తెలిపారు. ‘సాధువులు, సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినందుకు నటుడు విజయ్ కి నా హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఈపోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కాగా టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో కోలీవుడ్ లో విజయ్ కూడా అంతే క్రేజ్ ఉంది. వీరిద్దరి ఒకరు సినిమాలు ఒకరు రీమేక్ చేసుకుని సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఇద్దరూ కూడా స్టార్ హీరోలుగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అలా జన సేన పార్టీని ప్రారంభించి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు పవన్ కల్యాన్. మరి విజయ్ కూడా పాలిటిక్స్ లో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి
`ప్రభుత్వం మారగానే శైలజా రామయ్య మళ్ళీ కమీషనర్ కుర్చీలోకి ఎలా వచ్చారు?
`అలుగు వర్షిణిని తప్పించి శైలజా రామయ్య మళ్ళీ ఎందుకొచ్చారు?
`అలుగు వర్షిణి గురుకులాకు ఎందుకు వెళ్లారు?
`గత ప్రభుత్వంలో శైలజా రామయ్యను ఎందుకు తప్పించారు?
`అవతవకలపై ఈ ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించారు?
`జయేష్ రంజన్ రాసిన లెటర్లు చిత్తు కాగితాలా?
`గతంలో టెస్కోలో అవినీతిపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు అబద్దమా?
`అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విచారణ బుట్టదాఖలేనా?
`మంత్రి తుమ్మల మాటలకు విలువ లేదా?
`అవినీతి జరిగిన విషయం దృష్టికొచ్చిందన్న మాటలు అబద్దాలా!
`ప్రజా ప్రభుత్వంలో మంత్రికన్నా కమీషనరే పవర్ ఫుల్లా!
`విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పిన వెంటనే శైలజా రామయ్య ఎందుకొచ్చారు?
`మళ్ళీ శైలజా రామయ్యను ఎందుకు తెచ్చి పెట్టారు?
`ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రశ్నలా?
`ఇప్పుడు అవినీతి అధికారులకే పెద్ద పీటలా?
`అవినీతి చేసిన వారికి అందలాల!
`ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసిన వారికి కష్టాలా?
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని వ్యవస్దలకు ఏం మాయ రోగమొచ్చింది. చేస్తున్న ఉద్యోగాలకు నెల నెల వేలాదిరూపాయల జీతాలు తీసుకుంటూనే వున్నారు. అయినా అవినీతి అవతారం ఎత్తుతున్నారు. లంచాలు తీసుకోవడం తమ హక్కు అన్నంతగా మారిపోతున్నారు. ప్రజల సొమ్ముతినడం అన్యాయమని అనిపించదు. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా తినడం అక్రమని అనిపించదు. కాని వేలెత్తి చూపితే మాత్రం ఎక్కడలేని పౌరుషం పొడుచుకొస్తుంది. అవినీతి జరిగిందని చెబితే ఆక్రోషమొస్తుంది. అన్యాయం జరుగుతుందని అంటే కోపాలొస్తాయి. ప్రజల సేవ కోసం వున్న, ప్రజల పన్నుల మీద జీతాలు తీసుకుంటున్న వాళ్లు అవినీతికి పాల్పడమమే నేరం. ఆ సంగతి తెలిసి కూడా అన్యాయానికి తెగబడతాం…అవినీతిని విచ్చలవిడిగా చేస్తాం..అవకాశాన్ని బట్టి కోట్లు మింగేస్తామనుకుంటున్నారు. మింగుతున్నారు కూడా.. సహజంగా ఎక్కడైనా ఒకప్పుడు అవినీతి అధికారి అని ఎక్కడ ముద్రపడుతుందో అని భయపడేవారు. ఉద్యోగ విధినిర్వహణ కర్తవ్యంగా సాగించేవారు. కాని ఇప్పుడు అందిన కాడికి దోచుకుంటేనే గొప్ప అన్నట్లు మారిపోయింది. అలాంటి వారికి జేజేలు పలుకుతున్నారు. వారికే అటు ప్రజలు, ఇటు తోటి ఉద్యోగులు భయపడుతున్నారు. నేటిధాత్రి ఇటీవల చేనేతలో చేతి వాటం అనే శీర్షికతో ఓ కథనం ప్రచురించింది. ఆ కథనం తప్పైతే ఆ అధికారులు వార్తలను ఖండిరచొచ్చు. నిజానిజాలు వెల్లడిరచి వార్తను తప్పు పట్టొచ్చు. కాని ఒక ఉన్నతోద్యోగి దేవత అంటూ కింది స్దాయి ఉద్యోగులు కీర్తించడం ఎక్కడా విన్నది లేదు. చూసింది లేదు. ఒక ఉన్నతాధికారి ఎలా దేవత అవుతుందో తెలియదు. వ్యక్తిగతంగా ఉన్నతోద్యోగి మీద గౌరవం వుంటే అలా సంబోధించుకోవడానికి అభ్యంతరం లేదు. కాని అది కార్యాలయంలో ఉన్నతోద్యోగి అయిన ఆ దేవత మీద వార్తలు రాస్తారా? అంటూ చిందులు తొక్కే కింది స్ధాయి ఉద్యోగులు కూడా వుంటారని ఎక్కడా వినలేదు. కాని ఇప్పుడు వింటున్నాం.. చూస్తున్నాం..చేనేత .జౌళి శాఖ కమీషనర్గా వున్న శైలాజా రామయ్యను దేవతగా కీర్తిస్తూ కార్యాలయంలోని ఉద్యోగులు ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న వార్త రాయించిన వాళ్ల పాపం పోదని నిందిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అంతే కాదు వార్త రాసిన నేటిధాత్రికూడా ఆ పనిచేయాలని ఓ సుధాకర్ రెడ్డి అనే ఉద్యోగి ఇతర ఉద్యోగుల మీద చిందులు వేశాడట. కారణం ఆ ఉద్యోగి కూతురుకు ఎలాంటి నోటిఫికేషన్ అవసరంలేకుండానే టెస్కొలో కమీషనర్ శైలజా రామయ్య ఆశీస్సులతో ఉద్యోగం కల్పించారు. ఆ కృతజ్ఞత వుంటే వ్యక్తిగతంగా పూజించుకోవచ్చు. కాని టెస్కొలో ఎలాంటి ఉద్యగమైనా నియామకాల మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగం కల్పించాలి. కాని అది జరగలేదు. తన కూతురుకు అప్పనంగా ఉద్యోగం సంపాదించుకున్నామన్న బెరుకులేదు. మీడియాకు తెలిస్తే ఇబ్బంది అవుతుందన్న భయం లేదు. నిరుద్యోగులకు తెలిస్తే అలా ఉద్యోగం ఎలా కల్పిస్తారంటూ ప్రశ్నిస్తారన్న ఆందోళన అసలే లేదు. తప్పు చేసి, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఒక రకంగా నేరం చేశారు. అయినా ఉన్నతాధికారి ఐఎఎస్ అదికారి అండగా వున్నారన్న ఆలోచనతో ఒక ఉద్యోగి తోటి ఉద్యోగుల మీద చిందులు తొక్కుతున్నాడని తెలిసింది. ఇక ఇదిలా వుంటే టెస్కొలో అవినీతి జరిగిందనే వార్తలు అనేకం వున్నాయి. ఇప్పుడు అదికారంలో వున్న కాంగ్రెస్ నేతలు చేసిన అనేక ఆరోపణలున్నాయి. ఆనాడు అవి తప్పని కమీషనర్ నోరు విప్పలేదు. తప్పు జరగలేదని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల టెస్కొలో నిధులు గోల్ మాల్ అయిన సంగతి స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడిరచారు. అంటే ఇక్కడ మంత్రి చేసిన వ్యాఖ్యలు తప్పా? ఆయన జరిగిన దానిపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పడం అబద్దమా? దాంతో టెస్కొ విషయంలో మంత్రి మాటలకే చెల్లుబాటు లేకుండాపోయిందా? ఎవరు సమాదానం చెబుతారు? సాక్ష్యాత్తు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెస్కొలో బోగస్ సహకార సంఘాలున్నట్లు గుర్తించినట్లు కూడాచెప్పారు. అసలు వాటి గుట్టు రట్టు కావాల్సిన అవసరం వుంది. ఇక పోతే గత ప్రభుత్వమే టెస్కొలో ఏదో జరిగింది. కోట్ల రూపాయల గోల్ మాల్ కనిపిస్తుందని అనుమాన పడి అప్పటి మంత్రి కేటిఆర్ కమీషనర్ శైలాజా రామయ్యను బదిలీ చేశారు. ఆ స్దానంలో ఐఏఎస్ అధికారి బుద్ధ ప్రకాష్ను కమీషనర్గా నియమించారు.కొంతకాలం తర్వాత బుద్ధ ప్రకాష్ ను వేరే శాఖకు కేటీఆర్ బదిలీ చేసి టెస్కో కమీషనర్ గా అలుగు వర్షీణీని నియమించారు. ఆ తర్వాత జరిగిన తంతు గురించి ఆమె విచారణ మొదలు పెట్టింది. దాంతో టెస్కొలో విస్తుపోయే అంశాలు ఆమె దృష్టికి వచ్చాయి. వీటిలో లెక్కలు తేల్చాలంటే నిజాయితీ అధికారులుగా పేరున్న కొంత మందిని ఆమె తనశాఖలోకి తీసుకున్నారు. వారిలో కిరణ్మయి, క్రిష్ణప్రసాద్, కళావతి, మధు అనే ఉద్యోగులున్నారు. వీరి సహాకారంలో అలుగు వర్షిణి విచారణ మొదలు పెట్టింది. టెస్కోలో జరిగిన అవకతవకలు తన విచారణలో తెలిసిన వెంటనే లోతైన అధ్యయనం చేసే ముందు ఓసారి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్కు లేఖ రాశారు. ఆయన విజిలేన్స్ విచారణ జరపాలంటూ జీఏడికి సూచించారు. లోతైన విచారణ మొదలైంది. ఇంతలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కూడా విచారణ వేగవంతం చేయాలనే చూసింది. ఇంతలో టెస్కొలో జరిగిన అవినీతి బైటకు వస్తుందన్న ఆలోచనతో ఇతర శాఖలు చూస్తున్న శైలాజా రామయ్య పట్టుబట్టి మళ్లీ చేనేత జౌళి శాఖ కమీషనర్గా వచ్చారు. కమీషనర్గా వున్న ఐఏఎస్ అలుగు వర్షిణిని గురుకులకు పంపించారు. తర్వాత ఇతర ఉద్యోగుల మీద శైలాజా రామయ్య తమ ప్రతాపంచూపారు. తనపైనే విచారణ చేస్తారా? అని వచ్చిన వెంటనే కిరణ్మయిని గురుకుల శాఖకు పంపించారు. కృష్ణ ప్రసాద్ను తిరిగి పంపించేశారు. ఆయనకు రెండు నెలల్లో 35 మెమోలు, 8 చార్జిమెమోలు జారీ చేసి వేదిస్తున్నారని తెలుస్తోంది. ఒక కలావతి అనే ఉద్యోగికి నాలుగు నెలల నుంచి జీతం ఆపేశారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసినందుకు వీరికి కష్టాలు మొదలయ్యాయి. వేదింపులు మొదలయ్యాయి. నాలుగు నెలలుగా జీతం రావడం లేదని శైలజా రామయ్య ముందు కళావతి బోరున విలపించినా ఆమె కనికరించలేదు! ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కార్యాలయం ముందు వేచి వుంచి, చివరికి నా దగ్గరకు రావొద్దని హెచ్చారించారు. ఇకమధు అనే ఔటోర్సింగ్ ఉద్యోగి విషయంలో మరీ విచిత్రం చేశారు. ఔట్సోర్సింగ్ ఏజేన్సీకి మధు అనే ఉద్యోగి రాజీనామా చేశారని లెటర్ పంపించారు. ఆఫీసులోనే అతన్ని తీసేశామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 19న ఉత్తర్వులు తయారు చేసి, జూలై 27 వరకు మధుకు సమాచారం ఇవ్వలేదు. ఇదిలా వుంటే ఈ ఉద్యోగులకు వేధింపులు ఆగాలన్నా, వారి వారి కొలువులు సజావుగా చేసుకోవాలనుకుంటే శైలజా రామయ్య మీద అప్పటి కమీషనర్ అలుగు వర్షిణి మా మీద ఒత్తిడి తెచ్చి నివేదికలు తయారు చేయించిందని ప్రభుత్వానికి లెటర్లు రాయాలి? అందులో మా తప్పేంలేదని అప్పటి కమీషనర్ ఒత్తిడి మేరకు చేశామని ఒప్పుకోవాలి. శైలజా రామాయ్య కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటే కూడా మీరు చేసిన పాపం పోదని హెచ్చరిస్తున్నారు. వారిని బెదిరిస్తున్నారు. ఇదిలా వుంటే ఏ ఉద్యోగుల మూలంగా టెస్కొలో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయో ఆ ఉద్యోగులైన రఘునందన్ రావును అప్పట్లో బదిలీ చేశారు. ఆయనతోపాటు తత్వానంద చారి, కలింగరెడ్డి, సుధాకర్రెడ్డి, పురాణం శ్రీనివాస్ను బదిలీ చేశారు. ఎప్పుడైతే శైలజా రామయ్య మళ్లీ చార్జి తీసుకున్న వెంటనే రఘనందన్ రావుకు పోస్టింగ్ వచ్చింది. ˜తత్వానంద చారికి డివో నుంచి ఏడి అయ్యారు. కళింగ రెడ్డి డివో నుంచి ఏడి అయ్యారు. సస్పెండ్ అయిన పురాణం శ్రీనివాస్కు ఎంవో నుంచి లివరీ డివిజన్కు ప్రమోషన్ ఇచ్చారు. ఇలా టెస్కొలో అవినీతికి పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో తేలిన వారికి ఇప్పుడు ప్రమోషన్లు వచ్చాయి. ప్రభుత్వం విచారణ కోసం తీసుకున్న టీమ్ ఉద్యోగులకు మాత్రం బదిలీలు, ఒత్తిళ్లు, వేధింపులు, జీతాలు ఆపడాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మధుకు ఉద్యోగమే లేకుండా చేశారు. ఇదంతా నిజమా? కాదా? అన్నది కమీషనర్ చెప్పాలి. లేకుంటే అసలు టెస్కొలోఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వంతో చెప్పించాలి. కింది స్దాయి ఉద్యోగులను వేధిస్తే తప్పు ఒప్పు కాదు. జరిగిన అవినీతి లెక్కలోకి రాకుండాపోదు. నేటిధాత్రి మీద నిందలేస్తే సరిపోదు. ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాలి.
అతిశీని సిఎం చేస్తామని కేజ్రి ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యూహాలు అర్థం కాక బిజేపి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. బిజేపి జాతీయ నాయకులు ఒకటి తలిస్తే అరవింద్ కేజ్రివాల్ మరొకటి చేస్తున్నారు. అరవింద్ కేజ్రివాల్ ను జైలుకైతే పంపగలిగారు గాని, ఆయనను ముప్పు తిప్పలు పెట్టలేకపోతున్నారు. ఆయన మీద రాజకీయ ఆధిపత్యం కొనసాగించలేకపోతున్నారు. ఎలాగైనా ఆమ్ ఆద్మీని ఊదేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా అరవింద్ రాజకీయ వ్యూహాలు చిక్కడం లేదు. దొరకడం లేదు. బిజేపి పెద్దలకు అందడం లేదు. అరవింద్ కేజ్రివాల్ ను జైలు పాలు చేసి మానసిక స్థైర్యం దెబ్బ తీయాలని చూశారు. కానీ ఆయన మరింత బలడుతున్నారు. ఒకప్పుడు డిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ విస్తరణకు తెలియకుండానే బిజేపి వాళ్లే మార్గం చూపిస్తున్నారు. అరవింద్ కేజ్రివాల్ జైలులో వున్నంత కాలం ఆయనకు పదవి పిచ్చి తప్ప ప్రజలకు సేవ చేయాలని లేదని బిజేపి విమర్శిస్తూవచ్చింది. ఎలాగైనా కేజ్రివాల్ తో రాజీనామా చేయించి రాజకీయంగా పతనం వైపు నెట్టాలని చూసింది. కానీ అక్కడ కూడా బిజేపి ఎత్తుగడ పారలేదు. కేజ్రివాల్ ఒక వేళ రాజీనామా చేసినా తన సతీమణిని సిఎం. చేస్తారని భావించింది. జైలు నుంచి విడుదలైన కేజ్రివాల్ రెండు రోజులకు తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. దాంతో బిజేపి తన ఆరోపణలకు పదునుపెట్టింది. మరో లాలూ, రబ్రీ అంటూ విమర్శలు గుప్పించించింది. డిల్లీలో బిహార్ తరహా లాలు రాజకీయాలంటూ ఎత్తిపోడుపులు మొదలుపెట్టింది. పనిలో పనిగా బిజేపి డిల్లీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసింది. బిజేపి రాష్ట్రపతి ముర్ముకు వినతిపత్రం కూడా అందజేసింది. కానీ అనూహ్యంగా కేజ్రివాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ప్రకటించారు. బిజేపి కేంద్ర నాయకత్వం బిత్తరపోయేలా చేశారు. బిజేపికి పాలుపోని సంకట స్థితిలోకి కేజ్రివాల్ నెట్టేశాడు. ఒక రకంగా బిజేపికి దారులన్నీ మూసేశాడు. అసలు దారి దొరక్కుండా చేశారు. ఇప్పటికే కేజ్రివాల్ మూలంగా బిజేపికి రాజకీయంగా కోలుకోలేని దెబ్బలు పడుతూనే వున్నాయి. ఇప్పుడు బిజేపి ఊహకందని దెబ్బ కొట్టాడు. బిజేపికి ముందు నుయ్యి..వెనక గొయ్యి తెచ్చిపెట్టాడు. డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సందర్భంలోనే కేజ్రివాల్ తనను బిజేపి అరెస్టు చేయిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నిజం చేసి బిజేపి ఇరుకున పడింది. అది కేజ్రివాల్ జైలుకు వెళ్లిన తర్వాత బిజేపికి అర్థమైంది. అయినా బిజేపి ఏదో ఒక ఆశతో కేజ్రివాల్పై పైచేయి సాధిస్తామన్న నమ్మకంతో అడుగులు వేస్తూనే వుంది. కేజ్రివాల్ వాటిని బిజేపి తప్పటగులుగా తెల్చేస్తూనే వున్నారు. బిజేపి పరువు గంగలో కలిపేస్తూనే వున్నారు. ఇప్పుడు కేజ్రివాల్ ఇలాంటి దెబ్బ కొడతారని బిజేపి అధినాయకత్వం కలలో కూడా ఊహించలేదు. బిజేపి ఇంతగా చతికిలపడే పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అనవసరంగా కేజ్రివాల్ ను కెలికి తప్పు చేశామా? అన్న భావన కొందరు బిజేపి పెద్దలు వెలుబుచ్చుతూనే వున్నారు. ఇదే అదునుగా బిజేపిని కేజ్రివాల్ దెబ్బ మీద కొడుతూనే వున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజేపికి గడ్డుకాలం తెచ్చేందుకు కేజ్రివాల్ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. నిజానికి డిల్లీలో రాష్ట్రపతి పాలన తేవాలని బిజేపి కేంద్ర నాయకత్వం తహతహలాడుతోంది. కేజ్రివాల్ సరికొత్త ఎత్తుగడతో బిజేపి చతికిలపడిపోయింది. అంతే కాకుండా ఆమ్ ఆద్మీ నాయకురాలు అతీశీ మీద ఎలాంటి ఆరోపణలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బిజేపి ఆగమాగమౌతోంది. ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక కొత్త ఎత్తులు ఎలా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా డిల్లీని సొంతం చేసుకోవాలని పదేళ్ల నుంచి ఆరాటపడుతోంది. ఇప్పటికైనా ఆ అవకాశం దక్కుతుందనుకున్న ఆశలు ఆవిరి కావడంతో దిక్కులు చూస్తోంది.
-చిట్ ఎత్తినా నెలల తరబడి తిప్పించుకుంటాం..ఇది పాత మాట.
-చిట్టేసిన వాళ్లకు ఫ్లాట్లే ఇస్తాం..ఇది కొత్త మాట.
-ఇలా కూడా చీట్ చేస్తాం!
-హైడ్రా నుంచి తప్పించుకునేందుకు నయా వ్యాపారం!
-అమాయక కస్టమర్లను ఇలా కూడా ముంచేస్తాం.
-కస్టమర్లకు అమ్మేసి చేతులు దులిపేసుకుందాం.
-కేసుల నుంచి తప్పించుకుందాం..
-చిట్ అమౌంట్ ఇవ్వలేం…
-కావాలంటే ఫ్లాట్లు ఇస్తాం..
-చిట్ ఫండ్ వెంచర్ ఫ్లాట్లు అంటకడతాం?
-ఆలోచించుకోండి…మీ ఇష్టం!
-ఎలాగైనా వదిలించుకునేందుకు కొత్త ఎత్తుగడలు.
-అడ్డికి పావుసేరుకైనా అంటగట్టడమే!
హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా దెబ్బకు కొన్ని చిట్ఫండ్ కంపనీలు విలవిలలాడిపోతున్నాయి. చిట్ ఫండ్ సంస్ధల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైడ్రాకు చిట్పండ్ కంపనీలకు సంబంధం ఏమిటా? అన్న అనుమానం కల్గుతోందా? ఇక్కడే వుంది అసలు తిరకాసు. హైడ్రా తెరమీదకు రావడంతో చిట్ఫండ్ సంస్ధల మోసాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో చాల వరకు చిట్ ఫండ్ కంపనీలు రియల్ వ్యాపారం పెద్దఎత్తున చేశాయి. కొన్ని సంస్ధలు సంయుక్తంగా చేస్తే, కొన్ని పెద్ద సంస్ధలు సొంతంగా పెద్దఎత్తున రియల్ వ్యాపారం సాగించాయి. అయితే చిట్ ఫండ్ సంస్థలు పెట్టిన పెట్టుబడి మొత్తం చిట్ దారుల నుంచి వసూలు చేసిన డబ్బులే కావడం గమనార్హం. అయితే లోగుట్టులో కొన్ని ఆసక్తికరమైన అంశాలుంటాయి. గతంలో చిట్ఫండ్లు చిట్ వేసిన వారికాల పరిమిత పూర్తయిన తర్వాత వచ్చే ఎక మొత్తం సొమ్మును వారికి ఇవ్వకుండా వారిని ఒప్పించి, మెప్పించి, లేని పోని ఆశలు కల్పించి, అధిక వడ్డీ ఎర వేసి, ఆ సొమ్మును డిపాజిట్లు తిరిగి అవే సంస్ధలు తీసుకునేవి. చిట్స్ అండ్ ఫైనాన్స్ అనే లెక్కతో చిట్లు వేసిన వారిని పెద్దఎత్తున ప్రజల సొమ్మును డిపాజిట్లుగా మల్చుకునేవారు. అయితే కాల క్రమేనా ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి డిపాజిట్లకు అంగీకరించడం మానుకున్నారు. చిట్స్ అండ్ ఫైనాన్స్ల పేరుతో డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ తప్పుపట్టింది. వాటికి ఆ అర్హత లేదని తేల్చిచెప్పింది. దాంతో చిట్స్ కంపనీలు రియల్ వ్యాపారం బాట పట్టాయి. ఒక వేళ చిట్స్ నిబందనలు అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలుంటాయని హెచ్చరించింది. దాంతో కొత్త మార్గం వెతుకున్నారు. ఇంతలో తెలంగాణలోనే దేశ వ్యాప్తంగా రియల్ వ్యాపారం పెరిగింది. ఒక దశలో ఉచ్చ దశకు చేరుకున్నది. ఆ సందర్భంలో ఇదే చిట్టి దారుల నుంచి చిట్స్కు చేరే సొమ్ముతో నగర శివారుల్లో వుండే రైతుల భూములను తక్కువ ధరకు పెద్దఎత్తున సేకరించుకొని పెట్టుకున్నారు. ప్రజల సొమ్మంతా అక్కడ పెట్టుబడి పెట్టారు. భూమి మీద పెడితే ఎప్పటికైనా మేలుతోపాటు, మరింత లాభమే తప్ప నష్టం వుండదు. రూపాయికి వేయి రూపాయలు లాభం వస్తుందన్న బలమైన నమ్మకం కూడా వుంది. అందుకే తెలంగాణలో అసలు సాగుకు కూడా పనికి రావనుకున్న భూమలన్నీ నివాస యోగ్యాలుగా మార్చే వ్యాపారం పెద్దఎత్తున మొదలైంది. దాంతో అత్యాశకు పోయిన కొన్ని చిట్ ఫండ్ కంపనీలు భూములు కొనుగోలు చేయడం, ఖాతాదారులకు సొమ్ము ఇవ్వకుండా, స్ధిరాస్ధుల పేరుతో వారి వెంచర్లలో ప్లాట్లు అంటగట్టడం మొదలు పెట్టారు. డబ్బులు అత్యవసరమైన వాళ్లు తప్ప, మిగతా వాళ్లంతా ప్లాట్లకు చిట్స్నుంచి వచ్చే సొమ్ముకు అదనంగా మరింత జత చేసి మరీ ప్లాట్లు కొన్నవాళ్లు కొన్ని లక్షల మంది వున్నారు. అలా మూడు చిట్లు, ఆరు ప్లాట్లుగా సాగుతున్న వ్యాపారాన్ని మరింత మరింత విస్తరించుకోవాలన్న ఆశతో చిట్స్ కంపనీలు విచ్చలవిడిగా భూములు కొనుగోలు చేశారు. అందులో చెరువు భూములున్నాయి. శిఖం భూములున్నాయి. అసైండ్ భూములు కూడ వున్నాయి. చిట్స్ కంపనీలు రైతులనుంచి నేరుగా సేకరించిన భూములతోపాటు వాటికి ఆనుకొని వున్న అసైండ్ భూములు, శిఖం భూములును కూడా మింగేశారు. రెవిన్యూ అధికారులతో కలిసి, రిజిస్ట్రార్ల్ను మేనేజ్ చేసుకొని ఎకరాల కొద్ది భూములను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్లాట్లు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. అయితే ఇలా అమ్మగా చిట్స్ ఆస్ధులుగా భవిష్యత్తులో కూడా ఖాతాదారులు ముడిపెట్టేందుకు ఇంకా కొన్ని వేల ఎకరాల భూములు చిట్స్ కంపనీల చేతుల్లో వున్నాయి.
ఇప్పుడు అనుకోకుండా హైడ్రా వచ్చి పడిరది. ఏం చేయాలో పాలుపోని చిట్స్ కంపనీలు ఆ భూములను ఎలాగైనా వదిలించుకొని,ఖాతాదారులకు కట్టబెడుతున్నారు. ఒకప్పుడు రూపాయి కూడా తక్కువ ఇచ్చేది లేదంటూ చిట్స్ సొమ్ముకు తోడు లక్షలకు లక్షలు వసూలు చేసిన కంపనీలు ఇప్పుడు ఆ ప్లాట్లను అడ్డికిపావుసేరుకు అమ్మకాలు సాగిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగాలు సాగిస్తున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత నిజానికి రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని అందరూ అనుకున్నారు. కాని రిజిస్ట్రేషన్లు ఆగిపోలేదు. కారణం అమాయకులైన ప్రజలను ఇలా చిట్స్ కంపనీలు మోసం చేస్తున్నాయి. సహజంగా చిట్టి ఎత్తుకున్న తర్వాత ఏ ఖాతాదారుడికైన కంపనీలు మూడు నెలలలోపు ఆ సొమ్ము ఇవ్వదు. కొన్ని కంపనీలైతే అన్ని సక్రమంగా వున్నా ఆరు నెలలకు కూడా సొమ్ములు ఇవ్వవు. ఇలాంటి సమయంలో చిట్స్ కంపనీలు ఖాతాదారులను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తాదు. అందులో ప్లాట్ల దందా ఒకటి. అయితే ఇటీవల చిట్టిలు ఎత్తుకున్న వారికి సొమ్ము ఇవ్వడం కుదరని కంపనీలు తెల్చి చెబుతున్నాయి. కంపనీల్లో సొమ్ములేదని, ఆసొమ్మంతా ఖాతాదారుల మేలు కోసమే భూమి మీద పెట్టుబడి పెట్టామని నమ్మిస్తున్నారు. చిట్టిని బట్టి భూమిని కేటాయిస్తామే తప్ప, సొమ్ములు చేతుల్లో లేవని తేల్చిచెబుతున్నారు. దాంతో ఖాతాదారులు తప్పని పరిస్దితుల్లో ప్లాట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఆ భూములన్నీ అన్ని సక్రమంగానే వున్నట్లు మాయ చేస్తున్నారు. ఖాతాదారులను మభ్యపెడుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అలా చకచకా సాగుతున్న రిజిస్ట్రేషన్లలో అన్నీ ఇలాంటివే అన్న నిజాలు వెలుగు చూస్తున్నాయి. కంపనీల్లో సొమ్ము లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి! అని తెల్చి చెబుతుండడంతో, దిక్కు తోచక ఖాతాదారులు ప్లాట్లు తీసుకుంటున్నారు. కాని కొంత కాలానికి తాము పూర్తిగా మోసపోయామని తెలిస్తే వారి పరిస్ధితి ఏమిటన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఏటా కొన్ని వందల చిట్ కంపనీలు బోర్డులు తిప్పేస్తూనే వున్నా, ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని కొత్త కొత్త కంపనీలు పుట్టుకొస్తూనే వున్నాయి. వ్యాపారం విస్తరించుకుంటూనే వున్నాయి. ఖాతాదారులు సొమ్ముతో రియల్ వ్యాపారం సాగిస్తూనే వున్నాయి. అయితే గతం వేరు. ఇప్పుడు వేరు. గతంలో ఖాతాదారులకు చిట్స్ కంపనీలు అంట గట్టిన ప్లాట్లలో కూడా ఏవి నిజమైనవి? ఏవి చెరువుల్లో వున్నవి అన్నవి కూడా కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇప్పటికే మోసపోయిన వాళ్లు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది వున్నారు. ఇంత జరుగుతున్నా చిట్స్ కంపనీలు ఇంకా మోసం చేస్తూనే వున్నాయి. ప్రభుత్వం వెంటనే మేలుకొని ఇలాంటి మోసాలపై ప్రజలను అప్రమత్తంగా వుండాలని హెచ్చరించాల్సిన అవసరం వుంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత వుంది. లేకుంటే ప్రజలు ఇంకా నష్టపోవాల్సివుంటుంది. తర్వాత బుల్లోజర్లు వచ్చి, ప్లాట్లు స్వాదీనం చేసుకుంటే ప్రజలు లబోదిబోమనక తప్పదు. అయితే వున్న భూములను ఇప్పుడే అమ్మేస్తే తమకు చేతులకు మట్టి అంట కుండా వుంటుంది. కేసుల బారిన పడుకుండా జాగ్రత్తపడొచ్చని చిట్స్ కంపనీలు ఈ ఎత్తుగడ వేశాయి. ఒక వేళ హైడ్రా ఆ భూములను ఇప్పుడే స్వాధీనం చేసుకుంటే చిట్స్ వ్యాపారాలు కుప్పకూలిపోతాయి.
పైగా భూమ్మీద పెట్టిన సొమ్ముంతా చెరువు పాలౌతుంది. ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ములేదని చేతులెత్తేయాల్సి వస్తుంది. అయితే ప్రజల సొమ్ముతో అక్రమ వ్యాపారం చేసినందుకు కేసులు ఎదుర్కొవాల్సి వస్తుంది. చిట్స్ వ్యాపారంలో మోసపోయామంటే చెల్లుతుంది. కాని ఖాతాదారుల అనుమతి లేకుండా వారి సొమ్ము వారికి తెలియకుండా భూ వ్యాపారం చేసి లాభాలు గడిరచి, ఇప్పుడు నష్టపోయామని చెబితే చట్టం నమ్మదు. న్యాయస్ధానం ఒప్పుకోదు. ఇలాంటి కేసుల్లో ఐపి పెట్టడానికి కూడా అవకాశం వుండదు. అక్రమంగా అసైండ్ భూములు కొనుగోలు చేయడం నేరమని తెలిసి ఎలా కొనుగోలు చేశారన్నది తెరమీదకు వస్తుంది. ఏ రకంగా చూసినా చిట్స్ వ్యాపారులకు ముందునుయ్యి, వెనకు గొయ్యిగా మారుతుంది. ఆ ఉప ద్రవం నుంచి తప్పించుకోవడానికి గుట్టు చప్పుడు కాకుండా, అమాయకులైన ఖాతాదారులకు చిట్స్ కంపనీలు కుచ్చు టోపి పెడుతున్నారు. హైడ్రా వచ్చినప్పుడు వాళ్లే ఎదురుతిరుగుతారు. అంతే కాకుండా హైడ్రాకు ఎదురు తిరిగితే కేసులు నమోదు చేస్తారని భయపడి సైలెంటుగా వుంటారు. ఏది జరిగినా మళ్లీ చిట్ కంపనీలకే లాభం… అందుకే చిట్స్ కంపనీలు ఈ దురాగతానికి ఒడిగట్టాయి. ప్రజలారా..తొందరపడి చిట్ కంపనీలు అగ్గువకు ప్లాట్లు ఇస్తున్నారని మోసం పోకండి. వాటిని తీసుకోకండి.
రవి ముదిరాజ్ ఆహ్వానం మేరకు బెంగళూరు చేరుకున్న ఎం ఎల్ ఏ రాజగోపాల్ రెడ్డి
నేటిధాత్రి,బెంగళూరు :
తన వ్యక్తిగత పనులపై బెంగళూరు వెళ్ళిన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నీ బెంగళూరులోని తన నివాసంలో ఆతిథ్యం స్వీకరించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ – స్వరూప రాణి (మునుగోడు మాజీ జడ్పీటీసీ). రాజగోపాల్ రెడ్డి ని కోరారు అందుకు రాజగోపాల్ రెడ్డి వారి ఆహ్వానం మేరకు ఈరోజు రవి ముదిరాజ్ నివాసానికి వెళ్లారు
తమ నివాసానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే కి పుష్పగుచ్చం అందజేసి తమ సహచర మిత్రులతో కలిసి స్వాగతం పలికిన నారబోయిన రవి స్వరూప ముదిరాజ్ దంపతులు..
ఆపరేషన్ పోలో అమరవీరులకు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు జోహార్లతో
భారత ప్రభుత్వానికి లొంగిపోయిన నిజాం రాజు తద్వారా విలీనం
నిజాం ప్రభువుకు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం వలన ఈ ప్రాంతం విలీనం అయినది, ప్రజలకు విమోచనం జరిగింది
భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో తో తెలంగాణ ప్రజల మానప్రాణాలను తీయడం విద్రోహం
ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది
భారతదేశమంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నిజాం రాజు చేతిలో బందీగా ఉంది. భారతదేశమంతా స్వతంత్ర పోరాటం చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం ఎంచుకొని నిజాం ప్రభువుకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రతిఘటనలు చేస్తూ పోరాటం ముందుకు సాగించారు. ఆగస్టు 15 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం ప్రభువు చేతిలో ఇంకా బందీగా ఉంది, యావత్ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తుంటే తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు నిజాం నిరంకుషానికి బలైపోతూనే ఉన్నారు, ఒకవైపు సాయుధ పోరాటం వల్ల నిజాం రాజుకు ముచ్చమటలు పటిస్తున్న తెలంగాణ ప్రజలు , రజాకార్లను, దేశ్ ముఖులను ఊర్ల నుండి తరిమికొడుతుంటే, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా వెళుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో సాయుధ పోరాట ప్రభావం చూపెడుతుందని భావించిన భారత ప్రభుత్వం ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి మిలటరీతో తెలంగాణ ప్రాంతమైనటువంటి హైదరాబాదు స్టేట్ ని భారత దేశంలో కలుపుకునేందుకు నిజాం రాజు పై దండయాత్ర చేయడం జరిగింది అలా తీసుకున్న చర్యనే ఆపరేషన్ పోలోగా ఆనాటి భారత ప్రభుత్వం చెబుతుంది. భారత దేశ మిల్ట్రీ హైదరాబాద్ స్టేట్ లో అడుగుపెట్టి నిజాం రాజుకు వ్యతిరేకంగా రజాకారులతో ప్రత్యక్ష యుద్ధం లో దిగారు ఇలా కొన్ని రోజులు సాగినటువంటి ఆపరేషన్ పోలో కి తలోగ్గిన నిజాం ప్రభువు భారత దేశ హోం శాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆనాటి భారత దేశ ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటం, ఇక్కడ ప్రజల చైతన్యాన్ని గమనించి ఈ చైతన్యమంతా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కచ్చితంగా వ్యాపిస్తుందని దాని ప్రభావం యావత్ భారతదేశంపై పడుతుందని దానివల్ల భారతదేశం అంతా కూడా కమ్యూనిస్టు దేశంగా మారే అవకాశం ఉందని గ్రహించి ఆపరేషన్ పోలోను చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ పోలో ముసుగులో రజాకారులను, సామాన్యులను, ఒక వర్గ ప్రజలను మరియు సాయుధ పోరాటం వీరులను అంతం చేయడం జరిగింది. మరోవైపు చరిత్రకారుల పుస్తకాల్లో తెలంగాణ ప్రజల మానప్రాణాలను ఆపరేషన్ పోలో ముసుగులో దోచేశారని, కుప్పల కొద్దీ శవాలు విలిన తర్వాత బయటపడ్డాయని అనేకమంది మహిళలు మానాలు కోల్పోయారని చరిత్రకారుల పుస్తకాల్లో లిఖించబడ్డాయ, అందుకనే కమ్యూనిస్టులు ఈ రోజును విద్రోహ దినంగా ప్రకటించాయి, మరోవైపు భారతదేశం దీన్ని విలీనం ప్రక్రియగా ప్రకటించి ఇక్కడి ప్రజలను నిజాం నిరంకుశ పాల నుండి విమోచనం చేశామని ప్రకటించడం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 యొక్క ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఈ రోజును ఒక ప్రత్యేక దినంగా తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా ఆపరేషన్ పోలో అమరవీరులకు, సాయుధ పోరాట అమరవీరులకు ఇక్కడ ప్రజల త్యాగాలకు గుర్తుగా ఈ రోజును జరుపుకాకుండా, చరిత్రను చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర పెత్తందారులు , ఆనాటి ముఖ్యమంత్రులు ఇలా చరిత్ర కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంటే ఇక్కడి ప్రజలు చైతన్యవంతమై 1969లో విద్యార్థి ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మా హక్కులను మేము కాపాడుకుంటామని పోరాటం చేశారు ఆనాడు వందలాదిమంది విద్యార్థుల ప్రాణాలను బలికున్నారు ఆంధ్ర పెత్తందార , ముఖ్యమంత్రులు. ఆ తర్వాత తెలంగాణ వాదం కొన్ని రోజులు మరుగునపడిన 2001 తర్వాత అది రాజకీయ ఉనికిని పుచ్చుకొని మరో ఉద్యమంగా మారింది అలా సాగుతున్న ప్రయాణంలో 2009లో ఉద్యమం ఉధృతంగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగింది వేలాదిమంది ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ప్రపంచ చరిత్రలో త్యాగాలు చేసిన వీరులను చూశారు కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరులను తెలంగాణ ప్రాంతంలోని చూశాను, ఎందుకంటే ఒకవైపు భారత దేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పైన చేస్తున్నటువంటి అణచివేతను తీవ్రంగా ప్రతిఘటిస్తూన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను చూసి కొంతమంది వారి ఆత్మ బలిదానాలు వలన చలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాలు ప్రకటిస్తాయి అనుకున్నారు, అలా చాలా మంది అమరులయ్యారు అలా అమరులైన ప్రతి అమరుడికి జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ అస్తిత్వ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు చివరిగా వివిధ పార్టీలు సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించిన అధికారికంగా సెప్టెంబర్ 17న ఇంతవరకు నిర్వహించలేదు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం గా ప్రకటించి అధికారికంగా నిర్వహించబోతోంది దానికి తెలంగాణ ప్రజల తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ దినోత్సవం రోజున ముందుగా సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమం, మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వీరులకు, ఆపరేషన్ పోలో అమరులైనటువంటి అమాయక ప్రజలకు, వీరులకు శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాలకు సరైన న్యాయం చేసి, ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారి త్యాగాలకు తగిన గుర్తింపుని ఇవ్వాలని వారికి ఉద్యమకారుల పెన్షన్లతో గౌరవించాలని ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల్లో ఇళ్లను కట్టించి ఇవ్వాలని అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పెషల్ కోటను ప్రకటించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రభుత్వానికి ఉద్యమకారుల తరఫున కోరుకుంటున్నాం. ఏదేమైనాప్పటికీ చరిత్రలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం ఇక్కడ ఆధిపత్య కులాలు మరియు ఆంధ్ర పెత్తందారులు ముఖ్యమంత్రులు చేసి, అమరవీరుల అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేయడం దుర్మార్గమని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మన చరిత్రను ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా పుస్తకాలను రూపొందించి దేశ, విదేశాలకు తెలంగాణ చరిత్రను వ్యాప్తి చెందేలా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
ఆర్టికల్ రాసింది: తాడిశెట్టి క్రాంతి కుమార్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు, హనుమకొండ జిల్లా జేఏసీ కన్వీనర్, తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం కన్వీనర్, వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కంటెస్టెడ్ కాండేట్
– జిల్లాలోని యువత డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు కావాలి. మైనంపల్లి….
– వైద్యా కళాశాల అనుభవిజ్ఞులైన వైద్యాధికారులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…..
– దీని వెనుక విశేష కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమాత్యులు దామోదర్ రాజనర్సింహ….
– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెడికల్ యంత్రాంగానికి ధన్యవాదాలు…..
– మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు…..
కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-
బుధవారం మెదక్ మెడికల్ కలశాల మంజూరి సందర్బంగా పీళ్ళికొటాలలో ఉన్న తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించరు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించనున్న శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ రాహుల్ తో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భావనాలను, సమకూర్చిన, ఫర్నిచర్, పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలోనే మెడికల్ కాలేజీ మంజూరు అయిందన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ వైద్య విద్యకు న్యాయం చేసిన వేళ జిల్లాలో యువత ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారయ్యే వేల ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మెదక్ మెడికల్ కాలేజ్ మంజూరి చేసినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు జిల్లా కలెక్టర్ కు, అధికారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్ కళాశాల,మెడికల్ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు. జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం పీళ్ళికొటాలలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కళాశాల భూమిని శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ పరిశీలించి భవన నిర్మాణాలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజనలో భాగంగా మెదక్ ప్రత్యేక జిల్లా అయినా కూడా అంత అభివృద్ధి చెందలేదని జిల్లా అభివృద్ధిలో విద్యా ,వైద్యం సౌకర్యాలు మెరుగు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు వైద్య కళాశాల మంజూరు కావడం దీని వెనక విశేష కృషి చేసిన జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు, హెల్త్ సెక్రెటరీ , ధన్యవాదాలు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యాధికారులు ఉండడం స్థానికంగా ఉండి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మెడికల్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అంతకుముందు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు రాందాస్ చౌరస్తాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శివ దయాల్, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వార్డ్ కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ అధికారులు , మెడికల్ కళాశాల సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
`ఇలాంటి మోసగాళ్ల వల్ల కుల వృత్తి వదలి కూలీ చేసుకుంటున్నారు.
`బంగారం దుకాణాల పేరుతో తెలంగాణ కులవృత్తి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.
`కంసాలీలంతా ఏకమైతే ఇలాంటి మోసగాళ్లను తరిమేడం పెద్ద లెక్క కాదు!
`ప్రజలారా! తస్మాత్ జాగ్రత్త!
హైదరాబాద్,నేటిధాత్రి:
తియ్యని మాటల వెనుక చేదుగుళికలుంటాయి. నవ్వుతూ మాట్లాడే మాటల వెనుక గోతులుంటాయంటారు. లలిత జ్యూవెర్లర్ అధినేత చెప్పే మాటల్లో కూడా నిజం ఆవగింజంత కూడా లేదని తెలుస్తోంది? డబ్బులు ఊరికే రావు అంటూ ఆయన ఇచ్చే బంగారంలో స్వచ్ఛత ఎంత అన్నదానిపై స్పష్టత ఎవరివ్వాలి? ప్రకటనలు ఇస్తున్నారు కదా? అని మీడియా కూడా నిజనిజాలు నిగ్గు లేల్చకపోవడం బాదాకరం. ప్రభుత్వాలు కూడా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే పేరుతో దోపిడీ దారులకు కొమ్ము కాయడం కూడా సరైంది కాదు. సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత స్ధాయి వరకు ప్రతి వ్యక్తి ప్రతి వస్తువుకు జిఎస్టీ చెల్లిస్తున్నారు. సంపన్నులు, ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయంకు పైబడి వున్న వారంతా ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు. అయితే ఎంత మంది వ్యాపారులు డబ్బులు ఎగవేత దారుల్లో వున్నారో తెలియంది కాదు. వ్యాపారం పేరుతో ఏ వ్యక్తి తన సొంత సంపాదనలను పెట్టుబడులుగా పెట్టరు. అది చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైన సరే బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటారు. దాంతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంటారు. సహజంగా బ్యాంకులో పది లక్షలు వుంటేనే ఇన్కమ్ ట్యాక్స్ అదికారులు నోటీసులు ఇస్తున్న ఈ సమయంలో వేల కోట్ల ఆదాయాలున్నవారు, పన్నులు ఎగ్గొడుతుంటే చూస్తూ వుంటున్నారని చెప్పడానికి లలిత జెవెల్లరీ షాపులే నిదర్శనం. ప్రజల నుంచి జీఎస్టీ రూపంలో వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి చెల్లించకుండా, మోసం చేయడం, వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి, వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం అలవాటు చేసుకుంటున్నారు. మాటలు మాత్రం ఈ అదినేత చాలా గొప్పగా చెబుతుంటారు. అయితే ఇటీవల విజయవాడ నీట మునిగింది. ప్రజలకు సహాయసహాకారాల కోసం లలిత జెవెల్లర్స్ అధినేత కిరణ్కుమార్ కోటి రూపాయలు ప్రభుత్వానికి అందజేశారు. కాని అందులో టాక్స్ బెనిఫిట్స్ దాగి వుంటాయన్న సంగతి సామాన్యులకు తెలియదు. కాని విరాళం ఇస్తూనే మరో వైపు ప్రచారాస్త్రంగా దానిని వాడుకున్నాడు.. ప్రజల మీద అత్యంత ప్రేమను చూపించినట్లు నటిస్తుంటాడు. సహజంగా ఏ బంగారం దుకాణంలోనైనా ఇంతకు ముందు ప్రజలు కొనుగోలు చేస్తే దానిపై సదరు ప్రాంత వ్యక్తులపై అత్యంత నమ్మకం వుండేది. ఆ బంగారం అవసరం మేరకు అమ్మకాలు చేసుకున్నా, తిరిగి డబ్బు చేతికి వచ్చేది. ఎప్పుడైతే లలిత జెవెల్లర్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో బంగారు నగల వ్యాపారం మొదలు పెట్టారో అప్పటి నుంచి కంసాలి వృత్తి దారులకు తీరని నష్టం ఎదురౌతోంది. ఇలాంటి సంస్ధల మూలంగా తెలంగాణలో కంసాలి కుల వృత్తిని తరరాలుగా నమ్ముకున్న వాళ్లంతా కూలీలుగా మారిపోయారు. వారి వృత్తిని కోల్పోయి రోడ్డున పడ్డారు. బంగారు నగల వ్యాపారుల ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల మోడళ్ల పేరుతో తయారు చేసే నగలలో ఎంత నాణ్యత అన్నది చెప్పడం కష్టం. గతంలో సోమాజిగూడ లలిత షోరూంలో నాణ్యత లేని బంగారం విక్రయించినట్లు కూడా పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. కాని ఆ కేసు ఏమైందన్నది ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద వ్యాపార సంస్ధలు ఇలా మోసాలు చేసినా, బైటకు రావు.
తాను మాత్రం చేతిలో కనీసం గ్రాము బంగారు వస్తువు కూడా ధరించరు. కాని ప్రజల చేత బంగారం కొనుగోలు చేయండి. అంటూ నిత్యం వ్యాపార ప్రకటనలతో కిరణ్కుమార్ ఊదరగొడుతుంటాడు. బంగారాన్ని ప్రజలకు పెట్టుబడిగా ప్రచారం చేస్తాడు. బంగారం ధర తగ్గిందని కొనుగోలు చేయంటాడు. బంగారం కిలో కోటి రూపాయలకు చేరుతుందని భయపెడుతుంటాడు. బంగారం ధర నిర్ణయించేది ప్రభుత్వం. కాని ఎప్పటిప్పుడు యూట్యూట్ ఛానళ్లకు వచ్చి, బంగారం ఎందుకు కొనాలి? బంగారం మీద ప్రజలు ఎలా పెట్టుబడి పెట్టాలి? బంగారం భవిష్యత్తులో ఎలా పెరుగుతుంది? అంటూ చెప్పి ప్రజలకు ఆశలు కల్పిసాడు. సహజంగా ఇంట్లో రూపాయి వుంటే దానిని పొదుపు చేసుకువారిని బంగారం కొనుగోలు వైపు ఆలోచనలు మళ్లిస్తాడు. గతంలో కూడా అనేక బంగారు దుకాణాలు వున్నాయి. కాని వాటి యజమానులు ఇలా ప్రజలను మభ్యపెట్టేలా స్వయంగా వాళ్లే ప్రచారం చేసుకోలేదు. తమ సంస్దల ప్రకటనలు మాత్రమే చేసుకుంటారు. కాని ఒక్క లలిత జెవెల్లర్స్ అధినేత మాత్రమే బంగారంపై నిత్యం ప్రజల్లో భ్రమలు కల్పిస్తారు. ప్రజలను బురిడీ కొట్టిస్తాడు. బంగారంపై లేని పోని ప్రకనటలు చేస్తుంటాడు. కేవలం తన వ్యాపారం కోసం ప్రజలకు మాయ మాటలు చెబుతుంటాడు. వ్యాపార పరంగా తన సంస్ధలో బంగారం కొనుగోలు చేయమని చెప్పడం ఒక పద్దతి. కాని ఆయన మాత్రం మా షాపులో మాత్రమే ఎందుకు కొనాలో అంటూ లేని పోని అపోహలు సృష్టిస్తాడు. నిజానికి బంగారంలో ఎంత ఇతర ఇతర లోహాలు కలుపుతారో అందరికీ తెలుసు. కాని వన్ గ్రామ్ బంగారు నగల పేరుతో లలిత జువెల్లర్స్ చేస్తున్న మోసాలపై ప్రజలు అప్పట్లో బాగానే నిలదీశారు. పేరుకు వన్ గ్రామ్ అంటూ అమ్మే వస్తువులు భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఉపయోగం వుండదు.
సంపన్నులు ఒకేసారి ఎంత బంగారం కొన్నా వ్యాపారులకు లాభాలు వుండవు. కాని వన్ గ్రామ్ పేరుతో పెద్దఎత్తున బంగారు నగలపై ఆశలు కల్పించి అమ్మకాలు సాగించడం వ్యాపారంలో పెద్ద మోసం. మహిళలకు సహజంగా బంగారం అంటే ఎంతో ఇష్టం. అయితే సామాన్యులు తులం బంగారం కొనుగోలు చేయాలంటే ఈ రోజుల్లో సాద్యం కాదు. దాంతో వారికి బంగారం మీద ఆశలు తీరక జీవితంలో ఏదో వెలితితో వుంటారు. అలాంటి వారిని పెద్దఎత్తున ఆకర్షించి వన్ గ్రామ్ బంగారం పేరుతో నగల తయారు చేయించి, అమ్మకాలు సాగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తులం బంగారు నగలనే కరిగిస్తే వచ్చేది ఎంతో ప్రజలందకీ తెలుసు. నగల్లో తరుగు ఎంత పోతుందో తెలియంది కాదు. పెద్దపెద్ద షాపులు ఏర్పాటు చేసుకొని, రంగురంగుల లైట్లు, అంతస్ధుల మేడల్లో బంగారుదుకాణాలు పెట్టుకునేవారు వన్ గ్రామ్ బంగారు నగలు ఎందుకు అమ్ముతున్నారన్నది ఎవరూ ఆలోచించడం లేదు. పది వేలు పెట్టి వన్ గ్రామ్ బంగారు నగ కొనుగోలు చేస్తే వచ్చే లాభం ఏమీవుండదు. ఏదైనా అసరం కోసం ఆ నగ తాకట్టు పెడదామన్నా ఎవరూ తీసుకోరు. అదే సంస్ద ఆ నగను తీసుకొని డబ్బులు ఇవ్వదు. అంటే డబ్బులు ఊరికే రావంటూ ఊదరగొట్టి జనం సొమ్మును లూటీ చేయడం తప్ప ఏమీ వుండదు. ఇందులో వున్న మర్మం తెలియన వాళ్లు చాలా మంది మోస పోతున్నారు. ఇది వరకు రోల్డ్ గోల్డ్ నగలు తక్కువ ధరకు ఖరీదు చేసుకునే మహిళలు వన్ గ్రామ్ బంగారం కోసం అప్పులు చేసి మరీ కొనుగోలు చేసుకుంటున్నారు. బంగారం ధరలు పెరుగుతున్నాయంటే ఎగబడి కొంటున్నారు. అసలు సిసలైన బంగారం షాపుల్లో వన్ గ్రామ్ బంగారు నగలు అందుబాటులో వుండవు. సామాన్యులకు సైతం బంగారు నగలు అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రచారం చేసుకునే షాపుల్లో మాత్రమే ఇలాంటి మోసాలు పెద్దఎత్తున జరుగుతుంటాయి. బంగారం పేరుతో షాపులోకి వచ్చిన వారెవరూ తిరిగి డబ్బులతో ఇంటికి వెళ్లకుండా వారి జేబులు ఖాళీ చేయించడంలో లలిత జువెల్లరీ ఆరితేరిపోయింది. అందుకే ఊరికో షాపు వెలుస్తోంది. కొన్ని దశాబ్థాలుగా బం గారం వ్యాపారం చేస్తున్న పెద్ద సెద్ద సంస్థలు కూడా ఇన్నిన్ని షాపులను ఎందుకు ఏర్పాటు చేయలేపోతున్నాయి. ఒకసారి బంగారు వస్తువు వన్ గ్రామ్పేరతో కొనుగోలు చేసిన వాళ్లు మోసపోయామని షాపుకు వచ్చి చెప్పుకున్నా, ఇంత కాలం పెట్టుకోవడం వల్ల అరిగిపోయింది. తరిగిపోయిందని సమాదానం చెప్పే అవకాశం లతిత జెవెల్లర్స్లో వుంటుంది. అందుకే ప్రజలను డబ్బులు ఊరికే రావంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. షాపుల మీద షాపులు పెంచుకుంటూ పోతున్నాడు. మరో వైపు ప్రభుత్వానికి జిఎస్సీలు ఎగ్గొడుతున్నాడు. ఏ వ్యాపారం చేసినా సామాన్యులే టార్గెట్గా సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సరిగ్గా ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా ఇలాంటి బరితెగించిన వ్యాపారం ఎక్కడా లేదు. మరి ప్రజలు ఇప్పటికన్నా పాత కాలంలోనే ఎక్కువ బంగారు నగలు విరివిగా వాడుకునేవారు. ప్రతి మహిళ మెడలో బంగారుగుండ్లు వుండేవి. కాని ఇలాంటి వ్యాపారుల మూలంగా కంసాలిలు మునిగిపోయారు. ప్రజలు మోసపోతున్నారు. వ్యాపారులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. అందర్ని బురిడీ కొట్టిస్తున్నారు.
కేసీఆర్ గారు ప్రధాని అవుతారు,అందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి:ఎంపీ రవిచంద్ర
కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుంది:ఎంపీ రవిచంద్ర
కేసీఆర్ గారు తెలంగాణను నంబర్ 1రాష్ట్రంగా తీర్చిదిద్దారు:ఎంపీ రవిచంద్ర
ఇల్లందు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదింది:ఎంపీ రవిచంద్ర
ఇంఛార్జిగా పెత్తనం చేసేందుకు రాలే, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అందరిని సమన్వయం చేస్త:ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా మొట్టమొదటి సారి ఇల్లందు విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు అపూర్వ స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు
లోకసభ సభ్యులు కవిత, ఎమ్మెల్యే హరిప్రియల నాయకత్వంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దేశ ప్రధాని అవుతారని,అందుకు కావలసిన అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.కేసీఆర్ గారికి సుదీర్ఘ పాలనానుభవం,దక్షత,అన్ని అంశాలపై లోతైన అవగాహన, వక్తృత్వం, సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమితులయ్యాక సోమవారం మొట్టమొదటి ఇల్లందుకు విచ్చేశారు.ఈ సందర్భంగా ఆయనకు లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తదితరుల నాయకత్వంలో అపూర్వ స్వాగతం లభించింది.డప్పువాయిద్యాలు, లంబాడ,కోయ నృత్యాలు,కోలాటం, పటాకులు కాల్చుతూ రవిచంద్రకు ఘన స్వాగతం పలికారు, గజమాలతో సత్కరించారు.ఎంపీ వద్దిరాజు ఇల్లందులో మొదట అభన్నాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాక,యువతను,కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ 3కిలోమీటర్లు వడివడిగా నడిచారు.పోలీసుస్టేషన్ చేరుకున్నాక ప్రచారరథమెక్కి చౌఈ గులాబీ శ్రేణులు,ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.రానున్న ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.అటుతర్వాత ఆయన దేశ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి,పట్టు సాధిస్తారని,కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు.కాలం కలిసివస్తే కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారని రవిచంద్ర వివరించారు.అనితర సాధ్యం అనుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించిన కేసీఆర్ గారు గొప్ప నాయకులని, బంగారు తెలంగాణగా,దేశం మొత్తం మీద నంబర్ 1గా తీర్చిదిద్దారని కొనియాడారు.ఈ సింగరేణి గడ్డ తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ఊపిరులూదిందని,మలి దశ పోరాటంలో అగ్రభాగాన నిలిచిందన్నారు.ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన నాయకుడిని కేసీఆర్ గారు చేరదీసి జెడ్పీ ఛైర్మన్ పదవి కట్టబెడితే డబ్బు సంచులకు అమ్ముడుపోయాడని,వారి ఆటలు సాగనివ్వమని రవిచంద్ర స్పష్టం చేశారు.తానిక్కడకు పెత్తనం చేసేందుకు రాలేదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గులాబీ శ్రేణులను సమన్వయం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పంపితే వచ్చానన్నారు.రానున్న ఎన్నికల్లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియల అఖండ విజయం తథ్యమన్నారు.ఇందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు.ఎంపీ రవిచంద్ర ఆగమనం సందర్భంగా ఇల్లందు పట్టణంతో పాటు నియోజకవర్గమంతా గులాబీమయమైంది.గులాబీ తోరణాలు,జెండాలు,ఫ్లైక్సీలు, హోర్డింగులతో ఇల్లందు నూతన శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”, “జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి” అనే నినాదాలు హోరెత్తాయి.
దాంతో దివ్యాంగుల సంస్థ స్పందించింది. శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి లు శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ అందజేశారు. ఆమె కళ్లలో ఆనందం నింపారు. దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపుతున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ దివ్యాంగుల జీవితాలకు భరోసా నింపారు. వారికి రెండు సార్లు పెన్షన్ పెంచారు. ఇటీవలే మరో వెయ్యి రూపాయల పించన్ పెంచడం జరిగింది. అంతే కాకుండా దివ్యాంగులకు స్కూటర్లు, ట్రై సైకిళ్ళు, బ్యాటరీ సైకిళ్ళు అందించడం జరుగుతోంది. వారికి ఉపాధి కల్పన కోసం కూడా సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నేటిధాత్రి దినపత్రిక లో వార్తను చూసిన రోజే స్పందించడం జరిగిందన్నారు. అయితే శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానిని సరికొత్తగా రూపకల్పన చేసి, ఈ రోజు బ్యాటరీ ట్రై సైకిల్ అందజేయడం ఆనందంగా వుందన్నారు. త్వరలోనే శ్రీలతకు అవసరమైన ఆర్థిక సహాయం సబ్సిడీ రుణం కూడా అందిస్తామని చెప్పారు.
నేటిధాత్రి కి శ్రీలత కృతజ్ఞతలు: తన దీన స్థితిని ఎవరూ పట్టించుకోకపోయినా, నేటిధాత్రి దినపత్రిక ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు, వారి జర్నలిస్టు బృందం తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నని చెప్పింది. మీడియా అంటే ఇంత కాలం వార్తలే అనుకున్నాను కానీ జీవితాలు నిలబెట్టేది అని అర్థమైందని శ్రీలత చెప్పారు. నన్ను ఎంతో మంది చూసి జాలి పడ్డారు. అయ్యో అన్నారే గాని ఆదుకోవాలన్న ఆలోచన చేయలేదు. కేవలం సామాజిక బాధ్యతతో తనేవరో తెలియని నేటిధాత్రి తన జీవితానికి వెలుగు వచ్చేలా చేసింది. అంతే కాకుండా తన ధీన గాథకు స్పందించి అదుకున్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి లకు జీవితాంతం రుణపడి వుంటానని చెప్పింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.