ఈసారీ దాటవెతలే…..

ఈసారీ దాటవెతలే…..

◆ నిర్మాణానికి నోచుకోని ప్యాలవరం బ్రిడ్జి

◆ రూ.3కోట్లతో ఆరు నెలల క్రితం శంకుస్థాపన

◆ వర్షకాలంలోపు పూర్తి చేస్తామని హామీ

◆ ఇప్పటికీ ప్రారంభంకాని పనులు

◆ వాగోస్తే రాకపోకలు తీవ్ర ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మండల పరిలోని ప్యాలారం వాగు ఏటా వానకాలంలో పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు రాకపోకలు తీవ్ర మబ్బందులు పడుతున్నాడు.

ఆరు నెలల క్రితం ఈ వాగు పై నూతనంగా బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయి.

అంతేకాకుండా బహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్.

ఇహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్తేపు, స్థానిక ప్రజాప్రతిఙ్ఞడు లతో కలిసి పనులకు శంకుస్థావన కూడా చేశారు.

రానున్న వానకాలం లోపు బ్రిడ్జి నిర్మాదాని పూర్తి చేస్తామని వారు అప్పట్లో ప్రజలకు భరోసా ఇచ్చారు.

దీంతో ఎన్నో ఏళ్ల అవస్థలకు దేక్ పడుతుందని గ్రామస్థులు బావించారు.

కానీ ఇప్పటికి పసులు ప్రారంభంకాకపోత తో ఈ సారీ కూడా ఇక్కట్లు తప్పడం లేదు. 10 రోజుల క్రితం కురి సేన వర్గానికి వాగు ప్రవాహించడంతో రాకపోకలు స్తంభించి ప్రయాణి కులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

Government

రాకపోకలకు తప్పని ఇబ్బందులు

ఎన్నో సంవత్సరాల నుంచి ప్మాలవరం వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు వర్ష కాలం వచ్చిదంటే నానా తంటాలు పడుతు న్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా పసులు ముందుకు సాగలేదు. ప్రస్తుత కాంగ్రెస్: ప్రభుత్వమైనా పనుణు వేగవంతంగా చేస్తుందనుకుంటే కాల యాపనికే పరిమితమైందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

Government

ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ముఖ్యంగా ప్యాంవరం, దేవరంపల్లి గ్రామానికి రాకపోకలు సాఫీగా సాగుతాయి.

ప్రతీ ఏటా తిప్పలే..

ఎలా వాగు ఉద్భత్తంగా ప్రవహిస్తుండ మతే రాకపోవకు ఇబ్బందులు పడు తున్నాయి.నీళ్లు తగ్గుముఖం పట్టింతవరకు నిరీక్షణ తప్పడంలేదు తప్పని పరిస్థితల్లో దేవరంపల్లి ఈదులపల్లి మీదుగా చుట్టూ తిరిగి జహీరాబాద్ పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది.

-మాణిక్యం యాదవ్. ప్యాలవరం

Government

 

 

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.

శివుడే నన్ను ఎంచుకున్నాడు

శివుడే నన్ను ఎంచుకున్నాడు

విష్ణు కథానాయకుడిగా ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా…

విష్ణు కథానాయకుడిగా ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘దాదాపు ఏడెనిమిదేళ్లు కష్టపడి ఈ సినిమా తీశాం. ఇందులో నటించమని అడిగిన వెంటనే అంగీకరించిన మా బావ ప్రభా్‌సకు కృతజ్ఞతలు. ఈ సినిమాను శివుడు ఆశీర్వదించాడు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఎవరెవరు పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది. ఈ చిత్ర ప్రయాణం నన్ను చాలా మార్చింది. ‘కన్నప్ప’ కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎంచుకున్నాడని భావిస్తున్నా’’ అని మంచు విష్ణు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, రఘుబాబు, శివబాలాజీ, కౌశల్‌ పాల్గొన్నారు.

సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంపిక.

సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంపిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం, రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఎంపికై, తన వినూత్న బోధనా పద్ధతులతో అందరి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో,సఫియా సుల్తానా తన పాఠశాలలో అమలు చేసిన సృజనాత్మక బోధనా పద్ధతులు, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన కార్యక్రమాలు, మరియు వీటి ద్వారా పాఠశాలలో సాధించిన గణనీయమైన ప్రగతిని అత్యంత ఆకర్షణీయమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ జి. రమేష్, ఆర్.జె.డి. విజయలక్ష్మి, మల్టీ జోన్-2కు చెందిన 350 మందికి పైగా మండల విద్యాధికారులు హాజరయ్యారు. శ్రీమతి సఫియా సుల్తానా గారి అద్భుతమైన ప్రదర్శనను తిలకించిన ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ రమేష్ మరియు ఆర్.జె.డి. విజయలక్ష్మి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే, ఎస్.సి.ఈ.ఆర్.టి.సురేష్ బాబు, శ్రీ సురేందర్, మరియు న్యాల్కల్ మండల విద్యాధికారి శ్రీ మారుతి రాథోడ్ కూడా ఆమె కృషిని అభినందించారు.

సర్దార్ 2 షూటింగ్ పూర్తి!

సర్దార్ 2 షూటింగ్ పూర్తి!

కార్తీ సూపర్ హిట్ మూవీ ‘సర్దార్’ సీక్వెల్ షూటింగ్ పూర్తయిపోయింది. ‘సర్దార్’కు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, సీక్వెల్ కు సామ్ సీఎస్ ను తొలుత అనుకుని ఇప్పుడు యువన్ శంకర్ రాజాతో మ్యూజిక్ చేయించుకున్నారు.

కార్తీ (Karthi) హీరోగా నటించిన ‘సర్దార్’ (Sardar) సినిమా 2022లో దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తండ్రీ కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రజిషా విజయన్ (Rajisha Vijayan), రాశీఖన్నా (Rasi Khanna) హీరోయిన్లుగా నటించారు. లైలా (Laila) ఓ కీలక పాత్రను పోషించి మెప్పించింది. పి.ఎస్. మిత్రన్ (P.S. Mithran) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ తెలిపారు. అన్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ ను కొంతకాలం క్రితం ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. థాయ్ లాండ్ లోని హువా హిన్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా టోటల్ క్రూ అంతా కలిసి కేక్ కట్ చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు.

ప్రిన్స్ పిక్చర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘సర్దార్ -2’లో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath), రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ చేస్తుండగా, ఎస్. జె. సూర్య (SJ Suryah) ఓ పవన్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తొలుత సామ్ సి.ఎస్.ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఆ స్థానంలోకి యువన్ శంకర్ రాజా (Yuvan Sakar Raja) వచ్చాడు. చిత్రం ఏమంటే… ‘సర్దార్’ తొలి భాగానికి వీరిద్దరూ కాకుండా జి.వి. ప్రకాశ్‌ కుమార్ సంగీతాన్ని అందించాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫీ సమకూర్చుతున్న ‘సర్దార్ -2’ చిత్రానికి దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ కొరియోగ్రాఫర్. ఎస్. లక్ష్మణ్‌ కుమార్ నిర్మిస్తున్న ‘సర్దార్ 2’ కు ఎ. వెంకటేశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతరం కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.

ఆగిన రోడ్డు మరమ్మతులు.

ఆగిన రోడ్డు మరమ్మతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం : గత మూడేళ్ల క్రితం రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు కాగా ఇటీవలే పనులు ప్రారం భమైనప్పటికీ తిరిగి నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతు న్నారు.

దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించనట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే నిధులు మంజూరు జరిగిన కాంట్రాక్టర్ మా త్రం పనులు వెంటనే ప్రారంభించ లేదు.

ఇటీవలే పనులు ప్రారంభమై నప్పటికీ కొన్ని నెలల్లోనే అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు.

ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామం నుండి పూర్యానాయక్ తండా వైపు 3.50 కిలోమీటర్ల మేర రోడ్డును మరమ్మతులు చేసేందుకు 2022 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.38 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

ఇట్టి పనులను పర్యవేక్షించేందుకై ప్రభుత్వం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి నియమించింది.

దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచి ఇట్టి పనిని చేసేందుకు కాంట్రాక్టర్కు అప్పగించింది.

అయితే కాంట్రాక్టర్ గత మూడు సంవత్సరాలు పాటు ఎలాంటి రోడ్డు మర మ్మతు పనులను ప్రారంభించకపోవడంతో గిరిజనుల ఆశలు సన్నగిల్లాయి.

 

BRS Government.

 

గత కొన్ని ఏళ్లుగా గిరిజనులు కంకర తేలి గుంతలపడ్డ రో డ్డుపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ద్విచక్ర వాహనాల మాట అటు ఉంచితే కనీసం కాలినడకన వెళ్లాలన్న ఈ రోడ్డు అనువుగా లేక పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ తరు ణంలోనే గత రెండు నెలల క్రితం కాంట్రాక్టర్ ఈ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించడంతో గిరిజనుల ఆశలు తిరిగి రేకెత్తిన్నాయి.

కాగా ఇప్పటి వరకు ఈ రోడ్డుపై పలుచోట్ల కల్వర్టులు నిర్మించారు.

అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేగడి మట్టిని తవ్వి సైడ్ వైన్దింగ్ పనులను చేపట్టారు.

అదే విధంగా మొరం కాకుండా చెడేతో కూడు కున్న మట్టిని రోడ్డుపై వేసి చదును చేశారు.

తదుపరి కంకర వేయ కుం డా రోడ్డు మరమ్మతు పనులను అర్ధాంతరంగా వదిలిపెట్టారు.

దీంతో ప్రస్తుతం ఈ రోడ్డు చిరుజల్లుతే చిత్తడిగా మారి ప్రయాణం చేయ డా నికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయా తండాలో గిరి జనులు ఆందోళన వ్యక్తం చేశారు.

పలువురు వాహనదారులు జారి పడి ప్రమాదాన్ని గురైనట్లు వారు వివరించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు

ఈ రోడ్డుపై కంకర వేసి బీటీ రోడ్డుగా మార్చడా నికి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

బాలకృష్ణతో మరోసారి 

బాలకృష్ణతో మరోసారి 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు…

 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలకృష్ణతో మరోసారి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మా కాంబో చేసే గర్జన మరింత ఎక్కువగా ఉండబోతోంది. చరిత్రలో నిలిచిపోయే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. మంగళవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇది ఆయన నటించనున్న 111వ చిత్రం. వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మించనున్నారు. కాగా, బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కలయికలో ‘వీరసింహా రెడ్డి’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

అఖండ 2 టీజర్‌ వచ్చేస్తోంది

హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్‌ కొట్టిన సంగతి తెలిసిందే. వారి కలయికలో నాలుగోసారి తెరకెక్కుతోన్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయనున్నారు మేకర్స్‌.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి..

◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…..

◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని……

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అందులో ముగ్గురు కొత్త మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక ముస్లింను చేర్చుకుంటారని తెలంగాణ ముస్లింలు ఆశించారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింను కూడా చేర్చకపోవడం విచారకరం. తెలంగాణలో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింల ఓట్లు అందుకు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు. ముస్లింలు అసూయపడే మంత్రి లేరు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. అవును,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు,కానీ బిజెపి మరియు మోడీ ప్రభుత్వాల మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డికి అందరూ మంచి గుణపాఠం నేర్పించాలని కోరారు. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు వచ్చే గ్రామ పంచాయతీ జడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్లలో ముస్లింలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గుణపాఠం నేర్పించాలని కోరారు.

అఖిల్‌, జైనబ్ రిసెప్ష‌న్‌..

అఖిల్‌, జైనబ్ రిసెప్ష‌న్‌.. త‌ర‌లివ‌చ్చిన తారాలోకం

 

అక్కినేని వార‌సుడు అఖిల్‌, జైనాబ్‌ల వివాహాం రెండు రోజుల క్రితం అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అక్కినేని వార‌సుడు అఖిల్‌ (Akhil), జైనాబ్‌ (Zainab)ల వివాహాం రెండు రోజుల క్రితం అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే మొన్న కేవ‌లం అతి కొద్దిమంది స‌మ‌క్షంలోనే ఈ పెళ్లి జ‌రుగ‌గా సినీ ఇండ‌స్ట్రీ నుంచి కొద్దిమంది అతిథులు మాత్ర‌మే హ‌జ‌ర‌య్యారు.

తాజాగా వీరి నిశ్చితార్ధం హైద‌రాబాద్‌లో క‌నుల‌పండువ‌గా జ‌రిగింది. ఈ వేడుక‌కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు భారీ ఎత్తున హ‌జ‌ర‌య్యారు.

ముఖ్యంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu), సూర్య‌, వెంకి అట్లూరి ఈ రిసెప్ష‌న్‌కు హ‌జ‌రైన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మీరూ వాటిపై ఓ లుక్ వేయండి.

రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న‌, అల్ల‌రి న‌రేశ్‌, నాని, నిఖిల్, క‌న్న‌డ స్టార్ య‌శ్‌ దంప‌తుల‌తో పాటు సుధీర్‌బాబు, ద‌ర్శ‌కుడు సుకుమార్ దంప‌తులు, బుచ్చిబాబు సాన‌, నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వినీ ద‌త్‌, బీవీ ప్ర‌సాద్‌, కేఎల్ నారాయ‌ణ‌ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

రాజ‌కీయ నాయ‌కులు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డిలు సైతం ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ.

దేవుని తిరుమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ

వనపర్తి నేటిధాత్రి

 

 

 

కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపురం గ్రామంలో భూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్య శిక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశామని ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు .

ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ గోశాల ఆవుల పరిరక్షణ నిమిత్తం పోషణకై దాతల వస్తూ రూపములో వచ్చిన వాటితో కొంతమంది ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

గవ్య ఉత్పత్తులను తయారుచేసి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో ఆవువుల ను రక్షించడానికి వాటికి అయ్యే ఖర్చు ఈ ఉత్పత్తుల ద్వారా ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఉత్పత్తులను తిరుమలాపురము ఆలయంలో తయారు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ తెలిపారు.

 

Lord Venkateswara Swamy Temple, Tirumalapuram.

 

పంచగవ్య ఉత్పత్తుల ఉత్పత్తుల ద్వారా దూప్ స్టిక్స్ దోమల అగర్బత్తీలు క్లీన్ ఆయిల్ ఇంకా సోప్స్ హోలీ పండుగకు ప్రత్యేకంగా పూర్ణిమ సందర్భంగా ఎటువంటి కెమికల్స్ రసాయన ద్రవ్యాలు కలుషితం లేకుండా పూలతో చెట్ల దినుసులతో రంగులు తయారు చేస్తున్నామని ప్రజలు రంగులు వాడిన ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా చర్మవ్యాధులు లేకుండా ఉంటాయని ఆయన తెలిపారు తల వెంట్రుకలకు సంబంధించి ఆయిల్స్ కూడా తయారవుతాయని ప్రజలు ఆయిల్స్ ధూప్ స్టిక్స్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ గ్లాసులు వాడడం వల్ల క్యాన్సర్ ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఇది కాకుండా పురాతన కాలంలో మోత్కాకుతో ఇస్తరాకులో ఉండేవి అదే ఆకులతో పేపర్ ప్లేట్లు కూడా యంత్రాలతో భవిష్యత్తులో తయారు చేయించి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు ఇది బాగుంది కంగ్రాట్స్ ఈ పేపర్ ప్రింట్ గాని గిలాసలు గాని తిడతాడు గ్లాసులు మొత్తం 15 వస్తువులు తయారవుతాయని ఆయన తెలిపారు

ఈ వారం ఓటీటీ సినిమాలివే.!

 ఈ వారం ఓటీటీ సినిమాలివే.. అన్నీ అదిరిపోయే బొమ్మ‌లే

 

నేటిధాత్రి:

 

 

 

 

 

 

ఈవారం ఓటీటీ () ప్రేక్ష‌కుల చెంత‌కు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది.

ఈవారం ఓటీటీ () ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఎప్ప‌టిలానే ఈ వీకెండ్ కూడా 100కు పైనే సినిమాలు, సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగుకు వ‌స్తుండ‌గా వాటిలో చాలా వ‌ర‌కు ప్ర‌ధాన కంటెంట్‌ తెలుగులోనూ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే వీటిలో అధిక శాతం మూవీస్‌ కేవ‌లం అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌లోనే వ‌స్తుండ‌డం విశేషం.

వీటిలో ముఖ్యంగా హీరోయిన్ స‌మంత నిర్మాత‌గా మారి మొట్ట మొద‌టి సారి నిర్మించిన శుభం, మ‌ల‌యాళ యువ నటుడు, ప్రేమ‌లు హీరో న‌టించిన అల‌ప్పుజ జింఖానా, న‌వీన్ చంద్ర ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ ఎలెవ‌న్ చిత్రాల‌తో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్‌, బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కేస‌రి2, త‌మిళ చిత్రాలు మామ‌న్‌, డీడీ నెక్స్ట్ లెవ‌ల్ వంటి కొత్త చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి. థియేట‌ర్ల‌లో ఈ సినిమాల‌ను మిస్స‌యిన వారు, ఇంటి పట్టునే ఉండి చూసే వారికి ఈ వీక్ స‌రిపోను వినోదం అందించ‌డానికి రెడీగా ఉన్నాయి.

 

 

 

Jio Hotstar

Padakkalam (Malayalam + Multi)

Snow White (English + Hindi) – JioHotstar

The Real Housewives Of Miami: S4 (English) [Series]

Subham (Telugu + Multi )

When No One Sees Us (Spanish)

Under Dogs (English)

 

 

 

 

 

 

Netflix

Train Wreck : The AstroWorld Tragedy (English)

OurTimes (Mexican)

Aniela (Polish) [Series]

CheersToLife (Brazilian)

Titan : The OceanGate Disaster (English)

CocaineAir : Smugglers at 30,000 Ft. (English) [Series]

FlatGirls (Thai)

MasameerJunior (Saudi)

AndTheBreadWinnerIs (Filipino)

Cells At Work (Japanese)

Rana Naidu : Season 2 (Hindi)

A Business Proposal (Indonesian)

Too Hot To Handle: Spain (Spanish) [Series]

The Rookie (English) – Netflix

 

Prime Video

The Amateur (English)

Misericordia (English) Rent

When Fallis Coming (English) Rent

Clown In A Cornfield (English) Rent

Deep Cover (English)

Eleven (Tamil)

Kesari Chapter2 June 13

DD Next Level June 13

Bonjour Tristesse (English) Rent

The Chosen: Last Supper Season 5 (English) [Series]

Final Destination Bloodlines Rent June 17

Zee5

Maaman (Tamil) June 13

Aha Tamil

Eleven (Tamil)

 

 

 

Sony Liv

Alappuzha Gymkhana (Malayalam + Multi)

Tentkotta

Eleven (Tamil)

ETv win

Aa Okkati Adakku (Telugu)

HBO Max

Cleaner (English)

Apple Tv+

EchoValley (English)

Simply South

Eleven (Tamil)

Alappuzha Gymkhana (Malayalam + Multi)

Lionsgate Play

The Prosecutor (Chinese) (Cantonese, Eng, Hi, Ta, Tel)

మ‌రోసారి.. ఫుల్‌గా ఓపెన్ అయిన తెలుగు బ్యూటీ.

మ‌రోసారి.. ఫుల్‌గా ఓపెన్ అయిన తెలుగు బ్యూటీ..

 

 

నేటిధాత్రి:

 

 

 

 

సుప్రీతా నాయుడు సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, న‌టి.

సుప్రీతా నాయుడు (Supritha Bandaru Naidu) సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, న‌టి. ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఒక సినిమా చేయ‌కున్నా బ‌డా హీరోయిన్లను త‌ల‌న్నేలా అందాల‌తో హోయ‌లు బోతూ త‌న ఫ్యాన్స్‌కు నిత్యం త‌నివితీరా ఫుల్ మీల్స్ పెడుతోంది.

 

స‌మ‌యం దొరికితే విదేశాలు, బీచులు, ప‌బ్‌లు తిరుగుతూ అందాల‌ను వ‌డ్డిస్తోంది. తాజాగా త‌ను హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ న‌టించిన సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న ఆమె నా ఇష్ట ప్ర‌కారమే నా డ్రెస్సింగ్ ఉంటుందంటూ బోల్డ్ కామెంట్లు చేసింది.

 

అది మ‌ర‌కువ‌కు ముందే తాజాగా త‌న ఎద అందాల‌న్నింటినా ఒపెన్‌గా ప్ర‌ద‌ర్శిస్తూ మ‌రోసారి చూసే వారికి క‌నుల వింతు చేసింది.

 

ఇప్పుడు ఈ పొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

యాపిల్ మ్యాక్‌బుక్‎పై రూ.31 వేల తగ్గింపు ఆఫర్..

క్రేజీ డీల్.. యాపిల్ మ్యాక్‌బుక్‎పై రూ.31 వేల తగ్గింపు ఆఫర్..

 

నేటిధాత్రి:

 

 

 

 

 

చాలా రోజుల నుంచి మీరు యాపిల్ MacBook కొనాలని అనుకుంటున్నారా. అయితే మీకు ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే MacBook Air M1పై ప్రస్తుతం 31 వేల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.

MacBook Air M1: క్రేజీ డీల్.. యాపిల్ మ్యాక్‌బుక్‎పై రూ.31 వేల తగ్గింపు ఆఫర్..
MacBook Air M1

మీరు అనేక రోజుల నుంచి యాపిల్ మ్యాక్‌బుక్‎ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు మీ కలల ల్యాప్‌టాప్‌ను తీసుకునేందుకు మంచి ఛాన్స్ వచ్చింది. Amazonలో MacBook Air M1పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, తక్కువ ధర ఇవన్నీ కూడా ప్రస్తుతం మీకు లభించనున్నాయి. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి. ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 

ధర తగ్గింపు ఆఫర్..

MacBook Air M1 8GB RAM, 256GB SSD వేరియంట్ ప్రస్తుతం Amazonలో రూ. 58,990కి లభిస్తోంది. అయితే దీని అసలు ధర రూ. 89,900తో పోలిస్తే రూ.31 వేల తగ్గింపుతో లభిస్తుండటం విశేషం. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

MacBook Air M1 ప్రధాన ఫీచర్లు

ప్రాసెసర్: Apple M1 చిప్ (8-కోర్ CPU, 7-కోర్ GPU)

RAM: 8GB

స్టోరేజ్: 256GB SSD

డిస్‌ప్లే: 13.3-అంగుళాల Retina డిస్‌ప్లే

బ్యాటరీ: 18 గంటల వరకు బ్యాటరీ జీవితం

కెమెరా: 720p FaceTime HD కెమెరా

కనెక్టివిటీ: Wi-Fi 6, Bluetooth 5.0

పోర్ట్స్: 2x Thunderbolt 3 (USB-C)

లాంగ్ బ్యాటరీ లైఫ్: 18 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్

స్లిమ్, లైట్ డిజైన్: 1.29 కిలోల బరువు

macOS: సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సపోర్ట్

 

సూర్యవంశీ సిక్సుల వర్షం..

సూర్యవంశీ సిక్సుల వర్షం.. ఈ రాక్షసుడ్ని ఆపడం అయ్యే పనికాదు!

 

 

నేటిధాత్రి:

 

 

 

 

 

యువ కెరటం వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్-2025 ముగిసినా వైభవ్ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు.

యువ కెరటం వైభవ్ సూర్యవంశీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. ఐపీఎల్-2025లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన వైభవ్.. అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా అండర్-19 ఎన్‌సీఏ క్యాంప్‌లో అతడు విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో బౌలర్లను హడలెత్తించాడీ 14 ఏళ్ల బ్యాటర్. త్వరలో జరిగే ఇంగ్లండ్ టూర్ కోసం సన్నద్ధమవుతోంది భారత అండర్-19 టీమ్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఈ జట్టు క్యాంప్ నడుస్తోంది. ఇందులో పాల్గొన్న వైభవ్.. అగ్రెసివ్ బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు.

రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.

రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాల్సిందే!

 

నేటిధాత్రి

 

 

 

 

 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరి విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మంచి నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆధునిక క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆడిన ప్రతి దేశంలోనూ అదరగొట్టారీ స్టార్లు. టీ20, వన్డే, టెస్ట్ అనే తేడాల్లేకుండా బరిలోకి దిగితే చాలు.. పరుగుల వర్షం కురిపించడమే ధ్యేయంగా ఆడుతూ వచ్చారు. అయితే పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ ద్వయం.. ఇటీవలే టెస్టులకూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతామని వెల్లడించారు. దీంతో అభిమానులు తెగ బాధపడుతున్నారు. కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండా రిటైర్ అవడం ఏంటని ఫీల్ అవుతున్నారు. సత్కరించే అవకాశం కూడా ఇవ్వరా అని వాపోతున్నారు. ఈ తరుణంలో రోహిత్-కోహ్లీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చేస్తున్న పని తెలిసి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అసలు సీఏ ఏం చేసిందంటే..

మొదలుపెట్టిన టీమిండియా..

మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

 

నేటిధాత్రి:

 

 

 

 

భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.

వేట మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురూ లేని భారత టెస్ట్ జట్టును ఊహించడం కష్టమే. గత కొన్నేళ్లుగా టీమిండియాకు అన్నీ తామై నిలిచారీ త్రిమూర్తులు. మన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే తక్కువ వ్యవధిలోనే ముగ్గురూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎలా ఆడుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టారు టీమిండియా ప్లేయర్లు. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని కుర్రాళ్ల బృందం ఉరిమే ఉత్సాహంతో ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

 

బెండు తీయడం ఖాయం!

ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో గిల్ అండ్ కో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఇందులో జట్టు ఆటగాళ్లంతా పరుగులు తీస్తూ చెమటోడ్చుతూ కనిపించారు. రన్నింగ్‌‌తో పాటు ఫుట్‌బాల్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు. కెప్టెన్ గిల్‌, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ అటు ఫీల్డింగ్ సెషన్స్‌తో పాటు ఇటు ఫిట్‌నెస్ డ్రిల్స్‌ను కూడా దగ్గరుండి గమనిస్తూ కనిపించాడు.ఇంగ్లండ్ గ్రౌండ్స్‌కు తగ్గట్లు ఫీల్డింగ్‌లో చేసుకోవాల్సిన మార్పులపై కోచ్ టి దిలీప్ కుర్రాళ్లతో చర్చిస్తూ కనిపించాడు. అటు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇంగ్లండ్ జట్టు బెండు తీసేందుకు లండన్‌లో ల్యాండ్ అయిన భారత బృందం.. ఇలా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ తాము వేటాడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.

 

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం..

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!

 

నేటిధాత్రి:

 

 

 

 

 

 

ఇంగ్లండ్‌కు గుబులు పుట్టిస్తున్నాడు టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా. అతడి పేరు చెబితేనే ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడుతున్నారు.

 ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం లండన్‌కు చేరుకున్న బుమ్రా.. అలా ల్యాండ్ అయ్యాడో లేదో సాధన షురూ చేసేశాడు. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో బుమ్రా పరుగులు తీస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమ్ క్యాంప్‌లో జాయిన్ అయిన స్పీడ్‌గన్.. రన్నింగ్‌తో పాటు బౌలింగ్ డ్రిల్స్ చేస్తూ కనిపించాడు. గ్యాప్‌లో బౌలింగ్ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌తో కలసి అతడు మాట్లాడటాన్ని కూడా వీడియోలో చూడొచ్చు. బుమ్రా సాధన చూసి ప్రత్యర్థి బ్యాటర్లు వణుకుతున్నారని తెలుస్తోంది.

 

వణుకుతున్న బ్యాటర్లు!

కోచ్‌తో బుమ్రా సుదీర్ఘంగా చర్చించడం, గ్రౌండ్‌లో రేసుగుర్రంలా పరుగులు తీయడం, ఫుల్‌ ఫిట్‌గా కనిపించడంతో ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఎక్కడ తమ పని ఫినిష్ చేస్తాడోనని ఇంగ్లీష్ బ్యాటర్లు భయపడుతున్నారట. అతడి ఫిట్‌నెస్ చూసి అవాక్కవుతున్నారట. 3 టెస్టులు ఆడితే గొప్ప అనుకుంటే.. ఇప్పుడు 5 టెస్టులు పక్కా ఆడేలా కనిపిస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆతిథ్య జట్టుకు దబిడిదిబిడేనని అంటున్నారు. స్టోక్స్ సేన కాచుకో.. అంటూ సవాల్ విసురుతున్నారు. కాగా, ఇంగ్లండ్ టూర్‌ కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించిన సమయంలో బుమ్రా మూడు మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం ఉందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే భారత ట్రెయినింగ్ సెషన్‌లో మాత్రం పేస్ గన్ ఉత్సాహంగా పాల్గొనడం, ఫిట్‌గా కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన టీమ్‌కు తిరుగులేదని అంటున్నారు.

 

నల్లకలువదే ఎర్రకోట.

నల్లకలువదే ఎర్రకోట

 

నేటిధాత్రి:

 

 

 

 

 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌గా కొకో గాఫ్‌ నిలిచింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల ఈ అమెరికన్‌.. 6-7 (5-7), 6-2, 6-4తో వరల్డ్‌ నెంబర్‌ 1 ఎరీనా సబలెంక (బెలారస్‌)ను ఓడించి ఎర్రకోటలో…

 

ఇద్దరూ ఇద్దరే.. ఒకరు వరల్డ్‌ నెంబర్‌ వన్‌ సబలెంక, మరొకరు వరల్డ్‌ నెంబర్‌ టూ కొకొ గాఫ్‌. బరిలోకి దిగిన పదిసార్లు కూడా సమాన విజయాలే. గ్రాండ్‌స్లామ్స్‌లోనే కాదు.. క్లే కోర్టుల్లోనూ తలపడిన రెండేసిసార్లూ పైచేయి. అలాంటి వీళ్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? అంచనాలకు తగ్గట్టుగానే ఇద్దరూ నువ్వా.. నేనా? అనే రీతిలో ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. అయితే ఆఖరి పోరాటంలో చివరకు నల్ల కలువ గాఫ్‌కే ఫ్రెంచ్‌ కిరీటం దక్కింది. గెలుపు అవకాశాలను చేజార్చుకున్న సబలెంక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌గా కొకో గాఫ్‌ నిలిచింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల ఈ అమెరికన్‌.. 6-7 (5-7), 6-2, 6-4తో వరల్డ్‌ నెంబర్‌ 1 ఎరీనా సబలెంక (బెలారస్‌)ను ఓడించి ఎర్రకోటలో పాగా వేసింది. గాఫ్‌ కెరీర్‌లో ఇదే తొలి ఫ్రెంచ్‌ ఓపెన్‌ కాగా.. ఆమెకిది రెండో గ్రాండ్‌స్లామ్‌. 2023లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచింది. అలాగే 2015లో సెరెనా తర్వాత మరో యూఎస్‌ క్రీడాకారిణి ఇక్కడ నెగ్గడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా సెరెనా (2002లో) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ను గెలిచిన యంగెస్ట్‌ అమెరికన్‌గానూ గాఫ్‌ నిలిచింది. ఇక సబలెంక కెరీర్‌లో ఆస్ట్రేలియన్‌, యూఎస్‌ ఓపెన్‌ గెలిచినా ఇప్పటిదాకా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గలేకపోయింది. ఈ పోరులో సబలెంక 70 అనవసర తప్పిదాలకు పాల్పడి మూల్యం చెల్లించుకుంది. గాఫ్‌ 9 బ్రేక్‌ పాయింట్లు, 3 ఏస్‌లతో చెలరేగింది.

 

హోరాహోరీగా..: తొలి సెట్‌లో సబలెంక శక్తివంతమైన బేస్‌లైన్‌ ఆటతీరుతో పాటు గాఫ్‌ పదునైన సర్వీస్‌ రిటర్న్‌లతో పోరు రంజుగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలు, డ్యూస్‌ల కారణంగా ఈ సెట్‌ గంటా 18 నిమిషాలు సాగింది. తొలి పాయింట్‌ గాఫ్‌దే అయినా సబలెంక ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్‌ చేస్తూ ఓ దశలో 4-1తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కానీ తర్వాత పుంజుకున్న గాఫ్‌ వరు సగా 3 పాయింట్లతో స్కోరును సమం చేసింది. ఇక్కడి నుంచి కోర్టులో చిరుతల్లా ఇద్దరూ తలపడ్డారు. ఫలితంగా సెట్‌ 6-6తో టైబ్రేక్‌కు వెళ్లింది. ఇందులో సబలెంక ఆరంభంలో వెనుకబడినా పట్టు వదలకుండా ఆడి సెట్‌ను 7-6తో ముగించింది. అయితే కీలక రెండో సెట్‌లో చెలరేగిన గాఫ్‌ 35 నిమిషాల్లోనే 6-2తో గెలిచి పోటీలో నిలిచింది. ఇక నిర్ణాయక సెట్‌ తిరిగి రసవత్తరం గా మారింది.

మొదట గాఫ్‌ బ్రేక్‌ పాయింట్లతో 3-1తో హవా చూపింది. ఈ దశలో సబలెంక ఒత్తిడిని అధిగమిస్తూ గాఫ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేస్తూ 3-3తో సవాల్‌ విసిరింది. కానీ సబలెంక అనవసర తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ గాఫ్‌ రెండు వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే తొమ్మిదో గేమ్‌ను సబలెంక దక్కించుకున్నా.. 5-4 ఆధిక్యంతో గాఫ్‌ చాంపియన్‌షిప్‌ సర్వీస్‌కు దిగింది. ఇందులో సబలెంక పోరాడినా తన బ్యాక్‌ హ్యాండ్‌ విన్నర్‌ను బయటకు కొట్టడంతో.. గాఫ్‌ విజేతగా నిలిచింది.

 

ఘ‌నంగా అక్కినేని అఖిల్ పెళ్లి.

ఘ‌నంగా అక్కినేని అఖిల్ పెళ్లి.. వివాహ వేడుక‌లో సినీ తార‌ల సంద‌డి

నేటిధాత్రి

 

 

 

 

  • అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీల వివాహం
  • హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా వేడుక
  • హాజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖులు
  • తెలుగు రాష్ట్రాల సీఎంల‌ను ఆహ్వానించిన నాగార్జున దంపతులు
  • ఈ నెలాఖరులో జోధ్‌పూర్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్‌

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన వేడుకలో ఏడడుగులు నడిచారు. గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు, ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి, వేడుకకు మరింత శోభను చేకూర్చారు. అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున అక్కినేని, తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం. దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా, సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతోంది.

వధువు జైనాబ్ రవ్జీ ప్రతిభావంతురాలైన ఆర్టిస్ట్, పర్ఫ్యూమర్. ఆమె సృష్టించే ఎక్స్‌ప్రెసివ్ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్‌వర్క్‌కు మంచి పేరుంది. అలాగే, “ఒన్స్ అపాన్ ది స్కిన్” అనే పేరుతో ఆమె నడుపుతున్న ఫ్రాగ్రెన్స్ బ్లాగ్ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్‌లో జన్మించిన జైనాబ్, ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు. అంతేకాకుండా ఎం.ఎఫ్. హుస్సేన్ దర్శకత్వం వహించిన “మీనాక్షి: ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్” చిత్రంలో కూడా జైనాబ్ చిన్న పాత్రలో నటించారు.

ఇక‌, అక్కినేని అభిమానులు ఎంతోకాలంగా ఈ పెళ్లి వేడుక వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరి నిశ్చితార్థం ప్రైవేట్‌గా జరగడం, అంతకుముందు 2017లో అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం జరిగి, తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో రద్దు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెళ్లిపై మరింత ఆసక్తి నెలకొంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం, ఈ నెలాఖరులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి దేశవ్యాప్తంగా మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. పలువురు శ్రేయోభిలాషులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందిస్తున్నారు.

 

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు.

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు: దీపికా పదుకొణే వివాదంపై రానా వ్యాఖ్యలు

 

 

నేటిధాత్రి:

 

 

 

 

భారతీయ సినిమా పరిశ్రమలో నటీనటుల పని గంటలపై జరుగుతున్న చర్చకు నటుడు రానా దగ్గుబాటి తనదైన శైలిలో స్పందించారు.

నటి దీపికా పదుకొణె…

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి పనివేళల విషయంలో విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తల నేపథ్యంలో, రానా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడ నిర్దిష్ట ప్రమాణాలను చేరుకోవడానికి ఎక్కువ గంటలు పనిచేయడం, ఎక్కువ కృషి చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ, “భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మనం అర్థం చేసుకోవాలి.

మనం అభివృద్ధి చెందిన దేశం కాదు.

తలసరి ఆదాయం పరంగా చూస్తే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో బహుశా 186వ స్థానంలో ఉంటుంది” అని పేర్కొన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన వైనాన్ని గుర్తుచేస్తూ, “కొన్ని కుటుంబాలు, వందలాది మంది తమ సర్వస్వాన్ని వదులుకుని ఒక నగరం నుంచి మరో నగరానికి వచ్చి ఇక్కడ పరిశ్రమను స్థాపించారు.

నాకు ఇది పనిలా కాకుండా ఒక జీవన విధానంలా అనిపిస్తుంది” అని తెలిపారు.

పరిశ్రమను బట్టి మారే పనివేళలు

పనిగంటలు అనేవి ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు, అలాగే ప్రాజెక్టును బట్టి కూడా గణనీయంగా మారుతాయని రానా వివరించారు.

“ఉదాహరణకు, మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ ఉంటుంది, తెలుగులో 8 గంటల షిఫ్ట్ ఉంటుంది.

కానీ మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు పని మొదలుపెడితే, తెలుగులో మేం ఉదయం 7 గంటలకే మొదలుపెడతాం.

అలాగే, షూటింగ్ జరిగే ప్రదేశం, నగరం, సెట్‌లో చిత్రీకరిస్తున్నారా లేదా స్టూడియోలోనా అనే అంశాలు కూడా పనిగంటలను ప్రభావితం చేస్తాయి.

సెట్‌లో షూట్ చేయడానికి ఎక్కువ సన్నాహాలు అవసరం, అదే స్టూడియో అయితే సౌకర్యవంతంగా ఉంటుంది.

కాబట్టి ఇది ప్రాజెక్టును బట్టి మారుతుంది.

దీన్ని ఒక సాధారణ విషయంగా చూడకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.

నటీనటులను ఎక్కువ గంటలు సెట్‌లో ఉండమని బలవంతం చేస్తారా అన్న ప్రశ్నకు రానా సమాధానమిస్తూ, “ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదు.

ఇది ఒక ఉద్యోగం.

‘మీరు ఈ షో చేయాల్సిందే’ అని ఎవరూ మిమ్మల్ని నిర్బంధించలేరు.

ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక.

జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై ప్రతి ఒక్కరికీ వారి వారి అభిప్రాయాలు ఉంటాయి.

కేవలం 4 గంటలు మాత్రమే షూట్ చేసే నటులు కూడా ఉన్నారు.

అది వారి పనివిధానం” అని తెలిపారు.

దేశ జనాభాలో 70-80 శాతం మంది రోజుకు 100 రూపాయలు సంపాదించే పరిస్థితులున్నాయని, ఈ కోణంలో చూసినప్పుడు మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని రానా అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version