అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలి *సిపిఎం ఆద్వర్యంలో తహశీల్దార్ కు వినతి బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలని సిపిఎం ఆద్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండలంలో నూతన బాద్యతలు చేపట్టిన తహశీల్దార్ పుష్పలతను సీపీఎం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఇసుక, చెరువు మట్టి అక్రమాలపై వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తహశీల్దార్ అక్రమ ఇసుక, మట్టి కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ శాఖ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచా అశోక్, సిపిఎం పార్టీ నాయకులు ఎలిగేటి రాజశేఖర్ పాల్గొన్నారు.
సిపిఎం ఆద్వర్యంలో తహశీల్దార్ కు వినతి బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలని సిపిఎం ఆద్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండలంలో నూతన బాద్యతలు చేపట్టిన తహశీల్దార్ పుష్పలతను సీపీఎం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఇసుక, చెరువు మట్టి అక్రమాలపై వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తహశీల్దార్ అక్రమ ఇసుక, మట్టి కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు….