అమ్మవార్లను దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ కుటుంబం

అమ్మవార్లను దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు
మొగులపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్ళపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన జనసందోహం మధ్య మహేందర్ గౌడ్ అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులను సమర్పించారు. అనంతరం తన పెద్ద కుమార్తె వేముల అనుప్రియ అమ్మవార్లకు ఇష్టమైన నిలువెత్తు బంగారంను దేవతలకు సమర్పించారు. ఈ క్రమంలో ఆయన జాతరలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మ తల్లులు వారిని నమ్ముకున్న భక్తులకు కష్టాల చీకట్లను తరిమి కొట్టి, వారిని చల్లగా చూసేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మినీ మేడారం గద్దెలపై ఆసీనులైనారన్నారు. ఆ తల్లుల దీవెనలతో ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ దేవతలను వేడుకున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version