కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు న్యాయం

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి
పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 26 నుండి అర్హులందరికీ మరో నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇండ్లు,ఆత్మీయ భరోసా,రైతు భరోసా,తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు 5,6,7,8, 18,19,20 వార్డుల సభ కొత్తమున్సిపల్ కార్యాలయంలో,3,4,15,16, 17,22 వార్డులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో,1,2 12,13,14 వార్డులకు సి.ఎస్.ఐ పాఠశాలలో,9,10,11, 21 వార్డులకు మాదారంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తారని తెలిపారు.గ్రామ సభలను లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని కోరారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,సమన్వయ కమిటీ సభ్యులు ఎక్స్ ఎంపీపీ రామ్మూర్తి,చిన్నలగోనాథ్,బొచ్చు చందర్,కౌన్సిలర్స్ పంజిగిరి జయమ్మ,పసుల రమేష్,రఘుపతి గౌడ్,అనిల్, సదానందంగౌడ్,మెరుగు శ్రీశైలం,ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాస్ వెంకటస్వామి,పోరండ్ల వేణు,ఒంటేరు శ్రావణ్,బొమ్మ కంటి చంద్రమౌళి,గడ్డం శివ,ఎండి బాబా,ఏకు బొబ్బిలి,బోచ్చు రవికుమార్,సుదమల్ల కిషోర్ కుమార్,జితేందర్,మంద సురేష్,మొగిలి,మోటం చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!