కంప్యూటర్ సైన్స్ విభాగంలో పరిశోధనకు.!

కంప్యూటర్ సైన్స్ విభాగంలో పరిశోధనకు శ్రవణ కుమారికి డాక్టరేట్

నేటిధాత్రి:

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (ఆటనామస్) కంప్యూటర్ సైన్స్ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న కుడికాల శ్రవణ కుమారికి కాకతీయ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.బి. మంజుల గారి పర్యవేక్షణలో పరిశోధన గ్రంధం సమర్పించిందుకు గాను కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ట రాజేందర్ డాక్టరేట్ ప్రకటించారు. డాక్టరేట్ సాధించిన వీరిని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హన్మకొండ ప్రిన్సిపాల్ కె. రజనీలత మరియు అధ్యాపకులు అభినందించారు. తన పిహెడి పరిశోధన సాధనలో ఎల్ల వేళల సహాయ సహకారం అందించిన సూపర్వైజర్, అధ్యాపక బృందానికి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. 

పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం.

జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం:

 

నేటిధాత్రి

 

 

 

 

తేదీ: 21-04-2025 నాడు జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ఆధునికరణ కొరకై పాఠశాల పూర్వ విద్యార్థి గుండేటి ప్రసాద్ మమత దంపతులు గారు విరాళాలు అందజేయడం జరిగినది. ఇట్టి కంప్యూటర్ గదిని వారి తల్లి గారైన గుండేటి గంగుబాయి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎం అర్జున్ గారు మాట్లాడుతూ నేటి యుగంలో పిల్లలకు తప్పనిసరిగా కంప్యూటర్ విద్యపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి కంప్యూటర్ గది ఆధుని కొరకు సహకరించిన గుండేటి రాజేంద్రప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. బోగోరి గంగాధర్ లక్ష్మీ నర్సు, ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశం, పి దరందీప్, పి శశిధర్, డి ఏడుకొండలు, జి అశోక్ ,రాజ్యలక్ష్మి, లక్ష్మి, ఉమాదేవి, నీలిమ, షాహినా, రవీందర్, సుమన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version