42వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి:

జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ మూసేసి గత 16 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండ యాజమాని మల్కా కొమురయ్య మొండిగా వ్యవహరిస్తు, కార్మికులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శాంతియుత రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 42వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి,లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *