అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ కే ఓటేయాలి…

అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ కే ఓటేయాలి : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

* అలియాబాద్ మున్సిపల్ లో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున సోమవారం మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఇంటి ఇంటి కి వెళ్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని ఓటర్ లను కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు బండి లక్ష్మీ రాంరెడ్డి, తూము యమున శ్యామ్, తంటం నర్సింహా, సగ్గు శ్రీనివాస్ యాదవ్, కుమార్ యాదవ్, ముద్దం మధుసూదన్ రెడ్డి, బోయిన రాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి…

ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి

ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు సైలెన్స్ డేగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
తెలిపారు. ఈ సమయంలో స్థానికేతరులు, ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, కాలనీలు వార్డుల్లో సంచరించరాదని సూచించారు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులతో ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.జిల్లావ్యవ పరిశీలకుల తనిఖీ…..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.జిల్లావ్యవ పరిశీలకుల తనిఖీ…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాడు జిల్లావ్యయ పరిశీ లకుల ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఏర్పాటుచేసిన ఎస్ .ఎస్. టి .చెక్పోస్ట్ ను పరిశీలించి. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకుని సిరిసిల్ల సిద్దిపేట దారి పైన వచ్చి పోయే వాహనాలను చెక్ చేస్తూ ఎన్నికల నియమాలు ప్రకారం ఎటువంటి. మండలంలో ప్రజలను ఎటువంటిప్రబోభాలకు గురికాకుండా చూసుకుంటూ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఏదైనా తనిఖీల్లో భాగంగా అనుమానం ఉన్నచో సంబంధిత వాహనాల గురించి అందులో ప్రయాణిస్తున్న వారిపై ఏమైనా అనుమానం వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిఘాపై కఠినంగాతగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అలాగే. తంగళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయం పరిశీలిస్తూ మండలంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందా అనేదానిపై ఎంపీడీవో లక్ష్మి రాజ్యమును రిటర్న్ అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో. ఎన్నికల జిల్లా వ్యాయ. పరిశీలకులు రాజ్ కుమార్. నోడల్ అధికారి నవీన్. భారతి. ఎంపీడీవో లక్ష్మీనారాయణ. ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జైపూర్ పోలింగ్ కేంద్రాల్లో డీసీపీ భాస్కర్ పర్యటన

ఎన్నికల పోలింగ్ స్టేషన్లను సందర్శించిన డీసీపీ భాస్కర్

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం లోని నర్వ,శివ్వారం గ్రామ పంచాయతీల పోలింగ్ స్టేషన్లను డీసీపీ భాస్కర్ శుక్రవారం సందర్శించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అనర్ధాలకు దారి తీయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని,ప్రజలు ప్రశాంతత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం జైపూర్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్,భీమారం,శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎన్నికలలో పాటించవలసిన నియమ నిబంధన గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వరరావు,జైపూర్ సిఐ నవీన్ కుమార్,శ్రీరాంపూర్ సిఐ శ్రీలత,జైపూర్ ఎస్సై శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, ఎస్సై లక్ష్మీ ప్రసన్న,భీమారం ఎస్సై శ్వేత ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, తహసిల్దార్ వనజా రెడ్డి ఎంపీఓ బాపూరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version