ఏజెన్సీ మండలాలపై బిఆర్ఎస్ ప్రభుత్వం వివక్షత.
రోళ్లపాడు.ప్రాజెక్టును విస్మరిస్తే నోరువిప్పని బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. రైతు సంఘాల పోరాట స్ఫూర్తితో నీళ్లసాధనకు పోరాడుదాం. అఖిలపక్ష నేతల పిలుపు. కారేపల్లి నేటి ధాత్రి: 2016 ఫిబ్రవరి16న రోళ్లపాడు చెరువువద్ద శిలాఫలకం వేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు అందిస్తామని,జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏడున్నర సంవత్సరాలు గడిచినా ఏమాత్రం పనులు చేయకుండా ఏజెన్సీ మండలాలకు ద్రోహం చేస్తున్నారని రోళ్లపాడు ప్రాజెక్టు జలసాధన కమిటీ సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు,సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం,వరంగల్ జిల్లాల ఏరియా…