రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో అంగారక చతుర్థి సందడి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జనవరి 6, 2026న సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రేజింతల్ గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు స్వామివారికి అభిషేకం, అలంకరణ, పుష్పార్చన, కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు.
