*ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ దంపతులు*
మొగులపల్లి నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆ దంపతులు స్వామివారికి మొక్కులను సమర్పించారు. అనంతరం స్వామివారి సేవలో పరితపించారు. అనంతరం వేముల మహేందర్ గౌడ్ దంపతులు మాట్లాడారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ..భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ రాష్ట్రంలోని దేవాలయాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం..ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించడం, రాష్ట్రంలో ప్రజలంతా భక్తి మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ మల్లికార్జున స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ, సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో కలకాలం వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
