నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో’ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మంగళవారం ఈ సినిమా ప్రీవ్యూ షోను వేశారు.

‘కేరాఫ్ కంచరపాలెం’ (Care of Kancharapalem), ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma maheswara ugra roopasya) చిత్రాల నిర్మాత పరుచూరి ప్రవీణ (Paruchuri Praveena) తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్తపల్లిలో…’ (Kothapalli lo). ఒకప్పుడు అనేది దాని ట్యాగ్ లైన్. 1980, 90లలో కొత్తపల్లి అనే గ్రామంలో జరిగే కొన్ని సంఘటనలను సినిమాగా దర్శకురాలు ప్రవీణ తెరకెక్కించింది.

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా మీద ఉన్న నమ్మకంతో విడుదలకు మూడు రోజుల ముందే మీడియాకు ప్రివ్యూ షో వేసి చూపించారు. గ్రామీణ ప్రజల మూఢ నమ్మకాలను, వాటి పర్యవసానాలను తెలియచేస్తూ ఈ సినిమా సాగింది. రామకృష్ణ అనే యువకుడి జీవితం రాత్రికి రాత్రి ఎలా తల్లకిందులైందనేది ఇందులోని ప్రధాన కథాంశం. దీన్ని మూఢ విశ్వాసాలకు, అగ్రవర్ణాల అహంకారానికి, జలగల్లా పీడించే వడ్డీ వ్యాపారుల క్రూరత్వానికి లింక్ చేస్తూ ప్రవీణ పరుచూరి సినిమాగా తీశారు.

ఇటీవల ఓ ఇంటర్వూలో ఆర్టిస్టుల పట్ల తాను సినిమా షూటింగ్ లో అనుచితంగా ప్రవర్తించానని, సన్నివేశం బాగా రావడం కోసం కొన్ని సందర్భాలలో వారిపై చెయ్యి చేసుకున్నానని, కోపంతో రాళ్లూ విసిరానని చెప్పుకోవచ్చారు. నిజానికి ఇవన్నీ సినిమా కథలో భాగంగానే ప్రవీణ పరుచూరి చేశారని ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అర్థమౌతోంది.

ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో నాగమణి అనే డీ గ్లామరైజ్డ్ పాత్రను ప్రవీణ పోషించారు. ఓ మారుమూల పల్లెటూరిలో అట్లు వేసుకుని జీవితాన్ని గడిపే నిరుపేదరాలు పాత్రను ఆమె చేసింది. హీరో ప్రేమ విషయంలో జరిగే తగవులో అతని తరఫున వకాల్తా పుచ్చుకున్న ఈ పాత్ర… అవతలి పాత్రలతో ఢీ అంటే ఢీ అంటూ బరిలోకి దిగుతుంది. జుత్తు జుత్తు పట్టుకుని ఇద్దరు మహిళలు వీరంగం సృష్టిస్తారు. దర్శక, నిర్మాత కూడా అయిన ప్రవీణ ఆ సమయంలో కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రెచ్చిపోయి… అవతలి వాళ్ళను తన్ని తగలేసి ఆ సన్నివేశాన్ని రక్తికట్టించింది. చిత్రం ఏమంటే… ‘కేరాఫ్ కంచరపాలెం’లో వేశ్యగా నటించడానికి వెనుకాడని ప్రవీణ… ఇందులోనూ తన పాత్రను కించపరిచే సంభాషణలను సైతం రాయించుకుంది. అక్కడ పాత్ర తప్పితే… మనకు నిర్మాతో, దర్శకురాలో కనిపించరు.

అమెరికాలో కార్డియాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్న పరుచూరి ప్రవీణకు సినిమా అంటే ఎంత పిచ్చో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థం అవుతుంది. మరి ఎంతో కష్టపడి, ఇష్టపడి పరుచూరి ప్రవీణ తెరకెక్కించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

యాక్టర్స్‌ని తిట్టాను కొట్టాను..

యాక్టర్స్‌ని తిట్టాను కొట్టాను

‘మా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాలో రెండు పాత్రల మధ్య నడిచే సన్నివేశాలు కీలకంగా నిలుస్తాయి. వారి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా రాకపోతే…

‘మా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాలో రెండు పాత్రల మధ్య నడిచే సన్నివేశాలు కీలకంగా నిలుస్తాయి. వారి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా రాకపోతే సినిమా సాదాసీదాగా ఉంటుంది. అందుకే వారి నుంచి మంచి నటన రాబట్టాలనుకన్నాను. సెట్‌లో వారిని తిట్టాను, కొట్టాను, వారిపై రాళ్లు విసిరాను. మనం చేసే పాత్రలో జీవించడమే నటన అని నమ్ముతాను. అందుకే సినిమా కోసం ఏదైనా సరే తప్పదు. అందుకే వారిపట్ల అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పలేదు’ అని దర్శకురాలు ప్రవీణ పరుచూరి చెప్పారు. రానా సమర్పణలో మనోజ్‌ చంద్ర, మోనికా జంటగా ప్రవీణ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మనోజ్‌ చంద్ర మాట్లాడుతూ ‘ప్రవీణ చేసే సినిమాల్లో నటిస్తే సరిపోదు, పాత్రల్లో జీవించాలి. అలా రామకృష్ణ పాత్రకు నేను ప్రాణం పోశానని నమ్ముతున్నాను’ అని చెప్పారు.

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు.

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు: దీపికా పదుకొణే వివాదంపై రానా వ్యాఖ్యలు

 

 

నేటిధాత్రి:

 

 

 

 

భారతీయ సినిమా పరిశ్రమలో నటీనటుల పని గంటలపై జరుగుతున్న చర్చకు నటుడు రానా దగ్గుబాటి తనదైన శైలిలో స్పందించారు.

నటి దీపికా పదుకొణె…

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి పనివేళల విషయంలో విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తల నేపథ్యంలో, రానా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడ నిర్దిష్ట ప్రమాణాలను చేరుకోవడానికి ఎక్కువ గంటలు పనిచేయడం, ఎక్కువ కృషి చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ, “భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మనం అర్థం చేసుకోవాలి.

మనం అభివృద్ధి చెందిన దేశం కాదు.

తలసరి ఆదాయం పరంగా చూస్తే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో బహుశా 186వ స్థానంలో ఉంటుంది” అని పేర్కొన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన వైనాన్ని గుర్తుచేస్తూ, “కొన్ని కుటుంబాలు, వందలాది మంది తమ సర్వస్వాన్ని వదులుకుని ఒక నగరం నుంచి మరో నగరానికి వచ్చి ఇక్కడ పరిశ్రమను స్థాపించారు.

నాకు ఇది పనిలా కాకుండా ఒక జీవన విధానంలా అనిపిస్తుంది” అని తెలిపారు.

పరిశ్రమను బట్టి మారే పనివేళలు

పనిగంటలు అనేవి ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు, అలాగే ప్రాజెక్టును బట్టి కూడా గణనీయంగా మారుతాయని రానా వివరించారు.

“ఉదాహరణకు, మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ ఉంటుంది, తెలుగులో 8 గంటల షిఫ్ట్ ఉంటుంది.

కానీ మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు పని మొదలుపెడితే, తెలుగులో మేం ఉదయం 7 గంటలకే మొదలుపెడతాం.

అలాగే, షూటింగ్ జరిగే ప్రదేశం, నగరం, సెట్‌లో చిత్రీకరిస్తున్నారా లేదా స్టూడియోలోనా అనే అంశాలు కూడా పనిగంటలను ప్రభావితం చేస్తాయి.

సెట్‌లో షూట్ చేయడానికి ఎక్కువ సన్నాహాలు అవసరం, అదే స్టూడియో అయితే సౌకర్యవంతంగా ఉంటుంది.

కాబట్టి ఇది ప్రాజెక్టును బట్టి మారుతుంది.

దీన్ని ఒక సాధారణ విషయంగా చూడకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.

నటీనటులను ఎక్కువ గంటలు సెట్‌లో ఉండమని బలవంతం చేస్తారా అన్న ప్రశ్నకు రానా సమాధానమిస్తూ, “ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదు.

ఇది ఒక ఉద్యోగం.

‘మీరు ఈ షో చేయాల్సిందే’ అని ఎవరూ మిమ్మల్ని నిర్బంధించలేరు.

ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక.

జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై ప్రతి ఒక్కరికీ వారి వారి అభిప్రాయాలు ఉంటాయి.

కేవలం 4 గంటలు మాత్రమే షూట్ చేసే నటులు కూడా ఉన్నారు.

అది వారి పనివిధానం” అని తెలిపారు.

దేశ జనాభాలో 70-80 శాతం మంది రోజుకు 100 రూపాయలు సంపాదించే పరిస్థితులున్నాయని, ఈ కోణంలో చూసినప్పుడు మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని రానా అన్నారు.

ఆ నటుడుడిని తొక్కేసింది బ్రహ్మానందమే!

ఏ అభిమాన నటుడుని మరో నటుడు ఆరాధిస్తాడో అదే ఇష్టమైన నటుడు తొక్కేస్తే ఎలా వుంటుంది? అవును తెలంగాణకు చెందిన గొప్ప మిమిక్రీ కళాకారుడు, సినీ నటుడు శివారెడ్డి సినీ జీవితాన్ని నాశనం చేసింది ఎవరో కాదు…బ్రహ్మానందం!

అందరి చేత నవ్వుల రారాజుగా పేరు పొందిన బ్రహ్మానందంలో వుండే మరో కోణం ఇది. బ్రహ్మానందం గురించి తెలంగాణకు చెందిన ఏ నటుడు గొప్పగా చెప్పరు. కారణం బ్రహ్మానందం అహంభావం. పైకి కనిపించకపోయినా ఎంతో మంది తెలంగాణ కళాకారుల జీవితాలను ఆగం చేసిన వ్యక్తి బ్రహ్మానందం. అవును.. ఆంద్రాకు చెందిన కళాకారులను ఒక రకంగా, తెలంగాణకు చెందిన నటులను మరో రకంగా చూసిన నటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం నవ్వుల వెనుక శాడిజం వుందని చాలా మంది చెప్పారు. ఇప్పటికీ చెప్పుకుంటారు. బ్రహ్మానందం ఎదగడానికి ఎంతో మంది దోహదపడ్డారు. తనకు పోటీ అనుకున్న వారిని తొక్కేయడానికి కూడా అంతే సినీ పెద్దలను బెదిరించారు. ఎప్పటికైనా సరే ఆంద్రా కళాకారులు తెలంగాణ కళాకారులను ఎదగనివ్వరని చెప్పడానికి శివారెడ్డి సినీ జీవితమే సాక్ష్యం. ఒక హీరోకు వుండాల్సిన అన్ని అర్హతలు వున్న శివారెడ్డి సినీ జీవితం ఆగమ్య గోచరం కావడానికి బ్రహ్మానందమే కారణమని సినీ వర్గాలందరికీ తెలుసంటారు. నవ్వుల వెనక విషాదం అంటే ఇదే మరి. నవ్వు నాలుగు రకాల చేటుకు ఇది కూడా సంకేతమే! అవునో కాదో మీ అభిప్రాయం చెప్పండి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version